FactCheck.AP.Gov.in

1.3K posts

FactCheck.AP.Gov.in banner
FactCheck.AP.Gov.in

FactCheck.AP.Gov.in

@FactCheckAPGov

Official Account of Fact Check Wing of Government of Andhra Pradesh. Report any misleading post/tweet at [email protected]

Katılım Aralık 2020
36 Takip Edilen30.1K Takipçiler
FactCheck.AP.Gov.in
FactCheck.AP.Gov.in@FactCheckAPGov·
ప్రభుత్వం విద్యాకానుక కిట్ల పంపిణీని నిలిపివేసిందని 'cockroach_janasena_party' వంటి ఫేక్ సోషల్ మీడియా ఖాతాల ద్వారా జరుగుతున్న ఈ తప్పుడు ప్రచారాలను ఎవరూ నమ్మవద్దు. ఇదే విషయం పై గతం లో కొంతమంది ఫేక్ ప్రచారం చేయగా మే 24వ తేదీ న ప్రభుత్వ పరంగా పూర్తి వివరాలతో ఖండన ఇవ్వడం జరిగింది. ఐనా ఇప్పుడు ఫేక్ ఎకౌంట్ లతో మళ్ళీ జరుపుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవం. యుద్ధప్రభావం, అంతర్జాతీయ రవాణా అడ్డంకులు మరియు ముడిసరుకుల ధరల పెరుగుదల వల్ల సరఫరాలో స్వల్ప జాప్యం జరుగుతోందే తప్ప పథకం ఎక్కడా నిలిపివేయలేదు. జూన్ 12న పాఠశాలలు పునఃప్రారంభమయ్యే నాటికి పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్ ఖచ్చితంగా అందుతాయి, మిగిలిన వస్తువులను తదుపరి మెగా పేరెంట్-టీచర్ మీటింగ్ నాటికి అందజేస్తారు. విద్యార్థుల విద్యా పథకాలపై ఇలాంటి అవాస్తవాలను వ్యాప్తి చేస్తూ ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్న వారిని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారిని గుర్తించి, వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు కేసులు నమోదు చేయడం జరుగుతుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. #FactCheck #AndhraPradesh
FactCheck.AP.Gov.in tweet media
తెలుగు
2
26
53
2.2K
FactCheck.AP.Gov.in
FactCheck.AP.Gov.in@FactCheckAPGov·
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (SAAP) చేపట్టిన 'స్పోర్ట్స్ డీఎస్సీ-2025' నియామక ప్రక్రియపై అనుమానాలు రేకెత్తించే విధంగా కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నియామక ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్ విధానంలో, అత్యంత పారదర్శకంగా నిర్వహించబడింది. క్రీడా సర్టిఫికెట్లను జారీ చేసే అధికారం శాప్‌కు లేదు. అవి కేవలం సంబంధిత క్రీడా సంఘాలు, ఫెడరేషన్లు మరియు విశ్వవిద్యాలయాల ద్వారా మాత్రమే జారీ చేయబడతాయి. అభ్యర్థులు సమర్పించిన ప్రతి సర్టిఫికెట్‌ను, అది జారీ చేసిన సంస్థకు పంపి, అధికారికంగా జెన్యూనిటీ ధృవీకరించిన తర్వాతే మెరిట్ కోసం పరిగణనలోకి తీసుకున్నారు. ధృవీకరణ లేని ఏ సర్టిఫికెట్‌ను ఎంపిక ప్రక్రియలో ఉపయోగించలేదు. డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు వచ్చిన ఫిర్యాదు పై 25.07.2025న విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు FIR No.75/2025 (BNS సెక్షన్ 319(2), IT Act సెక్షన్ 66-D) నమోదు చేశారు. స్థానిక/స్థానికేతర స్థితికి సంబంధించి వస్తున్న వార్తలు కూడా తప్పుదోవ పట్టించేలా ఉన్నాయి. క్రీడా మెరిట్ ధృవీకరణ మాత్రమే శాప్ పరిధిలో ఉంటుంది. రిజర్వేషన్లు, రోస్టర్ అమలు మరియు పోస్టుల కేటాయింపులు పూర్తిగా విద్యాశాఖ నిబంధనల ప్రకారం జరిగాయి. స్పోర్ట్స్ డీఎస్సీ-2025, శాప్ ప్రతిష్టను దెబ్బతీసేలా ప్రజలకు తప్పుడు ప్రచారం చేస్తున్న సోషల్ మీడియా అకౌంట్లు, వ్యక్తులు, మీడియా సంస్థలపై పరువు నష్టం కేసులు సహా కఠినమైన న్యాయపరమైన చర్యలు తీసుకుంటాము. #FactCheck #AndhraPradesh
