FactCheck.AP.Gov.in

1.4K posts

FactCheck.AP.Gov.in banner
FactCheck.AP.Gov.in

FactCheck.AP.Gov.in

@FactCheckAPGov

Official Account of Fact Check Wing of Government of Andhra Pradesh. Report any misleading post/tweet at [email protected]

Katılım Aralık 2020
36 Takip Edilen30.4K Takipçiler
FactCheck.AP.Gov.in
FactCheck.AP.Gov.in@FactCheckAPGov·
"పవన్ కళ్యాణ్ పై లోకేష్ నిఘా నేత్రం" అంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవం. ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దు. ఇలాంటి ఫేక్ వార్తలను షేర్ చేయడం, ప్రచారం చేయడం చట్టరీత్యా నేరం. తప్పుడు ప్రచారం చేస్తున్న మీడియా హాండిల్స్ పై ప్రభుత్వం చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించడమైనది. #FactCheck #AndhraPradesh
FactCheck.AP.Gov.in tweet media
తెలుగు
1
13
45
1.7K
FactCheck.AP.Gov.in
FactCheck.AP.Gov.in@FactCheckAPGov·
‘నాడు నెంబర్ 1 నేడు నంబర్ 8’ ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఇదీ బాబు మార్క్’ శీర్షికతో సాక్షి దినపత్రికలో 18-07-2026 నాడు ప్రచురితమైన వార్త పూర్తిగా అవాస్తవాలతో ప్రజలను తప్పుదోవ పట్టించేదిగా ఉన్నది. నీతి ఆయోగ్ ఇన్వెస్ట్ మెంట్ ఫ్రెండ్లీనెస్ ఇండెక్స్ 2026 కు వక్రభాష్యం చెబుతూ ఆ వార్తను ప్రచురించారు. వాస్తవానికి నీతి ఆయోగ్ "Investment Friendliness Index 2026" కు Ease of Doing Business (EoDB) ర్యాంకింగ్‌ కు చాలా తేడా ఉంటుంది. అయితే Investment Friendliness Index నివేదికను Ease of Doing Business నివేదిక గా చూపించడమే వార్తలో అతి పెద్ద వక్రీకరణ. నీతి ఆయోగ్ ఇన్వెస్ట్ మెంట్ ఫ్రెండ్లీనెస్ ఇండెక్స్ అనేది వివిధ రాష్ట్రాలు పెట్టుబడులను ఆకర్షించేందుకు ఉన్న పరిస్థితులు, అమలు చేస్తున్న విధానాలు, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి (ముఖ్యంగా అప్పులు, వాటికి చెల్లించే వడ్డీలు) తదితర అంశాల ఆధారంగా సేకరించిన సమాచారం మేరకు రూపొందిస్తారు. ఈ నివేదికలో నీతి ఆయోగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అత్యంత వేగంగా ముందుకు వెళుతున్న (Fast Movers) రాష్ట్రం క్యాటగిరీలో ఉంచింది. ఈ జాబితాలో ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ కూడా ఉన్నాయి. Ease of Doing Business (EoDB) అంచనాలను కేంద్ర ప్రభుత్వంలోని పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక శాఖ (DPIIT) Business Reforms Action Plan (BRAP) కింద నిర్వహిస్తుంది. ఈ కనీస అవగాహన కూడా లేకుండా వార్త ప్రచురించారు. గతంలో మాదిరిగా రాష్ట్రాలకు వరుస సంఖ్యలతో (ర్యాంక్ 1, 2, 3...) ర్యాంకులు ప్రకటించడం నిలిపివేశారు. ప్రస్తుతం నీతి ఆయోగ్ దేశంలోని రాష్ట్రాలను Top Achievers, Fast Movers, Aspirers వంటి పనితీరు విభాగాలుగా మాత్రమే వర్గీకరిస్తున్నారు. నీతి ఆయోగ్ విడుదల చేసిన "Investment Friendliness Index 2026" ఈ ఏడాది (2026) తొలిసారిగా ప్రవేశపెట్టిన కొత్త సూచీక. అందువల్ల దీనిని గత నివేదికలతో పోల్చడం సరికాదు. ఈ సూచీక ఉద్దేశం కేవలం పెట్టుబడులకు అనుకూల వాతావరణాన్ని అంచనా వేయడం మాత్రమే. గత ప్రభుత్వం చేసిన తీవ్రమైన అప్పుల కారణంగా రాష్ట్రం చెల్లించాల్సిన వడ్డీ తదితరాలు అధికంగా ఉండటం వల్ల రాష్ట్ర ఆర్ధిక పరిస్థితికి అతి తక్కువ మార్కులు వచ్చిన కారణంగానే నీతి ఆయోగ్ తన నివేదికలో ఆంధ్రప్రదేశ్ ను ఈ నివేదికలో 8వ స్థానంలో ఉంచింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జిఎస్ డిపిలో 35 శాతం అప్పులు ఉన్నాయి. అదే క్యాటగిరిలో ఉన్న రాష్ట్రాల సగటుతో పోలిస్తే ఇది 13 శాతం ఎక్కువ అని నీతి ఆయోగ్ పేర్కొన్నది. అందుకోసమే రాష్ట్రం స్కోర్ 48.7 దగ్గర ఆగిపోయి 8వ స్థానంలో ఉన్నది. గత 2 సంవత్సరాలలో రాష్ట్రంలో విద్యుత్ అందుబాటులో ఉంచడంలోనూ, మౌలిక సదుపాయాల కల్పనలోనూ విశేషమైన పురోగతి సాధించడం కూడా నీతి ఆయోగ్ నివేదికలో స్పష్టంగా ఉన్నది. నీతి ఆయోగ్ Investment Friendliness Index 2026 లో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన బలాలుగా పలు అంశాలను ప్రత్యేకంగా ప్రస్తావించింది. వాటిలో: బలమైన మౌలిక సదుపాయాలు, మెరుగైన డిజిటల్ మౌలిక వసతులు, విద్యుత్ అంతరాయాలు తక్కువగా ఉండటం, లభ్యత, పెట్టుబడులకు అనుకూల పరిపాలనా వ్యవస్థ వంటి అంశాలు ఉన్నాయి. అందువల్ల Investment Friendliness Index లో వచ్చిన ఫలితాలను Ease of Doing Business Rankings గా పేర్కొనడం లేదా రెండింటినీ ఒకటేనని భావించడం సాంకేతికంగా సరైనది కాదు. రెండూ వేర్వేరు సంస్థలు, వేర్వేరు లక్ష్యాలు, వేర్వేరు ప్రమాణాలతో రూపొందించిన నివేదికలు. తప్పుడు వ్యాఖ్యానాలతో వార్తలు ప్రచురించి ప్రజలను తప్పుదోవ పట్టించడం దురుద్దేశపూర్వక చర్యగా భావించాల్సి ఉంటుంది. ఈ తప్పుడు వార్తను ప్రజలు నమ్మవద్దు. #FactCheck #AndhraPradesh
FactCheck.AP.Gov.in tweet mediaFactCheck.AP.Gov.in tweet media
తెలుగు
1
16
41
1.8K
FactCheck.AP.Gov.in
FactCheck.AP.Gov.in@FactCheckAPGov·
సాక్షి దినపత్రికలో 17.07.2026న "కొందరికే తల్లికి వందనం" శీర్షికతో ప్రచురితమైన వార్త పూర్తిగా అవాస్తవం. ప్రభుత్వం ప్రతిష్టాత్మకం గా అమలుచేస్తున్న 'తల్లికి వందనం' పథకానికి సంబంధించి లబ్దిదారుల సంఖ్య తగ్గినట్లు చెప్పడం ప్రజలను తప్పుదోవపట్టించే ప్రయత్నమే. 2026-27 విద్యా సంవత్సరంలో పథకం లబ్దిదారుల సంఖ్య గత సంవత్సరాలతో పోలిస్తే పెరిగింది. 2025-26 విద్యా సంవత్సరంలో 67,27,164 మంది లబ్దిదారులు ఉండగా, 2026–27 విద్యా సంవత్సరంలో వారి సంఖ్య 67,47,190 కి పెరిగింది. పథకం అమలుకు అనుసరించిన అర్హత ప్రమాణాలు, మార్గదర్శకాలు కఠినతరం చేసినట్లు చెప్పడం పూర్తిగా తప్పు. గతంలో అమలు చేసిన విధంగానే అర్హత ప్రమాణాలు, మార్గదర్శకాలు యథాతథంగా కొనసాగుతున్నాయి. 2026-27 సంవత్సరానికి ప్రభుత్వం ఈ పథకం అమలుకు తగిన నిధులను కేటాయించి, సమర్దవంతంగా అమలు చేస్తోంది. అందువల్ల, పథకం లబ్దిదారులు తగ్గిపోయారనే లేదా అర్హులైన విద్యార్థులకు ప్రయోజనం అందడం లేదనే ప్రచారం పూర్తిగా నిరాధారమైనది. ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం అర్హులైన ప్రతి విద్యార్థికి 'తల్లికి వందనం' పథకం ప్రయోజనం అందజేయబడుతోంది. #FactCheck #AndhraPradesh
FactCheck.AP.Gov.in tweet media
తెలుగు
4
21
50
2.9K
FactCheck.AP.Gov.in
FactCheck.AP.Gov.in@FactCheckAPGov·
