Kesineni Foundation

438 posts

Kesineni Foundation banner
Kesineni Foundation

Kesineni Foundation

@Help_Kesineni

A Voluntary Organisation committed to empowering healthier relationships, and to bring positive change in the community.

Vijayawada Katılım Eylül 2022
1 Takip Edilen2.7K Takipçiler
Kesineni Foundation
Kesineni Foundation@Help_Kesineni·
విజయవాడ పార్లమెంట్ సభ్యులు శ్రీ కేశినేని శివనాథ్ (చిన్ని) గారి ద్వారా కేశినేని ఫౌండేషన్ లో మహిళలకు ఉపాధి దిశగా శిక్షణ.. హోమ్ లిక్విడ్స్ తయారీపై కేశినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న చింతా అరుణకుమారి గారు తమ అనుభవాన్ని పంచుకున్నారు. ఈ శిక్షణలో భాగంగా డిటర్జెంట్ పౌడర్ (సర్ఫ్) తయారీ విధానం మరియు దానికి అవసరమైన ముడి పదార్థాల గురించి సమగ్రంగా నేర్చుకున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌లోని National Institute of Rural Development and Panchayati Raj (NIRD) లో మానస గారి మార్గదర్శకత్వంలో ఈ శిక్షణ పొందినట్లు చెప్పారు. సర్ఫ్ తయారీకి అవసరమైన 13 రకాల ముడి పదార్థాల గురించి వివరంగా అవగాహన కలిగిందని తెలిపారు. మహిళలకు నైపుణ్యాభివృద్ధి కల్పించి, స్వయం ఉపాధి అవకాశాలు పెంచడం కేశినేని ఫౌండేషన్ లక్ష్యమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. #kesinenisivanadh #KesineniFoundation #WomenEmpowerment #SkillDevelopment #SelfEmployment #WomenEntrepreneurs #NIRD #EmpoweringWomen
తెలుగు
0
1
1
32
Kesineni Foundation
Kesineni Foundation@Help_Kesineni·
తిరువూరు తెలుగుదేశం పార్టీ మరియు కేశినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో తిరువూరులో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని యువనేత కేశినేని వెంకట్ బాబు గారు ప్రారంభించారు. ఆంధ్ర ఆసుపత్రి వైద్య బృందం సహకారంతో నిర్వహించిన ఈ మెడికల్ క్యాంపులో సాధారణ వ్యాధులతో పాటు క్యాన్సర్, కంటి, కిడ్నీ, దంత, వినికిడి తదితర ఆరోగ్య సమస్యలకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రజలు ఈ ఉచిత వైద్య శిబిరాన్ని పెద్ద ఎత్తున సద్వినియోగం చేసుకున్నారు. ఈ సందర్భంగా కేశినేని వెంకట్ బాబు గారు మాట్లాడుతూ… కేశినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో విజయవాడ పార్లమెంట్ పరిధిలో సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేస్తూ, ప్రతి పది రోజులకు ఒక ప్రాంతంలో మెడికల్ క్యాంపులు నిర్వహించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ కేశినేని శివనాథ్ (చిన్ని) గారి ఆదేశాల మేరకు ఫౌండేషన్ ద్వారా వైద్య శిబిరాలతో పాటు మహిళలు, యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. గత మూడు సంవత్సరాలుగా ఫౌండేషన్ ద్వారా కొనసాగుతున్న సేవా కార్యక్రమాలు ఇకపై మరింత విస్తృతంగా కొనసాగుతాయని తెలిపారు. ఈ మెడికల్ క్యాంపు విజయవంతంగా నిర్వహించడానికి సహకరించిన వైద్య బృందం, స్థానిక నాయకులు మరియు స్వచ్ఛంద సేవకులకు కేశినేని ఫౌండేషన్ ధన్యవాదాలు తెలిపింది. #KesineniFoundation #KesineniVenkatBabu #FreeMedicalCamp #Tiruvuru #HealthForAll #ServiceToSociety #VijayawadaParliament #AndhraPradesh #TDP #Narachandrababunaidu #Naralokesh
Kesineni Foundation tweet mediaKesineni Foundation tweet mediaKesineni Foundation tweet mediaKesineni Foundation tweet media
తెలుగు
0
0
0
21
Kesineni Foundation
Kesineni Foundation@Help_Kesineni·
ఎన్.ఐ.ఆర్.డి లో ఎస్.హెచ్.జి మహిళలకు ముగిసిన ఐదు రోజుల నైపుణ్యాభివృద్ధి శిక్షణా కార్యక్రమం. మష్రూమ్స్ పెంపకం, హోమ్ బేస్డ్ ప్రొడక్ట్స్ తయారీ, బిజినెస్ మోడల్, ప్యాకేజింగ్ & మార్కెటింగ్ పై శిక్షణ. విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని) గారి సారథ్యంలో కేశినేని ఫౌండేషన్ మరియు ఎన్.ఐ.ఆర్.డి.పి.ఆర్ సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఎన్.ఐ.ఆర్.డి లో నిర్వహించిన 12వ బ్యాచ్ ఐదు రోజుల నైపుణ్యాభివృద్ధి శిక్షణా కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. ఎన్టీఆర్ జిల్లాకు చెందిన ఎస్.హెచ్.జి మహిళలలో 45 మంది మహిళలు ఈ శిక్షణలో పాల్గొన్నారు. మష్రూమ్స్ పెంపకం, హోమ్ బేస్డ్ ప్రొడక్ట్స్ తయారీ విధానాలపై వారికి ప్రాక్టికల్ మరియు థియరీ శిక్షణ అందించారు. శిక్షణ ముగింపు కార్యక్రమంలో శిక్షణ పూర్తిచేసుకున్న మహిళలకు ఎన్.ఐ.ఆర్.డి సీనియర్ కన్సల్టెంట్ మహ్మద్ ఖాన్ గారు, ప్రొఫెసర్ డాక్టర్ కతిరేషన్ గారు, మష్రూమ్ ట్రైనర్ ఎస్.పీ. రెడ్డి గారు, హోమ్ బేస్డ్ ప్రొడక్ట్స్ ట్రైనర్ మానస గారు సర్టిఫికేట్లు అందజేశారు. అలాగే బిజినెస్ మోడల్, ఉత్పత్తుల ప్యాకేజింగ్, లేబెలింగ్, మార్కెటింగ్, ఆర్డర్ మేనేజ్‌మెంట్, కాస్ట్ అనాలిసిస్ వంటి అంశాలపై ప్రత్యేక అవగాహన కల్పించారు. మహిళా పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి ఉన్న అవకాశాలు మరియు ప్రభుత్వం అందిస్తున్న పథకాల గురించి కూడా వివరించారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ తమ జీవనోపాధి పెంచుకునేందుకు ఇలాంటి శిక్షణా అవకాశాన్ని కల్పించిన ఎంపీ కేశినేని శివనాథ్ గారికి, కేశినేని ఫౌండేషన్, ఎన్.ఐ.ఆర్.డి సంస్థలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా అర్బన్ ఎన్.ఐ.ఆర్.డి కోఆర్డినేటర్ సొంగా సంజయ్ వర్మ గారు తదితరులు పాల్గొన్నారు. #KesineniShivanath #NIRDPR #SHGWomen #WomenEmpowerment #SkillDevelopment #Vijayawada #NTRDistrict #AndhraPradesh
Kesineni Foundation tweet mediaKesineni Foundation tweet mediaKesineni Foundation tweet mediaKesineni Foundation tweet media
తెలుగు
0
0
1
21
Kesineni Foundation
Kesineni Foundation@Help_Kesineni·
మహిళల ఆర్థిక సాధికారతే లక్ష్యంగా శిక్షణ కార్యక్రమాలు.. ఎంపీ శ్రీ కేశినేని శివనాథ్ (చిన్ని) గారి సారథ్యంలో, కేశినేని ఫౌండేషన్ మరియు ఎన్‌.ఐ.ఆర్‌.డి సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో జరుగుతున్న ఐదు రోజుల 12వ నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమం రెండో రోజుకు చేరుకుంది. ఎన్‌టీఆర్ జిల్లాకు చెందిన 45 మంది ఎస్‌.హెచ్‌.జి మహిళలు మష్రూమ్స్ పెంపకం మరియు హోమ్ బేస్డ్ ప్రొడక్ట్స్ తయారీపై ప్రాక్టికల్ మరియు థియరీ శిక్షణ పొందుతున్నారు. ఆదాయం పెంపు మార్గాలు, పర్యావరణ పరిరక్షణ, నాణ్యత ప్రమాణాలు వంటి అంశాలపై సమగ్ర అవగాహన కల్పించబడింది. రెండో రోజు ట్రైనర్ డాక్టర్ ప్రసూన గారు స్పాన్ హ్యాండ్లింగ్, నాణ్యత పరిశీలన, సురక్షిత నిల్వ, సబ్‌స్ట్రేట్ ఎంపిక, తరిగే విధానం, పాస్చరైజేషన్/స్టెరిలైజేషన్, చల్లబరచడం, తేమ సర్దుబాటు, సబ్‌స్ట్రేట్ టెస్టింగ్ వంటి అంశాలపై అవగాహన కల్పించడంతో పాటు ప్రాక్టికల్ శిక్షణ అందించారు. ఉత్తమ్ ఇండస్ట్రీస్‌కు చెందిన ట్రైనర్ మానస గారు ఫీనైల్ తయారీ, హ్యాండ్‌వాష్ ఫార్ములేషన్, రసాయన లక్షణాలు, భద్రత ప్రమాణాలు, కొలతలు, మిక్సింగ్, ఫిల్ట్రేషన్, ప్యాకేజింగ్ డెమో వంటి అంశాలపై ప్రాక్టికల్ శిక్షణ ఇచ్చారు. #NTRDistrict #WomenEmpowerment #SkillDevelopment #SHGWomen #NIRD #MushroomCultivation #HomeBasedProducts