తెలుగు
3
45
64
1.2K
FactCheck.AP.Gov.in
FactCheck.AP.Gov.in@FactCheckAPGov·
ప్రొఫెసర్ నాగేశ్వర్ ను అరెస్టు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ పోలీసులు తెలంగాణకు చేరుకున్నట్లు జరుగుతున్న ప్రచారం అసత్యం. అలాంటిదేం జరగలేదు. కొందరు పనిగట్టుకుని ఈ ప్రచారం చేస్తున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. #FactCheck #AndhraPradesh
FactCheck.AP.Gov.in tweet media
తెలుగు
32
328
809
21.7K
FactCheck.AP.Gov.in
FactCheck.AP.Gov.in@FactCheckAPGov·
ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ ఇటీవల నిర్వహించిన మెగా డీఎస్సీ-2025 నియామక ప్రక్రియపై సోషల్ మీడియా వేదికగా కొందరు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవం. వ్యవస్థపై ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని దెబ్బతీసేందుకు ఉద్దేశపూర్వకంగా చేస్తున్న తప్పుడు ప్రచారాలు. మెగా డీఎస్సీ పరీక్షలను అత్యంత పారదర్శకమైన కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) పద్ధతిలో, అత్యున్నత స్థాయి డిజిటల్ భద్రతా ప్రమాణాలతో నిర్వహించడం జరిగింది. మల్టీ-సెషన్ పద్ధతిలో వేర్వేరు ప్రశ్నపత్రాలతో నిర్వహించిన ఈ పరీక్షలలో ప్రశ్నాపత్రం లీకేజ్ అవ్వడం సాంకేతికంగా అసాధ్యం. దీనిపై ఇప్పటి వరకు ఎటువంటి ఫిర్యాదులు కూడా అందలేదు.ఇక పి. నవీన్ అనర్హత అంశానికి సంబంధించి, నిబంధనల ప్రకారం ముందస్తు అనుమతి లేకుండా పరీక్ష రాయడం మరియు సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కు గైర్హాజరు కావడంతో రూల్ 20(vi) ప్రకారం ఆయన అభ్యర్థిత్వం రద్దు చేయబడిందని విద్యా శాఖ స్పష్టం చేసింది. ఈ నిర్ణయంపై ఆయన కోర్టును ఆశ్రయించగా, హైకోర్టు ఉత్తర్వుల మేరకు గ్రీవెన్స్ రెడ్రెస్సల్ కమిటీ మరియు రాష్ట్ర స్థాయి అప్పీల్ కమిటీలు నిబంధనల ప్రకారం విచారణ జరిపి కేసును పరిష్కరించామని ప్రభుత్వం వివరించింది. మెగా డీఎస్సీ-2025 నోటిఫికేషన్ విడుదలైన కేవలం 148 రోజుల్లోనే ఉపాధ్యాయుల నియామక ప్రక్రియను రికార్డు స్థాయిలో పూర్తి చేశారు. పరీక్షలు ముగిసిన తర్వాత 22.08.2025న అభ్యర్థుల పూర్తి వివరాలు, మార్కులు మరియు ర్యాంకులతో కూడిన అధికారిక మెరిట్ జాబితాలను పారదర్శకంగా వెబ్‌సైట్‌లో విడుదల చేసిన తర్వాతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించారు. ఎటువంటి డేటా డిలీట్ కాలేదని, డిజిటల్ రికార్డులన్నీ మల్టీ-లెవెల్ వెరిఫికేషన్ సిస్టమ్స్ ద్వారా భద్రంగా ఉన్నాయని ప్రభుత్వం వెల్లడించింది. రిజర్వేషన్లు మరియు ఎంపికలు పూర్తిగా నిబంధనల ప్రకారమే జరిగాయని, ముఖ్యంగా మహిళలు, దివ్యాంగులు మరియు ఇతర కోటాలకు 'హారిజాంటల్ రిజర్వేషన్' అమలు చేయడం వల్ల వారు రోస్టర్ పాయింట్ల ప్రకారం ఎంపికయ్యారని వివరణ ఇచ్చింది. అభ్యర్థులు దరఖాస్తు సమయంలో స్వయంగా ఇచ్చిన 'పోస్ట్ ప్రిఫరెన్స్' ఆధారంగానే ఆటోమేటెడ్ కంప్యూటర్ వ్యవస్థ ద్వారా పోస్టుల కేటాయింపు జరిగిందని, ఇందులో ఎటువంటి నిబంధనల ఉల్లంఘన జరగలేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. కన్వీనర్ నియామకం కూడా ప్రభుత్వ ఉత్తర్వులకు మరియు సేవా నిబంధనలకు అనుగుణంగానే అత్యంత పారదర్శకంగా, చట్టబద్ధంగా జరిగిందని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ పేర్కొన్నారు. ఇంత పకడ్బందీగా జరిగిన మెగా డీఎస్సీ-2025 పై తప్పుడు కథనాలు ప్రచారం చేయడం సబబు కాదు. #FactCheck #AndhraPradesh
FactCheck.AP.Gov.in tweet media
తెలుగు
2
28
52
2.3K
FactCheck.AP.Gov.in
FactCheck.AP.Gov.in@FactCheckAPGov·
ప్రభుత్వం ‘సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్ధి మిత్ర’ కిట్లను పూర్తిగా నిలిపివేసిందని, పేద విద్యార్థులకు ఈ ఏడాది యూనిఫాం, షూ, బ్యాగ్‌లు, పాఠ్యపుస్తకాలు ఇవ్వడం లేదని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అసలు వాస్తవాల్లోకి వెళితే సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్ధి మిత్ర కిట్లను నిలిపివేయలేదు. అంతర్జాతీయంగా ముడిసరుకుల ధరల పెరుగుదల, రవాణా అడ్డంకుల వల్ల యూనిఫాం క్లాత్, బ్యాగులు, బూట్ల సరఫరా కేవలం నెల రోజులు ఆలస్యమవుతుందని విద్యా శాఖ తెలిపింది. జూన్ 12న పాఠశాలలు పునఃప్రారంభమయ్యే నాటికి విద్యార్థులందరికీ పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్ ఖచ్చితంగా అందుతాయి. సాధ్యమైనంత త్వరగా పంపిణీ చేయడానికి అధికారులు తయారీ సంస్థలను సందర్శిస్తూ వేగంగా చర్యలు తీసుకుంటున్నారు. విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన విద్యా పథకాలపై ఇలాంటి అసంపూర్ణ లేదా తప్పుడు సమాచారంతో కూడిన ప్రచారాలు ప్రజల్లో అనవసర ఆందోళనలను కలిగిస్తాయి. #FactCheck #AndhraPradesh
FactCheck.AP.Gov.in tweet media
తెలుగు
0
25
40
1.4K
FactCheck.AP.Gov.in
FactCheck.AP.Gov.in@FactCheckAPGov·
అమరావతి శాశ్వత ప్రభుత్వ భవనాల నిర్మాణాలపై జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదు. విమర్శకులు ఐకానిక్ సచివాలయ భవనాల వైశాల్యాన్ని కేవలం 52.20 లక్షల చదరపు అడుగులుగా తక్కువ చేసి చూపిస్తూ, నిర్మాణ వ్యయాన్ని భారీగా పెంచి చెబుతున్నారు. పరిపాలనా సౌలభ్యం కోసం నిర్మిస్తున్న 5 ఐకానిక్ ప్రభుత్వ టవర్ల వివరాలు చూస్తే, జీఏడీ టవర్ (GAD Tower) అత్యంత ఎత్తైనది. ఇది బేస్‌మెంట్, గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు 47 అంతస్తులతో (47 Floors) నిర్మితమవుతోంది. వివిధ ప్రభుత్వ శాఖల విభాగాధిపతుల కార్యాలయాల కోసం నిర్మిస్తున్న మిగిలిన 4 హెచ్‌వోడీ టవర్లు (HOD Towers) ఒక్కొక్కటి 39 అంతస్తుల (39 Floors) చొప్పున నిర్మించబడుతున్నాయి. వీటితో పాటు వాటి ముందు నిర్మించే విశాలమైన ఆర్కిటెక్చరల్ పోడియంలను కలిపితే మొత్తం నిర్మాణ వైశాల్యం 71.43 లక్షల చదరపు అడుగులు (SFT) అవుతుంది. ఈ మొత్తం విస్తీర్ణానికి బడ్జెట్‌ను లెక్కగడితే చదరపు అడుగుకు అయ్యే అసలు ఖర్చు కేవలం ₹17,339 మాత్రమే. అంతర్జాతీయ స్థాయి ప్రీమియం నిలువు నిర్మాణాలకు (Vertical Structures) ఈ రేటు పూర్తిగా ప్రామాణికమైనది. ఈ ఖర్చు కేవలం సిమెంట్, ఇటుకల నిర్మాణానికే పరిమితం కాలేదు. ఇది