తెల్లబోయిన ప్రభుత్వ వైద్యం అనే శీర్షికతో సాక్షి దినపత్రికలో 17.07.2026న రాష్ట్ర వైద్య రంగంపై ప్రచురితమైన కథనం పూర్తిగా అవాస్తవం. రెండు దశల్లో రూ.8,480 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించే విధంగా రాష్ట్రానికి 17 వైద్య కళాశాలలు మంజూరు కాగా గత ప్రభుత్వం ఐదేళ్ల కాలపరిమితిలో కేవలం రూ. 866 కోట్లు మాత్రమే ఖర్చు చేసి వదిలేసింది. ప్రస్తుత ప్రభుత్వం కేవలం 2 సంవత్సరాల్లోనే రూ. 695 కోట్లు ఖర్చు చేసి నిర్మాణ పనులకు వేగం తీసుకురావడమే కాకుండా బోధన, బోధనేతర సిబ్బందిని నియమించి వైద్య విద్యలో సీట్లు గణనీయంగా, చరిత్రలో ఎన్నడూ లేనంతగా పెరిగేలా ప్రస్తుత ప్రభుత్వం చేసింది. తెలంగాణలో 35 ప్రభుత్వ, 32 ప్రైవేటు వైద్య కళాశాలలు (మొత్తం 67) ఉండగా, అదనంగా ఎయిమ్స్ 1, నిమ్స్ 1 (కేవలం పీజీ సీట్లు మాత్రమే), ఈఎస్ఐ 1 వైద్య కళాశాలలు కూడా ఉన్నాయి. మొత్తం యూజీ సీట్లు 9500 (ప్రభుత్వ 4250 + ప్రైవేటు 5250) కాగా, పీజీ సీట్లు 3374 ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 18 ప్రభుత్వ, 20 ప్రైవేటు, 2 డీమ్డ్ వైద్య కళాశాలలు, అదనంగా ఎయిమ్స్ 1 కలిపి మొత్తం 41 వైద్య కళాశాలలు మాత్రమే ఉన్నాయి. మొత్తం యూజీ సీట్లు 7240, పీజీ సీట్లు 4108 (ప్రభుత్వ – 2041, ప్రైవేటు – 2067) ఉన్నాయి. జాతీయ వైద్య కమిషన్ (NMC) నిబంధనల ప్రకారం జనాభా దామాషా, సీట్ల లభ్యత చూసుకుంటే ప్రతి 10 లక్షల జనాభాకు 100 సీట్లు ఉండాలి. ఈ ప్రమాణం ప్రకారం 5.37 కోట్ల జనాభా కలిగిన ఆంధ్రప్రదేశ్ లో 7240 యూజీ సీట్లు, 4108 పీజీ సీట్లతో మెరుగైన వైద్య విద్యా అవకాశాలను అందిస్తున్నది. గత 2 సంవత్సరాల్లో ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 505, ప్రైవేటు వైద్య కళాశాలల్లో 550 యూజీ సీట్లు కొత్తగా మంజూరయ్యాయి. గత 5 ఏళ్లలో ఇలా జరగలేదు. వైద్య విద్యలో సూపర్ స్పెషాలిటీ, పీజీ స్థాయి అవకాశాలను మరింత విస్తరించే దిశగా 2026-27 సంవత్సరానికి పీజీ సీట్ల పెంపు కోసం మొత్తం 185 సీట్లకు దరఖాస్తు చేయడం జరిగింది. రాబోయే కాలంలో, నిర్దిష్ట స్పెషాలిటీలలో అదనంగా మొత్తం 90 పీజీ సీట్లకు దరఖాస్తు చేయవలసి ఉంది. ఇందులో SMC-విజయవాడలో 18 సీట్లు, GMC-ఏలూరులో 24 సీట్లు, GMC-నంద్యాలలో 24 సీట్లు, GMC-మార్టూరులో 12 సీట్లు మరియు GMC-పాడేరులో 12 సీట్లు చొప్పున ప్రతిపాదించబడ్డాయి. విశాఖపట్నంలోని VIMSను స్వతంత్ర పీజీ బోధనా సంస్థగా అప్‌గ్రేడ్ చేసే ప్రతిపాదన కూడా పరిశీలనలో ఉంది. రాష్ట్రవ్యాప్తంగా వైద్య సిబ్బంది కొరతను అధిగమించే దిశగా ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (APMSRB) ద్వారా జూన్ 2024 నుండి జూన్ 2026 వరకు, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (DME), ఆంధ్రప్రదేశ్ పరిధిలో మొత్తం 1254 పోస్టులను పారదర్శకంగా, వేగంగా భర్తీ చేయడం జరిగింది. ఈ నియామక ప్రక్రియలో భాగంగా, జీఎంసీ పిడుగురాళ్ళలో మంజూరైన మొత్తం 237 బోధనా, బోధనేతర పోస్టులకు గాను ఇప్పటికే 142 పోస్టులు భర్తీ చేయబడ్డాయి. ఫలితంగా 100 యూజీ సీట్లు మంజూరయ్యాయి. ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి (జీజీహెచ్) పిడుగురాళ్ళలో ఔట్‌పేషెంట్ (OP), ఇన్‌పేషెంట్ (IP) సేవలు గణనీయంగా పెరిగాయి. నిన్న (13.07.2026) ఒక్క రోజులోనే OP సంఖ్య 428కు చేరుకోవడం స్థానిక ప్రజల్లో పెరుగుతున్న విశ్వాసానికి తార్కాణం. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ వైద్య కళాశాలల పరిధిలో మంజూరైన మొత్తం 4970 బోధనా పోస్టులకు గాను, జూన్ 2024 నుండి ఇప్పటి వరకు 803 మంది అధ్యాపకులు పదోన్నతి పొందడం లేదా కొత్తగా నియమితులు కావడం జరిగింది. దీనితో ప్రస్తుతం 4135 పోస్టులు (సుమారు 83 శాతం) భర్తీ అయ్యాయి. ఇలా గత 5 ఏళ్లలో జరగలేదు. సంక్షిప్తంగా చెప్పాలంటే, గత రెండు సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ వైద్య విద్యా రంగంలో సీట్ల విస్తరణ, సిబ్బంది నియామకాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధిలో అసమాన పురోగతి సాధించింది. ప్రస్తుత ప్రభుత్వం వైద్య మౌలిక సదుపాయాల విస్తరణతో పాటు, సంజీవని పథకం, డిజిటల్ హెల్త్ కార్యక్రమాలు, ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ (ABDM), అరుదైన వ్యాధుల (Rare Diseases) విధానం అమలుచేస్తున్నది. వాస్తవాలు ఈ విధంగా ఉంటే రాష్ట్రంలో కుంటుపడిన ప్రభుత్వ వైద్య రంగం అంటూ దుష్ప్రచారం చేయడం సబబు కాదు. #FactCheck #AndhraPradesh
FactCheck.AP.Gov.in tweet media
తెలుగు
0
16
38
2.5K
FactCheck.AP.Gov.in
FactCheck.AP.Gov.in@FactCheckAPGov·
‘‘సీఐ వేధింపులతోనే చచ్చిపోతున్నా’’ అంటూ సాక్షి దినపత్రికలో వచ్చిన కథనం వాస్తవాలకు దూరంగా ఉన్నది. పల్నాడు జిల్లా పిడుగురాళ్ళ లో జరిగిన ఒక దురదృష్టకర సంఘటనకు సంచలనాత్మక అంశాలను జోడించి ప్రచారం చేయడం బాధ్యతారాహిత్యం. సత్తెనపల్లిలోని ఉర్దూ అకాడమీ లో లైబ్రేరియన్ గా పని చేస్తున్న దరియా హుస్సేన్ (49) ఆత్మహత్యకు పాల్పడ్డారు. 2016లో దరియా హుస్సేన్ తన భార్య షేక్ అమిరున్ పేరుతో పులికూరి లక్ష్మి, పులికూరి ప్రశాంత్ ల నుంచి రేకుల ఇంటిని కొనుగోలు చేశారు. అప్పుడే 10 లక్షల రూపాయలు ఇచ్చినా గత కొద్ది కాలంగా వారు తమను వేధిస్తూనే ఉన్నారని షేక్ అమిరున్ తెలిపారు. తన వ్యక్తిగతమైన ఈ విషయాన్ని కొందరు రాజకీయంగా వాడుకుంటున్నారని, ఇది కరెక్టు కాదని ఆమె అభిప్రాయపడ్డారు. తన విషయం గురజాల ఎమ్మెల్యే శ్రీ యరపతినేని శ్రీనివాసరావు తెలుసుకుని తనకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారని అమిరున్ వివరిస్తున్నారు. #FactCheck #AndhraPradesh
తెలుగు
0
17
43
1.7K
FactCheck.AP.Gov.in
FactCheck.AP.Gov.in@FactCheckAPGov·
నెల్లూరు జిల్లా మనుబోలులో లాకప్ డెత్ జరిగిందంటూ కొందరు చేస్తున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదు. వాస్తవంగా జరిగినది ఏమిటంటే.... మనుబోలు మండలం చెరుకుమూడిలో చైన్ స్నాచింగ్ కేసులో అక్కంపేటకు చెందిన ఇద్దరు నిందితులతో పాటు, చెరుకుమూడికి చెందిన ఏడుకొండలును 2026 జులై 12వ తేదీన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు ప్రశ్నించగా చైన్ స్నాచింగ్ తో బాటు 20 వ్యవసాయ మోటార్లను కూడా దొంగతనం చేసినట్టు వారు అంగీకరించారు. వాటన్నిటినీ రికవర్ చేసుకుని 12వ తేదీ రాత్రి నోటీసులు ఇచ్చి వారిని పోలీస్ స్టేషన్ నుండి పంపించి వేశారు. దీనికి సంబంధించిన స్పష్టమైన సీసీ టీవీ ఫుటేజ్ ఉన్నది.15వ తేదీన ఏడు కొండలు దాదాపుగా స్పృహలేని స్థితి లో కాలువ ప్రక్కన పడి ఉన్నాడని స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అక్కడకు వెళ్ళి అతడిని ఆస్పత్రికి తీసుకువెళ్లగా అతను అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. అంతే తప్ప ఏడుకొండలు మరణానికి పోలీసులకు ఎలాంటి సంబంధం లేదని జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల స్పష్టం చేశారు. కాబట్టి ఈ తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దు. #FactCheck #AndhraPradesh