Kesineni Foundation tweet mediaKesineni Foundation tweet mediaKesineni Foundation tweet mediaKesineni Foundation tweet media
తెలుగు
0
0
0
17
Kesineni Foundation
Kesineni Foundation@Help_Kesineni·
ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) గారి సారథ్యంలో కేశినేని ఫౌండేషన్ మరియు ఎన్.ఐ.ఆర్.డి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 12వ నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమం సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఎన్టీఆర్ జిల్లాకు చెందిన 45 మంది ఎస్‌.హెచ్‌.జి మహిళలు మార్చి 2 నుంచి మార్చి 6వ తేదీ వరకు ఐదు రోజుల పాటు మష్రూమ్స్ పెంపకం మరియు హోమ్ బేస్డ్ ప్రొడక్ట్స్ తయారీపై ప్రత్యేక శిక్షణ పొందనున్నారు. శిక్షణ ప్రారంభ సమావేశం ఎన్‌.ఐ‌.ఆర్‌.డి.పి.ఆర్‌లో అసోసియేట్ ప్రొఫెసర్ (సి.ఐ.ఎ.టి.ఎస్.జె - హెడ్) డాక్టర్ సి. కత్తిరేషన్ గారి ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్. రమేష్ శక్తివేల్ గారు, సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ మహ్మద్ ఖాన్ గారు, హోమ్ బేస్డ్ ప్రోగ్రామ్స్ ట్రైనర్ మానస గారు, మష్రూమ్స్ పెంపకం ట్రైనర్ ప్రసన్న గారు పాల్గొని శిక్షణ వివరాలు తెలియజేశారు. హోమ్ బేస్డ్ ప్రొడక్ట్స్ (వాషింగ్ పౌడర్, లిక్విడ్ సోప్స్, షాంపులు, పినాయిల్) తయారీకి అవసరమైన ముడి పదార్థాలు, తయారీ విధానం, వినియోగాలు గురించి సమగ్రంగా అవగాహన కల్పించారు. అలాగే మష్రూమ్స్ పెంపకం పై ప్రాయోగిక మరియు సిద్దాంతాత్మక శిక్షణ అందించారు. స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా ఎదగడానికి ఈ శిక్షణ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని మహిళలు పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని కల్పించిన ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) గారికి, కేశినేని ఫౌండేషన్ మరియు ఎన్‌.ఐ‌.ఆర్‌.డి సంస్థలకు వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా ఎన్‌.ఐ‌.ఆర్‌.డి అర్బన్ కో-ఆర్డినేటర్ సొంగా సంజయ్ వర్మ గారు తదితరులు పాల్గొన్నారు. #MPKesineniShivanath #Vijayawada #NTRDistrict #SkillDevelopment #SHGWomen #WomenEmpowerment #NIRDPR #KesineniFoundation
Kesineni Foundation tweet mediaKesineni Foundation tweet mediaKesineni Foundation tweet mediaKesineni Foundation tweet media
తెలుగు
0
0
1
20
Kesineni Foundation
Kesineni Foundation@Help_Kesineni·
ఈరోజు కేశినేని ఫౌండేషన్ మరియు ఎన్.ఐ.ఆర్ .డి సంయుక్త ఆధ్వర్యంలో, ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ నుంచి 45 మంది స్వయం సహాయక సంఘాల మహిళలను హైదరాబాద్‌లోని ఎన్.ఐ.ఆర్ .డి ప్రధాన కార్యాలయానికి 5 రోజుల ప్రత్యేక శిక్షణ కోసం పంపించడం జరిగింది. మార్చి 2 నుండి మార్చి 6 వరకు నిర్వహించనున్న ఈ శిక్షణా కార్యక్రమంలో పుట్టగొడుగుల తయారీ, గృహ ఆధారిత ఉత్పత్తుల తయారీ విధానాలపై ప్రాయోగిక శిక్షణ అందించబడుతుంది. ప్రతి ఇంటి నుంచి ఒక మహిళా పారిశ్రామికవేత్త తయారు కావాలన్న లక్ష్యంతో, గత ఏడాది కాలంగా సుమారు 500 మంది మహిళలకు కేశినేని ఫౌండేషన్ ద్వారా కేశినేని శివనాథ్ (చిన్ని) గారు స్వంత నిధులతో నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి జంపాల సీతారామయ్య గారు, కొండపల్లి మున్సిపాలిటీ చైర్మన్ మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెన్నుబోయిన చిట్టిబాబు గారు, ఎన్టీఆర్ జిల్లా జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ గ్రామీణ సమన్వయకర్త సొంగా సంజయ్ వర్మ గారు, సహకార సంఘ సహకార బ్యాంక్ అధ్యక్షులు కోయ నెహ్రూ గారు, కౌన్సిలర్ పులిదాసు గారు, మైలవరం నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు కొత్తపల్లి ప్రకాశ్ గారు, ఎస్టీ నాయకులు మేడా శ్రీను గారు, మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యులు మాబు సుభాని గారు పాల్గొన్నారు. #KesineniFoundation #WomenEmpowerment #SkillDevelopment #SHGWomen #Entrepreneurship #HyderabadTraining #NIRD #Vijayawada #NTRDistrict #AtmaNirbharWomen
Kesineni Foundation tweet mediaKesineni Foundation tweet mediaKesineni Foundation tweet mediaKesineni Foundation tweet media
తెలుగు
0
0
0
26
Kesineni Foundation
Kesineni Foundation@Help_Kesineni·
గంపలగూడెం మండలం ఊటుకూరులో మెగా ఉచిత మెడికల్, రక్తదాన శిబిరం ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్, కేశినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో, ఎన్టీఆర్ జిల్లా తెలుగు రైతు అధ్యక్షులు చెరుకూరి రాజేశ్వరరావు గారి సతీమణి చెరుకూరి రాణి గారి 9వ వర్ధంతి పురస్కరించుకొని గంపలగూడెం మండలం ఊటుకూరులో మెగా ఉచిత మెడికల్ మరియు రక్తదాన శిబిరం నిర్వహించబడింది. ఈ శిబిరాన్ని తిరువూరు ఏఎంసీ చైర్పర్సన్ రేగళ్ల లక్ష్మీ–అనిత గారు, రేగళ్ల వీరారెడ్డి గారు, చెరుకూరి రాజేశ్వరరావు గారు కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం చెరుకూరి రాణి గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వివిధ గ్రామాల నుండి విచ్చేసిన రోగులకు వైద్యులు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు పంపిణీ చేశారు. రక్తదాన శిబిరంలో మండల టిడిపి పార్టీ అధ్యక్షులు మానుకొండ రామకృష్ణ (ఎంఆర్కే) గారు సహా టిడిపి నాయకులు, కార్యకర్తలు రక్తదానం చేసి సేవా స్పూర్తిని చాటారు. రక్తదానం చేసిన దాతలకు పండ్ల రసాలు అందజేసి ప్రశంసా పత్రాలు ప్రదానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా అన్నదానం కార్యక్రమం కూడా ఏర్పాటు చేయబడింది. ఈ కార్యక్రమంలో చెరుకూరు చందు గారు, మాజీ జెడ్పిటిసి సభ్యులు దిరిశాల వెంకట కృష్ణారావు గారు, నీటి సంఘం అధ్యక్షులు జంగా చెంచు రెడ్డి గారు, మాజీ సర్పంచ్ కొత్తా రజనీకాంత్ గారు, మండల టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. #MPKaryalayam #SevaKaryakramam #MedicalCamp #BloodDonationCamp #NTRMemorialTrust #KesineniFoundation #TDP #NTRDistrict
తెలుగు
0
0
0
13
Kesineni Foundation
Kesineni Foundation@Help_Kesineni·
