పోలవరం నిర్వాసితులకు గతంలో దీపావళి, సంక్రాంతి పండుగలకు రెండు విడతల్లో రూ.1980 కోట్లు ఇచ్చిన చంద్రబాబుగారు ఇప్పుడు ఉగాదికి మరో రూ.250 కోట్లు ఇచ్చారు. మౌజన్లు, ఇమామ్ల గౌరవ వేతనాలను బకాయిలు లేకుండా మొత్తం చెల్లించారు. పోలీస్ ఉద్యోగాలు, టీచర్ ఉద్యోగాలు, గ్రూప్ 1 వంటి 10 వేలకు పైగా ఉద్యోగాలకు సంబంధించి జాబ్ క్యాలెండర్ విడుదల చేసారు.
#Ugadi2026#APJobCalender2026#IdhiManchiPrabhutvam#ChandrababuNaidu#Andhrapradesh
రాష్ట్ర ప్రభుత్వం తరఫున పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించాం. ఉగాది పచ్చడి స్వీకరించి, పంచాంగ శ్రవణం ఆలకించాను. రాష్ట్రానికి అంతా మంచి జరగాలని కోరుకున్నా. మన సంస్కృతి, సంప్రదాయాలు కాపాడేలా నిర్వహించిన కార్యక్రమంలో అందరికీ స్వయంగా ఉగాది పురస్కారాలు అందించాను. ఆయా రంగాల్లో ప్రముఖులను గౌరవించుకున్నాం.
#Ugadi2026
#APJobCalender2026
జాబ్ ఫస్ట్ అనేది కూటమి ప్రభుత్వ విధానం. అధికారంలోకి వచ్చిన 21 నెలల్లో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో 6 లక్షల పైచిలుకు ఉద్యోగ, ఉపాధి కల్పన జరిగింది. పెట్టుబడులు, పరిశ్రమల స్థాపనతో ఈ ఏడాది ప్రైవేటు రంగంలో పెద్ద ఎత్తున ఉద్యోగ కల్పన జరగనుంది. ఈ క్రమంలో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో 10,060 ఉద్యోగాల భర్తీ చేయబోతున్నాం. మే 15 నుంచి అక్టోబర్ 15 వరకు వీటికి సంబంధించిన నోటిపికేషన్లు రిలీజ్ చేస్తాం. ఉద్యోగార్థులు సన్నద్దతతో, ప్రతిభతో అవకాశాలను అందిపుచ్చుకోమని కోరుతున్నాను.
అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మంత్రి @naralokesh గారు యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ... యువతకు ఉగాది కానుకగా 10,060 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం సంతోషకరం.
#APJobCalender2026#NaraLokesh#AndhraPradesh
డిప్యూటీ సీఎం శ్రీ @PawanKalyan గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు!
ఈ ఉగాది పర్వదినాన విడుదలవుతున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రం ప్రేక్షకులను విశేషంగా అలరించి, అఖండ విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించాలని ఆకాంక్షిస్తూ, చిత్ర బృందానికి నా అభినందనలు.
#UstaadBhagatSingh#PawanKalyan#KinjarapuAtchannaidu#TeluguCinema#Ugaadi
రాష్ట్రంలో రాబోయే మూడు నాలుగు రోజుల పాటు అకాల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో, వ్యవసాయ మరియు అనుబంధ శాఖల అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితిని సమీక్షించాను.
ముఖ్యంగా రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.
అరటి, మామిడి, మిర్చి, మొక్కజొన్న వంటి పంటలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉన్నందున, క్షేత్రస్థాయిలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించాను. వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలను త్వరితగతిన గుర్తించి, నష్టాన్ని నమోదు చేయాలని స్పష్టం చేశాను. రైతులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుంది.
రైతు సోదరులకు నా విన్నపం:
పండిన పంటను సాధ్యమైనంత త్వరగా సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. వడగళ్ల వాన, ఈదురుగాలులు వీస్తున్న సమయంలో పొలాల్లో ఉండకూడదు. పిడుగులు పడే అవకాశం ఉన్నందున చెట్ల కింద నిలబడకుండా సురక్షిత కట్టడాల్లో ఆశ్రయం పొందాలి. వ్యవసాయ యంత్రాలను భద్రపరుచుకోవాలి.
ప్రభుత్వం రైతుల పక్షాన నిలబడి, నష్టపోయిన ప్రతి రైతుకు న్యాయం చేసే దిశగా అన్ని చర్యలు తీసుకుంటుంది. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాను.
పరాభవ నామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా ఈరోజు నా స్వగ్రామం నిమ్మాడలో సతీసమేతంగా గోపూజ మరియు గోసేవలో పాల్గొనడం జరిగింది.
మన సనాతన ధర్మంలో గోమాతను లక్ష్మీస్వరూపంగా భావిస్తాం. అటువంటి గోమాతకు సేవ చేస్తూ నూతన సంవత్సరాన్ని ప్రారంభించడం చాలా సంతోషాన్ని ఇచ్చింది.
రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, రైతన్నల ఇంట పాడిపంటలు సమృద్ధిగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థించాను. అందరికీ ఉగాది శుభాకాంక్షలు.
#ugadi2026#happyugadi
యువత ఆశలను గౌరవిస్తూ, వారికి ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ, ఆంధ్రప్రదేశ్లోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈ ఉగాది సందర్భంగా జాబ్ క్యాలెండర్ను విడుదల చేసింది. యువతకు మంచి అవకాశాలు కల్పించాలనే ప్రభుత్వ సంకల్పాన్ని ఇది రుజువుచేస్తుంది .
లోకేశ్ అన్న యువగళం పాదయాత్ర హామీని అమలు చేస్తూ, ఈ జాబ్ క్యాలెండర్లో నాలుగు విభాగాల్లో 10,060 ఉద్యోగాలను ప్రకటించారు. స్పష్టమైన తేదీలు, పారదర్శక నోటిఫికేషన్ తో పరీక్ష ప్రక్రియను రూపొందించారు. దీంతో అభ్యర్థులు తమ ప్రేపరషన్ ముందుగానే ప్లాన్ చేసుకుని, నమ్మకంగా పోటీకి సిద్ధమవచ్చు.
ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, శ్రీ నారా లోకేష్ గారి సారధ్యం లో ఆంధ్రప్రదేశ్ లో యువతకు మంచి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ముందుకు సాగుతోంది.
ప్రభుత్వం రంగ ఉద్యోగం సంపాదించి సేవ చేయాలనే ప్రతి ఒక్కరికీ ఈ జాబ్ క్యాలెండర్ను సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఈ ఉగాది నిజంగా యువతకు ఆశలు, అవకాశాలు తీసుకొచ్చిన ఒక కొత్త ఆరంభం.
Honouring the aspirations of our youth and reaffirming our unwavering commitment, the NDA Kutami Government in Andhra Pradesh has taken a significant step by releasing the Job Calendar this Ugadi. This reflects our dedication to creating meaningful employment opportunities and building a future where every young individual has a fair chance to succeed.
Fulfilling the #Yuvagalam promise, the calendar outlines 10,060 vacancies across four categories, with clear timelines, transparent notifications, and well-defined procedures. This structured approach provides much-needed clarity and direction, enabling aspirants to plan their preparation effectively and compete with confidence.
Under the visionary leadership of CM Shri @ncbn garu, Dy. CM Shri @PawanKalyan garu, and Shri @naralokesh , Andhra Pradesh is creating opportunities and platforms for every aspiring youngster to excel.
I encourage all aspirants to make the best use of this Job Calendar. My best wishes to everyone aiming to serve in government.This Ugadi truly marks a new beginning of hope, opportunity, and empowerment for our youth.
శ్రీకాకుళం జిల్లా పరిషత్ రోడ్డులోని శశి కన్వెన్షన్ హాల్లో మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు గొండు శంకర్ గారితో కలిసి పాల్గొనడం జరిగింది.
పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనల్లో పాల్గొనడం సంతోషాన్ని ఇచ్చింది. కూటమి ప్రభుత్వం ముస్లిం మైనారిటీల సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోంది.
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn మైనారిటీల అభివృద్ధికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది, వారి సంక్షేమం కోసం ఇప్పటికే అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా ఇమామ్లు, మౌజన్ల గౌరవ వేతనాల కోసం ప్రభుత్వం 45 కోట్ల రూపాయలను విడుదల చేసింది.
శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో త్వరలోనే షాదీఖానా నిర్మాణానికి అవసరమైన చర్యలు తీసుకుంటాం. అలాగే జామియా మసీదు అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాల కృషి చేస్తుంది.
ముస్లిం మైనారిటీలకు ప్రతి ఏడాది బడ్జెట్లో ప్రత్యేక నిధులు కేటాయిస్తూ విద్య, వైద్య రంగాల్లో వారికి అవసరమైన అన్ని సదుపాయాలు కల్పిస్తున్నాం.
గతంలో మాదిరిగా రంజాన్ తోఫా ఇవ్వాలనే ఆలోచన ఉన్నప్పటికీ, ప్రస్తుత ప్రభుత్వ ఆర్థిక పరిస్థితుల కారణంగా ఈసారి అందించలేకపోయాం, కానీ భవిష్యత్తులో తిరిగి ఇచ్చేందుకు ఖచ్చితంగా ప్రయత్నిస్తాం.
పేద, బడుగు బలహీన ముస్లిం కుటుంబాలకు ఇళ్ల మంజూరుతో పాటు మౌలిక సదుపాయాల కల్పనకు నిరంతరం కృషి చేస్తాం. ముస్లిం సోదరులందరికీ ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా సమీక్షా సమావేశంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారితో కలిసి పాల్గొన్నాను. ఈ సందర్భంగా జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులు మరియు సంక్షేమ పథకాల అమలుపై సమగ్రంగా చర్చించాము.
కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రజలకు మెరుగైన సేవలు అందించడమేనని, ఆ దిశగా అధికారులు మరింత చురుకుగా పనిచేసి అభివృద్ధి ఫలాలను అట్టడుగు స్థాయి వరకు చేర్చాలని ఆదేశించడమైనది.