తెలుగు
0
24
74
2.1K
FactCheck.AP.Gov.in
FactCheck.AP.Gov.in@FactCheckAPGov·
విశాఖపట్నం తీరంలో జూలై 4వ తేదీన జరిగిన మత్స్యకారుల బోటు ప్రమాదం, ఆ తర్వాత ఆరుగురు మత్స్యకారులు గల్లంతైన ఉదంతం తీవ్ర కలకలం రేపింది. అయితే, ఈ ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే ప్రభుత్వ యంత్రాంగం మరియు రక్షణ విభాగాలు స్పందించలేదని, తీవ్ర నిర్లక్ష్యం వహించాయంటూ కొంతమంది మీడియా, సోషల్ మీడియా వేదికగా ప్రజలను తప్పుదోవ పట్టేలా చేస్తున్న ప్రచారాలు పూర్తిగా అవాస్తవం. మత్స్యకారుల ఆచూకీ కోసం యంత్రాంగం ఏ విధంగా అప్రమత్తమైందో జూలై 4 రాత్రి నిమిషాల వారీగా జరిగిన అధికారిక కమ్యూనికేషన్ లాగ్స్ స్పష్టం చేస్తున్నాయి. ✓ రాత్రి 10:30 గంటలకు: విశాఖ మెరైన్ పోలీస్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (CI) కి ఒక వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. సముద్రంలోకి వెళ్లిన ఒక ఫిషింగ్ బోట్ (IND-AP-V5-MM-83) తిరిగి రావాల్సి ఉన్నా రాలేదని ప్రాథమిక సమాచారాన్ని అందించారు. సమాచారం అందిన వెంటనే, మెరైన్ సీఐ ఫిషర్మెన్ అసోసియేషన్ ప్రతినిధులతో మాట్లాడి బోటు వివరాలను క్రాస్-వెరిఫై చేయడం ప్రారంభించారు. ✓రాత్రి 10:33 గంటలకు బాధితుల బంధువు బోట్ సమాచారాన్ని వాట్సాప్‌లో పంపించారు. వెంటనే మెరైన్ సిఐ రిప్లై ఇచ్చారు. ✓ రాత్రి 10:55 గంటలకు: కోస్ట్ గార్డ్ మరియు నేవీ బలగాలకు అధికారికంగా గాలింపు కోరడానికి మరింత ఖచ్చితమైన సమాచారం అవసరం. అందువల్ల సీఐ మొదట ఫోన్ చేసిన వ్యక్తికి తిరిగి కాల్ చేసి, మరిన్ని వివరాలను సేకరించారు. ✓ రాత్రి 11:30 గంటలకు: మిస్సింగ్ బోటు గురించిన పూర్తి సమాచారాన్ని క్రోడీకరించి, రక్షణ విభాగాలకు పంపాల్సిన అత్యవసర SAR (Search and Rescue - శోధన మరియు రెస్క్యూ) నివేదికను సిద్ధం చేయడం ప్రారంభించారు. ✓ రాత్రి 12:16 & 12:17 గంటలకు: నివేదిక సిద్ధమైన వెంటనే, అర్ధరాత్రి దాటిన నిమిషాల వ్యవధిలోనే ఇండియన్ నేవీ (ENC) మరియు ఇండియన్ కోస్ట్ గార్డ్‌లకు తక్షణ గాలింపు చర్యలు చేపట్టాలని కోరుతూ మెరైన్ విభాగం అధికారిక ఈ-మెయిల్స్ పంపింది. ✓ వెంటనే సముద్రంలో గాలింపు కోసం ఇండియన్ కోస్ట్ గార్డ్‌కు చెందిన అత్యాధునిక రెండు యుద్ధ నౌకలు, కోస్ట్ గార్డ్ హెలికాప్టర్ ,తూర్పు నౌకాదళం హెలికాప్టర్ లను తక్షణమే రంగంలోకి దించారు. ✓ప్రమాదంలో చిక్కుకున్న కర్రి చిన్న ను ఆదివారం ఉదయం ఒక మర్చంట్ వెసెల్ గుర్తించగా, ఇండియన్ నేవీ హెలికాప్టర్ ద్వారా అతనిని ఎయిర్‌లిఫ్ట్ చేసి ప్రాణాలు కాపాడారు. హెలికాప్టర్ సహాయంతో ఆయనను ఐఎన్‌ఎస్ డేగాకు తరలించి, అక్కడి నుంచి వైద్య చికిత్స కోసం ఆస్పత్రికి పంపించారు. ✓వాతావరణం అనుకూలించకపోయినా అధికారులు సుమారు 72 గంటలకు పైగా (4 రోజుల పాటు నిరంతరాయంగా) సముద్ర గర్భంలో, గగనతలంలో విస్తృతంగా గాలించారు. ఎలాంటి ఆచూకీ లభించకపోవడంతో స్టాండర్డ్ ప్రొసీజర్ ప్రకారం జూలై 8న సెర్చ్ ఆపరేషన్ ముగించారు. సముద్రంలో ప్రమాదాలు జరిగినప్పుడు ఖచ్చితమైన లొకేషన్ మరియు బోటు వివరాలు లేకుండా నేవీ లేదా కోస్ట్ గార్డ్ నౌకలు శోధన ప్రారంభించలేవు. ఈ సాంకేతిక ప్రక్రియను మెరైన్ పోలీసులు కేవలం గంటన్నర వ్యవధిలోనే పూర్తి చేసి రెస్క్యూ బలగాలను అప్రమత్తం చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అధికారులు, మంత్రులుతో సహా సహకారాలపై సమీక్షలు నిర్వహించారు. గల్లంతైన ఆరుగురు మత్స్యకారులను మృతి చెందినట్లుగా నిర్ధారించిన వెంటనే రూ. 10 లక్షల చొప్పున పరిహారాన్ని కూడా తక్షణమే పంపిణీ చేశారు. కాబట్టి "అధికారులు స్పందించలేదు లేదా ఆలస్యం చేశారు" అనే ఆరోపణల్లో వాస్తవం లేదు. రెస్క్యూ టీమ్స్ నిబంధనల ప్రకారం అత్యంత వేగంగానే స్పందించాయి. #FactCheck #AndhraPradesh
FactCheck.AP.Gov.in tweet media
తెలుగు
2
34
91
2.3K
FactCheck.AP.Gov.in
FactCheck.AP.Gov.in@FactCheckAPGov·
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల కోసం క్రోమ్ బుక్ ల కొనుగోలుకు సంబంధించిన టెండర్ ప్రక్రియలో రూ.112 కోట్ల స్కామ్ జరిగిందని ఒక దినపత్రికలో ప్రచురితమైన వార్త పూర్తిగా అవాస్తవం. ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్న ఈ చర్యను ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తోంది. ప్రజలకు నిజం తెలియజెప్పడం బాధ్యతగా భావించి ఈ వివరణ ఇస్తున్నాం. విషయం ఏమంటే... ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థుల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 3,459 పాఠశాలల్లో కంప్యూటర్ ల్యాబ్ ల కోసం 27,672 ల్యాప్ టాప్ ల సేకరణ చేస్తోంది ప్రభుత్వం. ఇందుకు గాను టెండర్ ప్రక్రియ పూర్తి చేయడం జరిగింది. ఈ టెండర్ ప్రక్రియలో రూ.112 కోట్ల స్కామ్ జరిగిందని సదరు పత్రిక ఫేక్ వార్త రాసింది. ఆ ఫేక్ వార్త ఆరోపణలు - వాస్తవాలు ఇప్పుడు చూద్దాం. 1. టెండర్ అర్హత నిబంధనలను కొందరికి లబ్ది చేకూర్చేలా మార్చారు అన్నది మొదటి ఆరోపణ. ఇందులో ఎలాంటి నిజం లేదు. వాస్తవం ఏంటంటే... ఆయా సంస్థల నుండి వచ్చిన ప్రీ-బిడ్ ప్రశ్నల ఆధారంగా మాత్రమే 2026 ఏప్రిల్ 4, 22 తేదీలలో టెండర్ అర్హత నిబంధనలను సవరించడం జరిగింది. ఇందులో రహస్యం ఏమీ లేదు. ఈ మార్పులను గవర్నమెంట్ ఇ-మార్కెట్ ప్లేస్ (GeM) పోర్టల్ లో బిడ్డర్లందరికీ అందుబాటులో ఉంచడం జరిగింది. 2. టెండర్ ప్రక్రియలో 'మేక్ ఇన్ ఇండియా' నిబంధనలను నీరుగార్చారని మరో ఆరోపణ. ఇది కూడా అబద్దమే. టెండర్ ప్రక్రియ పొడవునా GeM బిడ్ పారామీటర్ అయిన "MII purchase preference:Yes" అనేది మార్చకుండా అలాగే ఉంచబడింది. DPIIT మేక్ ఇన్ ఇండియా ఆర్డర్ 2017 లోని క్లాజ్ 6కి అనుగుణంగా కేవలం ధ్రువీకరణ పత్రాల సమర్పణ విధానాన్ని మాత్రమే సవరించడం జరిగింది. ఇది పరిపాలనాపరమైన మార్పు తప్ప నిబంధనల ఉల్లంఘన కాదు. 3. L1, L2 బిడ్డర్ల మధ్య 70:30 నిష్పత్తిలో పరిమాణాన్ని విభజించారు. ఇదేమీ తప్పు కాదు. ఒకే సరఫరాదారుపై ఆధారపడకుండా ఉండటానికి, పెద్ద ఎత్తున జరిగే ప్రభుత్వ కొనుగోళ్లలో రిస్క్ తగ్గించడానికి ఇది ఒక ప్రామాణిక పద్దతి. అతి తక్కువ ధరకు కోట్ చేసిన L1 బిడ్డర్ కు 70% ఆర్డర్ ఇస్తారు. మిగిలిన 30% ఆర్డర్ ను L1 కోట్ చేసిన ధరకే ఇస్తామంటే L2 కి ఇస్తారు. వాళ్ళు ఒప్పుకోకపోతే L3కి ఇస్తారు. 