ఒక సంపూర్ణమైన ‘టర్న్‌కీ’ (Turnkey) ఒప్పందం. ఇందులో భవనాన్ని మోసే అత్యంత క్లిష్టమైన పునాదులు, సూపర్ స్ట్రక్చర్, అధునాతన మెకానికల్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ (MEP) వ్యవస్థలు, గాలి వేగాన్ని తట్టుకునే హై-పర్ఫార్మెన్స్ ఎక్స్‌టీరియర్ ఫసాడ్స్, పూర్తిస్థాయి ఇంటీరియర్స్, డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టమ్, అంతర్గత మౌలిక వసతులు అన్నీ కలిసి ఉన్నాయి. జాతీయ, ప్రాంతీయ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులతో పోల్చి చూసినా అమరావతి రేట్లు అత్యంత హేతుబద్ధంగా ఉన్నాయి. కేంద్ర పార్లమెంట్‌ను 4 అంతస్తులతో నిర్మించారు. చదరపు అడుగుకు ₹16,916 ఖర్చయిన కేంద్ర పార్లమెంట్ భవనంతో పోలిస్తే, అమరావతి భవనాలు విపరీతమైన గాలి ఒత్తిడిని, ప్రకృతి విపత్తులను తట్టుకోవాల్సిన అవసరం ఉన్న 250 మీటర్ల ఎత్తైన (47 అంతస్తులు, 39 అంతస్తుల భవనాలు) ఐకానిక్ టవర్లుగా నిర్మితమవుతున్నాయి. సివిల్ ఇంజనీరింగ్ సంక్లిష్టతను బట్టి చూస్తే చదరపు అడుగుకు ₹17,339 కావడం మార్కెట్ రేట్లకు అనుగుణంగానే ఉంది. కాబట్టి అమరావతి ప్రతిష్టను దెబ్బతీయాలని పనిగట్టుకొని కొందరు చేస్తున్న విమర్శలను నమ్మవద్దు. #FactCheck #AndhraPradesh
FactCheck.AP.Gov.in tweet media
తెలుగు
9
41
97
5.9K
FactCheck.AP.Gov.in
FactCheck.AP.Gov.in@FactCheckAPGov·
మీడియాలో, సోషల్ మీడియాలో కొందరు “అమరావతిలో కిలోమీటర్ రోడ్డు నిర్మాణానికి ₹189 కోట్లు ఖర్చు” అని ప్రచారం చేస్తున్నారు. అయితే, మౌలిక వసతుల సాంకేతిక వివరాలను పరిశీలిస్తే ఈ ప్రచారం పూర్తిగా అవాస్తవం, తప్పుదారి పట్టించేదిగా ఉందని స్పష్టమవుతోంది. నిజానికి అమరావతిలో నిర్మించిన ప్రధాన 6 లేన్ల రహదారుల సగటు ఖర్చు కిలోమీటర్‌కు దాదాపు ₹35 కోట్లు మాత్రమే. సాధారణ జాతీయ రహదారులతో పోలిస్తే ఇందులో అదనంగా నీటి సరఫరా పైపులు, భూగర్భ డ్రైనేజీ, కరెంట్, ఇంటర్నెట్ కేబుల్స్ కోసం ప్రత్యేక అండర్‌గ్రౌండ్ యుటిలిటీ డక్ట్, సైకిల్ ట్రాక్, రోడ్లకు ఇరువైపులా మరియు డివైడర్లలో మొక్కల ఏర్పాటు వంటి అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించారు. అలాగే కొండవీటి వాగు ఫ్లైఓవర్ ప్రాజెక్ట్ వ్యయం ₹135 కోట్లు మాత్రమే. ఇది సాధారణ ఫ్లైఓవర్ కాదు. ఇందులో 3 కిలోమీటర్ల ఎలివేటెడ్ రోడ్‌తో పాటు క్లిష్టమైన ట్రంపెట్ ఇంటర్‌చేంజ్‌లు, ఫ్లడ్ మేనేజ్‌మెంట్ నిర్మాణాలు ఉన్నాయి. అమరావతి అనేది రైతులు ఇచ్చిన భూముల్లో, ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం అంతర్జాతీయ స్థాయిలో నిర్మిస్తున్న రాజధాని. కాబట్టి అలాంటి ప్రాజెక్టులపై తప్పుడు ప్రచారం చేయడం తగదు. #FactCheck #AndhraPradesh
FactCheck.AP.Gov.in tweet media
తెలుగు
26
52
151
11.6K
FactCheck.AP.Gov.in
FactCheck.AP.Gov.in@FactCheckAPGov·
