Arjun phani
23.2K posts






ప్రజల కోసం తన కష్టార్జితాన్ని, వ్యక్తిగత జీవితాన్ని, సినీ కెరీర్ను సైతం త్యాగం చేసిన జనసేన పార్టీ అధినేత, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారిపై భూ కబ్జా అంటూ అవాస్తవ ప్రచారాలు చేయడం రాజకీయ దివాళాకోరుతనానికి నిదర్శనం. రాజకీయంగా ఎదుర్కోలేక, ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను జీర్ణించుకోలేక, ఆంధ్రప్రదేశ్లో తిరస్కరణకు గురైన ఒక క్రిమినల్ రాజకీయ పార్టీకి మద్దతుగా తెలంగాణలోని కొందరు పెయిడ్ యూట్యూబ్ ఛానల్స్, స్వయం ప్రకటిత మేధావులు, ఎర్నలిస్టులు, చిల్లర నాయకులు కలిసి దుష్ప్రచారాలకు దిగటం సిగ్గుచేటు. పవన్ కళ్యాణ్ గారి శంకర్ పల్లి ఫాం హౌస్ పై వాస్తవాలు: • 15-12-2014న ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్, 1882 సెక్షన్ 54 ప్రకారం చట్టబద్ధంగా భూమి కొనుగోలు జరిగింది. • రిజిస్ట్రేషన్ యాక్ట్, 1908 సెక్షన్ 17 ప్రకారం రిజిస్టర్డ్ సేల్ డీడ్ నమోదైంది. రిజిస్టర్డ్ డాక్యుమెంట్ అంటే చట్టబద్ధ యాజమాన్యానికి అధికారిక సాక్ష్యం. • FTL నిబంధనలు నిర్మాణాలపై వర్తిస్తాయి కానీ యాజమాన్య హక్కులపై కాదు. • శిఖం పట్టా భూమి అంటే వ్యక్తిగత యాజమాన్య హక్కులు కలిగిన భూమి. దానిని "ప్రభుత్వ భూమి"గా చిత్రీకరించడం అజ్ఞానం లేదా ఉద్దేశపూర్వక మోసం. • మ్యుటేషన్లు, ఖాతా నంబర్లు, సబ్-డివిజన్లు అన్నీ తెలంగాణ రెవెన్యూ చట్టాల ప్రకారమే జరిగాయి. ఒక వ్యక్తికి ఒకే ఖాతా ఉండాలనే చట్టం ఎక్కడా లేదు. • Registered Sale Deed = Lawful Ownership. • Mutation = Statutory Revenue Process. • Multiple Khatas = Legally Recognized Situation. • FTL Restrictions = Construction Rules, Not Ownership Restrictions. అన్ని ప్రభుత్వ రికార్డులు, చట్టబద్ధ పత్రాలు ఒక వైపు ఉంటే... కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారు. పెయిడ్ ఎర్నలిస్టులకు శతఘ్ని సవాల్: భూ కబ్జా జరిగిందని ఆరోపిస్తున్న వారు ఒక్క ఆధారం అయినా ప్రజల ముందుంచాలి. చట్టబద్ధంగా కొనుగోలు చేసిన, రిజిస్ట్రేషన్ పొందిన భూమిని "కబ్జా"గా చిత్రీకరించడం మా అధినేత వ్యక్తిగత పరువుకు భంగం కలిగే చర్యకు పాల్పడిన వారు, తెర వెనుక మిమ్మల్ని నడిపిస్తున్న చిల్లర నాయకులు ఎవరైనా సరే బయటకు వచ్చి ఇది తప్పు అని నిరూపించగలరా? వాస్తవాలను వక్రీకరించి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు ఎంత చేసినా, శ్రీ పవన్ కళ్యాణ్ గారి నిబద్ధతను, ప్రజల నమ్మకాన్ని, జనసేన ప్రయాణాన్ని దెబ్బతీయలేవు. అవిపవన్ కళ్యాణ్ గారి మీద పవన్ కళ్యాణ్ గారిపై అబద్ధపు ఆరోపణలు చేయడం అంటే హిమాలయ శిఖరాన్ని గులకరాయితో కూల్చేయాలని ప్రయత్నించినట్టే. #EndofCheapPaidArtists








సైదరాబాద్ లో భారీ భూకుంభకోణం : గండిపేట ప్రభుత్వ భూమి వవహరంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే పాత్ర 1500కోట్ల విలువైన భూమి ఫేక్ జీవోలతో కొట్టేసేందుకు ప్రయత్నం వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, బొల్లా రమేష్ లపై కేసు నమోదు వైసీపీ మాజీ ఎమ్మెల్యే కోసం పోలీసుల గాలింపు #YSRCP









