MYTDP App

10.5K posts

MYTDP App banner
MYTDP App

MYTDP App

@MYTDPApp

Official MY TDP Mobile Application Channel

Katılım Nisan 2023
15 Takip Edilen11.1K Takipçiler
MYTDP App
MYTDP App@MYTDPApp·
ఆంధ్రప్రదేశ్‌లో మత్స్యకారుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం మరోసారి తన చిత్తశుద్ధిని చాటుతోంది. వేట నిషేధ సమయంలో గంగపుత్రుల కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోకుండా ఆదుకునేందుకు అమలు చేస్తున్న “మత్స్యకారుల సేవలో” పథకం కింద వరుసగా రెండో ఏడాది భారీ ఆర్థిక సాయాన్ని అందిస్తోంది. ప్రజా ప్రభుత్వం మత్స్యకారుల వెన్నంటే నిలుస్తూ, వారి కుటుంబాలకు భరోసా కల్పిస్తోంది. నెల్లూరు జిల్లా కావలి మండలం తుమ్మలపెంటలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఈ నిధుల విడుదల కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,30,796 మత్స్యకార కుటుంబాలకు రూ.262 కోట్ల ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం నేరుగా వారి ఖాతాల్లో జమ చేసింది. ప్రతీ కుటుంబానికి రూ.20 వేల చొప్పున అందిస్తున్న ఈ సాయం, వేట నిషేధ కాలంలో కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించనుంది. ప్రతీ ఏడాది ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు 61 రోజుల పాటు సముద్రంలో చేపల సంరక్షణ కోసం వేట నిషేధం అమలులో ఉంటుంది. ఈ సమయంలో ఉపాధి కోల్పోయే మత్స్యకార కుటుంబాలకు ఇబ్బంది కలగకుండా చేయాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ వరుసగా రెండో ఏడాది ఈ సాయం అందించడం గమనార్హం. గత ఏడాది 1,21,433 కుటుంబాలకు రూ.243 కోట్ల సాయం అందించగా, ఈసారి లబ్ధిదారుల సంఖ్య పెరిగి 1,30,796 కుటుంబాలకు చేరింది. రెండేళ్లలోనే మొత్తం రూ.505 కోట్ల సాయాన్ని ప్రభుత్వం మత్స్యకార కుటుంబాలకు అందించింది. గత ప్రభుత్వ హయాంలో కేవలం రూ.10 వేల సహాయం మాత్రమే అందించగా, కూటమి ప్రభుత్వం దానిని రెట్టింపు చేసి రూ.20 వేలకు పెంచింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు సవాళ్లతో ఉన్నప్పటికీ బలహీన వర్గాల సంక్షేమమే ప్రధాన లక్ష్యమని ప్రభుత్వం మరోసారి నిరూపించింది. మత్స్యకారుల సంక్షేమం కేవలం ఆర్థిక సాయంతోనే పరిమితం కాలేదు. వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు మరణించిన మత్స్యకారుల కుటుంబాలకు కూడా ప్రభుత్వం అండగా నిలుస్తోంది. 2024-25లో 63 క్లెయిమ్స్‌కు రూ.3.15 కోట్లు, 2025-26లో 113 పెండింగ్ క్లెయిమ్స్‌కు రూ.5.65 కోట్ల పరిహారాన్ని సకాలంలో చెల్లించింది. కుటుంబాలు రోడ్డున పడకుండా చేయాలనే బాధ్యతతో ప్రభుత్వం పనిచేస్తోంది. అంతేకాకుండా మత్స్యకారుల ఆదాయ వనరులు పెంచేందుకు సీవీడ్ సాగును కూడా ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. సముద్రతీర ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలను పెంచి మత్స్యకార కుటుంబాల ఆర్థిక స్థితిని బలోపేతం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. “వేటకు విరామం… కానీ మత్స్యకారుల కుటుంబాలకు కాదు” అన్న భావనతో కూటమి ప్రభుత్వం చేపడుతున్న ఈ చర్యలు గంగపుత్రుల జీవితాల్లో భరోసా నింపుతున్నాయి. సంక్షేమం అంటే కేవలం మాటలు కాదు… అవసరమైన సమయంలో అండగా నిలవడమేనని ప్రజా ప్రభుత్వం మరోసారి నిరూపిస్తోంది. #MatsyakarulaSevalo #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh
MYTDP App tweet media
తెలుగు
6
60
114
254
MYTDP App
MYTDP App@MYTDPApp·
గాడిదకి రక్తం వచ్చేలా, గొడ్డలి పార్టీ అరాచకం. రాజకీయ ప్రయోజనాల కోసం గొడ్డలి పార్టీ మరో ఘాతుకానికి ఒడిగట్టింది. పెట్రోల్ డీజిల్ సరఫరా పై ఇటీవల తిరుపతిలో అత్యంత దారుణంగా ఒక ఎద్దును హింసిస్తూ ప్రదర్శన జరిపిన వైకాపా, నేడు పెట్రోల్ డీజిల్ ధరల పేరుతో గాడిదలను హింసించింది. జగన్ రెడ్డి పుట్టిన రోజు పేరుతో మూగ జీవాలను బలి ఇచ్చి ఆ రక్తాన్ని అతని ఫొటోకు పూసిన రప్పా రప్పా బ్యాచ్ తరచూ జంతు హింసకు పాల్పడుతూనే ఉంది. విశాఖపట్నంలో మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ తన అనుచరులతో కలిసి ఈ దారుణానికి పాల్పడ్డాడు. గాడిదలకు మోటారు సైకిల్ సీటు, హెడ్ లైటు కట్టి వాటి మెడ, శరీర భాగాలు తీవ్రంగా రక్త స్రావం అవుతున్నా కూడా కొడుతూ లాక్కెళ్లారు. దారుణమైన మానసిక ప్రవర్తన ఉన్నవారు మాత్రమే ఇలా చేయగలుగుతారు. ఈ వికృత చర్యలతో స్థానికులు వైకాపా ను చీదరించుకున్నారు. #PsychoFekuJagan #EndOfYCP #AndhraPradesh
తెలుగు
3
3
19
201
MYTDP App
MYTDP App@MYTDPApp·