కుప్పంలోని శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతరలో గౌరవ ముఖ్యమంత్రి ప్రసాదం తీసుకోకుండా కేవలం తీసుకున్నట్లు నటించారని, ఆపై పక్కకు పెట్టేశారంటూ ఒక చిన్న వీడియో క్లిప్‌ను సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదు. వైరల్ అవుతున్న వీడియో క్లిప్ సగం మాత్రమే కట్ చేసి, వక్రీకరించబడినది. అసలు వీడియోను పూర్తిగా పరిశీలిస్తే అసలు వాస్తవాలు స్పష్టంగా తెలుస్తాయి. జాతర సందర్భంగా ముఖ్యమంత్రి దంపతులు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఆ సమయంలో ఆలయ అర్చకులు సాంప్రదాయబద్ధంగా తీర్థ ప్రసాదాలు అందజేశారు. అర్చకులు ఇచ్చిన ప్రసాదాన్ని ముఖ్యమంత్రి గారు ఎంతో భక్తిప్రపత్తులతో, గౌరవపూర్వకంగా స్వీకరించిన పూర్తి విజువల్స్ ఒరిజినల్ వీడియోలో స్పష్టంగా ఉన్నాయి. పూర్తి వీడియో నుండి కేవలం ఒక చిన్న భాగాన్ని మాత్రమే కట్ చేసి, సందర్భాన్ని మార్చి చూపిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించేలా తప్పుడు నెరేటివ్‌తో ఈ క్లిప్‌ను వైరల్ చేశారు. దేవుని సన్నిధిలో జరిగిన పవిత్రమైన కార్యక్రమానికి సంబంధించిన దృశ్యాలను ఎడిట్ చేసి, తప్పుడు ప్రచారం చేస్తున్నారు. పూర్తి వీడియో సాక్ష్యాల ప్రకారం ముఖ్యమంత్రి గారు ప్రసాదాన్ని భక్తిశ్రద్ధలతో స్వీకరించారు. కాబట్టి ఇటువంటి మార్ఫింగ్ మరియు ఎడిటెడ్ వీడియోలను నమ్మవద్దని విజ్ఞప్తి. మార్ఫింగ్ మరియు ఎడిటెడ్ వీడియోల ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టించేలా తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. #FactCheck #AndhraPradesh
తెలుగు
0
46
69
2K
FactCheck.AP.Gov.in
FactCheck.AP.Gov.in@FactCheckAPGov·
ఆంధ్రప్రదేశ్ విశ్వవిద్యాలయాల అధ్యాపకుల నియామక నోటిఫికేషన్లలో దివ్యాంగులకు రిజర్వేషన్లు కల్పించలేదంటూ సామాజిక మాధ్యమాల్లో కొందరు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవం. ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక నోటిఫికేషన్ ప్రకారం, కేంద్ర ప్రభుత్వ 'దివ్యాంగుల హక్కుల చట్టం 2016' మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల G.O.Ms.77, G.O.Ms.46 కు అనుగుణంగా దివ్యాంగులకు చట్టబద్ధంగా దక్కాల్సిన 4% రిజర్వేషన్‌ను స్పష్టంగా పొందుపరిచారు. అధికారిక నోటిఫికేషన్‌లో దివ్యాంగులకు 4%తో పాటు మహిళలకు 33 1/3%, క్రీడాకారులకు 3%, మాజీ సైనికోద్యోగులకు 2% రిజర్వేషన్లను ప్రభుత్వం అమలు చేస్తోంది. #FactCheck #AndhraPradesh
FactCheck.AP.Gov.in tweet media
తెలుగు
0
15
32
1.5K
FactCheck.AP.Gov.in
FactCheck.AP.Gov.in@FactCheckAPGov·
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల ఉచిత బస్సు ప్రయాణ ‘స్త్రీ శక్తి’ పథకాన్ని రద్దు చేస్తోందని, డీజిల్ బస్సుల స్థానంలో కొత్తగా తెస్తున్న ఈ-బస్సుల వల్ల ఈ పథకం కనుమరుగవుతుందంటూ మీడియాలో, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా తప్పు. ప్రభుత్వం ‘స్త్రీ శక్తి’ పథకాన్ని రద్దు చేయడం లేదు. గత 9 నెలల్లో మహిళలు 67 కోట్ల ఉచిత ప్రయాణాలు చేయగా, దీనికి సంబంధించిన రూ. 2,350 కోట్ల సబ్సిడీని ప్రభుత్వమే భరించింది మరియు ఇప్పటికే రూ. 720 కోట్లను ఆర్టీసీకి తిరిగి చెల్లించింది. ఈ పథకం వల్ల ఆర్టీసీ ఆక్యుపెన్సీ 60% నుండి 92% కి పెరిగి సంస్థ ఆదాయం కూడా మెరుగైంది. ఇందులో టికెట్ కొని ప్రయాణించే పురుషుల సంఖ్య కూడా 40% గా ఉంది. ఆర్టీసీ బస్సులను ఎంచుకోవడం వల్ల రోడ్డు ప్రమాదాల్లో మహిళల మరణాల సంఖ్య 39% తగ్గినట్లు పోలీసుల అధ్యయనంలో తేలింది. ప్రయాణికులకు మరిన్ని బస్సులు అందుబాటులోకి తేవటం కోసం కేంద్ర సహకారంతో 1,450 కొత్త ఈవీ బస్సులను రాష్ట్ర ప్రభుత్వం తెస్తోంది. కొత్త బస్సుల రాక ప్రయాణికుల మెరుగైన సౌకర్యాలు అందించటం కోసమే, వైరల్ అవుతున్న రద్దు వార్తలు కేవలం అపోహలు మాత్రమే. #FactCheck #AndhraPradesh