4 టెండర్ లో ఖరారైన ధర మార్కెట్ ధర కంటే ఎక్కువ ఉంది. ముఖ్యవిషయం ఏమంటే ఈ టెండర్ లో ఖరారైన ధర కేవలం హార్డ్ వేర్ కోసం మాత్రమే కాదు. ఇందులో విద్యా వ్యవస్థకు ఎంతగానో ఉపయోగపడే విలువైన లైసెన్స్ లు, సాఫ్ట్ వేర్, ఇతర సేవలు కలిసి ఉన్నాయి. క్రోమ్ బుక్ OS G1m 11 మరియు గూగుల్ జెమిని ఎంటర్ప్రైజ్ లైసెన్స్ కలిపి మొత్తం ఒక్కొక్క దానికి రూ.75,126 ల చొప్పున పడింది. సదరు పత్రిక అస్సాం టెండర్ తో పోలుస్తూ మరో తప్పుడు కథనం రాసింది. అందులో ఒక్కోదానికి కేవలం రూ.38,501.81 అని రాసారు. కానీ అస్సాం Contract No. GEMC511687721539490, తేదీ : 17.02.2026 ప్రకారం ఒక్కో డివైజ్ కు రూ.1,42,541.58 లు అవుతుంది. ఈ నిజాన్ని సదరు పత్రిక దాచేసింది. అస్సాంతో పోల్చుకుంటే రూ.1,42,541.58 లు ఎక్కడ... ఏపీ ధర రూ.75,126 ఎక్కడ? ఏది తక్కువో మీరే చూడండి. సాధారణ ల్యాప్ టాప్/డెస్క్ టాప్ ల కంటే గూగుల్ జెమిని AI క్రోమ్ బుక్ ల వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. AI ఆధారిత పర్సనలైజ్డ్ లెర్నింగ్ కు ఉపయుక్తం. టీచర్లు లెసన్ ప్లాన్లు, వర్క్ షీట్లు, క్విజ్ లు, క్వశ్చన్ బ్యాంకులను క్షణాల్లో రూపొందించుకోవచ్చు. నిర్వహణ ఖర్చు తక్కువ. కేవలం 10 సెకన్లలో బూట్ అవుతాయి. క్లౌడ్ లాగిన్ ద్వారా ఒకే పరికరాన్ని వేర్వేరు విద్యార్థులు వాడుకోవచ్చు. మెరుగైన బ్యాటరీ బ్యాకప్ ఉంటుంది. భద్రత, డేటా ప్రైవసీ ఉంటుంది. అన్ని క్రోమ్ బుక్ లను విద్యాశాఖ ఓకే కేంద్రం నుంచి పర్యవేక్షించవచ్చు. కాబట్టి ఈ విషయంలో ఎటువంటి అతిక్రమణలు జరగలేదని చెబుతూ... సదరు పత్రిక చేస్తున్న ఫేక్ ప్రచారాన్ని నమ్మొద్దని ప్రజలకు చెప్పడమైనది. #FactCheck #AndhraPradesh
FactCheck.AP.Gov.in tweet mediaFactCheck.AP.Gov.in tweet media
తెలుగు
1
21
40
3.3K
FactCheck.AP.Gov.in
FactCheck.AP.Gov.in@FactCheckAPGov·
బస్తా యూరియా కోసం వెళితే నిండు ప్రాణం బలి అనే శీర్షికతో ఒక దిన పత్రికలో వచ్చిన వార్త పూర్తిగా అవాస్తవం. సంచలనాల కోసం ఇలా తప్పుడు వార్తలు ప్రచారం చేయడం సబబు కాదు. వాస్తవాలు ఈ విధంగా ఉన్నాయి: శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలంలోని పెద్దులవానిపల్లి రైతు సేవా కేంద్రానికి పి.కాంతమ్మ అనే 73 సంవత్సరాల వృద్ధురాలు తన కుమార్తెలు వంజంగి సుమతి, చప్ప భానుమతి, అల్లుడు తులసి, అదే గ్రామానికి చెందిన మరో ఐదారు మంది కలిసి యూరియా తీసుకోవడానికి వచ్చారు. ఆ సమయంలో రైతు సేవా కేంద్రంలో సుమారు 100 మంది రైతులు ఉన్నారు. మొత్తం 224 యూరియా బస్తాలు అందుబాటులో ఉన్నాయి. ఈ కేంద్రం పరిధిలో 1,341 ఎకరాల సాగు విస్తీర్ణం ఉండగా, ప్రస్తుతం నేరుగా విత్తిన వరి సాగు సుమారు 300 ఎకరాల్లో మాత్రమే ఉంది. పంట వారం రోజుల వయస్సులో ఉంది. యూరియా పంపిణీ వేగంగా జరిగేందుకు నాలుగు కౌంటర్లను ఏర్పాటు చేశారు. పి. కాంతమ్మ మధ్యాహ్నం 3.30 గంటలకు రైతు సేవా కేంద్రానికి చేరుకుని, తన కుటుంబ సభ్యులతో కలిసి లోపలే కూర్చున్నారు. ఆమె వృద్ధురాలు కావడంతో మండల వ్యవసాయ అధికారి ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చి ముందుగానే యూరియా అందజేశారు. సాయంత్రం 4.33 గంటలకు ఆమెకు ఒక యూరియా బస్తా జారీ చేశారు. గంట వ్యవధిలోనే 70 మంది రైతులకు యూరియా పంపిణీ పూర్తయింది. కాంతమ్మ యూరియా తీసుకుని తమ గ్రామానికి చెందిన వారందరూ కలిసి తిరిగి వెళ్లాలనే ఉద్దేశ్యంతో వేచి చూస్తున్నారు. సాయంత్రం సుమారు 5 గంటల సమయంలో కాంతమ్మ ఒక్కసారిగా కుప్పకూలారు. వెంటనే ప్రథమ చికిత్స అందించగా ఆమెకు స్పృహ వచ్చింది. అనంతరం సాయంత్రం 5.08 గంటలకు 108 అంబులెన్స్‌కు సమాచారం అందించగా, 5.14 గంటలకు ఆమెను ఇద్దరు కుమార్తెలు, అల్లుడితో కలిసి టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడ విధుల్లో ఉన్న వైద్యుడు గుండెపోటుతో ఆమె మరణించినట్లు నిర్ధారించారు. యూరియా పంపిణీలో జాప్యం వల్ల ప్రాణం పోయినట్లు నిర్ధారించుకోకుండానే వార్త రాయడం బాధ్యతా రాహిత్యం. ఇలాంటి తప్పుడు వార్తలను ఎవరూ నమ్మవద్దు. యూరియా సరఫరా ఎలాంటి ఆటంకాలు లేకుండా సజావుగా జరుగుతున్నది. #FactCheck #AndhraPradesh
FactCheck.AP.Gov.in tweet mediaFactCheck.AP.Gov.in tweet mediaFactCheck.AP.Gov.in tweet media
తెలుగు
2
24
47
1.9K
FactCheck.AP.Gov.in
FactCheck.AP.Gov.in@FactCheckAPGov·
ఆర్టీసీని ప్రయివేటుపరం చేస్తున్నారనే తప్పుడు వార్తలు ఎవరూ నమ్మవద్దని రాష్ట్ర రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ ఎం టి కృష్ణబాబు కోరారు. కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తున్న విధానంలోనే ఏపీలోనూ ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడుతున్నామే తప్ప ఆర్టీసీని ప్రైవేటీకరిస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారం పూర్తిగా అసత్యమని ఆయన స్పష్టం చేశారు. పీఎం ఈ-బస్ సేవా స్కీం కింద 11 నగరాలలో 750 ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశ పెడుతున్నారు.ఈ బస్సుల నిర్వహణ కోసం కేంద్ర ప్రభుత్వమే అన్ని రాష్ట్రాల్లో CESL ద్వారా కామన్ గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ తరహాలో వెట్ పద్దతిలో టెండర్ నిర్వహించింది. దీని ప్రకారం ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణతో పాటు డ్రైవర్ కూడా ప్రైవేట్ వారే ఉంటారు. ఈ విధానం కేవలం కేంద్ర ప్రభుత్వం పథకం ద్వారా వస్తున్న ఆర్టీసీ బస్సులకు మాత్రమే వర్తిస్తుంది. ఏపీలోనే కాదు మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఇదే తరహా పద్దతిని అవలంబిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ స్కీంతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చే ఎలక్ట్రిక్ బస్సుల్లో డ్రైవర్లుగా ఆర్టీసీ ఉద్యోగులే ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వం తెచ్చే ఎలక్ట్రిక్ బస్సుల కోసం వెట్ పద్దతిలో కాకుండా డ్రై పద్దతిలో టెండర్లు పిలిచే అంశంపై అధ్యయనం చేస్తున్నాం. డ్రై పద్దతిలో టెండర్లు పిలిస్తే ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీకి చెందిన డ్రైవర్లే నడుపుతారు. జనరల్ మెయింటెనెన్స్ కూడా ఆర్టీసీ సిబ్బందే చేపడతారు. ఆర్టీసీ స్థలాలను ప్రైవేట్ వాళ్లకు అప్పగించడం లేదు. ఆర్టీసీ ఆస్తులను విక్రయించడం లేదు. లీజుకు ఇవ్వడం లేదు. ఆర్టీసీపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దు. ఆర్టీసీకి చెందిన ఏ ఒక్క ఉద్యోగినీ తప్పించడం లేదని, ఆర్టీసీ సిబ్బందికి పూర్తి ఉద్యోగ భద్రత ఉందని ఆయన వివరించారు. ఆర్టీసీపై తప్పుడు వార్తలు ప్రచారం చేయడం, ఉద్యోగులలో అభద్రతాభావనలు కల్పించడం సబబు కాదని ఆయన అన్నారు. #FactCheck #AndhraPradesh