మహిళలకు అండగా ఆర్టీసీ... స్త్రీ శక్తి పథకంతో ఆర్థిక వెసులుబాటు స్త్రీ శక్తితో ఆర్టీసీకి పెరిగిన ఆక్యుపెన్సీ స్త్రీ శక్తితో తగ్గిన మరణాలు... ప్రమాదాలు స్త్రీ శక్తి లబ్దిదారులకు సరాసరి నెలకు రూ. 2 వేలకు పైగా ఆదా 9 నెలల్లో 67 కోట్ల ఉచిత ప్రయాణాలు... రూ. 2350 కోట్ల సబ్సిడి 25 లక్షల ఉచిత ప్రయాణాలు చేసిన దివ్యాంగులు సంక్షేమ చరిత్రలో ఆర్టీసీకి ప్రత్యేక స్థానం కల్పించిన కూటమి ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమం... ప్రయాణీకుల సౌకర్యమే లక్ష్యంగా అడుగులు ఆర్టీసీ సేవలపై ప్రతీ వారం సమీక్షిస్తోన్న ముఖ్యమంత్రి సిబ్బందికి నైట్ అవుట్ అలవెన్స్ – కష్టానికి గౌరవం ప్రమోషన్లతో భారీ ఊరట – వేలాది మందికి న్యాయం SBI ప్రత్యేక బీమా పథకం – ఉద్యోగులకు భద్రతా కవచం రిటైర్డ్ ఉద్యోగులకు జీవితాంతం EHS – మానవీయ నిర్ణయం ఈవీలతో ఆర్టీసీకి కొత్త హంగులు ఆర్టీసీ బస్ స్టేషన్లల్లో వసతులపై సీఎం వారం వారం సమీక్ష... నిత్యం ప్రజాభిప్రాయ సేకరణ రెండేళ్ల ప్రయాణంలో పరుగులు పెడుతున్న ప్రగతి రథ చక్రం ఆర్టీసీ అనేది ప్రజా రవాణ వ్యవస్థగానే కాదు... మహిళలకు, దివ్యాంగులకు ఆర్థికంగా అండగా నిలిచే వ్యవస్థగా కూటమి ప్రభుత్వం తీర్చిదిద్దింది. తొలి నుంచి ఆర్టీసీ అనేది ఓ ప్రజా రవాణ వ్యవస్థగానే ప్రభుత్వాలు భావించాయి. కానీ ఈ ప్రజా రవాణ వ్యవస్థ ద్వారా ప్రజలకు ఆర్థిక వెసులుబాటు కల్పించే నిర్ణయాలు తీసుకోవచ్చు.. పేద, మధ్య తరగతి ప్రజలకు భరోసా కల్పించవచ్చు అని కూటమి ప్రభుత్వమే నిరూపించింది. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా 2025 ఆగస్టు 15 స్త్రీ శక్తి పథకాన్ని ప్రారంభించింది. అప్పటి వరకు బస్ ఛార్జీలు పెంచిన ప్రభుత్వాలనే చూసిన ప్రజలకు... స్త్రీ శక్తి పథకం ద్వారా ఉచిత ప్రయాణాన్ని పరిచయం చేసింది కూటమి ప్రభుత్వం. ఆ వర్గం.. ఈ వర్గం అని లేకుండా.. ఎలాంటి షరతులు.. నిబంధనలు లేకుండా అమలవుతున్న ఏకైక పథకంగా స్త్రీ శక్తి పథకమే. ఈ పథకం అమలు ద్వారా ఆర్టీసీకి సంక్షేమ చరిత్రలో ప్రత్యేక స్థానం కల్పించింది సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం ప్రారంభించిన మిగిలిన పథకాలన్ని ఒక ఎత్తు... స్త్రీ శక్తి పథకం మరో ఎత్తు అనే అభిప్రాయం అందరిలోనూ వ్యక్తమవుతోంది. స్త్రీ శక్తి పథకంలో ఉన్న గొప్పదనమిదే... స్త్రీ శక్తి పథకంతో పేద, మధ్యతరగతి ప్రజల ఆదాయం ఆదా అవుతోంది. ఇది మహిళల్లో ఆర్థిక సాధికారత పెంచింది. ఓ మహిళా ఉద్యోగి ఆఫీసుకు వెళ్లాలన్నా.. ఓ యువతి కాలేజీకి వెళ్లాలన్నా.. మహిళా రైతు ఉత్పత్తులను మార్కెట్టుకు తీసుకెళ్లి అమ్ముకోవాలన్నా ఆర్టీసీ బస్సెక్కి ఉచితంగా తమ గమ్య స్థానాలకు చేరుతున్నారు. అంతే కాకుండా పుట్టింటికి వెళ్లాలన్నా.. బంధువుల ఇంటికి వెళ్లాలన్నా ఉచితంగా ప్రయాణిస్తున్నారు. అలాగే పండుగ దినాల్లో పుణ్యక్షేత్రాలకు పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నారు. దీని వల్ల ప్రతి కుటుంబానికి సుమారుగా రూ. 2 వేల నుంచి 2,500 ఆదా అవుతున్నట్టు అంచనా. అంటే ఏడాదికి సుమారుగా రూ. 25 వేలు ఆదా అవుతోందని లబ్దిదారులే స్వయంగా చెబుతున్నారు. ఇక స్త్రీ శక్తి పథకం వల్ల దేవాలయాలకు ఆదాయం పెరుగుతోంది.. పర్యాటక ప్రాంతాల్లో రద్దీ పెరుగుతోంది. ఈ మేరకు ఆయా ప్రాంతాల్లో స్థానికంగా ఉపాధి మెరుగవుతోంది. అందుకే ఈ పథకం సూపర్ హిట్ అయింది. స్త్రీ శక్తి పథకం ప్రారంభించిన 9 నెలల్లో 67 కోట్ల ఉచిత ప్రయాణాలు జరిగితే.. సుమారు రూ. 2350 కోట్ల మేర సబ్సిడిని ప్రభుత్వం భరించింది. దీనికి గానూ.. రూ. 720 కోట్లను ప్రభుత్వం ఆర్టీసీకి రీ-ఇంబర్స్ చేసింది. ఈ విధంగా ఎప్పటికప్పుడు రీ-ఇంబర్స్ చేస్తూ ఆర్టీసీపై ఆర్థిక భారాన్ని తగ్గిస్తోంది ప్రభుత్వం. ఈ పథకం ద్వారా ఆర్టీసీకి స్త్రీ శక్తి బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో సుమారుగా 92 శాతానికి పెరిగింది. గతంలో సుమారుగా 60 శాతంగా ఉండే ఆక్యుపెన్సీ రేషియో స్త్రీ శక్తి పుణ్యమా అని 92 శాతానికి చేరింది. ఇందులో పురుష ప్రయాణికుల సంఖ్య 40 శాతంగా ఉంది. ఈ పథకం ఓ విధంగా ఆర్టీసీకి అండగా నిలుస్తోంది. స్త్రీ శక్తి కింద వచ్చే సబ్సిడీని ప్రభుత్వం నుంచి అందుకుంటోంది.. అలాగే పెరిగిన ఆక్యుపెన్సీ రేషియో ద్వారా ఆర్టీసీ తన ఆదాయాన్ని పెంచుకుంటోంది. ఇక దివ్యాంగ శక్తి కింద దివ్యాంగులు సుమారు 25 లక్షల ఉచిత ప్రయాణాలు జరిగాయి. ప్రాణాలు కాపాడుతున్న స్త్రీ శక్తి... ఆర్టీసీలో ప్రయాణం సురక్షితం అనేది ఏపీఎస్సార్టీసీకి ఉన్న బ్రాండ్. ఈ బ్రాండ్ నిలబెట్టేలా స్త్రీ శక్తి పథకం ఆర్టీసీకి ఉపకరిస్తోంది. స్త్రీ శక్తి పథకం అమలు తర్వాత ఆర్టీసీలో ఆక్యుపెన్సీ రేషియో పెరిగింది. చాలా మంది మహిళలు ఆటోల్లో... ఇతర వాహానాల్లో ప్రయాణాలు తగ్గించుకుని ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణాలు చేస్తున్నారు. దీంతో ప్రమాదాల బారిన పడి చనిపోయే వారి సంఖ్య గణనీయంగా తగ్గిందని అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రకాశం జిల్లా ఎస్పీ నిర్వహించిన సర్వే ప్రకారం స్త్రీ శక్తి పథకం ప్రవేశపెట్టిన తర్వాత ప్రమాదాల్లో మహిళా మరణాల సంఖ్య దాదాపు 39 శాతం మేర తగ్గినట్టు వెల్లడైంది. అలాగే ప్రమాదాల్లో పురుషుల మరణాల సంఖ్య కూడా గణనీయంగా తగ్గినట్టు గుర్తించారు. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబుకు ప్రకాశం జిల్లా ఎస్పీ వివరించారు. దీనిపై రాష్ట్ర స్థాయి అధ్యయనం చేయించాల్సిందిగా ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆర్టీసీని, ఉద్యోగులను ఆదుకునేలా ప్రభుత్వం చొరవ... ఎన్నికలకు ముందు సిబ్బంది సమస్యలు, పెండింగ్ బకాయిలు, బస్సుల కొరత వంటి అనేక సవాళ్లను ఆర్టీసీ ఎదుర్కొంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీ పునర్వ్యవస్థీకరణకు ప్రాధాన్యత ఇచ్చింది. ఉద్యోగుల సంక్షేమం, ప్రయాణికుల సేవల మెరుగుదల, ఆధునికీకరణ, ఆర్థిక బలోపేతం లక్ష్యంగా అనేక కీలక నిర్ణయాలు తీసుకుంది. డ్రైవర్లు, కండక్టర్లు ఎక్కువసేపు విధులు నిర్వహిస్తూ కుటుంబాలకు దూరంగా పనిచేయాల్సి వస్తుంది. ముఖ్యంగా రాత్రి వేళల్లో సేవలు అందించే సిబ్బంది అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ అంశాన్ని గుర్తించిన ప్రభుత్వం ప్రతి నైట్ డ్యూటీకి రూ. 150 చొప్పున నైట్ అవుట్ అలవెన్స్ మంజూరు చేసింది. ఈ నిర్ణయంతో ఉద్యోగులకు నెలకు రూ. 2 వేల నుంచి రూ. 5 వేల వరకు అదనపు ఆదాయం లభిస్తోంది. ఇది వారి కుటుంబ ఆర్థిక పరిస్థితికి ఊరటనిస్తోంది. ప్రమోషన్ల విషయంలో ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వం పెద్ద ఎత్తున ఉపశమనం కల్పించింది. 2020కు ముందు నియమితులై ప్రభుత్వ సేవల్లో విలీనమైన ఉద్యోగులకు పాత RTC మార్గదర్శకాలను పునరుద్ధరించడంతో సుమారు 7 వేల మందికి పదోన్నతులు లభించాయి. ఈ నిర్ణయం ఉద్యోగుల కెరీర్ పురోగతికి దోహదపడుతోంది. అనేక మంది ఉద్యోగులు పదోన్నతుల ద్వారా అధిక వేతనాలు, బాధ్యతలు పొందే అవకాశం కలిగింది. SBI ప్రత్యేక బీమా పథకం – ఉద్యోగులకు భద్రతా కవచం ప్రభుత్వ ఉద్యోగుల తరహాలోనే PTD ఉద్యోగులకు కూడా SBI SGSP పథకం వర్తింపజేయడం ద్వారా ప్రభుత్వం ఉద్యోగుల భవిష్యత్తుకు భరోసా కల్పించింది. రూ. 1 కోటి ప్రమాద భీమా, సహజ మరణానికి రూ. 10 లక్షల బీమా వంటి ప్రయోజనాలు ఉద్యోగ కుటుంబాలకు ఆర్థిక రక్షణగా నిలుస్తున్నాయి. జీరో బ్యాలెన్స్ ఖాతాలు, తక్కువ వడ్డీ రుణాలు, డిజిటల్ బ్యాంకింగ్ సేవలు ఉద్యోగుల ఆర్థిక అవసరాలను సులభతరం చేస్తున్నాయి. ఇక విరమణ అనంతరం వైద్య ఖర్చులు భారం అవుతాయని భావించే ఉద్యోగులకు ప్రభుత్వం జీవితాంతం EHS వైద్య సేవలు అందేలా నిర్ణయం తీసుకుంది. రిటైర్డ్ ఉద్యోగులు, వారి జీవిత భాగస్వాములకు ఈ సదుపాయం పెద్ద ఊరటనిచ్చింది. ఈ చర్య ప్రభుత్వం ఉద్యోగులను కేవలం సేవా కాలంలో మాత్రమే కాకుండా, జీవితాంతం ఆదుకుంటుందనే నమ్మకాన్ని కల్పించింది. విధి నిర్వహణలో మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు కారుణ్య నియామకాలు కల్పించడం ద్వారా ప్రభుత్వం మానవత్వాన్ని చాటుకుంది. ముఖ్యంగా అర్హతల విషయంలో సడలింపులు ఇవ్వడం వల్ల అనేక కుటుంబాలకు ఉపాధి అవకాశాలు లభించాయి. కొత్త బస్సులతో ఆధునిక ప్రయాణం 1,489 కొత్త బస్సులను ప్రవేశపెట్టడం ద్వారా ప్రభుత్వం ప్రజా రవాణా సేవలను ఆధునికీకరించింది. సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలక్స్, స్టార్ లైనర్, వెన్నెల వంటి బస్సులు ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందిస్తున్నాయి. ఈ కొత్త బస్సులు గ్రామీణ ప్రాంతాల నుంచి నగరాల వరకు ప్రజలకు సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని కల్పిస్తున్నాయి. ఇక కేంద్ర ప్రభుత్వ సహకారంతో సుమారు 1450 ఈవీ బస్సులు త్వరలో రాబోతున్నాయి. ఇదే కాకుండా... బస్ స్టేషన్ల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. 338 బస్ స్టేషన్ల అభివృద్ధికి ప్రభుత్వం రూ. 30 కోట్లు కేటాయించి ప్రజా రవాణా మౌలిక వసతులపై దృష్టి పెట్టింది. ఆధునిక టాయిలెట్ బ్లాకులు, కూర్చునే సదుపాయాలు, ఫ్యాన్లు, శుభ్రత చర్యలు ప్రయాణికులకు మెరుగైన అనుభూతిని కల్పిస్తున్నాయి. ప్రత్యేకంగా మహిళలు, వృద్ధులు, దివ్యాంగులకు సౌకర్యవంతమైన వాతావరణం కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. డిజిటల్ ఫీడ్‌బ్యాక్ వ్యవస్థ – ప్రజల అభిప్రాయాలకు ప్రాధాన్యం 129 బస్ స్టేషన్లలో డిజిటల్ స్కానర్ల ద్వారా ప్రయాణికుల అభిప్రాయాలను సేకరించే వ్యవస్థను ఆర్టీసీ ఏర్పాటు చేసింది. ఆర్టీసీ అందించే సేవలపై ప్రజలు తమ అభిప్రాయాలను నేరుగా తెలిపే అవకాశం కల్పిస్తోంది. ఈ ఫీడ్‌బ్యాక్ ఆధారంగా సేవల నాణ్యతను మెరుగుపరచడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. దీంతో ప్రతి వారం ఆర్టీసీ సేవలపై స్వయంగా సీఎం పర్యవేక్షిస్తున్నారు. మెరుగైన చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తున్నారు. కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఆర్టీసీ పునర్వైభవానికి బలమైన పునాది వేశాయి. ఉద్యోగుల సంక్షేమం, ప్రయాణికుల సేవల మెరుగుదల, ఆధునికీకరణ, పర్యావరణహిత రవాణా వంటి అంశాల్లో ప్రభుత్వం స్పష్టమైన దూరదృష్టితో ఆర్టీసీ రెండేళ్ల ప్రయాణం సాగింది. రెండేళ్లల్లో కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యలతో ప్రగతి రథ చక్రం పరుగులు పెడుతోంది. #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh
MYTDP App tweet mediaMYTDP App tweet mediaMYTDP App tweet mediaMYTDP App tweet media
తెలుగు
7
14
57
860
MYTDP App
MYTDP App@MYTDPApp·
కూటమి ప్రభుత్వం @ 23 నెలలు - 100 విజయాలు సంక్షేమం, సామాజిక భద్రత : 1. సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ – నెరవేరిన ఎన్నికల హామీలు 2. తల్లికి వందనం : రూ.10,090 కోట్లు చెల్లింపు, 67.27 లక్షల మంది విద్యార్ధులకు సాయం 3. స్త్రీ శక్తి : మహిళలకు ఉచితంగా ఏపీఎస్‌ఆర్టీసీ బస్సు ప్రయాణం - 63.61 కోట్ల ప్రయాణాలు (మే 6 వరకు) 4. దివ్యాంగ శక్తి : దివ్యాంగులకు ఉచితంగా ఏపీఎస్‌ఆర్టీసీ బస్సు ప్రయాణం – 20.51 లక్షల ప్రయాణాలు 5. దీపం 2 పథకం : ఏటా ఉచితంగా 3 సిలిండర్ల పంపిణీ - ఇప్పటికి 4 కోట్ల సిలిండర్లు. 6. అన్న క్యాంటీన్‌ : రాష్ట్రంలో 269 ఏర్పాటు - 9.15 కోట్ల భోజనాలు (మే 6 నాటికి) 7. అన్నదాత సుఖీభవ : 46 లక్షల మంది రైతులకు 3 విడతలు కలిపి రూ.8,985 కోట్లు జమ 8. ఎన్టీఆర్ భరోసా : ఇప్పటివరకు సామాజిక భద్రతా పెన్షన్ల కోసం రూ.63 వేల కోట్లకు పైగా వ్యయం 9. మత్స్యకార సేవలో : ఏడాదికి 20 వేల చొప్పున 1.25 లక్షల మందికి రూ.250 కోట్లు 10. ఆటో డ్రైవర్ల సేవలో : ఏడాదికి రూ.15,000... రూ.436 కోట్లు జమ, 2.90 లక్షల మందికి లబ్ది 11. అంగన్‌వాడి కార్యకర్తలు, ఆశాలకు గ్రాట్యుటీ అమలు 12. బాలింతలకు మళ్లీ ఎన్టీఆర్ బేబీ కిట్ల అందజేత 13. P 4 ద్వారా పేదరిక నిర్మూలన – 2 లక్షల బంగారు కుటుంబాలకు మార్గదర్శుల చేయూత 14. 23 నెలల్లో 5.5 లక్షల ఇళ్లు పేదలకు అందజేత... మరో 5 లక్షల ఇళ్ల నిర్మాణానికి సంకల్పం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ : 15. మత్స్యకారుల కోసం జీ.వో 217 రద్దు – నీటి వనరులపై హక్కు 16. గీత కార్మికులకు 10 శాతం మద్యం షాపుల కేటాయింపు 17. వివాదాలకు తావివ్వకుండా ఎస్సీ వర్గీకరణ 18. స్వర్ణకారులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు 19. ఈ ఏడాది మైనారిటీ సంక్షేమానికి రూ.3,670 కోట్లు 20. 8,427 మంది పాస్టర్లకు నెలకు రూ.5,000 చొప్పున గౌరవ వేతనానికి రూ.51 కోట్లు 21. ఇమామ్‌లకు నెలకు రూ.10,000 మౌజన్లకు రూ.5,000 చొప్పున ఏడాదికి రూ.90 కోట్లు 22. వక్ఫ్ బోర్డు పునరుద్ధరణ – అన్ని వర్గాలకు ప్రాధాన్యం 23. పురోహితులకు నెలకు రూ.15,000కు వేతనాల పెంపు 24. నాయీ బ్రాహ్మణులకు నెలకు రూ.25,000కు వేతనాల పెంపు 25. చేనేతలకు ఉచిత విద్యుత్ : నెలకు మగ్గానికి 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్లు 26. జూనియర్ లాయర్లకు రూ.10,000 గౌరవ వేతనం 27. 20 లక్షల ఎస్సీ, ఎస్టీల కుటుంబాలకు ఉచితంగా సోలార్ రూఫ్ టాప్ 28. సోలార్ రూఫ్ టాప్‌కు బీసీలకు రూ.20 వేల అదనపు సాయం 29. లక్ష మంది మహిళా పారిశ్రామిక వేత్తలు – మరో 5 లక్షల మంది లక్ష్యం నియామకాలు, ఉద్యోగుల సంక్షేమం : 30. మెగా DSC రిక్రూట్మెంట్ - ముఖ్యమంత్రి తొలి సంతకం, 15,941 టీచర్ పోస్టుల భర్తీ 31. 5,757 కానిస్టేబుల్ పోస్టుల నియామకాలు పూర్తి, రూ.4,500 నుంచి రూ.12,500కు స్టైఫండ్ పెంపు 32. 10 వేలకు పైగా పోస్టులతో కొత్తగా జాబ్ కేలండర్ విడుదల 33. ప్రభుత్వ ఉద్యోగులకు 23 నెలల్లో రూ.21 వేల కోట్ల బకాయిలు చెల్లింపులు 34. మహిళా ఉద్యోగులకు ఇద్దరు కన్నా ఎక్కువ మంది పిల్లలున్నా మెటర్నిటీ లీవ్ రాజధాని, మౌలిక సదుపాయాలు : 35. భవిష్యత్ నగరంగా అమరావతి నిర్మాణం – శాశ్వత, ఏకైక రాజధానిగా కేంద్రం గెజిట్ 36. రూ.861 కోట్లతో 20,060 కి.మీ పాత్ హోల్ ఫ్రీ రోడ్లు- రూ.2500 కోట్లతో రహదారుల నిర్మాణం 37. విజయవాడ – మచిలీపట్నం 6 లైన్ రోడ్డుకు ఆమోదం 38. మూలపేట - వైజాగ్ - కాకినాడ బీచ్ రోడ్, నాగపూర్ – అమరావతి హైవే నిర్మాణం 39. హైదరాబాద్ - అమరావతి - చెన్నై బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుకు పచ్చజెండా 40. రికార్డు స్థాయిలో బెంగుళూరు - అమరావతి హైవే పనులు 41. గాడిలో పంచాయతీరాజ్ వ్యవస్థ. పల్లె పండుగ కింద గ్రామాల్లో 4,000 కి.మీ. రోడ్ల నిర్మాణం 42. అడవితల్లి బాటలో గిరిజన తండాలకు రోడ్ల నిర్మాణం, 4జీ నెట్వర్క్ సౌకర్యం 43. ప్రతీ ఇంటికి అమరజీవి జలధార పేరుతో మంచినీటి కుళాయి కనెక్షన్లు 44. విశాఖపట్నం, అమరావతి, తిరుపతి కేంద్రంగా 3 రీజియన్ల అభివృద్ధి 45. వేగంగా పోర్టులు, ఫిషింగ్ హార్బర్‌ల నిర్మాణం 46. జూలై నాటికి భోగాపురం విమానాశ్రయం పూర్తి 47. లక్ష కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులు – విశాఖ కేంద్రంగా రైల్వే జోన్‌కు గెజిట్ 48. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లు కొత్తగా మార్కాపురం, పోలవరం జిల్లాల ఏర్పాటు పరిశ్రమలు, పెట్టుబడులు, ఐటీ : 49. 