FactCheck.AP.Gov.in tweet media
తెలుగు
1
22
59
8.6K
FactCheck.AP.Gov.in
FactCheck.AP.Gov.in@FactCheckAPGov·
ఏపీ ఎస్ ఆర్టీసీ ని ప్రైవేటు పరం చేస్తున్నట్లు ఒక దిన పత్రిక లో మరియు ఇతర సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం లో ఎలాంటి నిజం లేదు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఆధీనంలో ఉన్న డీజిల్ బస్సుల వల్ల కాలుష్యాన్ని తగ్గించేందుకు ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెట్టాలనేది కేంద్ర ప్రభుత్వ నిర్ణయం. అందుకోసం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన 'కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్' (CESL) 2022- 23 నుంచి టెండర్లు పిలుస్తూనే ఉన్నది. పీఎం ఈ-బస్ సేవా (PM-eBus Sewa) పథకం, పీఎం ఈ-డ్రైవ్ (PM E-DRIVE) పథకం కింద ఈ బస్సులను GCC (Gross Cost Contract) పద్ధతిలో నిర్వహిస్తారు. అంటే ప్రైవేటు సంస్థలు బస్సులను కొనుగోలు చేసి, నిర్వహణ బాధ్యతలు చూసుకుంటాయి. ఆర్టీసీ కండక్టర్ల ను నియమిస్తుంది. ఇది దేశవ్యాప్తంగా ఉన్న పాలసీ తప్ప మన రాష్ట్రం లో మాత్రమే అమలుకావడం లేదు. ఏపీ ఎస్ ఆర్టీసీ రాష్ట్ర ప్రభుత్వం లో భాగం. దానిని ప్రైవేటు పరం చేయడం లేదు. ప్రజల్లో అపోహలు సృష్టించే విధంగా తప్పుడు ప్రచారం చేయడం చట్టరీత్య నేరం. #FactCheck #AndhraPradesh
తెలుగు
3
26
67
1.8K
FactCheck.AP.Gov.in
FactCheck.AP.Gov.in@FactCheckAPGov·
మంగళగిరి ఎయిమ్స్ (AIIMS) సమీపంలో పర్యావరణ శాఖ కళ్ళుకప్పి కొండలను అక్రమంగా తవ్వేస్తూ, ప్రకృతి విధ్వంసానికి పాల్పడుతున్నారంటూ సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు. చిత్రాల్లో కనిపిస్తున్న పనులు అక్రమ తవ్వకాలు కావు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని, మంగళగిరి జాతీయ రహదారిని అనుసంధానించే అత్యంత ప్రతిష్టాత్మకమైన E13 రోడ్డు నిర్మాణ పనులు. మంగళగిరి ఎయిమ్స్ మీదుగా అమరావతి కోర్ క్యాపిటల్‌కు వెళ్లే ఈ బృహత్తర రహదారి మార్గంలో కొండ భాగం అడ్డుగా ఉంది. ప్రయాణాన్ని సులభతరం చేయడానికి, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చేయడానికి ప్రభుత్వం అధికారికంగా 'హిల్ కట్టింగ్' పనులను చేపట్టింది. అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ADCL) ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రభుత్వ మౌలిక వసతుల ప్రాజెక్టుకు అవసరమైన అన్ని రకాల పర్యావరణ మరియు అధికారిక అనుమతులు ఉన్నాయి. నిబంధనల ప్రకారమే ఇక్కడ రోడ్డు విస్తరణ పనులు వేగంగా జరుగుతున్నాయి. రాజధాని అమరావతి కనెక్టివిటీ కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న E13 రహదారి అభివృద్ధి పనులను, సోషల్ మీడియాలో కొందరు "అక్రమ కొండల తవ్వకం, ప్రకృతి విధ్వంసం" అంటూ తప్పుడు రంగు పులిమి తప్పుదారి పట్టిస్తున్నారు. కాబట్టి ఈ ప్రచారాన్ని నమ్మవద్దు. #FactCheck #AndhraPradesh
