
జిల్లా కలెక్టర్ అంకిత్ IAS మాట్లాడుతూ రహదారి ప్రమాదాల నివారణలో అవగాహన కీలకమని తెలిపారు. “అర్రైవ్ అ లైవ్” కార్యక్రమం ద్వారా జిల్లాలో విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. విద్యార్థులు, యువత ముందుకు వచ్చి సమాజంలో చైతన్యం కల్పించాలని సూచించారు.
జిల్లాలో భారీ వాహనాల రాకపోకలు ఎక్కువగా ఉండటంతో ప్రమాదాల అవకాశాలు అధికంగా ఉన్నాయని, ఇప్పటికే 38 బ్లాక్ స్పాట్లను గుర్తించి ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ప్రమాద సమయంలో తక్షణ వైద్య సహాయం అందేలా అంబులెన్స్ సేవలను బలోపేతం చేస్తున్నామని పేర్కొన్నారు.
హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగం, వేగ పరిమితులు పాటించడం ద్వారా ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని, రహదారి భద్రతను ప్రజలు తమ బాధ్యతగా భావించాలని జిల్లా కలెక్టర్ అంకిత్ IAS పిలుపునిచ్చారు.
జిల్లా ఎస్పీ రోహిత్ రాజు మాట్లాడుతూ రహదారి ప్రమాదాల నివారణలో అన్ని శాఖల సమన్వయం కీలకమని తెలిపారు. మద్యం సేవించి వాహనం నడపడం, ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం వంటి కారణాల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.
అనంతరం రహదారి భద్రతపై పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేసి, కొంతమందికి డ్రైవింగ్ లైసెన్సులు పంపిణీ చేశారు. గిరిజనులకు హెల్మెట్లు అందజేశారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ పగడాల రమాదేవి, మార్కెట్ కమిటీ చైర్మన్, డీఎస్పీ సతీష్, పోలీస్ శాఖ అధికారులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
@TelanganaCMO @TelanganaCS @IPRTelangana @Bhatti_Mallu @TummalaOfficial @INC_Ponguleti @Vakiti_srihari @DamodarCilarapu
#BhadradriKothagudem #RoadSafety #ArriveAlive #TrafficAwareness #SafeDriving #TelanganaCongress




తెలుగు
























































