
నా రాజకీయ జీవితంలో...
17 ఏళ్ల కాలం ప్రతిపక్షంలోనే ఉన్నాను..
సీఎం రేవంత్ రెడ్డి పాయింట్స్
నాకు అసహనం, అసంతృప్తి ఉండది కాబట్టి ఎనర్జీగా ఉంటా
సమస్య వచ్చినప్పుడు కొంత మానసికంగా ఒత్తిడి ఉంటుంది.
రాజకీయాల్లో 51 శాతం ఉంటే గెలుస్తావని నేను నమ్ముతా.. వంద శాతం అనేది నేను కోరుకోను.
నేను జూబ్లీహిల్స్ నుంచి గ్రామాల్లోకి వెళ్లిన
నేను సినీ, పారిశ్రామిక రంగాల నుంచి గ్రామ స్థాయి వరకు అన్నింటినీ చూశా..
భీమవరంలో కొత్త అల్లుడు ఇంటికి వచ్చినప్పుడు 200 వంటకాలతో భోజనం పెడతారు.. కానీ తెల్లారి లేచి టిఫిన్ అడుగుతారు. అలాగే సంక్షేమం కూడా..
సంక్షేమం నిరంతర ప్రక్రియ.. అభివృద్ధి అనేది ప్రణాళిక ప్రకారం చేయాలి.
ఈ ప్రభుత్వం చేసే పరిమితమైన ప్రణాళికలు ఆ తర్వాత వచ్చే ప్రభుత్వం చేయడం లేదు.
నీతి ఆయోగ్ చెప్పింది తెలంగాణలోని ప్రభుత్వ స్కూళ్లలో జీరో డ్రాప్ అవుట్స్ అని..
28 నెలల్లో 10 వేల నిధులను మహిళల కోసం ప్రభుత్వం చెల్లించింది.
ఈరోజు ఆర్టీసీని లాభాల్లోకి తీసుకొచ్చాము. ప్రతి నెల ఆర్టీసీ కి రూ.350 కోట్లు ఇస్తున్నాం. తద్వారా లాభాల్లోకి వెళ్ళింది. నేను ఇచ్చిన డబ్బుల వల్ల సంస్థ నిలబడింది.
కోర్ అర్బన్ రీజియన్ లో 2,554 బస్సులను నడిపిస్తున్నాం.
ఈవీ వెహికిల్స్ తీసుకొచ్చి ఆర్టీసీకి డీజిల్ ఖర్చు తగ్గిస్తున్నాం.
108 దేశాల నుంచి ప్రపంచ ప్రతినిధులను తెలంగాణకు తీసుకొచ్చి గ్లోబల్ సమ్మిట్ పెట్టి తెలంగాణ పారిశ్రామిక పాలసీ డాక్యుమెంట్ తీసుకొచ్చాము.
ప్రకృతి వైపరీత్యాలను తగ్గించేందుకు ఆక్రమణలను తొలగిస్తున్నాం.
యుద్ధం జరిగినప్పుడు కొంత మంది అమాయకులు చనిపోతారు.. అలాగే ఆక్రమణల తొలగింపు కూడా..
నా స్వార్థం కోసం కాదు.. సమాజం కోసం పనిచేస్తున్నాను..
ఆక్రమణలు తొలగిస్తుంటే కొంత మంది తిట్టినా పట్టించుకోను.
పేద వాళ్లకు న్యాయం చేస్తాను.. కూలగొట్టిన ఇళ్ల వారికి డబుల్ బెడ్ రూమ్ లు, సహా ఇతర సదుపాయాలు కల్పిస్తామన్నా సరే వినడం లేదు.
మూసీ నది పేరు ఎవరైనా పెట్టుకుంటున్నారా?
ORR ఔట్ సైడ్, RRR ఇన్ సైడ్ లోపల సుమారు 10 వేల స్క్వేర్ కి.మీ. మేర పెరీ అర్బన్ రీజియన్ లో పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తాము.
ఫ్యూచర్ సిటీ అనేది కచ్చితంగా సాధ్యం. చేసి చూపిస్తాం.
ఫ్యూచర్ సిటీ నుంచి మచిలీపట్నం వరకు రవాణా కనెక్టివిటీ తీసుకోస్తాం.