FactCheck.AP.Gov.in tweet media
తెలుగు
16
37
104
31.9K
FactCheck.AP.Gov.in
FactCheck.AP.Gov.in@FactCheckAPGov·
విజయనగరం ఎస్కవేటర్ ఘటనపై జిల్లా యంత్రాంగం తక్షణ చర్యలు భోగాపురం మండలం బైరెడ్డిపాలెం గ్రామంలో ఎయిర్పోర్ట్ అప్రోచ్ రోడ్డు నిర్మాణ పనుల వద్ద చోటుచేసుకున్న ఎస్కవేటర్ ఘటనపై జిల్లా యంత్రాంగం వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకుంది. దినపత్రికల్లో వచ్చిన కథనాలపై జిల్లా కలెక్టర్ ఎస్. రామసుందర్ రెడ్డి స్పందిస్తూ, ఎస్కవేటర్ తొట్టెలో కూర్చున్న వ్యక్తులను ప్రమాదకరంగా కదిలించిన ఆపరేటర్‌ను పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వారి సమస్యల పరిష్కారానికి త్వరగా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో పనులు తిరిగి ప్రారంభమయ్యాయి. భూసేకరణకు సంబంధించిన పరిహారం అంశాలు ప్రస్తుతం న్యాయపరమైన ప్రక్రియలో ఉన్నాయని, బాధితులకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రజల భద్రతకు భంగం కలిగించే విధంగా ఎవరూ వ్యవహరించకూడదని, భవిష్యత్‌లో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ సంబంధిత సిబ్బందిని ఆదేశించారు. #FactCheck #AndhraPradesh
FactCheck.AP.Gov.in tweet media
తెలుగు
1
17
45
2.2K
FactCheck.AP.Gov.in
FactCheck.AP.Gov.in@FactCheckAPGov·
విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ మూసివేత వార్త పూర్తిగా అవాస్తవం. గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికుల రద్దీని తట్టుకోవడానికి రూ. 611.80 కోట్ల అంచనా వ్యయంతో నూతన ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ బిల్డింగ్ (New Integrated Terminal Building - NITB) నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. దీనిని త్వరలోనే ప్రారంభించేందుకు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) మరియు రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తున్నాయి. అమరావతి గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ ఒక దీర్ఘకాలిక వ్యూహాత్మక ప్రాజెక్ట్. రాజధాని అమరావతి పరిధిలోని గుంటూరు జిల్లా, తాడికొండ మండలం రావెల గ్రామ సమీపంలో సుమారు 4,618 ఎకరాల్లో కొత్త గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుకు సిద్ధమయ్యారు. అయితే, ఇది భవిష్యత్తులో అమరావతిని గ్లోబల్ ఏవియేషన్ హబ్‌గా, విమానాల మరమ్మతుల కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ఉద్దేశించిన దీర్ఘకాలిక ప్రాజెక్ట్. రెండు విమానాశ్రయాలూ కలిసే కొనసాగుతాయి మెట్రో నగరాలు మరియు అభివృద్ధి చెందుతున్న రాజధాని ప్రాంతాలలో ఒకటి కంటే ఎక్కువ విమానాశ్రయాలు ఉండటం సాధారణం. (ఉదాహరణకు: దిల్లీలో ఇందిరాగాంధీ ఎయిర్‌పోర్ట్ మరియు నోయిడా/జెవార్ ఎయిర్‌పోర్ట్; ముంబైలో ఛత్రపతి శివాజీ ఎయిర్‌పోర్ట్ మరియు నవీ ముంబై ఎయిర్‌పోర్ట్). అదే విధంగా, అమరావతిలో కొత్త ఎయిర్‌పోర్ట్ వచ్చినా, విజయవాడ గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ యథావిధిగా తన సేవలను కొనసాగిస్తుంది. ఈ అంశంలో తప్పుడు ప్రచారం నమ్మవద్దని కోరుతున్నాం. #FactCheck #AndhraPradesh
FactCheck.AP.Gov.in tweet media