తెలుగు
1
22
42
2.8K
FactCheck.AP.Gov.in
FactCheck.AP.Gov.in@FactCheckAPGov·
ఆర్టీసీని ప్రయివేటుపరం చేస్తున్నారనే తప్పుడు వార్తలు ఎవరూ నమ్మవద్దని రాష్ట్ర రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ ఎం టి కృష్ణబాబు కోరారు. ఆర్టీసీకి చెందిన ఏ ఒక్క ఉద్యోగినీ తప్పించడం లేదని, ఆర్టీసీ సిబ్బందికి పూర్తి ఉద్యోగ భద్రత ఉందని ఆయన వివరించారు. ప్రస్తుతం ఉన్న డీజిల్ బస్సులను దశల వారీగా ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చేందుకు ఎస్ ఇ ఎం పి 4.0 పాలసీని అమలు చేస్తున్నామని, దీనివల్ల రాబోయే 5 సంవత్సరాలలో పూర్తిగా ఎలక్ట్రిక్ బస్సులుగా మారతాయని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం దేశంలోని అన్ని రాష్ట్రాలలో అమలు చేసే జీసీసీ మోడల్ తో బాటు డ్రై లీజ్ పద్ధతిని అమలు చేస్తున్నామని చెప్పారు. వెట్ లీజ్ లో అన్ని అంశాలూ వాహనం సరఫరాదారుడే చూసుకుంటాడు. డ్రైలీజ్ లో డ్రైవర్ మన స్టాఫ్ ఉండేలా చేస్తున్నాము. ఉద్యోగ సంఘాలతో మాట్లాడి ఆమోదయోగ్యమైన విధానం మాత్రమే అమలు చేస్తామని స్పష్టం చేశారు. అందువల్ల ఆర్టీసీపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దని, ఆర్టీసీపై తప్పుడు వార్తలు ప్రచారం చేయడం, ఉద్యోగులలో అభద్రతాభావనలు కల్పించడం సబబు కాదని ఆయన అన్నారు. #FactCheck #AndhraPradesh
తెలుగు
1
18
36
2K
FactCheck.AP.Gov.in
FactCheck.AP.Gov.in@FactCheckAPGov·
ఆర్టీసీని ప్రయివేటుపరం చేస్తున్నారనే తప్పుడు వార్తలు ఎవరూ నమ్మవద్దని రాష్ట్ర రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ ఎం టి కృష్ణబాబు కోరారు. ఆర్టీసీపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దని, ఆర్టీసీ ప్రైవేటీకరణ కావడంలేదని ఆయన అన్నారు. ఆర్టీసీ ఆస్తులను ప్రైవేట్ వాళ్లకు ఇవ్వడం లేదు. ఆర్టీసీ సిబ్బంది ఉద్యోగాలకు ఎలాంటి ఇబ్బంది లేదు అని ఆయన స్పష్టంగా చెప్పారు. ఆర్టీసీకి చెందిన ఏ ఒక్క ఉద్యోగినీ తప్పించడం లేదని, ఆర్టీసీ సిబ్బందికి పూర్తి ఉద్యోగ భద్రత ఉందని ఆయన వివరించారు. ఆర్టీసీపై తప్పుడు వార్తలు ప్రచారం చేయడం, ఉద్యోగులలో అభద్రతాభావనలు కల్పించడం సబబు కాదని ఆయన అన్నారు. #FactCheck #AndhraPradesh
తెలుగు
0
17
34
1.8K
FactCheck.AP.Gov.in
FactCheck.AP.Gov.in@FactCheckAPGov·
రామాయపట్నం రాసిచ్చేస్తాం శీర్షికతో సాక్షి దినపత్రికలో ప్రచురితమైన వార్త అభూతకల్పనల ఆధారంగా చేస్తున్న తప్పుడు ప్రచారం. దేశంలోని ప్రధాన, చిన్న పోర్టుల్లో గత 25 నుంచి 30 ఏళ్లుగా ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య (పీపీపీ) విధానం అమలులో ఉన్నది. కేంద్ర ప్రభుత్వం కూడా పోర్టులు, నౌకాశ్రయాలు, జలమార్గాల మంత్రిత్వ శాఖ పరిధిలో నిర్వహిస్తున్న పోర్టుల్లో కూడా ఇదే పద్ధతి అనుసరిస్తోంది. పోర్టు నిర్వహణను ప్రైవేటు సంస్థలకు అప్పగించడం అంటే పోర్టును అమ్మివేయడం కాదు. భూమి, యాజమాన్య హక్కులు పూర్తిగా ప్రభుత్వానికే ఉంటాయి. నిర్వహణ, అభివృద్ధి బాధ్యతలను మాత్రమే ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తారు. దీనికి ప్రతిఫలంగా ప్రభుత్వం ఆదాయ భాగస్వామ్యం, కనీస హామీ ఆదాయం, ముందస్తు ప్రీమియం రూపంలో గణనీయమైన ఆదాయాన్ని పొందుతుంది. గత ప్రభుత్వం 2021లో గంగవరం పోర్టులో ప్రభుత్వానికి ఉన్న 10.40 శాతం వాటాను అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్‌కు విక్రయించింది. 2024 జూన్ నాటికి రామాయపట్నం పోర్టులో 50 శాతం, మచిలీపట్నం పోర్టులో 16 శాతం, మూలపేట పోర్టులో 25 శాతం మాత్రమే నిర్మాణ పురోగతి ఉంది. ప్రస్తుత ప్రభుత్వం పనులను వేగవంతం చేసింది. 2026 డిసెంబర్ నాటికి అన్ని పోర్టుల నిర్మాణాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. గత ప్రభుత్వం రామాయపట్నం పోర్టులో తొలి దశ నిర్మాణానికే పరిమితం అయింది. ప్రస్తుతం పీపీపీ విధానంలో రూ.20,000 కోట్లు పెట్టుబడి వస్తున్నది. దీనివల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 25 వేల మందికి ఉపాధి దొరుకుతుంది. ఈ విధానంలో ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఆదాయంలో వాటా, సుమారు రూ.1,500 కోట్ల ముందస్తు ప్రీమియాన్ని కూడా పొందనుంది. రామాయపట్నం వంటి భారీ పోర్టును నిర్మించడం ఒక సవాలైతే, దానిని విజయవంతంగా నిర్వహించడం మరో పెద్ద సవాలు. ప్రపంచవ్యాప్తంగా ప్రధాన షిప్పింగ్ సంస్థలు, సరుకు రవాణా సంస్థలతో బలమైన అనుబంధాలు కలిగిన జాతీయ లేదా అంతర్జాతీయ స్థాయి సంస్థలకు నిర్వహణ బాధ్యతలు అప్పగించడం ద్వారా మాత్రమే అధిక స్థాయిలో వ్యాపారాన్ని ఆకర్షించడం సాధ్యమవుతుంది. వాస్తవాలు ఈ విధంగా ఉండగా ప్రజల్లో అపోహలు కలిగించేందుకు తప్పుడు ప్రచారం చేయడం చట్టరీత్యా నేరం. #FactCheck #AndhraPradesh
FactCheck.AP.Gov.in tweet media
తెలుగు
2
44
61
2.3K
FactCheck.AP.Gov.in
FactCheck.AP.Gov.in@FactCheckAPGov·
ఏపీలో మళ్లీ కోవిడ్ కలకలం… ప్రభుత్వానికి ఇంత వరకు సమాచారం లేదు అంటూ కొందరు సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారం పూర్తిగా అసత్యం. దురదృష్టకర సంఘటనలను కూడా తప్పుడు ప్రచారానికి వాడుకోవడం, ప్రజా భద్రతకు భంగం కలిగించాలని చూడటం చట్టరీత్యా నేరం అవుతుంది. కడప జిల్లాలో వెలుగులోకి వచ్చిన ఈ సంఘటనలపై ప్రభుత్వం నిశితంగా దృష్టి సారించింది. సీనియర్ వైద్యులు, ఆరోగ్య రంగ నిపుణులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ తక్షణ, దీర్ఘకాలిక చర్యలు చేపడుతున్నారు. వృద్ధాప్యం, మధుమేహం, అధిక రక్తపోటు, దీర్ఘకాలికంగా మద్యపానం తదితర కారణాలతో ఇటీవల సంభవించిన మరణాలపై ప్రభుత్వ వైద్య కళాశాల, కడప, సూక్ష్మజీవ శాస్త్ర విభాగం వైరల్ పరిశోధన మరియు నిర్ధారణ ప్రయోగశాల ఇప్పటికే పూర్తి స్థాయి నివేదిక ఇచ్చింది. తదుపరి చర్యలను ప్రభుత్వం పటిష్టంగా తీసుకుంటున్నది. నమోదైన కేసుల వివరాలు: 1. ఎన్. సుబ్బరాయుడు (52) – మధుమేహం, అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. తీవ్ర స్థితిలో ఉండగా 2026 జూన్ 28న మరణించారు. 2. వీరారెడ్డి (66) – మధుమేహం, అధిక రక్తపోటు ఉన్నాయి. తీవ్ర స్థితిలో చికిత్స అనంతరం కోలుకుని 2026 జూలై 4న తిరుపతికి డిశ్చార్జ్ అయ్యారు. 3. జి. కొండయ్య (67) – మధుమేహం, క్షయవ్యాధితో పాటు ఆత్మహత్యాయత్నం చేసిన చరిత్ర ఉంది. ప్రస్తుతం కడప ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 4. సయ్యద్ మబాషా (43) – దీర్ఘకాలిక మద్యపాన అలవాటు ఉంది. తీవ్ర అనారోగ్యంతో చికిత్స పొందుతూ 2026 జూలై 7న మరణించారు. 