విజయవాడ: స్వ‌యం ఉపాధి కోసం కేశినేని శివనాథ్(చిన్ని) గారి ఫౌండేష‌న్ ఆధ్వ‌ర్యంలో హైద‌రాబాద్ ఎన్.ఐ.ఆర్.డిలో నైపుణ్యాభివృద్ది శిక్ష‌ణ పొందిన మహిళలు స్వయం ఉపాధితో పారిశ్రామిక వేత్త‌లుగా మారి ఆర్థికంగా ఎదగాలనే లక్ష్యంతో కామన్ ఫెసిలిటీ సెంటర్లు (CFCs) ఏర్పాటు చేయనున్నట్లు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) గారు తెలిపారు. అలాగే మార్కెటింగ్ ప‌రంగా కూడా పూర్తి స‌హాయ స‌హ‌కారాలు అందిస్తామ‌ని భ‌రోసా ఇచ్చారు. గురునాన‌క్ కాల‌నీలోని విజ‌య‌వాడ పార్ల‌మెంట్ కార్యాల‌యం, ఎన్టీఆర్ భ‌వ‌న్ లో బుధ‌వారం ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) గారు మిల్లెట్స్, గార్మెంట్స్ అండ్ లెద‌ర్, నాచుర‌ల్ ఫార్మింగ్ , తేనె త‌యారీ, జ్యూట్ అండ్ కాటన్ బ్యాగ్స్ హెర్బ‌ల్ ప్రొడ‌క్ట్స్ త‌యారీ పై శిక్ష‌ణ పొందిన ఏడు గ్రూపుల మ‌హిళ‌ల‌తో గ్రూపుల వారీ గా విడివిడిగా స‌మావేశం అయ్యారు. ఈ స‌మావేశంలో ఎన్టీఆర్ జిల్లా పిడి డి.ఆర్.డి.ఎ నాంచార‌య్య కూడా పాల్గొన్నారు. మ‌హిళ‌లు తాము త‌యారు చేసిన వ‌స్తువుల‌ను ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) గారికి చూపించారు. ఆ వస్తువుల నాణ్య‌త‌, భ‌ద్ర‌త ల కోసం తీసుకున్న జాగ్ర‌త్త‌ల గురించి ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) గారు అడిగి తెలుసుకున్నారు. ఈ సంద‌ర్బంగా శిక్ష‌ణ పొందిన మ‌హిళ‌లు త‌మ‌కి రా మెటీరియ‌ల్ కొనుగోలు విష‌యంలో, మార్కెటింగ్ ప‌రంగా, అధిక సంఖ్య‌లో వ‌స్తువుల ఉత్ప‌త్తికి త‌యారీ కోసం మెషిన‌రీ ప‌రంగా స‌హ‌కారం అందించాల‌ని ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) గారిని కోరారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) గారు మాట్లాడుతూ శిక్ష‌ణ పొంది వ‌స్తువులు త‌యారు చేస్తున్న మ‌హిళ‌ల‌కు మ‌రింత‌గా ప్రోత్స‌హ‌కం అందించే విధంగా తాము చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు తెలిపారు. . ఒకే ర‌క‌మైన వ‌స్తువులు త‌యారు చేసే వారంద‌రికీ ఉప‌యోగ‌ప‌డే విధంగా కామ‌న్ పెసిలిటీ సెంట‌ర్స్ ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ కామ‌న్ ఫెసిలిటీ సెంట‌ర్స్ ను ఏర్పాటు చేయ‌టానికి వేగవంతంగా చ‌ర్య‌లు చేప‌డుతున్న‌ట్లు వివరించారు. అలాగే త‌యారు చేసిన వ‌స్తువుల‌కు మార్కెటింగ్ క‌ల్పించే విధంగా..వారు ఆర్థికంగా మ‌రింత ఉన్న‌త స్థానంలో వుండే విధంగా కావాల్సిన స‌హాయ స‌హ‌కారాలు అందించ‌టానికైనా ముందు వుంటామ‌ని తెలిపారు. ఇంటి ఒక ఎంట‌ర్ ప్రెన్యూర్ వుండాల‌న్న ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఆశయాన్ని స్పూర్తిగా తీసుకుని మ‌హిళ‌ల‌ను ఎంట‌ర్ ప్రెన్యూర్స్ గా తీర్చిదిద్దేందుకు కేశినేని శివనాథ్(చిన్ని) గారి ఫౌండేష‌న్ ద్వారా ఎన్.ఐ.ఆర్.డి లో ప‌లు విభాగాల్లో శిక్ష‌ణ ఇప్పించ‌టం జ‌రిగింద‌న్నారు. అనంత‌రం ఎన్టీఆర్ జిల్లా పిడి డి.ఆర్.డి.ఎ నాంచార‌య్య మాట్లాడుతూ మిల్లెట్స్, గార్మెంట్స్ అండ్ లెద‌ర్, నాచుర‌ల్ ఫార్మింగ్ , తేనె త‌యారీ, జ్యూట్ అండ్ కాటన్ బ్యాగ్స్ హెర్బ‌ల్ ప్రొడ‌క్ట్స్ గ్రూపుల‌కు నాణ్య‌మైన‌ రా మెటీరియ‌ల్ ఎక్క‌డ దొరుకుతుంద‌నే అంశాల‌పై అవ‌గాహ‌న క‌ల్పించారు. . అలాగే వ‌స్తువుల త‌యారీ చేసే క్ర‌మంలో, వాటిని మార్కెటింగ్ చేసే స‌మ‌యంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా, స‌హాయ స‌హ‌కారాలు అందిస్తామ‌న్నారు. ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) గారు అందించే స‌హాయంతో పారిశ్రామిక వేత్తలుగా రాణించాల‌ని ఆకాంక్షించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎన్టీఆర్ జిల్లా ఎన్.ఐ.ఆర్.డి రూర‌ల్ కో ఆర్డినేట‌ర్ సొంగా సంజ‌య్ వ‌ర్మ, న్టీఆర్ జిల్లా ఎన్.ఐ.ఆర్.డి అర్బ‌న్ కో ఆర్డినేట‌ర్ వ‌ల్ల‌భ‌నేని న‌రసింహాచౌద‌రి, ఎన్టీఆర్ జిల్లా స‌మైక్య అధ్య‌క్షురాలు కందుల క‌ల్ప‌న‌, విజ‌య‌వాడ రూర‌ల్ స‌మైక్య అధ్య‌క్షురాలు సుహాసిని ల‌తో పాటు త‌దిత‌రులు పాల్గొన్నారు #Vijayawada #WomenEntrepreneurs #CFC #SkillDevelopment #NIRD #AtmaNirbharWomen
Kesineni Foundation tweet mediaKesineni Foundation tweet mediaKesineni Foundation tweet mediaKesineni Foundation tweet media
తెలుగు
0
0
0
13
Kesineni Foundation
Kesineni Foundation@Help_Kesineni·
విజ‌య‌వాడ : కేశినేని శివనాథ్(చిన్ని) గారి ఫౌండేష‌న్ ద్వారా హైద‌రాబాద్ ఎన్.ఐ.ఆర్.డి లో స్వ‌యం ఉపాధికి సంబంధించి నైపుణ్యాభివృద్ది శిక్ష‌ణ పొందిన మ‌హిళ‌లు ఎంట‌ర్ ప్రెన్యూర్స్ గా రాణించేందుకు కామ‌న్ ఫెసిలిటీ సెంట‌ర్స్ ఏర్పాటు చేయ‌టంతోపాటు మార్కెటింగ్ ప‌రంగా కూడా పూర్తి స‌హాయ స‌హ‌కారాలు అందిస్తామ‌ని ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) గారు తెలిపారు. గురునాన‌క్ కాల‌నీలోని విజ‌య‌వాడ పార్ల‌మెంట్ కార్యాల‌యం, ఎన్టీఆర్ భ‌వ‌న్ లో మంగ‌ళ‌వారం ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) గారి హ్యాండ్ మేడ్ పేప‌ర్ ప్రొడ‌క్ట్స్, హోమ్ బేస్ట్ ప్రొడ‌క్ట్స్ , బ్రిక్స్ త‌యారీ పై శిక్ష‌ణ పొందిన మూడు గ్రూపుల మ‌హిళ‌ల‌తో గ్రూపుల వారీ గా విడివిడిగా స‌మావేశం అయ్యారు. మ‌హిళ‌లు తాము త‌యారు చేసిన వ‌స్తువుల‌ను ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) గారికి చూపించారు. ఆ వస్తువుల నాణ్య‌త‌, భ‌ద్ర‌త ల కోసం తీసుకున్న జాగ్ర‌త్త‌ల గురించి ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) గారు అడిగి తెలుసుకున్నారు. ఈ సంద‌ర్బంగా శిక్ష‌ణ పొందిన మ‌హిళ‌లు త‌మ‌కి రా మెటీరియ‌ల్ కొనుగోలు విష‌యంలో, మార్కెటింగ్ ప‌రంగా, మెషిన‌రీ కి సంబంధించి స‌హ‌కారం అందించాల‌ని ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) గారిని కోరారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) గారు మాట్లాడుతూ శిక్ష‌ణ పొంది వ‌స్తువులు త‌యారు చేస్తున్న మ‌హిళ‌ల‌కు మ‌రింత‌గా ప్రోత్స‌హ‌కం అందించే విధంగా తాము చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు తెలిపారు. . ఒకే ర‌క‌మైన వ‌స్తువులు త‌యారు చేసే వారంద‌రికీ ఉప‌యోగ‌ప‌డే విధంగా కామ‌న్ పెసిలిటీ సెంట‌ర్స్ ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ కామ‌న్ ఫెసిలిటీ సెంట‌ర్స్ ను ఏర్పాటు చేయ‌టానికి వేగవంతంగా చ‌ర్య‌లు చేప‌డుతున్న‌ట్లు వివరించారు. అలాగే త‌యారు చేసిన వ‌స్తువుల‌కు మార్కెటింగ్ క‌ల్పించే విధంగా..వారు ఆర్థికంగా మ‌రింత ఉన్న‌త స్థానంలో వుండే విధంగా కావాల్సిన సదుపాయాలు క‌ల్పించటంతో పాటు , ఎటువంటి స‌హాయ స‌హ‌కారాలు అందించ‌టానికైనా ముందు వుంటామ‌ని తెలిపారు. ఇంటి ఒక ఎంట‌ర్ ప్రెన్యూర్ వుండాల‌న్న ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఆశయాన్ని స్పూర్తిగా తీసుకుని మ‌హిళ‌ల‌ను ఎంట‌ర్ ప్రెన్యూర్స్ గా తీర్చిదిద్దేందుకు కేశినేని శివనాథ్(చిన్ని) గారు ఫౌండేష‌న్ ద్వారా ఎన్.ఐ.ఆర్.డి లో ప‌లు విభాగాల్లో శిక్ష‌ణ ఇప్పించ‌టం జ‌రిగింద‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎన్.ఐ.ఆర్.డి అధికారి ముర‌ళీకృష్ణ‌, ఎన్టీఆర్ జిల్లా ఎన్.ఐ.ఆర్.డి రూర‌ల్ కో ఆర్డినేట‌ర్ సొంగా సంజ‌య్ వ‌ర్మ, న్టీఆర్ జిల్లా ఎన్.ఐ.ఆర్.డి అర్బ‌న్ కో ఆర్డినేట‌ర్ వ‌ల్ల‌భ‌నేని న‌రసింహాచౌద‌రి, ఎన్టీఆర్ జిల్లా స‌మైక్య అధ్య‌క్షురాలు కందుల క‌ల్ప‌న‌, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి రామ‌ల‌క్ష్మీ, విజ‌య‌వాడ రూర‌ల్ స‌మైక్య అధ్య‌క్షురాలు సుహాసిని, సెక్ర‌ట‌రీ విజ‌య‌ల‌క్ష్మీ ల‌తో పాటు త‌దిత‌రులు పాల్గొన్నారు.