28 నూతన పాలసీలు, పరిశ్రమలకు రాయితీల కోసం దేశంలో తొలిసారి ఎస్క్రో ఖాతాలు 50. ఒక్క ఏడాదికి దేశంలోని పెట్టుబడుల్లో 25.3 శాతం ఏపీకి – బిజినెస్ రిఫార్మర్ అవార్డు 51. CII సమ్మిట్ 538 ఒప్పందాలు. రూ.11.38 లక్షల కోట్ల పెట్టుబడులు, 13.95 లక్షల ఉద్యోగాలు 52. 17 SIPB సమావేశాల్లో రూ.11,37,222 పెట్టుబడులు, 10,01,147 లక్షల ఉద్యోగాలు 53. 175 నియోజకవర్గాల్లో MSME పార్కులు, వన్ ఫ్యామిలీ వన్ ఎంట్రప్రెన్యూర్ 54. విశాఖ IT హబ్ – TCS ప్రారంభం, కాగ్నిజెంట్‌కు శంకుస్థాపన 55. రాజధానిలో క్వాంటం వ్యాలీకి శంకుస్థాపన, క్వాంటమ్ రిఫరెన్స్ ఫెలిసిటీ సెంటర్ ప్రారంభం 56. కాకినాడలో AM గ్రీన్ అమోనియాకు శంకుస్థాపన… రెండేళ్లలో గ్రీన్ అమోనియా ఎగుమతి 57. రాష్ట్రానికి సెమీ కండక్టర్, డిఫెన్స్, ఆటోమొబైల్ పరిశ్రమలు 58. శ్రీ సిటీలో రూ.5 వేల కోట్లతో LG, రూ.1000 కోట్లతో క్యారియర్ ఏసీ పరిశ్రమకు శంకుస్థాపన 59. అనకాపల్లి జిల్లాలో రూ.5,400 కోట్లతో రెన్యూ ఎనర్జీ సంస్థకు శంకుస్థాపన 60. అనకాపల్లి జిల్లాలో రూ.1.35 లక్షల కోట్లతో ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన 61. విశాఖపట్నంలో రూ.1.35 లక్షల కోట్లతో గూగుల్ ఏఐ డేటా సెంటర్ హబ్‌కు శంకుస్థాపన 62. రూ.1 లక్షల కోట్లతో రిలయన్స్ డేటా సెంటర్ ఏర్పాటుకు అడుగులు కీలక నిర్ణయాలు-సంస్కరణలు : 63. 15వ ఆర్ధిక సంఘం నిధుల విడుదల, 90కి పైగా CSS పథకాల పునరుద్ధరణ 64. రాష్ట్ర ఆర్థికాభివృద్ధి డబుల్ డిజిట్ గ్రోత్ 11.28 శాతం... పెరిగిన మూలధన వ్యయం 65. ఇద్దరు కన్నా ఎక్కువ మంది పిల్లలున్నా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అర్హత 66. తిరుమల సహా దేవాలయాల్లో సంస్కరణలు, 15 ప్రధాన ఆలయాల్లో నిత్యాన్నదానాలు 67. రుణాల రీ షెడ్యూల్‌తో ప్రభుత్వంపై తగ్గిన వడ్డీల భారం 68. 50 వేల మంది కాంట్రాక్టర్లకు రూ.2 వేల కోట్ల బకాయిల చెల్లింపులు 69. ఉచిత ఇసుక విధానంతో నిర్మాణ రంగానికి ఊతం 70. చెత్త పన్ను రద్దు - దాదాపు 84 లక్షల టన్నుల లెగసీ వేస్ట్ తొలగింపు 71. ప్రతీ నెలా 3వ శనివారం ‘స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర’, డోర్ టు డోర్ కలెక్షన్, స్వచ్ఛ రథాలు 72. సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్‌పై నిషేధం, నెట్ జీరో లక్ష్యంగా కార్యాచరణ వ్యవసాయం, రైతు సంక్షేమం : 73. రికార్డ్ స్థాయిలో ధాన్యం సేకరణ, 24 గంటల్లో డబ్బులు జమ 74. మార్కెట్ ఇంటర్వెన్షన్ ద్వారా పొగాకు, మామిడి, కోకో, ఉల్లి పంటలకు రూ.1,100 కోట్లు 75. రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు, నాలా చట్టం - ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ రద్దు సమర్ధ నీటి నిర్వహణ : 76. 100 రోజుల్లోనే హంద్రీనీవా కాలువ విస్తరణ, కుప్పానికి సాగు నీరు 77. రాయలసీమలో అన్ని చెరువులు, ప్రాజెక్టులు నింపి సాగు, తాగునీరు 78. సాగునీటి ప్రాజెక్టులకు 23 నెలల్లో రూ.24 వేల కోట్ల వ్యయం 79. శరవేగంగా పోలవరం నిర్మాణం – డయాఫ్రం వాల్ పూర్తి 80. రూ.2 వేల కోట్లతో పోలవరం నిర్వాసితులకు పునరావాసం 81. వెలిగొండ ప్రాజెక్టుకు రూ.571 కోట్లు వ్యయం – జులై నాటికి తొలి దశ పూర్తి 82. తుంగభద్ర గేట్ల మరమ్మతులు పూర్తి - ఏపీ వాటాగా రూ.55 కోట్ల కేటాయింపు 83. శ్రీకాకుళం జిల్లాలో నేరడి బ్యారేజీ నిర్మాణానికి గెజిట్ నోటిఫికేషన్ 84. చింతలపూడి ఎత్తిపోతల అనుమతుల్లో పురోగతి 85. సాగు నీటి ప్రాజెక్టుల మరమ్మతులకు రూ.610 కోట్లతో మరమ్మతులు 86. రాష్ట్ర వ్యాప్తంగా కాలువల నిర్వహణ, పూడికలతీత, లాకుల మరమ్మతులకు నిధులు 87. మళ్లీ సాగునీటి సంఘాల కీలక పాత్ర- 6,047 సాగునీటి సంఘాలకు ఎన్నికలు డిజిటల్ గవర్నెన్స్ : 88. స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్, డేటా డ్రివెన్ డెసిషన్స్, విపత్తుల నిర్వహణ 89. మన మిత్ర వాట్సప్ గవర్నెన్స్ ద్వారా 1,035 సేవలు విద్య, వైద్య రంగాలు : 90. గేట్స్ ఫౌండేషన్, టాటా సంజీవనితో డిజి హెల్త్ కేర్, యూనివర్సల్ హెల్త్ పాలసీ 91. విద్యా వ్యవస్థలో పెనుమార్పులు - మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ 92. పదో తరగతిలో అత్యుత్తమ ఫలితాల సాధన – ‘ముస్తాబు’ వంటి వినూత్న కార్యక్రమాలు 93. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం, సర్వేపల్లి రాధాకృష్ణ కిట్స్, పారదర్శకంగా బదిలీలు విద్యుత్, గ్రీన్ ఎనర్జీ : 94. గాడిన పడిన విద్యుత్ రంగం – ట్రూ డౌన్‌కు అంకురార్పణ 95. యూనిట్ కాస్ట్ 0.30 పైసలు తగ్గింపు – మరో 0.30 పైసలు తగ్గింపు లక్ష్యం 96. EVలకు ప్రోత్సాహం -వాహనాలకు గ్రీన్ టాక్స్ తగ్గింపు 97. 90 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి ప్రాజెక్టులకు కుదిరిన ఒప్పందాలు శాంతి భద్రతలు : 98. తగ్గిన క్రైమ్ రేట్ – మహిళల భద్రతకు ప్రాధాన్యత 99. గంజాయి-డ్రగ్స్ పై ఉక్కుపాదం- ఈగల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు 100. అగ్నిమాపక శాఖ బలోపేతం – రూ. 34 కోట్లతో కొత్త పరికరాలు, వాహనాలు #IdhiManchiPrabhutvam #AndhraPradesh