జిల్లా సర్వతోముఖాభివృద్ధికి అధికారులు మరియు ప్రజాప్రతినిధులు సమన్వయంతో ముందుకు సాగాలని, ముఖ్యంగా ప్రజా సమస్యల పరిష్కారంలో ఎక్కడా జాప్యం జరగకుండా చూడాలని స్పష్టం చేశాను.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కూన రవికుమార్ గారు, గౌతు శిరీష గారు, గొండు శంకర్ గారు, ఎన్. ఈశ్వర్ రావు గారు, మామిడి గోవిందరావు గారు మరియు జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.
నిరాడంబరతకు నిలువుటద్దం, చంద్రగిరి మాజీ శాసనసభ్యులు మరియు మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారి సోదరులు స్వర్గీయ నారా రామ్మూర్తి నాయుడు గారి జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పిస్తున్నాను. ఉమ్మడి చిత్తూరు జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసి, ప్రజా సేవకు అంకితమైన వారి జ్ఞాపకాలు ఎప్పటికీ స్ఫూర్తిదాయకం. ప్రజా నాయకుడిగా వారు చేసిన సేవలు చిరస్మరణీయం.
రాష్ట్రవ్యాప్తంగా కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ‘దివ్యాంగ శక్తి’ పథకం ద్వారా దాదాపు 12.5 లక్షల మందికి ప్రయోజనం చేకూరనుంది.
మన జిల్లాలో మొత్తం 42 వేల మంది వికలాంగులు ఉండగా, ఇప్పటివరకు కేవలం 3,500 మందికి మాత్రమే బస్సు పాసులు ఉన్నాయి.మిగిలిన వారికి కూడా ఈ సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నాము.
ఇకపై జిల్లాలోని అన్ని ఆర్టీసీ బస్టాండ్లలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి వికలాంగులందరికీ వంద శాతం పాసులు అందేలా చర్యలు తీసుకుంటాము.
మీ ప్రాంతాల్లో ఎవరైనా వికలాంగులు ఉంటే వారికి ఈ విషయం తెలిపి, వారు పాసులు పొందేలా సహాయం చేయాలని కోరుతున్నాము. వికలాంగుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉంది, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి.
#DivyangaShakti #దివ్యాంగశక్తి #IdhiManchiPrabhutvam#ChandrababuNaidu#AndhraPradesh#KinjarapuAtchannaidu
రాష్ట్రంలోని దివ్యాంగుల జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపేలా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారు చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు.
గత డిసెంబర్ 3న అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం నాడు ఇచ్చిన హామీని నెరవేరుస్తూ, నేడు ఉగాది కానుకగా ‘దివ్యాంగ శక్తి’ పథకానికి శ్రీకారం చుట్టడం ఎంతో గర్వంగా ఉంది.
ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 40 శాతం వైకల్యం కలిగిన సుమారు 12.76 లక్షల మంది దివ్యాంగులకు పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ మరియు మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం లభించనుంది.
శ్రీకాకుళంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ గారు మరియు ఎన్డీయే కూటమి నాయకులతో కలిసి ఈ సేవలని ప్రారంభించడం జరిగింది.
ఈ సందర్భంగా బస్సులో స్వయంగా ప్రయాణించి, నా దివ్యాంగ సోదరులతో ముఖాముఖి మాట్లాడటం నాకు ఎంతో సంతృప్తిని ఇచ్చింది.
వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నప్పుడు, ప్రభుత్వం కల్పిస్తున్న ఈ వెసులుబాటు పట్ల వారి కళ్లలో కనిపించిన ఆనందం మాటల్లో చెప్పలేనిది.
గతంలో కేవలం 4 వర్గాలకే పరిమితమైన ఈ రాయితీని ఇప్పుడు 21 వర్గాలకు విస్తరించడమే కాకుండా, దివ్యాంగులతో పాటు వచ్చే సహాయకులకు కూడా టికెట్ ధరలో 50 శాతం రాయితీని కల్పిస్తూ మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
నేడు ఈ సేవలను ప్రారంభించిన తరుణంలో లబ్ధిదారుల ముఖాల్లో కనిపిస్తున్న చిరునవ్వు, వారు వ్యక్తం చేస్తున్న హర్షం మా బాధ్యతను మరింత పెంచుతోంది.
సొంత ఊళ్లకు వెళ్లాలన్నా, పనుల నిమిత్తం ప్రయాణించాలన్నా ఇకపై దివ్యాంగులకు ఆర్థిక భారం ఉండదు.
లబ్ధిదారులు తమ పాత పాసులతో లేదా ఆర్టీసీ యాప్ ద్వారా పొందే డిజిటల్ పాసులతో ఈ అద్భుత సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు.
ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకుంటూ, అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా మా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
#DivyangaShakti #దివ్యాంగశక్తి #IdhiManchiPrabhutvam#ChandrababuNaidu#AndhraPradesh#KinjarapuAtchannaidu