Kesineni Foundation tweet mediaKesineni Foundation tweet mediaKesineni Foundation tweet mediaKesineni Foundation tweet media
తెలుగు
0
0
0
23
Kesineni Foundation
Kesineni Foundation@Help_Kesineni·
విజ‌య‌వాడ : గ‌త ఏడాది కాలం నుంచి కేశినేని ఫౌండేష‌న్ ద్వారా హైదరాబాద్ ఎన్.ఐ.ఆర్.డి ప్ర‌ధాన కార్యాల‌యంలో స్వ‌యం ఉపాధి కి సంబంధించి నైపుణ్యాభివృద్ధి శిక్ష‌ణ పొందిన ఎస్.హెచ్.జి మ‌హిళ‌ల గ్రూపుల‌తో ఎంపీ కేశినేని శివ‌నాథ్(చిన్ని) గారు ఈ నెల 20 నుంచి స్వ‌యంగా క‌లిసి మాట్లాడ‌తార‌ని కేశినేని ఫౌండేష‌న్ చైర్మ‌న్, ఎంపీ కేశినేని శివ‌నాథ్(చిన్ని) గారి స‌తీమ‌ణి కేశినేని జాన‌కి ల‌క్ష్మీ గారు తెలిపారు. శిక్షణ అనంతరం ఎంట‌ర్ ప్రెన్యూర్స్ గా రాణించేందుకు ఎదురయ్యే సమస్యలను ఎంపీ కేశినేని శివ‌నాథ్(చిన్ని) గారు తెలుసుకుని వాటిని ప‌రిష్క‌రిస్తార‌ని తెలిపారు. హైదరాబాద్ ఎన్.ఐ.ఆర్.డి ప్ర‌ధాన కార్యాల‌యంలో ఫిబ్ర‌వ‌రి 9వ తేదీ నుంచి మొద‌లైన హ్యాండ్ మేడ్ పేప‌ర్ ప్రొడ‌క్ట్స్ త‌యారీ పై శిక్ష‌ణ ముగింపు కార్య‌క్ర‌మం శుక్ర‌వారం జ‌రిగింది. ఈ ఐదు రోజుల‌ శిక్షణా కార్య‌క్ర‌మంలో విజ‌యవంతంగా నైపుణ్యాభివృద్ది శిక్ష‌ణ ను పూర్తి చేసిన ఎన్టీఆర్ జిల్లాకు చెందిన 40 మంది ఎస్.హెచ్.జి మ‌హిళ‌ల‌కు స‌ర్టిఫికేట్స్ అందించారు. అంత‌కుముందు హ్యాండ్ మేడ్ పేపర్ ప్రొడక్ట్స్ త‌యారీ పై శిక్షణ పొందిన మహిళలందరితో మాట్లాడి శిక్షణలో భాగంగా ఏమి నేర్చుకున్నారో అడిగి తెలుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా కేశినేని జాన‌కీ ల‌క్ష్మీ గారు మాట్లాడుతూ స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 లక్ష్య సాధ‌నలో భాగంగా ప్రతి ఇంటిలో కనీసం ఒక ఎంటర్‌ప్రెన్యూర్ ఉండాలన్న‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశ‌యాల‌కు అనుగుణంగా ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) గారు ముందడుగు వేశారని తెలిపారు. మ‌హిళ‌లు ఆర్థిక స్వావలంబన సాధించాల‌నే లక్ష్యంతో ఎంపీ కేశినేని శివ‌నాథ్(చిన్ని) గారు త‌న స్వంత నిధులను వెచ్చించి ఎన్.ఐ.ఆర్.డి లో శిక్ష‌ణ ఇప్పిస్తూ ఎస్.హెచ్.జి మహిళలకు చేయూత అందిస్తున్నారని పేర్కొన్నారు. ఈ శిక్షణ లో నేర్చుకున్నది ఆచరణలో పెట్టాల‌ని సూచించారు. ముఖ్యంగా మహిళలు పుట్టుకతోనే బహుముఖ ప్రతిభ కలవారని, భార్యగా, తల్లిగా, చెల్లిగా అనేక బాధ్యతలు నిర్వర్తించే సామర్థ్యం ఉన్న మహిళలకు ఎంట‌ర్ ప్రెన్యూర్ గా రాణించ‌టం అంత క‌ష్టం కాద‌ని అభిప్రాయపడ్డారు. సరైన మార్గదర్శనం, అవకాశాలు లభిస్తే మహిళలు కూడా విజయవంతమైన వ్యాపారవేత్తలుగా ఎదగగలరని మీరంతా నిరూపించాల‌ని కోరారు. ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ఎన్.ఐ.ఆర్.డి సీనియ‌ర్ క‌న్స‌ల్టెంట్ మ‌హ్మాద్ ఖాన్, ప్రొఫ‌స‌ర్ డాక్ట‌ర్ క‌తిరేష‌న్, గాంధీ హ్యాండ్ మేడ్ పేప‌ర్ యూనిట్ అధికారి జె.ర‌వీంద్ర‌రావు, ఎన్టీఆర్ జిల్లా ఎన్.ఐ.ఆర్.డి రూర‌ల్ కో-ఆర్డినేట‌ర్ సొంగా సంజ‌య్ వ‌ర్మ ల‌తో పాటు త‌దిత‌రులు పాల్గొన్నారు. #NIRD #SelfHelpGroups #NaraChandrababuNaidu #VijayawadaParliament #KesineniChinni #kesinenisivanath #KesineniFoundation #ntrjillashg #vikasitpanchayat #ruraldevelopment
Kesineni Foundation tweet mediaKesineni Foundation tweet mediaKesineni Foundation tweet mediaKesineni Foundation tweet media
తెలుగు
0
0
0
23
Kesineni Foundation
Kesineni Foundation@Help_Kesineni·
విజ‌య‌వాడ : గ్రామీణ మహిళలు తమ జీవనోపాధి అవకాశాలను విస్తరించుకుని ఆర్థికంగా స్వాలంబ‌న సాధించే దిశ‌గా న‌డిపించేందుకు ఎంపీ కేశినేని శివ‌నాథ్(చిన్ని) గారి సార‌ధ్యంలో కేశినేని ఫౌండేష‌న్, ఎన్.ఐ.ఆర్.డి సంయుక్త ఆధ్వ‌ర్యంలో హైద‌రాబాద్ ఎన్.ఐ.ఆర్.డి ప్ర‌ధాన కార్యాల‌యంలో హ్యాండ్ మేడ్ పేప‌ర్ ప్రొడ‌క్ట్స్ త‌యారీపై అందిస్తున్న నైపుణ్యాభివృద్ది శిక్ష‌ణను ఎన్టీఆర్ జిల్లా కు చెందిన ఎస్.హెచ్.జి మ‌హిళ‌లు అందిపుచ్చుకుంటున్నారు. ఫిబ్ర‌వ‌రి 9 వ తేదీ నుంచి ఫిబ్రవరి 13వ తేదీ వరకు ఐదు రోజుల పాటు జరిగే ఈ శిక్షణా కార్యక్రమంలో నాల‌వ రోజు గురువారం ఎన్.ఐ.ఆర్.డిలో ఎస్.హెచ్.జి మహిళలు పొందిన శిక్షణ వివరాలను తెలియజేస్తూ ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) గారి, కేశినేని ఫౌండేషన్ కార్యాలయం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది ఎన్.ఐ.ఆర్.డి లో హ్యాండ్ మేడ్ పేపర్ ఉత్పత్తుల తయారీకి సంబంధించి గాంధీ హ్యాండ్ మేడ్ పేపర్ యూనిట్ అధికారి జె.రవీంద్రరావు నేతృత్వంలో పల్ప్ తయారీ, షీట్ నిర్మాణం, స్క్రీన్ ప్రింటింగ్, ఎన్వలప్ కవర్స్, పెన్స్ స్టాండ్ తయారీ పై అవగాహన శిక్షణ తరగతులు నిర్వహించారు. అనంతరం వీటిని ఎలా తయారు చేయాలో శిక్షణ ఇచ్చారు.. అలాగే స్క్రీన్ ప్రింటింగ్ యూనిట్ ను సంద‌ర్శించారు. #NIRD #RuralDevelopment #KesineniSivanath #KesineniChinni #KesineniFoundation #NaraChandrababuNaidu #VikasitPanchayat #VijayawadaParliament #SelfHelpGroups #NTRJillaSHG
Kesineni Foundation tweet mediaKesineni Foundation tweet mediaKesineni Foundation tweet mediaKesineni Foundation tweet media
తెలుగు
0
0
0
21
Kesineni Foundation
Kesineni Foundation@Help_Kesineni·