MYTDP App tweet media
తెలుగు
124
857
1.7K
6.6K
MYTDP App
MYTDP App@MYTDPApp·
వేటకు విరామం... సర్కారు సాయం గంగపుత్రులకు రెండో ఏడాది అండగా ప్రజాప్రభుత్వం ‘మత్స్యకారుల సేవలో’ కింద ప్రతీ కుటుంబానికి రూ.20 వేలు జమ 1.30 లక్షల కుటుంబాలకు రూ.262 కోట్లు లబ్ది కావలిలో రేపు నిధులు విడుదల కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి, మే 18 : ఆంధ్రప్రదేశ్‌లోని మత్స్యకారుల కుటుంబాలకు ప్రజా ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలుస్తోంది. వేట నిషేధ కాలంలో ఇబ్బందులు ఎదుర్కోకుండా మత్స్యకారులను ఆదుకునేందుకు అమలు చేస్తోన్న ‘మత్స్యకారుల సేవలో’ పథకం కింద వరుసగా రెండో ఏడాది ఆర్థిక సాయం అందించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 1,30,796 మత్స్యకార కుటుంబాలకు రూ.262 కోట్ల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం మత్య్సకారుల ఖాతాల్లో జమ చేయనుంది. నెల్లూరు జిల్లా కావలి మండలం తుమ్మలపెంట గ్రామంలో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నిధులు విడుదల చేయనున్నారు. ప్రతీ ఏటా ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు... 61 రోజుల పాటు సముద్రంలో చేపలు పిల్లలు పెట్టే సమయంలో వేటకు విరామం ఉంటుంది. ఈ సమయంలో మత్స్యకారుల జీవనానికి ఇబ్బంది లేకుండా చేసేందుకు ప్రభుత్వం ప్రతీ కుటుంబానికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తోంది. రెండేళ్లలోనే రూ.505 కోట్ల సాయం వేట నిషేధ సమయంలో మత్య్సకారులకు రూ.20 వేలు ఆర్థికసాయం ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ఎన్డీఏ కూటమి హామీ ఇచ్చింది. హామీ ఇచ్చినట్టుగానే గతేడాది 1,21,433 కుటుంబాలకు రూ.243 కోట్లు సాయం అందించగా... ఈ ఏడాది 1,30,796 మత్స్యకార కుటుంబాలకు రూ.262 కోట్ల ఆర్థిక సాయాన్ని ఇస్తోంది. ఈ ఏడాది లబ్ధిదారు కుటుంబాల సంఖ్య కూడా పెరిగింది. రెండేళ్లలోనే మత్య్సకారుల కుటుంబాలకు వేట నిషేధ సమయంలో రూ.505 కోట్లను సాయంగా అందించింది. గత ప్రభుత్వం మత్స్యకారులకు కేవలం రూ.10 వేల సాయాన్ని మాత్రమే అందించింది. అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు సవాళ్లతో కూడుకున్నప్పటికీ బలహీన వర్గాల సంక్షేమానికే కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తూ సాయాన్ని రూ.20,000 పెంచుతూ ప్రజా ప్రభుత్వం బాసటగా నిలిచింది. వరుసగా రెండో ఏడాది ఇవ్వడంతో పాటు లబ్ధిదారుల సంఖ్యను పెంచి నిధులు విడుదల చేయడం ద్వారా మత్స్యకారుల సంక్షేమంపై ప్రభుత్వ చిత్తశుద్ధి స్పష్టమవుతోంది. సకాలంలో పరిహారం... కుటుంబాలకు సహకారం వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు మరణించిన మత్స్యకారుల కుటుంబాలు రోడ్డున పడకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వేట సమయంలో మృతి చెందిన బాధిత కుటుంబాలకు పరిహారం సకాలంలోనే అందిస్తోంది. 2024-25లో 63 క్లెయిమ్స్‌కు రూ.3.15 కోట్లు, 2025-26లో 113 పెండింగ్ క్లెయిమ్స్‌కు రూ.5.65 కోట్లను ప్రభుత్వం చెల్లించింది. అంతేకాకుండా వారి ఆదాయం పెంచేందుకు ప్రభుత్వం సీవీడ్ సాగును ప్రోత్సహిస్తోంది. ముఖ్యమంత్రి పర్యటన వివరాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మత్య్సకారుల సేవలో కార్యక్రమంలో భాగంగా నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఉదయం 09.30 గంటలకు అమరావతి క్యాంప్ కార్యాలయం నుంచి బయలుదేరి 10.30 గంటలకు కావలి మండలం తుమ్మలపెంటకు చేరుకుంటారు. 10.45 గంటలకు ప్రజావేదిక సభలో పాల్గొని కార్యక్రమాన్ని ఉద్దేశించి ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. నిధులు విడుదల చేస్తారు. మధ్యాహ్నం 01.15 గంటలకు గ్రామంలోని మత్య్సకార కుటుంబాలతో భేటీ అవుతారు. 2 గంటలకు టీడీపీ శ్రేణులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. సాయంత్రం 04.45 గంటలకు తిరిగి అమరావతికి చేరుకుంటారు. #MatsyakarulaSevalo #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh
MYTDP App tweet mediaMYTDP App tweet mediaMYTDP App tweet mediaMYTDP App tweet media
తెలుగు
1
18
39
514
MYTDP App
MYTDP App@MYTDPApp·