నా ఫ్యూచర్ బీఆర్ఎస్ వాళ్లు కాదు డిసైడ్ చేసేది ప్రజలు డిసైడ్ చేస్తారు.
నేను ఆశించినంత మేర రియల్ ఎస్టేట్ ఎదుగుదల లేదు.. తెలంగాణలోనే కాదు దేశమంతా లేదు..
ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇచ్చినా సరే బీఆర్ఎస్ వాళ్లు ఇంకా భ్రమలోనే ఉంటున్నారు.
వాళ్ళు ఫామ్ హౌసుల్లో డ్రగ్స్ తో దొరికితే నన్ను తిడితే ఎట్లా?
దీపావళి రోజున చిచ్చు బుడ్డులతో పండగ చేసుకోవాలి కానీ డ్రగ్స్ తో కాదు..
డ్రగ్స్ కంట్రోల్, సైబర్ క్రైమ్స్ ఇలా ప్రతి విషయంలో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశాను.
నేను డ్రగ్స్ ను ఆపాలని చూస్తున్నా.. అయినా నన్ను విలన్ గా చూస్తున్నారు..
నేను సాధించిన దానిలో 100 శాతం సంతృప్తిగా ఉన్నాను.
మేడిగడ్డ బుర్ర లేకుండా కట్టడంతో కూలిపోయింది.
విద్య, ఇరిగేషన్ వ్యవస్థను నెహ్రూ దత్తత తీసుకొని నూతన సంస్కరణలు తేవడంతో ఈ దేశం అభివృద్ధిలో తొలి అడుగు పడింది.
గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఈ దేశంలో సృక్చర్డ్ విద్యా వ్యవస్థను రూపొందించింది కాంగ్రెస్ ప్రభుత్వమే.
కుల నిర్మూలన పోవాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పి, కులాల వారీగా స్కూళ్లను ఎందుకు కట్టారు.. అంటరానితనాన్ని ప్రోత్సహించడం కాదా?
ఇదంతా పోవాలనే యంగ్ ఇండియా స్కూల్స్ తీసుకొస్తున్నాం. అన్ని వర్గాల వారు ఒకే దగ్గర చదువుకుంటారు.
నేడు హాస్టళ్లలో పిల్లలను చదివిస్తే పెద్దయ్యాక వాళ్లు తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో వదిలేస్తున్నారు. ఇందులో మానవత్వం ఏది.?
ఒక కేసు విషయంలో నాకు రాహుల్ గాంధీ మెసేజ్ చేశారు.
చంద్రబాబుకు నా పట్ల ప్రేమ, గౌరవం ఉంది.
నా లీడర్ చంద్రబాబుకు అబద్ధం చెప్పలేదు.. నా గోల్ రీచ్ కావాలంటే పార్టీ మారాలని చెప్పి మరీ వచ్చాను.
ఇప్పుడు స్విగ్గి పాలిటిక్స్ నడుస్తున్నాయి.. ఆర్డర్ పెడితే వెంటనే డెలివరీ కావాలని చూస్తున్నారు.
వచ్చే ఎన్నికల్లో రాహుల్ గాంధే ప్రధాని అభ్యర్థి.. ఇది కన్ఫర్మ్
నేను 2034 వరకు సీఎంగా ఉంటాను.
10 శాతం జీడీపీ తెలంగాణ నుంచి ఇచ్చేలా 2034 వరకు కృషి చేస్తాను.
నువ్ వీడియో దాచిపెట్టుకో నేనే 2034 వరకు సీఎంగా ఉంటాను.. ఆ తర్వాత కాంగ్రెస్ 100సీట్లు గెలిచినా నేను సీఎం గా ఉండను.
దేశం చాలా విశాలంగా ఉంది. నేను జాతీయ స్థాయిలో సేవ చేస్తాను. రాహుల్ గాంధీని ప్రధానిగా కూర్చోబెట్టి తనకు ఏ చైర్ ఇచ్చినా కూర్చుంటాను.
ఇప్పుడు కొందరు సినీ స్టార్స్ అనుకునే వారు కిడ్స్ నుంచి నాకు తెలుసు.. బీర్ కోసం అడిగేవారు.
లీస్ టీమ్ లను నియమించాం.
RS ప్రవీణ్ కుమార్ గడీలకు గులాం అయ్యిండు.
#RevanthReddy #Telangana

తెలుగు