విజ‌య‌వాడ : ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) గారి సారధ్యంలో కేశినేని ఫౌండేషన్ , ఎన్.ఐ.ఆర్.డి సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాద్ ఎన్.ఐ.ఆర్.డి.పి.ఆర్. కార్యాలయంలో అందిస్తున్న హ్యాండ్ మేడ్ పేప‌ర్ ప్రొడ‌క్ట్స్ త‌యారీ పై శిక్షణను ఎన్టీఆర్ జిల్లాకు చెందిన ఎస్.హెచ్.జి మహిళలు సమర్థంగా వినియోగించుకుంటున్నారు. తమ జీవనోపాధి అవకాశాలను విస్తరించుకునేందుకు వారిలో నైపుణ్యాభివృద్ధి శిక్షణా కార్యక్రమం కొత్త ఉత్సాహం, స్పూర్తిని నింపుతోంది. ఫిబ్ర‌వ‌రి 9 వ తేదీ నుంచి ఫిబ్రవరి 13వ తేదీ వరకు ఐదు రోజుల పాటు జరిగే ఈ శిక్షణా కార్యక్రమంలో మూడవ రోజు బుధ‌వారం ఎన్.ఐ.ఆర్.డిలో ఎస్.హెచ్.జి మహిళలు పొందిన శిక్షణ వివరాలను తెలియజేస్తూ ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) గారి, కేశినేని ఫౌండేషన్ కార్యాలయం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది హ్యాండ్ మేడ్ పేపర్ ఉత్పత్తుల తయారీకి సంబంధించి గాంధీ హ్యాండ్ మేడ్ పేపర్ యూనిట్ అధికారి జె.రవీంద్రరావు నేతృత్వంలో ముందుగా గిఫ్ట్ బాక్స్ నిర్మాణం, కొలతలు ఏ విధంగా తీసుకోవాలి, ఉపయోగించే పదార్థాలు, ఫినిషింగ్ ఎలా వుండాల‌నే విధానాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. గిఫ్ట్ బాక్స్‌లో ఉపయోగించే కాగితం, కార్డ్‌బోర్డు, డెకరేటివ్ షీట్లు, గ్లూ వంటి పదార్థాల వినియోగం, మడతలు వేయడం, అతికించడం, అంచుల ఫినిషింగ్ వంటి అంశాలపై వివరంగా శిక్షణ ఇచ్చారు. ఇక ప్రాక్టికల్ సెషన్‌లో విద్యార్థులతో స్వ‌యంగా హ్యాండ్‌మేడ్ గిఫ్ట్ బాక్స్ తయారీ చేయించారు. గిఫ్ట్ బాక్స్ కి సంబంధించిన కట్టింగ్, ఫోల్డింగ్, అసెంబ్లింగ్, ఫినిషింగ్, అలంకరణ వంటి దశలను శిక్ష‌ణ పొందుతున్న మ‌హిళ‌ల‌తో చేయించారు. అలాగే కొలతల ప్ర‌కారం క‌ట్ చేయ‌డం, అంచులు స‌రైన అమరికతో స‌మానంగా వుండేలా నాణ్యత మెరుగుదల పద్ధతులు కూడా నేర్పించారు. శిక్ష‌ణ పొందుతున్న మ‌హిళ‌లు పేప‌ర్ బ్యాగ్స్ తో పాటు గిప్ట్ బాక్స్ లు త‌యారు చేశారు. #NIRD #RuralDevelopment #KesineniSivanath #KesineniChinni #KesineniFoundation #NaraChandrababuNaidu #VikasitPanchayat #VijayawadaParliament #SelfHelpGroups #NTRJillaSHG
Kesineni Foundation tweet mediaKesineni Foundation tweet mediaKesineni Foundation tweet mediaKesineni Foundation tweet media
తెలుగు
0
0
0
20
Kesineni Foundation
Kesineni Foundation@Help_Kesineni·
విజయవాడ పార్లమెంట్ సభ్యులు శ్రీ కేశినేని శివనాథ్ (చిన్ని) గారు, కేశినేని ఫౌండేషన్ , ఎన్.ఐ.ఆర్.డి సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాద్ ఎన్.ఐ.ఆర్.డి.ప్రధాన కార్యాలయంలో హ్యాండ్ మేడ్ పేప‌ర్ ప్రోడ‌క్ట్స్ త‌యారీ పై నైపుణ్యాభివృద్ది శిక్షణ పొందుతున్న ఎన్టీఆర్ జిల్లాకి చెందిన‌ ఎస్.హెచ్.జి మహిళలు ఈ శిక్ష‌ణ ను స‌ద్వినియోగ‌ పర్చుకుంటున్నారు. ఫిబ్ర‌వ‌రి 9వ తేదీ నుంచి ఫిబ్రవరి 13వ తేదీ వరకు ఐదు రోజుల పాటు జరిగే ఈ శిక్షణా కార్యక్రమంలో రెండు రోజు మంగ‌ళ‌వారం ఎన్.ఐ.ఆర్.డిలో హ్యాండ్ మేడ్ పేప‌ర్ ప్రోడ‌క్ట్స్ త‌యారీ పై ఎస్.హెచ్.జి మహిళలు పొందిన శిక్షణ వివరాలను తెలియజేస్తూ ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) గారి, కేశినేని ఫౌండేషన్ కార్యాలయం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. హ్యాండ్ మేడ్ పేపర్ ఉత్పత్తుల తయారీకి సంబంధించి గాంధీ హ్యాండ్ మేడ్ పేపర్ యూనిట్ అధికారి జె.రవీంద్రరావు నేతృత్వంలో హ్యాండ్ మేడ్ పేపర్ ను ఉపయోగించి పేపర్ బాగ్స్, ఫోటో ఫ్రేమ్ ఏ విధంగా తయారు చేయాలి...ఫోటో ఫ్రేమ్ డిజైన్స్, పేపర్ బాగ్స్ తయారీ కి మెటీరియల్ సెలక్షన్ గురించి, ఎల్.పోల్డర్ తయారీ పై, ఫైల్ తయారీ కోసం కొలతలు ఏ విధంగా తీసుకోవాలి, ఫైల్స్ డిజైన్ ఎలా వుండాలి...హ్యాండ్ ఆన్ పోల్డర్ గురించి అవగాహన శిక్షణ తరగతులు నిర్వహించారు. అనంతరం వీటిని ఎలా తయారు చేయాలో శిక్షణ ఇచ్చారు.. #NIRD #RuralDevelopment #KesineniSivanath #KesineniChinni #KesineniFoundation #NaraChandrababuNaidu #VikasitPanchayat #VijayawadaParliament #SelfHelpGroups #NTRJillaSHG
Kesineni Foundation tweet mediaKesineni Foundation tweet mediaKesineni Foundation tweet mediaKesineni Foundation tweet media
తెలుగు
0
0
0
18
Kesineni Foundation
Kesineni Foundation@Help_Kesineni·
విజయవాడ : ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) గారి సారధ్యంలో కేశినేని ఫౌండేషన్ మరియు ఎన్.ఐ.ఆర్.డి సంయుక్త ఆధ్వర్యంలో హ్యాండ్ మేడ్ పేపర్ ఉత్పత్తుల తయారీ విధానం పై ఐదు రోజుల పాటు శిక్షణ పొందేందుకు హైదరాబాద్ ఎన్.ఐ.ఆర్.డికి వెళ్లిన 40 మంది ఎన్టీఆర్ జిల్లాకు చెందిన ఎస్.హెచ్.జి మహిళలకు శిక్షణ తరగతులు సోమ‌వారం ప్రారంభం అయ్యాయి. 11వ నైపుణ్యాభివృద్ధి శిక్షణ కు వెళ్లిన వీరికి ఫిబ్ర‌వ‌రి 9 నుంచి 13వ తేదీ వరకు ఐదు రోజులు పాటు హ్యాండ్ మేడ్ పేపర్ ఉత్పత్తుల తయారీ విధానం పై శిక్షణ వుంటుంది. ఈమేరకు ఎంపీ కేశినేని శివనాథ్ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది ఈ ఐదు రోజుల నైపుణ్యాభివృద్ది శిక్షణా కార్యక్రమం ప్రారంభ సమావేశం ఎన్.ఐ.ఆర్.డి.పి.ఆర్. లో సోమ‌వారం అసోసియేట్ ఫ్రోపెసర్ (సి.ఐ.ఎ.టి.ఎస్.జె -హెడ్) డాక్టర్ సి.కత్తిరేషన్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశంలో అసోసియేషన్ ప్రోఫెసర్ డాక్టర్ ఎస్.రమేష్ శక్తివేల్, సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ మ హ్మాద్ ఖాన్, సంబంధించి గాంధీ హ్యాండ్ మేడ్ పేపర్ యూనిట్ అధికారి జె.రవీంద్రరావు శిక్షణ తీసుకునే 40 మంది ఎస్.హెచ్.జి మహిళలకు ముందుగా హ్యాండ్ మేడ్ పేపర్ ఉత్పత్తుల తయారీ విధానం శిక్షణ తరగతుల కార్యక్రమాల గురించి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్ గురించి వివరించారు. మేడ్ పేపర్ ఉత్పత్తుల తయారీ లో శిక్షణ పొందే వారికి మొదటి రోజు శిక్షణలో భాగంగా గాంధీ హ్యాండ్ మేడ్ పేపర్ యూనిట్ అధికారి జె.రవీంద్రరావు నేతృత్వంలో బేసిక్స్ ఆఫ్ హ్యాండ్ మేడ్ పేప‌ర్ టెక్నాల‌జీ, కావాల్సిన ముడి పదార్థాలు వాటి లక్షణాలు, తయారీ ప్రక్రియ, ఉపయోగాలు స‌వివరంగా తెలియ‌జేయ‌టం జ‌రిగింది. అలాగే ఫోటో ఫ్రేమ్ డిజైన్స్, మెటీరియల్ సెలక్షన్ గురించి, ఎల్.పోల్డర్ తయారీ పై, ఫైల్ తయారీ కోసం కొలతలు ఏ విధంగా తీసుకోవాలి, ఫైల్స్ డిజైన్ ఎలా వుండాలి...హ్యాండ్ ఆన్ పోల్డర్ గురించి అవగాహన శిక్షణ తరగతులు నిర్వహించారు. అనంతరం వీటిని ఎలా తయారు చేయాలో శిక్షణ ఇచ్చారు. స్వయం ఉపాధి నెలకొల్పుకునేందుకు శిక్షణ కార్యక్రమంకు పంపించినందుకు ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) గారితో పాటు కేశినేని ఫౌండేషన్, ఎన్.ఐ.ఆర్.డికి శిక్షణ పొందుతున్న మహిళలు కృతజ్ఞతలు తెలిపారు. #NIRD #ruraldevelopment #VijayawadaParliament #KesineniChinni #kesinenisivanath #KesineniFoundation #SHGGroups #Jaggayapeta