తెలుగు
13
50
136
8.2K
FactCheck.AP.Gov.in
FactCheck.AP.Gov.in@FactCheckAPGov·
లేని సమస్య ను సృష్టిస్తూ సోషల్ మీడియాలో రీల్స్ కోసం నిరసన కార్యక్రమం అంటూ పోలీసుల విధి నిర్వహణకు అడ్డు పడటం చట్టరీత్య నేరం. వాస్తవాలు పరిశీలిస్తే....రేపల్లె టౌన్ లో తాలూకా ఆఫీస్ రోడ్ లో 50 సెంట్ల రెవెన్యూ స్థలాన్ని 25 సెంట్లు డీఎస్పీ కార్యాలయానికి 20 సెంట్లు ఇన్డోర్ సబ్ స్టేషన్ కి రెవెన్యూ వారు కేటాయించారు. గత 20 రోజుల క్రితం మంత్రి శ్రీ అనగాని మరియు ఇంచార్జి మంత్రి శ్రీ కొలుసు పార్ధ సారధి శంకుస్థాపన చేయడం జరిగింది.ఆ స్థలం ఎదురుగా పవన్ నాగిశెట్టి కి చెందిన నాగిశెట్టి మధు కల్యాణ మండపం ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా ఈ కల్యాణ మండపంలో జరుగుతున్న శుభకార్యాలకు పార్కింగ్ గా ఈ స్థలం వాడుకుంటున్నారు. ఇప్పుడు ప్రభుత్వ కార్యాలయాలు కడితే వారికీ ఇబ్బంది అవుతుంది అని గత 2 రోజుల క్రితం ఒక 10 మంది పిల్లలతో ఫ్లకార్డు లు పట్టుకొని ధర్నా చేశారు.గతంలో కూడా ఇలానే చేస్తున్న ఆరోపణలు ఉండడంతో పవన్ నాగిశెట్టి ని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ లో పెట్టి 48 గంటల తరువాత వదిలిపెట్టడం జరిగింది. తమ తమ కళ్యాణ మండపం పార్కింగ్ కోసం వాడిన ప్రభుత్వ స్థలం పోతున్నదనే కారణం తో శాంతిభద్రతలకు విఘాతం కలిగించడం నేరపూరిత చర్య. చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరిగింది. ప్రభుత్వ భూమిపై ప్రైవేటు వారి పెత్తనాన్ని ఎట్టి పరిస్థితుల్లో అనుమతించేది లేదని తెలియచేస్తున్నాం. #FactCheck #AndhraPradesh
తెలుగు
1
47
108
5.1K
FactCheck.AP.Gov.in
FactCheck.AP.Gov.in@FactCheckAPGov·
బకింగ్‌హామ్ కెనాల్‌పై నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జికి సంబంధించిన గడ్డర్లు ఒరిగిపోయాయంటూ జరుగుతున్న దుష్ప్రచారాన్ని అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ తీవ్రంగా ఖండించింది. స్టీల్ బ్రిడ్జిల నిర్మాణంలో పొడవైన గడ్డర్లు జాయింట్ చేస్తారు. ఈ క్రమంలో బేరింగ్‌లపై గడ్డర్లు అనుసంధానిస్తారు. ఒక్కోసారి గడ్డర్ల జాయింట్లను విడదీసి సరిచేస్తారు. అంతే కానీ గడ్డర్లు ఒరిగిపోతున్నాయనే ప్రచారంలో ఎలాంటి నిజం లేదు. స్టీల్ బ్రిడ్జి సురక్షితం, బలంగా ఉంది. తప్పుడు ప్రచారం చేసే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. #FactCheck #AndhraPradesh
FactCheck.AP.Gov.in tweet mediaFactCheck.AP.Gov.in tweet media
తెలుగు
2
31
107
7.4K
FactCheck.AP.Gov.in
FactCheck.AP.Gov.in@FactCheckAPGov·
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారి కాన్వాయ్‌పై సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు పూర్తిగా అవాస్తవం. ఇంధన పొదుపు కోసం సీఎం గారి ఆదేశాల మేరకు వాహన శ్రేణిని ఇప్పటికే 4 కార్లకు తగ్గించారు. ప్రస్తుతం ప్రచారంలో ఉన్నది 2024, డిసెంబర్ 13 నాటి పాత వీడియో. పాత వీడియోలతో సీఎం గారి ప్రతిష్టను దెబ్బతీసే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రజలు ఇలాంటి మార్ఫింగ్ వీడియోలను, తప్పుడు పోస్టులను నమ్మవద్దని విజ్ఞప్తి. #FactCheck #AndhraPradesh
తెలుగు
1
18
58
1.7K