5. అక్షత్ (25) – ఇతర అనారోగ్య సమస్యలు లేవు. స్వల్ప లక్షణాలతో ఇంటి వద్దే ఐసోలేషన్‌లో ఉన్నారు. నమోదైన అన్ని కేసులపై సమగ్ర విచారణ చేపట్టగా, ఎవరికి కూడా ఇటీవల ప్రయాణ చరిత్ర లేనట్లు తేలింది. దీంతో జిల్లాలో స్థానిక స్థాయిలో వైరస్ వ్యాప్తి జరిగి ఉండే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. నమోదైన కేసుల్లో ఒకరు ప్రభుత్వ వైద్య కళాశాల కడపలో విధులు నిర్వహిస్తున్న అండర్ గ్రాడ్యుయేట్ ఇంటర్న్ వైద్య విద్యార్థి. ఆయన ప్రస్తుతం ఆరోగ్యంగా ఉండి ఇంటి వద్దే ఐసోలేషన్‌లో ఉన్నారు. ప్రజారోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని వైరస్‌లో కొత్త రూపాంతరాలు ఉన్నాయా లేదా అనేది తెలుసుకునేందుకు పలు చర్యలు ప్రారంభించారు. తీవ్రత, మరణాల నేపథ్యంలో సంబంధిత నమూనాలను పుణెలోని జాతీయ వైరాలజీ సంస్థకు పూర్తి జన్యు విశ్లేషణ కోసం పంపించాలని నిర్ణయించారు. వైరస్‌లో కొత్త లేదా ఆందోళనకరమైన వేరియంట్లు ఉన్నాయా అనే విషయాన్ని నిర్ధారించేందుకు ఈ చర్య చేపడుతున్నారు. రోగులతో సన్నిహితంగా మెలిగిన వ్యక్తులను గుర్తించి విస్తృత స్థాయిలో కాంటాక్ట్ ట్రేసింగ్ నిర్వహిస్తున్నారు. ప్రభావిత ప్రాంతాల్లో నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోంది. సంస్థాగత ఐసోలేషన్, ఇంటి వద్ద ఐసోలేషన్ విధానాలను కట్టుదిట్టంగా అమలు చేస్తూ వైరస్ మరింత వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ప్రత్యేక ఐసోలేషన్ వార్డుల్లో ఇరవై నాలుగు గంటల పాటు అత్యవసర వైద్య నిపుణులు అందుబాటులో ఉండేలా, అధిక ప్రవాహ ఆక్సిజన్, వెంటిలేటర్ సౌకర్యాలు సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. తీవ్ర కేసులపై ప్రత్యేక వైద్య సమీక్ష కూడా ప్రారంభించారు. పల్మనాలజీ విభాగంలో విధులు నిర్వహిస్తున్న ఇంటర్న్‌కు కోవిడ్ నిర్ధారణ కావడంతో వ్యక్తిగత రక్షణ పరికరాల వినియోగం తప్పనిసరి చేయాలని, ఆసుపత్రి పరిసరాలను పూర్తిగా శుభ్రపరచాలని, అధిక ప్రమాదంలో ఉన్న సిబ్బందికి పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు ప్రభావిత ప్రాంతాల్లో ఇంటింటికీ వెళ్లి జ్వర సర్వే నిర్వహిస్తున్నారు. ఇన్‌ఫ్లుయెంజా తరహా లక్షణాలు లేదా తీవ్రమైన శ్వాసకోశ ఇన్ఫెక్షన్ లక్షణాలు ఉన్నవారిని గుర్తించి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రజా ఆరోగ్యానికి సంబంధించిన విషయంలో కూడా తప్పుడు ప్రచారం చేయడం, ప్రభుత్వాన్ని నిందించడం సదరు సోషల్ మీడియా హ్యాండిల్స్ కు సబబు కాదని మరొక్క సారి స్పష్టం చేస్తున్నాము. #FactCheck #AndhraPradesh
FactCheck.AP.Gov.in tweet media
తెలుగు
0
35
38
1.6K
FactCheck.AP.Gov.in
FactCheck.AP.Gov.in@FactCheckAPGov·
టెట్‌ నిబంధనలతో టీచర్లు చాలా ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోకపోవడం అన్యాయం అంటూ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడును ఉద్దేశిస్తూ కొందరు ఆక్షేపించడం వాస్తవాలను దాచే ప్రయత్నం చేయడమే. ఎందుకంటే టెట్ నిబంధన రాష్ట్ర ప్రభుత్వం తనంతట తాను తీసుకువచ్చింది కాదు. గౌరవ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అమలు జరుపుతున్న ఈ నిబంధనను వాస్తవాలను మభ్యపెట్టే విధంగా ప్రచారం చేయడం సబబు కాదు. వాస్తవం ఏమిటంటే: ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం (ఆర్‌టీఈ చట్టం 2009) సెక్షన్ 23(1), జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి 2010 ఆగస్టు 23న జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఉపాధ్యాయ నియామకాలకు కనీస అర్హతల్లో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)లో ఉత్తీర్ణతను తప్పనిసరిగా పేర్కొంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో ఎంఎస్ నెం. 51, పాఠశాల విద్యాశాఖ, తేదీ 16-04-2011 ద్వారా టెట్ నిర్వహణకు మార్గదర్శకాలను జారీ చేసింది. 2010 ఆగస్టు 23కు ముందు ప్రభుత్వ లేదా స్థానిక సంస్థల్లో నియమితులైన ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు కల్పించింది. ప్రభుత్వ ఆమోదం లేని ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులకు ఈ మినహాయింపు వర్తించదు. ప్రైవేటు ఎయిడెడ్ పాఠశాలల్లో ప్రభుత్వ ఆమోదం లేని ఉపాధ్యాయులు టెట్‌లో తప్పనిసరిగా ఉత్తీర్ణులు కావాలి. ఈ అంశంలో సుప్రీంకోర్టు సివిల్ అప్పీల్ నెం. 1385/2025లో 2025 సెప్టెంబర్ 1న కీలక తీర్పు ఇచ్చింది. ఆర్‌టీఈ చట్టానికి ముందు నియమితులై, 2025 సెప్టెంబర్ 1 నాటికి పదవీ విరమణకు ఐదేళ్లకు పైగా సర్వీసు మిగిలి ఉన్న ఉపాధ్యాయులు రెండు సంవత్సరాల్లో టెట్ ఉత్తీర్ణులు కావాలి అనేది దాని సారాంశం. అయితే ఈ అంశంపై ఉపాధ్యాయులకు మేలుకలిగిద్దామనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేయగా సుప్రీంకోర్టు టెట్ తప్పనిసరి నిబంధన గడువును రెండు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాలకు పొడిగించింది. దీంతో ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులు 2028 ఆగస్టు 31లోగా టెట్ ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుంది. అందుకోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో ఎంఎస్ నెం. 36, పాఠశాల విద్యాశాఖ, తేదీ 23-10-2025 ద్వారా టెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 2011కు ముందు నియమితులైన ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయుల కోసం ప్రత్యేకంగా టెట్ నిర్వహించాలని పలువురు శాసన మండలి సభ్యులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ అభ్యర్ధన మేరకు ప్రభుత్వం మెమో నెం. 3303567/సర్వీసెస్-1/ఏ2/2026, తేదీ 25-06-2026 ద్వారా పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌కు ప్రత్యేక టెట్ నిర్వహించేందుకు అనుమతి ఇచ్చింది. 2011కు ముందు నియమితులైన ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయుల కోసం మాత్రమే ఈ ప్రత్యేక టెట్ నిర్వహించబడుతుంది. సాధారణ ఏపీ టెట్‌తో పాటు ఈ ప్రత్యేక టెట్ కూడా నిర్వహిస్తారు. 2028 ఆగస్టు 31లోగా టెట్ అర్హత సాధించేలా అవకాశం కల్పించడం, సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయడం ఈ ప్రత్యేక టెట్ ప్రధాన ఉద్దేశ్యం. వాస్తవాలు ఈ విధంగా ఉండగా తప్పుడు ప్రచారం చేయడం సబబు కాదు. #FactCheck #AndhraPradesh
FactCheck.AP.Gov.in tweet media
తెలుగు
1
19
35
2.4K
FactCheck.AP.Gov.in
FactCheck.AP.Gov.in@FactCheckAPGov·