Kesineni Foundation tweet mediaKesineni Foundation tweet mediaKesineni Foundation tweet mediaKesineni Foundation tweet media
తెలుగు
0
1
1
18
Kesineni Foundation
Kesineni Foundation@Help_Kesineni·
జ‌గ్గ‌య్యపేట : ఇంటికో పారిశ్రామిక వేత్త వుండాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశయాన్ని ముందు తీసుకువెళ్లుందుకు ఎంపి కేశినేని శివనాథ్(చిన్ని) గారు కేశినేని ఫౌండేషన్ ద్వారా తన సొంత నిధులతో ప్రణాళిక బద్దంగా అడుగులు వేయ‌టంతో పాటు మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేందుకు తోడ్పాటు అందిస్తున్నార‌ని ఎమ్మెల్యే శ్రీరాం రాజ‌గోపాల్ (తాతాయ్య‌) గారు అన్నారు. ఎంపీ కేశినేని శివ‌నాథ్(చిన్ని) గారి సారథ్యంలో కేశినేని ఫౌండేష‌న్ మ‌రియు ఎన్.ఐ.ఆర్.డి సంయుక్త ఆధ్వ‌ర్యంలో హైదరాబాద్ ఎన్.ఐ.ఆర్.డి ప్ర‌ధాన కార్యాల‌యంలో ఈ నెల 9 నుండి 13వ తేదీ వరకు ఐదు రోజుల పాటు హ్యాండ్‌మేడ్ పేపర్ ప్రొడక్ట్స్ తయారీ విధానంపై శిక్ష‌ణ పొందేందుకు ఎన్టీఆర్ జిల్లా రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గాలకు చెందిన 40 మంది ఎస్.హెచ్.జి మ‌హిళ‌లతో ఒక ప్ర‌త్యేక బ‌స్సు ఆదివారం జ‌గ్గ‌య్య‌పేట‌ పట్టణం మున్సిప‌ల్ కార్యాల‌యం వ‌ద్ద నుంచి బ‌య‌లుదేరింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్యఅతిథిగా హాజ‌రైన ఎమ్మెల్యే శ్రీరాం రాజ‌గోపాల్ (తాతాయ్య‌) గారు శిక్ష‌ణ పొందేందుకు వెళుతున్న మహిళ‌ల‌కు శుభాకాంక్ష‌లు తెల‌ప‌టంతో పాటు వారితో స్వ‌యం మాట్లాడి వారి ఆస‌క్తి తెలుసుకున్నారు. అనంత‌రం ఎమ్మెల్యే శ్రీరాం రాజ‌గోపాల్ (తాతాయ్య‌) గారు జెండా ఊపి బ‌స్సు ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే శ్రీరాం రాజ‌గోపాల్ (తాతాయ్య‌) గారు మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేందుకు నైపుణ్యాభివృద్ధి శిక్షణలు ఎంతో దోహదపడ‌తాయని, హ్యాండ్ మేడ్ పేప‌ర్ ప్రొడ‌క్ట్స్ వంటి ఉపాధి అవకాశాలు గ్రామీణ మహిళలకు స్థిరమైన ఆదాయ మార్గంగా మారుతాయన్నారు. కేశినేని ఫౌండేషన్ సహకారంతో మహిళలకు శిక్షణ, ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తుండటం అభినందనీయమని అన్నారు. ప్రభుత్వం మహిళల సంక్షేమం, ఉపాధి కల్పనకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. గ్రామాలతో పాటు గ్రామాల్లోని మ‌హిళ‌ల అభివృద్ది కోసం ఎన్.ఐ.ఆర్.డి తో కేశినేని ఫౌండేష‌న్ ఎమ్.వో.యు చేసుకోవ‌టం చాలా గొప్ప విష‌య‌మంటూ ప్ర‌శంసించారు. ఇందులో భాగంగా గ్రామీణ ప్రాంతాల స్వ‌యం స‌హాయ‌క సంఘాల మ‌హిళ‌ల‌ను స్వ‌యం ఉపాధి మార్గం వైపు న‌డిపించేందుకు ఎంపీ కేశినేని శివ‌నాథ్(చిన్ని) గారు కృషి చేస్తున్నార‌ని తెలిపారు. అనంత‌రంఎన్.ఐ.ఆర్.డి రూర‌ల్ కో-ఆర్డినేట‌ర్ సొంగా సంజ‌య్ వ‌ర్మ మాట్లాడుతూ ఎంపీ కేశినేని శివ‌నాథ్ నేతృత్వంలో గ‌త ఏడాది నుంచి ఎస్.హెచ్.జి మ‌హిళ‌ల‌కు ఎన్.ఐ.ఆర్.డిలో స్వ‌యం ఉపాధి కి సంబంధించి నైపుణ్యాభివృద్ది శిక్ష‌ణ ఇప్పిస్తున్నార‌న్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు 10 నైఫుణ్యాభివృద్ది శిక్ష‌ణ కార్య‌క్ర‌మాలు జ‌ర‌గ్గా అందులో తొమ్మిది శిక్ష‌ణా కార్య‌క్ర‌మాల్లో జ‌గ్గ‌య్య‌పేట ఎస్.హెచ్.జి మ‌హిళ‌లు పాల్గొన్నార‌ని, వారంతా ఇప్పుడు స్వ‌యంగా ప్రొడ‌క్ట్స్ తయారు చేసి ఎంట‌ర్ ప్రెన్యూర్స్ రాణిస్తున్నార‌ని తెలిపారు. వీరు త‌యారు చేసే ప్రోడ‌క్ట్స్ కూడా మార్కెటింగ్ చేసేందుకు కూడా ఎంపీ కేశినేని శివ‌నాథ్(చిన్ని) గారు, ఎమ్మెల్యే శ్రీరాం రాజ‌గోపాల్ (తాతాయ్య‌) గారు కృషి చేస్తున్నార‌ని తెలిపారు. అలాగే తిరువూరు, నందిగామ, మైల‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గాల్లోని ఎస్.హెచ్.జి మ‌హిళ‌ల‌కు ఎన్.ఐ.ఆర్.డి నైఫుణ్యాభివృద్ది శిక్ష‌ణా కార్య‌క్ర‌మాలు ఇప్పించ‌టం జ‌రిగింద‌ని...ఎంపీ కేశినేని శివ‌నాథ్(చిన్ని) గారి సార‌ధ్యంలో ఇది నిరంతరం జ‌రుగుతుంద‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎన్టీఆర్ జిల్లా ఎన్.ఐ.ఆర్.డి అర్బ‌న్ కో-ఆర్డినేట‌ర్ వ‌ల్ల‌భ‌నేని న‌ర‌సింహాచౌద‌రి, జ‌గ్గ‌య్యపేట మండ‌ల డెవ‌ల‌ప్మెంట్ అధికారి జి.నితిన్, టిడిపి టౌన్ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి మైనేని రాధ‌, కౌన్సిల‌ర్లు క‌న్నెబోయిన రామ‌ల‌క్ష్మీ, సూర్య‌దేవ‌ర రామ్ ప్ర‌సాద్, నెక్క‌రికంటి వెంక‌టి, టిడిపి నాయ‌కుడు ఎస్.కె.న‌జీమున్, మండ‌ల మ‌హిళ స‌మైక్య అధ్య‌క్షురాలు నాయిని ర‌జ‌నీ, కృష్ణ‌వేణి, వెలుగు ఎ.పి.ఎమ్ లు ల‌క్ష్మ‌ణారావు, సంఘ‌య్య ల‌తో పాటు ఎన్డీయే కూట‌మి నాయ‌కులు పాల్గొన్నారు.. #NIRD #ruraldevelopment #VijayawadaParliament #KesineniChinni #kesinenisivanath #KesineniFoundation #SHGGroups #sreeramrajagopal #Jaggayapeta
Kesineni Foundation tweet mediaKesineni Foundation tweet mediaKesineni Foundation tweet mediaKesineni Foundation tweet media
తెలుగు
0
1
1
25
Kesineni Foundation
Kesineni Foundation@Help_Kesineni·
విజయవాడ : ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) గారి సారధ్యంలో కేశినేని ఫౌండేషన్ మరియు ఎన్.ఐ.ఆర్.డి సంయుక్త ఆధ్వర్యంలో జ్యూట్ అండ్ కాట‌న్ బ్యాగ్స్, గిఫ్ట్ ఆర్టిక‌ల్స్, హెర్బ‌ల్ ప్రొడ‌క్ట్స్ త‌యారీ విధానం పై ఐదు రోజుల పాటు శిక్ష‌ణ పొందేందుకు హైదరాబాద్ ఎన్.ఐ.ఆర్.డికి వెళ్లిన 50 మంది ఎన్టీఆర్ జిల్లాకు చెందిన ఎస్.హెచ్.జి మహిళలకు శిక్షణ తరగతులు బుధ‌వారం ప్రారంభం అయ్యాయి. 10వ నైపుణ్యాభివృద్ధి శిక్షణ కు వెళ్లిన వీరికి జ‌న‌వ‌రి 28 నుంచి ఫిబ్ర‌వ‌రి 1వ తేదీ వ‌ర‌కు ఐదు రోజులు పాటు జ్యూట్ అండ్ కాట‌న్ బ్యాగ్స్ త‌యారీ విధానం పై శిక్షణ వుంటుంది. ఈమేరకు ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) గారి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది ఈ ఐదు రోజుల నైపుణ్యాభివృద్ది శిక్ష‌ణా కార్య‌క్ర‌మం ప్రారంభ స‌మావేశం ఎన్.ఐ.ఆర్.డి.పి.ఆర్. లో బుధ‌వారం అసోసియేట్ ఫ్రోపెసర్ (సి.ఐ.ఎ.టి.ఎస్.జె -హెడ్) డాక్టర్ సి.కత్తిరేషన్ ఆధ్వ‌ర్యంలో జ‌రిగింది. ఈ స‌మావేశంలో అసోసియేషన్ ప్రోఫెసర్ డాక్టర్ ఎస్.రమేష్ శక్తివేల్, సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ మహ్మాద్ ఖాన్ శిక్ష‌ణ తీసుకునే 50 మంది ఎస్.హెచ్.జి మ‌హిళ‌ల‌కు ముందుగా జ్యూట్ అండ్ కాట‌న్ బ్యాగ్స్ , గిఫ్ట్ ఆర్టిక‌ల్స్, హెర్బ‌ల్ ప్రొడ‌క్ట్స్ త‌యారీ విధానం శిక్షణ తరగతుల కార్య‌క్ర‌మాల‌ గురించి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్ గురించి వివ‌రించారు. జ్యూట్ అండ్ కాట‌న్ బ్యాగ్స్, గిఫ్ట్ ఆర్టిక‌ల్స్ త‌యారీ శిక్ష‌ణ‌ను 25 మంది, హెర్బ‌ల్ ప్రొడ‌క్ట్స్ త‌యారీ శిక్ష‌ణ‌ను 25 మంది తీసుకుంటున్నారు. హెర్బ‌ల్ ప్రొడ‌క్ట్స్ త‌యారీ లో శిక్ష‌ణ పొందే వారికి మొద‌టి రోజు శిక్ష‌ణ‌లో భాగంగా ఆయుష్ పరిచయం , ఔషధ మొక్కల ఉత్పత్తుల ప్రాముఖ్యత , ఔషధ మొక్కల ఉత్పత్తుల పై అవగాహన, వాటి ప్రయోజనాలు, ఆర్గానిక్ స‌బ్బుల త‌యారీకి సంబంధించి ద‌శ‌ల‌వారీ త‌యారీ విధానం, ఫెయిర్‌నెస్ ప్యాక్ తయారీ విధానం, వివిధ రకాలైన చ‌ర్మాల‌ కోసం ఫార్ములేషన్ల కి సంబంధించి అవ‌గాహ‌న త‌ర‌గ‌తులతో పాటు ప్రాక్టిక‌ల్ గా కూడా చూపించటం జ‌రిగింది. ఈ శిక్ష‌ణ కార్య‌క్ర‌మం మెడిహెర్బ్స్ కి సంబంధించిన జాన్సీ లక్ష్మీ బాయి ఆధ్వ‌ర్యంలో జ‌రిగింది. జ్యూట్ అండ్ కాట‌న్ బ్యాగ్స్, గిఫ్ట్ ఆర్టిక‌ల్స్ తయారీ లో శిక్ష‌ణ పొందే వారికి మొద‌టి రోజు శిక్ష‌ణ‌లో భాగంగా జ్యూట్ క్రాఫ్టెడ్ ఉత్పత్తుల పరిచయం, జ్యూట్ క్రాఫ్టెడ్ ఉత్పత్తుల తయారీకి సంబంధించిన వివిధ ప్రక్రియలపై అవగాహన, భారతదేశంలోని జ్యూట్ హస్తకళా ఉత్పత్తులపై అవ‌గాహ‌న‌, జ్యూట్ బ్యాగ్స్ త‌యారీ కోసం ఉప‌యోగించే సాధ‌నాలు, ప‌రికరాల ప‌రిచ‌యం , ఫైబ‌ర్లు, నూలు ర‌కాల ప్రాముఖ్య‌త‌, కుట్టు విధానంలోని వివిధ ప‌ద్ద‌తులు, ఉత్పత్తి నాణ్యతకు అవసరమైన కనీస ప్రమాణాలు , కుట్టు యంత్రాల నిర్వహణకు మార్గదర్శకాలు, కుట్టు యంత్రంలోని వివిధ భాగాల విధులు, ప్రాథమిక కొలతల అవగాహన, ఫ్రేమ్‌ల వంటి పరికరాల వినియోగంపై ప్రదర్శన, ముడి పదార్థాల ఎంపిక పై అవ‌గాహ‌న త‌ర‌గ‌తులతో పాటు ప్రాక్టిక‌ల్ త‌ర‌గ‌తులు జ‌రిగాయి. ఈ శిక్ష‌ణ కార్య‌క్ర‌మం ఎథ్నిక్ క్లాత్ బ్యాగ్ యూనిట్ కి చెందిన డా. జి. అంబిక ఆధ్వ‌ర్యంలో జ‌రిగింది.స్వ‌యం ఉపాధి నెలకొల్పుకునేందుకు శిక్ష‌ణ కార్య‌క్ర‌మంకు పంపించినందుకు ఎంపీ కేశినేని శివ‌నాథ్(చిన్ని) గారితో పాటు కేశినేని ఫౌండేష‌న్, ఎన్.ఐ.ఆర్.డికి శిక్ష‌ణ పొందుతున్న మ‌హిళ‌లు కృత‌జ్ఞ‌తలు తెలిపారు.. #NIRD #ruraldevelopment #VijayawadaParliament #KesineniFoundation #kesinenisivanath #KesineniChinni
Kesineni Foundation tweet mediaKesineni Foundation tweet mediaKesineni Foundation tweet mediaKesineni Foundation tweet media
తెలుగు
0
0
0
8
Kesineni Foundation
Kesineni Foundation@Help_Kesineni·
రేపు (10-01-2026) కేశినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో తిరువూరు నియోజకవర్గంలోని కిడ్నీ బాధితులకు పౌష్టిక ఆహారం పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది... ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విజయవాడ పార్లమెంట్ సభ్యులు శ్రీ కేశినేని శివనాథ్(చిన్ని) గారు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ శా గారు, తిరువూరు ఆర్డీవో మాధురి గారు పాల్గొంటారు సమయం : ఉదయం 10:00 గంటలకు.. స్థలం : ఏ కొండూరు ప్రభుత్వ పాఠశాలలో కావున ఎన్డీయే కూటమి నాయకులు, కార్యకర్తలు, వివిధ హోదాల నాయకులు, మండల మరియు గ్రామ పార్టీ నాయకులు హాజరు కావలసిందిగా కోరుచున్నాము... #KesineniFoundation #kesinenisivanath #KesineniChinni #IdhiManchiPrabhutvam #KidneyPatients #AKonduruKidneyPatients #NaraChandrababuNaidu #NaraLokesh #Tiruvuru #VijayawadaParliament
Kesineni Foundation tweet media
తెలుగు
0
1
1
23
Kesineni Foundation retweetledi
Kesineni Sivanath
Kesineni Sivanath@KesineniS·
వన్ ఫ్యామిలీ - వన్ ఎంటర్ ప్రెన్యూర్... మ‌హిళ‌ల ఆర్థిక స్వావలంబ‌నకు కేశినేని ఫౌండేషన్ అండ‌గా వుంటుంది... కేశినేని ఫౌండేషన్, ఎన్.ఐ.ఆర్.డి సంయుక్త ఆధ్వర్యంలో గత నెల రోజులుగా ఎన్టీఆర్ జిల్లా ఎస్.హెచ్.జి మహిళలకు హైదరాబాద్ ఎన్.ఐ.ఆర్.డి లో ఇప్పిస్తున్న నైపుణ్య అభివృద్ధి శిక్షణ కార్యక్రమాలపై ఈరోజు మా కార్యాలయం ఎన్టీఆర్ భవన్ నందు విలేకరుల సమావేశం ఏర్పాటు చేయటం జరిగింది.. ఈ సమావేశానికి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు గారు, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు గారు, దూదేకుల సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ నాగుల్ మీరా గారు, మాజీ ఎమ్మెల్సీ, టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్ధా వెంకన్న గార్లు మరియు ఎన్.ఐ.ఆర్.డి అధికారులు పాల్గొన్నారు... అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నినాదం ఒక్కటే... ఒక్కో కుటుంబానికి ఒక్కో పారిశ్రామికవేత్త... ఆ దిశగానే 12 రకాల శిక్షణ కార్యక్రమాలను కేశినేని ఫౌండేషన్ ద్వారా ఎంపిక చేసుకొని మహిళలకు శిక్షణ అందిస్తున్నాము... ఇప్పటివరకు ఎన్టీఆర్ జిల్ల నుంచి 400 మందికి పైగా ఎస్.హెచ్.జి మహిళలను ఎన్.ఐ.ఆర్.డి కి పంపించి మష్రూమ్, తేనె పరిశ్రమ, పేస్ట్ కంట్రోల్, దోమల నివారణ, బొద్దింకల నివారణ, బ్రిక్స్ తయారీ, పేపర్ హ్యాండ్లూమ్ వర్క్స్, మరియు ఇతర కార్యక్రమాలు పై శిక్షణ ఇప్పించడం జరిగింది... చివరికి వారికి మార్కెటింగ్ సపోర్ట్ కూడా మేమే ఇస్తాము... ఆన్లైన్ మార్కెటింగ్ కూడా చేయించి విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టునున్నాము... గత మూడు రోజులుగా కేశినేని ఫౌండేషన్, ఎన్.