రాజధాని అమరావతిలో జరుగుతున్న నిర్మాణాలకు సంబంధించిన నిర్మాణ వ్యయంపై ఇప్పటికే ప్రభుత్వం పలుమార్లు పూర్తి స్థాయిలో వివరణలు ఇచ్చినా కొందరు అదేపనిగా తప్పుడు ప్రచారానికి పాల్పడుతున్నారు. ఒకే అబద్ధాన్ని వందసార్లు చెప్పినా అది నిజంగా మారదు. అంతర్జాతీయ ప్రమాణాలతో రాజధాని అమరావతిలో జరుగుతున్న నిర్మాణాల వ్యయం దేశంలోని ఇతర నిర్మాణాలకు అయిన వ్యయంతో పోలిస్తే ఏ మాత్రం ఎక్కువ కాదు. అయినా సరే అమరావతి నిర్మాణాలపై అసత్య ప్రచారం చేయడం క్షమించరాని నేరం. కేంద్ర ప్రభుత్వ నివాస సముదాయం (Central Government Residential Complex) అమరావతిలో చదరపు అడుగు నిర్మాణ వ్యయం రూ.3,945 కాగా, హ్యాపీ నెస్ట్ ప్రాజెక్టులో అది రూ.3,374గా ఉంది. ప్రభుత్వ గృహ నిర్మాణ (GO Housing) ప్రాజెక్టులో రూ.4,228, ఎన్జీవో హౌసింగ్‌లో రూ.4,172, ఎమ్మెల్యే/ఎంఎల్‌సీ టవర్లలో రూ.4,088గా ఉంది. అంటే అమరావతి నివాస సముదాయాల నిర్మాణ వ్యయం దేశంలోని ఇతర ప్రభుత్వ ప్రాజెక్టులతో పోలిస్తే సహజమైన పరిధిలోనే ఉందని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఐకానిక్ భవనాల విషయానికి వస్తే తెలంగాణ సచివాలయం చదరపు అడుగు నిర్మాణ వ్యయం రూ.13,762 కాగా, అమరావతి అసెంబ్లీకి రూ.16,052, హైకోర్టుకు రూ.10,471, జీఏడీ టవర్‌కు రూ.13,144, హెచ్‌వోడీ టవర్లకు రూ.13,620–13,829గా ఉంది. పార్లమెంట్ భవనం నిర్మాణ వ్యయం రూ.16,916 చదరపు అడుగుకు నమోదైంది. అయితే అమరావతిలో ప్రభుత్వ భవనాల నిర్మాణానికి చదరపు అడుగు నిర్మాణ వ్యయం రూ.20,000 గా ఉందనే తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అత్యున్నత ప్రమాణాలతో నిర్మిస్తున్న ప్రభుత్వ ప్రతిష్టాత్మక భవనాలకు అమరావతి వ్యయం ఏమాత్రం అసాధారణం కావు. అమరావతి భవనాలన్నీ భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని, భూకంప నిరోధక సాంకేతికత, ఆధునిక భద్రతా ప్రమాణాలు, గ్రీన్ బిల్డింగ్ ప్రమాణాలు, అత్యాధునిక మౌలిక సదుపాయాలతో రూపుదిద్దుకుంటున్నాయి. కేవలం నిర్మాణ వ్యయాలను వక్రీకరించి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు ఇకనైనా మానుకోవాలి. అమరావతి ఒక సాధారణ నిర్మాణ ప్రాజెక్టు కాదు. ఇది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ పరిపాలనా కేంద్రం. రాష్ట్రానికి దశాబ్దాల పాటు సేవలందించే శాశ్వత రాజధానిని అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించడమే ప్రభుత్వ లక్ష్యం. అందుకే నాణ్యతలో రాజీ పడకుండా, ప్రతి రూపాయిని విలువైన పెట్టుబడిగా వినియోగిస్తూ అమరావతి నిర్మాణాన్ని ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తోంది. #FactCheck #AndhraPradesh
FactCheck.AP.Gov.in tweet media
తెలుగు
2
23
53
2.2K
FactCheck.AP.Gov.in
FactCheck.AP.Gov.in@FactCheckAPGov·
విజయవాడ పోలీస్ కమీషనరేట్ పరిధిలో మరో వ్యక్తి అదృశ్యం అయ్యాడని కొందరు పనిగట్టుకుని చేస్తున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదు. మొగిలిచర్ల ఏసుబాబు అనే వ్యక్తిని 3 రోజుల కిందట జగ్గయ్యపేట పోలీసులు అరెస్టు చేశారు. చట్ట ప్రకారం నిందితుడు అరెస్టు అయిన 24 గంటలలో జగ్గయ్యపేట పోలీసులు న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు. న్యాయమూర్తి అదే రోజు నిందితుడికి రిమాండ్ విధించారు. నిందితుడు జగ్గయ్యపేట సబ్ జైలులో ఉన్నాడు. కాబట్టి మరో వ్యక్తి అదృశ్యం అయ్యాడు అనే వార్తను నమ్మవద్దు. తప్పుడు ప్రచారం చేసే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. #FactCheck #AndhraPradesh
FactCheck.AP.Gov.in tweet mediaFactCheck.AP.Gov.in tweet mediaFactCheck.AP.Gov.in tweet media
తెలుగు
1
17
38
2.2K
FactCheck.AP.Gov.in
FactCheck.AP.Gov.in@FactCheckAPGov·
శివాలయంలో వెలుగుతున్న పవిత్ర దీపంతో ఒక యువకుడు సిగరెట్ వెలిగించిన వీడియో పూర్వాపరాలను పోలీసులు దర్యాప్తు చేయగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఆ సంఘటన గతంలో (2022వ సంవత్సరంలో) జరిగింది. ఆదోని నియోజకవర్గం రణమండల కొండపైన ఉన్న శివాలయంలో 2022లో ఈ సంఘటన జరిగిందని పోలీసు దర్యాప్తులో తేలింది. ఆ సంవత్సరం 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షల సమయంలో ముగ్గురు స్నేహితులతో కలిసి ఆదోని మండలం విరూపాపురం గ్రామానికి చెందిన వడ్డె ఈరన్న అనే యువకుడు ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడని పోలీసు విచారణలో తేలింది. అప్పటిలో జరిగిన ఈ సంఘటనపై కనీసం కేసు కూడా నమోదు కాలేదు. ఇప్పుడు వీడియోను కొందరు కావాలని వైరల్ చేయడంతో పోలీసులు బీఎన్‌ఎస్ సెక్షన్ 299 కింద కేసు నమోదు చేశారు. అప్పట్లో చిత్రీకరించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ఎందుకు వైరల్ అయిందనే కోణంలో పోలీసుల దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మతాలు, కులాల మధ్య చిచ్చు పెట్టేలా, హిందువుల మనోభావాలు దెబ్బతీసి రెచ్చగొట్టేలా ఇటీవల జరుగుతున్న కొన్ని పరిణామాలను పోలీసులు విశ్లేషిస్తున్నారు. #FactCheck #AndhraPradesh
FactCheck.AP.Gov.in tweet media
తెలుగు
11
114
246
25.3K
FactCheck.AP.Gov.in
FactCheck.AP.Gov.in@FactCheckAPGov·
ఆర్టీసీ ప్రైవేటీకరణ కే ప్రభుత్వ పంతం అంటూ కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఈ అంశంపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం లో ఎలాంటి నిజం లేదు. ఈ ఏడాది మే నెల 17వ తేదీన, 19వ తేదీన ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం కూడా పూర్తి స్థాయిలో వివరణ ఇచ్చినా మళ్ళీ మళ్లీ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఆధీనంలో ఉన్న డీజిల్ బస్సుల వల్ల కాలుష్యాన్ని తగ్గించేందుకు ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెట్టాలనేది కేంద్ర ప్రభుత్వ నిర్ణయం. దీనికి విపరీతార్థాలు తీయడం, ప్రైవేటీకరణ అంటూ వార్తలు రాయడం కొందరికి అలవాటు అయ్యింది. ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు కోసం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన 'కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్' (CESL) 2022- 23 నుంచి టెండర్లు పిలుస్తూనే ఉన్నది. పీఎం ఈ-బస్ సేవా (PM-eBus Sewa) పథకం, పీఎం ఈ-డ్రైవ్ (PM E-DRIVE) పథకం కింద ఈ బస్సులను GCC (Gross Cost Contract) పద్ధతిలో నిర్వహిస్తారు. అంటే ప్రైవేటు సంస్థలు బస్సులను కొనుగోలు చేసి, నిర్వహణ బాధ్యతలు చూసుకుంటాయి. ఆర్టీసీ కండక్టర్ల ను నియమిస్తుంది. ఇది దేశవ్యాప్తంగా ఉన్న పాలసీ తప్ప మన రాష్ట్రం లో మాత్రమే అమలుకావడం లేదు. ఏపీ ఎస్ ఆర్టీసీ రాష్ట్ర ప్రభుత్వం లో భాగం. దానిని ప్రైవేటు పరం చేయడం లేదు. ప్రజల్లో అపోహలు సృష్టించే విధంగా తప్పుడు ప్రచారం చేయడం చట్టరీత్య నేరం. #FactCheck #AndhraPradesh