ఐ.ఆర్.డి మరియు ఎన్వుఇండియా సంయుక్త ఆధ్వర్యంలో మెప్మా ఎస్.హెచ్.జి మహిళలకు చెదలు-బొద్దింకలు-దోమల నివారణ పై ఎన్టీఆర్ భవన్ మా కార్యాలయంలో శిక్షణ ఇప్పించడం జరిగింది... ఇందులో భాగంగా చివరి రోజుగా నైపుణ్యాభివృద్ధి శిక్షణ తరగతులు పూర్తి చేసుకున్న మహిళలకు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు గారు, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు గారు, దూదేకుల సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ నాగుల్ మీరా గారు, మాజీ ఎమ్మెల్సీ, టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్ధా వెంకన్న గార్లతో కలిసి సర్టిఫికెట్స్ అందించడం జరిగింది... #NIRD #RuralDevelopment #VijayawadaParliament #NaraChandrababuNaidu #NaraLokesh #NTRJillaSHG #SelfHelpGroups #KesineniFoundation #NTRJilla #Vision2047 #NTRJillaSelfHelpGroups #VikasithPanchayat #vikasithandhra #vikasithbharath #BondaUma #GaddeRammohan #TangiralaSowmya #VasanthaKriahnaPrasad #sreeramrajagopal #NagulMeera #BuddhaVenkanna #Nandigama #Jaggayapeta #Tiruvuru #Mylavaram #IdhiManchiPrabhutvam #VijayawadaParliamentDevelopment #NTRJillaDevelopment
Kesineni Sivanath tweet mediaKesineni Sivanath tweet mediaKesineni Sivanath tweet mediaKesineni Sivanath tweet media
తెలుగు
0
9
35
430
Kesineni Foundation
Kesineni Foundation@Help_Kesineni·
విజ‌య‌వాడ : ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) గారి సారధ్యంలో కేశినేని ఫౌండేషన్, ఎన్వు ఇండియా మరియు ఎన్.ఐ.ఆర్.డి సంయుక్త ఆధ్వర్యంలో మెప్పా ఎస్.హెచ్.జి మహిళలకు చెద‌లు-బొద్దింక‌లు, దోమ‌లు నివార‌ణ పై మంగ‌ళ‌వారం రెండో రోజు శిక్షణ గురునాన‌క్ కాల‌నీలోని ఎంపీ కేశినేని శివ‌నాథ్(చిన్ని) గారి కార్యాల‌యంలో విజయవంతంగా కొనసాగింది. చెద‌లు-బొద్దింక‌లు, దోమ‌లు నివార‌ణ పై మూడు రోజుల శిక్ష‌ణ‌లో భాగంగా 2వ రోజు దోమల నియంత్రణ కోసం లార్వా నివారణ చర్యలు, ఈగల నియంత్రణ, దోమల నియంత్రణ కోసం ఫాగింగ్ (పొగ పిచికారీ) పై అవ‌గాహ‌న క‌ల్పించ‌టంతోపాటు దోమ‌లు ఎక్క‌డెక్కడ వుంటాయి, ఎక్క‌డ కుడ‌తాయి...ఎన్నిర‌కాల దోమ‌లు వుంటాయి...ఏ దోమ కుడితే ఏలాంటి జ‌బ్బు వ‌స్తుంది. దొమ‌ల‌ను ఎట్లా నివారించాలి. దోమ‌ల‌ను ఏ విధంగా గుర్తించాల‌నే అంశాల‌పై ప్రాక్టిక‌ల్ ట్రైనింగ్ ఇవ్వ‌టం జ‌రిగింది. ఈ శిక్షణ మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించడమే కాకుండా, సమాజంలో ఆరోగ్య పరిరక్షణకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందనే విష‌యం వివ‌రించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎన్.ఐ.ఆర్.డి సీనియ‌ర్ క‌న్స‌ల్టెంట్ ఎమ్.డి ఖాన్ గారు, ఎన్.ఐ.ఆర్.డి ఫెస్ట్ మేనేజ్మెంట్ ట్రైనీ కో ఆర్డినేట‌ర్ ఉద‌య్ మీన‌న్ గారు, ఎన్వు ఇండియా కంపెనీ ప్ర‌తినిధి మొక్క‌పాటి అనిల్ కుమార్ గారు, కీట‌కాల మేనేజ్మెంట్ జి.ఎస్.ఎస్.ప్ర‌కాష్‌ గారు, ఎన్.ఐ.ఆర్.డి అధికారి ముర‌ళీ కృష్ణ‌ గారు, ఎన్టీఆర్ జిల్లా ఎన్.ఐ.ఆర్.డి అర్బ‌న్ కో ఆర్డినేట‌ర్ వ‌ల్ల‌భ‌నేని న‌రసింహాచౌద‌రి గారు, ఎన్టీఆర్ జిల్లా ఎన్.ఐ.ఆర్.డి రూర‌ల్ కో ఆర్డినేట‌ర్ సొంగా సంజ‌య్ వ‌ర్మ గారు మరియు త‌దిత‌రులు పాల్గొన్నారు. #NIRD #RuralDevelopment #VijayawadaParliament #NaraChandrababuNaidu #NaraLokesh #KesineniSivanath #KesineniChinni #TangiralaSowmya #KesineniJanaki #KesineniVenkat #KesineniFoundation #NTRJilla #NTRJillaSelfHelpGroups #VikasithPanchayat #vikasithandhra #vikasithbharath #TangiralaSowmya #VasanthaKriahnaPrasad #sreeramrajagopal #Nandigama #Jaggayapeta #Mylavaram #Tiruvuru #IdhiManchiPrabhutvam #VijayawadaParliamentDevelopment #NTRJillaDevelopment
తెలుగు
0
0
0
26
Kesineni Foundation
Kesineni Foundation@Help_Kesineni·
విజయవాడ పార్లమెంట్ సభ్యులు శ్రీ కేశినేని శివనాథ్(చిన్ని) గారి నేతృత్వంలో హైదరాబాద్ ఎన్.ఐ.ఆర్.డి లో ఎన్టీఆర్ జిల్లాకు చెందిన ఎస్.హెచ్.జి మహిళల 3వ బ్యాచ్ నైపుణ్యాభివృద్ధి శిక్షణ విజయవంతంగా పూర్తి కావడం జరిగింది... డిసెంబర్ 15వ తేదీ నుంచి 19వ తేదీ వరకు వర్మికంపోస్టింగ్, ప్రకృతి వ్యవసాయం, తేనె తయారీపై శిక్షణ తీసుకున్న మహిళలు... శిక్షణ పూర్తి చేసుకున్న 45 మంది మహిళలకు కేశినేని జానకి లక్ష్మి గారి చేతులు మీదగా సర్టిఫికెట్లను అందించడం జరిగింది... ఈ సందర్భంగా కేశినేని జానకి లక్ష్మీ గారు మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వాతంత్రతే కుటుంబం, సమాజం, రాష్ట్ర అభివృద్ధికి పునాది, మహిళల ఆర్థిక స్వాలంబన, సాధికారత కోసం విజయవాడ పార్లమెంట్ సభ్యులు శ్రీ కేశినేని శివనాథ్(చిన్ని) గారు కేశినేని ఫౌండేషన్ ద్వారా నిరంతరం కృషి చేస్తున్నారు అని తెలియజేశారు... శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు భవిష్యత్తులో మరింత సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.. ఈ కార్యక్రమంలో ఎన్.ఐ.ఆర్.డి సీనియర్ కన్సల్టెంట్ మహ్మద్ ఖాన్ గారు, ప్రొఫెసర్ డాక్టర్ కతిరేషన్ గారు, ఎన్టీఆర్ జిల్లా ఎన్.ఐ.ఆర్.డి రూరల్ కోఆర్డినేటర్ సొంగా సంజయ్ వర్మ గారు మరియు తదితరులు పాల్గొన్నారు.. #NIRD #RuralDevelopment #VijayawadaParliament #NaraChandrababuNaidu #NaraLokesh #KesineniSivanath #KesineniChinni #KesineniJanaki #KesineniFoundation #NTRJilla #NTRJillaSelfHelpGroups #VikasithPanchayat #vikasithandhra #vikasithbharath #TangiralaSowmya #VasanthaKriahnaPrasad #sreeramrajagopal #Nandigama #Jaggayapeta #Mylavaram #IdhiManchiPrabhutvam #VijayawadaParliamentDevelopment #NTRJillaDevelopment
Kesineni Foundation tweet mediaKesineni Foundation tweet mediaKesineni Foundation tweet mediaKesineni Foundation tweet media
తెలుగు
0
0
0
21