FactCheck.AP.Gov.in tweet media
తెలుగు
1
10
19
2.9K
FactCheck.AP.Gov.in
FactCheck.AP.Gov.in@FactCheckAPGov·
ఉన్నత విద్యలో బదిలీల గందరగోళం శీర్షికతో సాక్షి దినపత్రికలో వచ్చిన వార్త పూర్తిగా నిరాధారమైనది. అభూతకల్పనలతో కూడినది. ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలు, షెడ్యూల్‌కు అనుగుణంగానే బదిలీల ప్రక్రియను పూర్తిగా నిర్వహించినట్లు ఉన్నత విద్యాశాఖ కమిషనర్ స్పష్టం చేశారు. స్వయంప్రతిపత్తి లేని కళాశాలల నుంచి 766, స్వయంప్రతిపత్తి కలిగిన కళాశాలల నుంచి 390 దరఖాస్తులు కలిపి మొత్తం 1,156 దరఖాస్తులను అర్హత పాయింట్ల ఆధారంగా పారదర్శకంగా పరిశీలించారు. ధ్రువపత్రాల పరిశీలన సమయంలో గుర్తించిన వ్యత్యాసాలను కౌన్సెలింగ్‌కు ముందే మళ్లీ పరిశీలించి సరిదిద్దారు. అలాగే గౌరవ న్యాయస్థానం ఆదేశాలను పూర్తిగా గౌరవిస్తూ వాటిని అమలు చేశారు. ఈ నేపథ్యంలో బదిలీల ప్రక్రియలో గందరగోళం నెలకొందనే ఆరోపణలు పూర్తిగా అవాస్తవం. ఆరోపణ: బదిలీల ప్రక్రియ ఒకే రోజులో పూర్తి చేయాలని ఆదేశించారు. హడావుడి నిర్ణయంతో సంబంధిత అధికారుల్లో తీవ్ర ఆందోళన, గందరగోళం నెలకొన్నాయి. వాస్తవం: ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో సాధారణ బదిలీల ప్రక్రియకు ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఉన్నత విద్యాశాఖ జూలై 2న 134 నెంబరు ఉత్తర్వు జారీ అయింది. ఆ షెడ్యూల్ ప్రకారం జూలై 3 సాయంత్రం వరకు ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ, జూలై 3, 4 తేదీల్లో సీనియారిటీ, అర్హత మార్కుల జాబితా ప్రదర్శన, పరిశీలన, జూలై 4, 5 తేదీల్లో స్వయంప్రతిపత్తి కళాశాలలకు ఎంపిక కమిటీల ద్వారా ఇంటర్వ్యూలు, స్వయంప్రతిపత్తి లేని కళాశాలలకు దృశ్య సమావేశం ద్వారా కౌన్సెలింగ్ నిర్వహించేలా నిర్ణయించారు. నిర్ణయించిన షెడ్యూల్‌లో ఒక రోజు ఆదివారం వచ్చినా ఉద్యోగుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అదే రోజు కౌన్సెలింగ్ నిర్వహించారు. మూడు రోజుల గడువును తగ్గించడం లేదా ఒకే రోజులో ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశం ఇవ్వడం జరగలేదు. ఆరోపణ: తక్కువ వ్యవధిలోనే బదిలీల ప్రక్రియ కొనసాగడం వల్ల ఇబ్బంది కలిగింది. వాస్తవం: బదిలీలకు సంబంధించిన షెడ్యూల్ ప్రభుత్వం ముందుగానే ప్రకటించింది. ఉన్నత విద్య కమిషనర్ విడుదల చేసిన కార్యాచరణ షెడ్యూల్‌ను అన్ని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాళ్లకు పంపించి, అధ్యాపకులు, సిబ్బందికి వివరించడం జరిగింది. అందువల్ల హడావుడిగా చేశారనే ఆరోపణ అవాస్తవం. ఆరోపణ: సీనియారిటీ మార్కుల జాబితాను శనివారం అర్ధరాత్రి సమయంలో విడుదల చేసి, అందులో విస్తృత స్థాయిలో తప్పులు ఉన్నాయని గుర్తించిన అనంతరం కొద్దిసేపటికే దానిని హఠాత్తుగా రద్దు చేశారు. వాస్తవం: సీనియారిటీ, అర్హత మార్కుల జాబితా ఉద్యోగులు తమ ఆన్‌లైన్ దరఖాస్తుల్లో స్వయంగా నమోదు చేసిన వివరాల ఆధారంగా సిద్ధం చేశారు. అనంతరం సంబంధిత కళాశాలల ప్రిన్సిపాళ్లు వాటిని పరిశీలించారు. ధ్రువీకరించిన సీనియారిటీ జాబితా, అర్హత మార్కులను అందచేసిన తర్వాత కౌన్సెలింగ్ ప్రారంభానికి ముందే సవరించిన జాబితాను సిద్ధం చేశారు. ముందస్తుగా జాబితాను విడుదల చేయడం, లోపాలు గుర్తించిన వెంటనే వాటిని సరిదిద్దడం పారదర్శకతలో భాగమే. దీనిని పరిపాలనా వైఫల్యంగా చిత్రీకరించడం సరికాదు. ఆరోపణ: గతంలో ఎయిడెడ్ కళాశాలలలోని అధ్యాపకులు తమ సీనియారిటీ నిర్ణయంలో తీవ్ర అన్యాయం జరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. వాస్తవం: ప్రభుత్వంలో విలీనమైన మాజీ ఎయిడెడ్ కళాశాలల ఉద్యోగులకు ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన సేవా నిబంధనల ప్రకారమే సీనియారిటీ, సేవా కాలాన్ని పరిగణనలోకి తీసుకున్నారు. వారి సేవా కాలం, వారు ప్రభుత్వ సేవలో విలీనమైన తేదీ అయిన 2021 నుంచి మాత్రమే లెక్కిస్తారు. ఎయిడెడ్ విద్యాసంస్థల్లో మొదట ఉద్యోగంలో చేరిన తేదీ నుంచి కాదు. దీనిపై అపోహలు రేకెత్తించడం సబబు కాదు. ఆరోపణ: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలలో పనిచేస్తున్న సాధారణ అధ్యాపకులు బదిలీల ప్రక్రియలో సర్వీసు మార్కుల కేటాయింపుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. వాస్తవం: కౌన్సెలింగ్ ప్రారంభానికి ముందే సంబంధిత కళాశాలల ప్రిన్సిపాళ్ల ద్వారా ధృవీకరించుకున్న వాటినే ఉన్నతాధికారులు అమలు చేశారు. ఆరోపణ: ప్రభుత్వంలో విలీనమైన మాజీ ఎయిడెడ్ కళాశాలల ఉద్యోగులు తమ సేవా నిబంధనల రూపకల్పనకు ముందు సమర్పించిన అభ్యంతరాలు, సూచనలను ఉన్నత విద్యాశాఖ పరిగణనలోకి తీసుకోలేదు. వాస్తవం: ప్రభుత్వంలో విలీనమైన మాజీ ఎయిడెడ్ కళాశాలల ఉద్యోగులకు సంబంధించిన సేవా నిబంధనలు జారీ చేసే ముందు వారి ప్రతినిధులతో విస్తృత స్థాయిలో అధికారులు చర్చలు జరిపారు. సేవా నిబంధనల రూపకల్పనకు ముందు వివిధ అంశాలపై వారి అభిప్రాయాలు, సూచనలను స్వీకరించి సమగ్రంగా పరిశీలించిన అనంతరమే తుది నిర్ణయం తీసుకున్నారు. అందువల్ల భాగస్వాముల అభిప్రాయాలను తీసుకోకుండా సేవా నిబంధనలను అమలు చేశారన్న ఆరోపణలు వాస్తవాలకు విరుద్ధం. ఆరోపణ: బదిలీల కౌన్సెలింగ్ ప్రక్రియలో సాంకేతిక సమస్యలు వాస్తవం: బదిలీల కౌన్సెలింగ్ సందర్భంగా తలెత్తిన సాంకేతిక సమస్యలను కౌన్సెలింగ్‌కు ఆటంకం కలగకుండా పరిష్కరించారు. ఆరోపణ: విలీనమైన 350 మంది అధ్యాపకులు తమ బదిలీలను సవాలు చేస్తూ గౌరవ న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్లు సమాచారం. ఈ పిటిషన్లతో బదిలీల ప్రక్రియపై న్యాయపరమైన ప్రతిష్ఠంభన ఏర్పడినట్లు తెలుస్తోంది. వాస్తవం: 225 మంది ఉద్యోగులు (బోధనా, బోధనేతర సిబ్బంది) ప్రస్తుతం న్యాయస్థానం ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల ఆధారంగా శాఖలో కొనసాగుతున్నారు. గౌరవ న్యాయస్థానం అమల్లో ఉన్న ఆదేశాలను గౌరవిస్తూ, ఈ ఉద్యోగులకు బదిలీలను అమలు చేయలేదు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులలోని 28వ మార్గదర్శకంలో కూడా న్యాయస్థాన ఉత్తర్వుల ఆధారంగా విధుల్లో కొనసాగుతున్న ఉద్యోగులు ఈ మార్గదర్శకాల పరిధిలోకి రారు. గౌరవ న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను పూర్తిగా పాటిస్తున్నారు. అలాగే న్యాయస్థానం వెలువరించే తుది తీర్పును కూడా యథావిధిగా అమలు చేస్తారు. అందువల్ల బదిలీల ప్రక్రియలో ఎలాంటి ప్రతిష్ఠంభన లేదు. #FactCheck #AndhraPradesh
FactCheck.AP.Gov.in tweet media
తెలుగు
1
7
19
2.2K