పర్యాటకంతో రాష్ట్ర ప్రగతి... పురోగతి పర్యాటకాభివృద్ధితో 1.22 లక్షల మందికి ఉద్యోగ-ఉపాధి అవకాశాలు టూరిజానికి పారిశ్రామిక హోదాతో ఏపీకి తరలి వస్తున్న ప్రాజెక్టులు రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ఊతమిచ్చేలా పర్యాటకాభివృద్ధికి రోడ్ మ్యాప్ హోటళ్లు, హోం స్టేలు, థీమ్ పార్కులు, కారవాన్ టూరిజంలతో పర్యాటకాభివృద్ధికి ప్రణాళికలు బీచ్ ఫెస్టివల్స్, కార్నివాల్స్ తో కళకళలాడుతోన్న రాష్ట్రం జగ్గన్నతోట ప్రభల ఉత్సవంతో వెల్లివిరిసిన సాంస్కృతిక శోభ అన్ని ఇజంల కంటే టూరిజం బెస్ట్ అనే థియరితో టూరిజం అభివృద్ధికి ముఖ్యమంత్రి మార్గనిర్దేశం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక సూచనలతో పర్యాటకాభివృద్ధికి మెరుగైన చర్యలు ఏపీ పర్యాటకానికి నీతి ఆయోగ్ కితాబు రెండేళ్ల కూటమి పాలనలో టూరిజంలో విప్లవాత్మక సంస్కరణలు... పర్యాటకాభివృద్ధి దిశగా ఏపీ అడుగులు అమరావతి: పర్యాటకాభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయడంతోపాటు... పర్యాటక రంగంతో రాష్ట్ర ఆర్థికాభివృద్ధి జరిగేలా రోడ్ మ్యాప్ ఏర్పాటు చేసుకుని కూటమి ప్రభుత్వం ఈ రెండేళ్ల కాలంలో పని చేసింది. టూరిజం అభివృద్ధితో రాష్ట్రానికి పెట్టుబడులు సాధించేలా... యువతకు ఉద్యోగ-ఉపాధి అవకాశాలు మెరుగయ్యేలా పక్కా ప్రణాళికతో టూరిజం శాఖ వ్యవహరిస్తోంది. అన్ని ఇజంలు పక్కకు పోతాయని... టూరిజమే మిగులుతుందనే మాటను వివిధ సందర్భాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతూ ఉంటారు. ఇదే థియరితో పర్యాటకాభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ టూరిజం అభివృద్ధికి విలువైన సలహాలు ఇస్తున్నారు. రాష్ట్రంలో ప్రతి జిల్లాలోనూ అద్భుతమైన పర్యాటక ప్రాంతాలు... ఆధ్యాత్మిక కేంద్రాలు... దేవాలయాలు ఉన్నాయి. వీటిని ఇంటిగ్రేట్ చేయడం.. ప్రాచుర్యం కల్పించడం.. ఆయా ప్రాంతాల్లో అభివృద్ధికి చర్యలు తీసుకోవడంతో వివిధ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ సంస్థలు ముందుకు వస్తున్నాయి. అందర్నీ ఆకట్టుకునేలా టూరిజం పాలసీ 2024–29ని ప్రభుత్వం రూపొందించారు. రాబోయే ఐదేళ్ల కాలానికి స్పష్టమైన రోడ్ మ్యాప్‌తో సరికొత్త పర్యాటక విధానాన్ని కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టింది. పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ విధానంలో పెట్టుబడులను ఆకర్షించడమే ఈ పాలసీ ప్రధాన లక్ష్యం. దీంతోపాటు... పర్యాటక రంగానికి పరిశ్రమ హోదా కల్పించి.. ఇన్వెస్టర్లకు క్యాపిటల్ సబ్సిడీలు, SGST రీయింబర్స్‌మెంట్, స్టాంప్ డ్యూటీ మినహాయింపు వంటి రాయితీలను అందించేలా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంది. దేశంలో తొలిసారిగా టూరిజం ల్యాండ్ అలాట్‌మెంట్ పాలసీ 2025ను ప్రవేశపెట్టి పారదర్శక పద్ధతిలో భూ కేటాయింపులు చేస్తూ భారీ పెట్టుబడులకు మార్గం సుగమం చేశారు. అదే విధంగా క్యారవాన్ టూరిజం, హోమ్‌స్టే, బి&బి (B&B) విధానాల ద్వారా పర్యాటక రంగాన్ని అభివృద్ధికి చర్యలు చేపడుతున్నారు. లక్ష్యాలను నిర్దేశించుకుని... రాష్ట్రంలో 50,000 క్లాసిఫైడ్ గదుల ఏర్పాటు, పెద్ద ఎత్తున పెట్టుబడులు, 10,000 హోమ్ స్టేలు, 20 శాతం జీవీఏ సాధన, 12 శాతం నుంచి 15 శాతం ఉద్యోగాల కల్పన తద్వారా 5 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పర్యాటక శాఖ ముందుకు సాగుతోంది. రాష్ట్రాల్లో ఏపీని అగ్రపథాన నిలిపేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ముందుకు సాగుతుంది. పర్యాటకాభివృద్ధి ద్వారా రాష్ట్ర తలసరి ఆదాయానికి పర్యాటక శాఖ నుండి ఆర్థిక సహకారం అందించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఏపీకి క్యూ కట్టిన అంతర్జాతీయ బ్రాండ్లు ప్రభుత్వం తీసుకున్న చర్యలతో పర్యాటక రంగంలో పెట్టుబడులు పెద్ద ఎత్తున వచ్చాయి. రెండేళ్ల కాలంలో రూ. 20 వేల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టేందుకు వివిధ కంపెనీలు ముందుకు వచ్చాయి. అలాగే 117 ఎంఓయూలు కుదుర్చుకోగా, వీటి ద్వారా 1,22,637 మందికి ఉపాధి లభించనుంది. ఇక జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరున్న వివిధ హోటళ్లు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి, ప్రాజెక్టులు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాయి. తాజ్, మారియట్, ఐటీసీ, హయత్, ఒబెరాయ్, మేఫెర్, హిల్టన్ వంటి 14 అంతర్జాతీయ బ్రాండ్లు రాష్ట్రంలో తమ కార్యకలాపాలను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాయి. వీటి ద్వారా కొత్తగా 7,770 హోటల్ గదులు అందుబాటులోకి రానున్నాయి. MICE (సమావేశాలు, ప్రదర్శనలు) కేంద్రంగా అమరావతి, విశాఖపట్నం, తిరుపతి నగరాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. మల్టీ-ఎక్స్పీరియన్స్ టూరిజం గ్రిడ్... పర్యాటక సర్క్యూట్లు రాష్ట్రాన్ని ఒక సమగ్ర పర్యాటక గ్రిడ్‌గా మారుస్తూ విశాఖ, అరకు, రాజమహేంద్రవరం, అమరావతి, శ్రీశైలం, గండికోట, తిరుపతిలలో 7 యాంకర్ హబ్‌లు, 25కు పైగా ప్రత్యేక సర్క్యూట్‌లను అభివృద్ధి చేస్తున్నారు. కార్డెలియా సంస్థ ద్వారా విలాసవంతమైన క్రూయిజ్ ప్రయాణాలు, టైడా వద్ద లగ్జరీ టెంట్ సిటీలు, ఈజ్ మై ట్రిప్ సహకారంతో హెలీ టూరిజం, లక్స్ క్యారవాన్స్ ద్వారా క్యారవాన్ పర్యాటకం, అరకు లోయలు, లంబసింగి, గండికోట వంటి గ్రీన్ రిసార్టులు, కారవాన్ టూరిజం అభివృద్ధికి చర్యలు తీసుకున్నారు. ఇక నదులపై తేలియాడే హౌస్ బోట్లను రాష్ట్ర పర్యాటకంలో ప్రవేశపెట్టారు. మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా 14 ప్రాంతాలలో దాదాపు 30 రకాల వినూత్న కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. త్వరలో మరో 21 ప్రాంతాలలో 100కు పైగా కొత్త పర్యాటక అంశాలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. సూర్యలంకలో హౌస్ బోట్లు విజయవంతంగా నడుస్తున్నాయి. ఇటీవలే వాటర్ స్పోర్ట్స్ కూడా ప్రారంభమయ్యాయి. వచ్చే 3 నెలల్లో భవానీ ఐలాండ్, సరస్వతీ ఘాట్, పుష్కర్ ఘాట్, గండికోటలో కూడా ఇవి పర్యాటకులను అలరించనున్నాయి. వాటర్ స్పోర్ట్స్, అడ్వెంచర్ యాక్టివిటీస్‌ అందుబాటులోకి వచ్చాయి. ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రాలు, బౌద్ధ సర్క్యూట్లు అందమైన బీచ్‌లు, స్వచ్ఛమైన నదీ తీరాలు, క్రూయిజ్ పర్యాటకం, ఎకో-టూరిజం, సాహసోపేతమైన సీప్లేన్ సర్క్యూట్లు పర్యాటకులకు సరికొత్త అనుభూతిని ఇస్తున్నాయి. వీటన్నింటి ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను ఒక 'మల్టీ-ఎక్స్పీరియన్స్ టూరిజం గ్రిడ్'గా మార్చింది కూటమి ప్రభుత్వం. అంతేగాక పర్యాటకుల భద్రత కోసం ప్రత్యేక బీచ్ ప్రొటెక్షన్ ఫోర్స్ సిద్దమవుతోంది. వెల్లివిరుస్తోన్న సాంస్కృతిక వైభవం తిరుమల, శ్రీశైలం, విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం, అంతర్వేది, సింహాచలం, రాయలసీమ ఆధ్యాత్మిక క్షేత్రాలను అనుసంధానిస్తూ భక్తులకు మెరుగైన రవాణా, వసతి సౌకర్యాలు కల్పించారు. AirBnB, MakeMyTrip, Booking.com, Stay Vista, Homestay Buddy, HomeyHuts వంటి సంస్థల భాగస్వామ్యంతో 1,855 హోమ్‌స్టేలను అనుసంధానించారు. ప్రత్యేకంగా 'ఏపీ హోమ్‌స్టే పోర్టల్'ను అందుబాటులోకి తెచ్చారు. విజయవాడ ఉత్సవ్, గండికోట, అనకాపల్లి, విశాఖ ఉత్సవ్, అరకు చలి ఉత్సవ్, అమరావతి ఆవకాయ్ ఫెస్టివల్, ఫ్లెమింగో ఫెస్టివల్, మసులా బీచ్ ఫెస్టివల్ వంటి వాటితో ఆయా ప్రాంతాల్లో పర్యాటక ప్రాంతాలకు రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రచారం లభిస్తోంది. ఫెస్టివళ్ల నిర్వహణ ద్వారా స్థానికంగా పెద్ద ఎత్తున ఉపాధి లభించింది. బెజవాడ ఉత్సవ్ నిర్వహణతో ఏపీలోని వివిధ కళారూపాలకు పెద్ద ఎత్తున ప్రాచుర్యం లభించింది. పురాతన కాలం నుంచి కోనసీమ ప్రాంతంలో జరిగే జగ్గన్నతోట ప్రభల ఉత్సవానికి స్టేట్ ఫెస్టివల్ గా గుర్తింపు ఇవ్వడంతో మంచి ప్రచారం లభించింది... లక్షలాది మంది పర్యాటకులు జగ్గన్నతోట ప్రభల ఉత్సవానికి తరలి వచ్చారు. యోగాంధ్ర, ప్రపంచ పర్యాటక దినోత్సవం, శ్రీ సాయిబాబా 100వ జయంతి వేడుకలు, కృష్ణవేణి సంగీత నీరాజనం, ఏపీ ట్రావెల్ మార్ట్ తదితర 10 ప్రధాన ఉత్సవాల ద్వారా ఏడాదంతా పర్యాటక శోభ ఉండేలా చర్యలు తీసుకున్నారు. సుమారు 15 లక్షల మంది పర్యాటకులు వాటిలో పాల్గొన్నారన్నది అంచనా. టూరిజం అభివృద్ధిలో భాగంగా 8 జిల్లాల్లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమాలకు సుమారు 11 లక్షల మంది హాజరయ్యారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయి ప్రదర్శనలు... ఏపీలోని పర్యాటక క్షేత్రాల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలకు నీతి ఆయోగ్ గుర్తింపు లభించింది. పర్యాటకానికి సంబంధించి నీతి ఆయోగ్ ప్రచురించిన పుస్తకంలో ఏపీ పర్యాటకానికి సంబంధించి ప్రత్యేకంగా ప్రస్తావించింది. ఇక సోషల్ మీడియా ద్వారా పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టేందుకు పర్యాటక శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంది. వివిధ సోషల్ మీడియా ప్లాట్ ఫాంస్ ద్వారా చేసిన ప్రచారాలతో 90 లక్షల మంది నెటిజన్లను రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలు ఆకట్టుకున్నాయి. ఇప్పటివరకు ఏపీ అందాలను చాటిచెప్పే 110 షార్ట్ వీడియోలు మరియు రీల్స్‌ను రూపొందించారు. దేశంలోనే తొలిసారిగా రాపిడో భాగస్వామ్యంతో పర్యాటకులకు సరైన సమాచారం అందించేందుకు ఆటో/టాక్సీ డ్రైవర్లకు ప్రత్యేకంగా 'డ్రైవర్-కమ్-గైడ్' శిక్షణను ఇచ్చారు. కొండపల్లి టాయ్స్ ఫెస్టివల్ వంటి స్థానిక కళలను, లేపాక్షి వైభవాన్ని గ్లోబల్ ప్లాట్‌ఫామ్స్ పై ప్రదర్శించి వారసత్వాన్ని కాపాడేందుకు చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు రాష్ట్ర పర్యాటక శాఖ 30 జాతీయ మరియు 3 అంతర్జాతీయ పర్యాటక ప్రదర్శనలలో పాల్గొని ఆంధ్రప్రదేశ్ అందాలను ప్రపంచానికి చాటిచెప్పింది. అంతర్జాతీయ వేదికలపై ఏపీ పర్యాటక సొబగులను వినూత్నంగా ప్రదర్శించడం ద్వారా పర్యాటకుల సంఖ్యను భారీగా పెరిగింది. ప్రపంచ వేదికలపై ఏపీ పర్యాటక వాణి మంత్రి దుర్గేష్ వివిధ దేశాల్లో పర్యటించి ఏపీ పర్యాటకం గురించి వివరించారు... ఏపీలోని టూరిజం అభివృద్ధికి ఉన్న అంశాలను ప్రజెంట్ చేశారు. జర్మనీలో జరిగిన ఐటీబీ బెర్లిన్-2025 సదస్సులో పాల్గొని, వరల్డ్ మీడియా కాన్ఫరెన్స్ ద్వారా ఏపీలోని మడ అడవులు, సుదీర్ఘ సముద్ర తీరం, చారిత్రాత్మక కోటలు, బౌద్ధారామాల విశిష్టతను ప్రపంచానికి వివరించారు. వియత్నాం టూరిజం కాంక్లేవ్, సౌత్ ఏషియా లీడింగ్ ట్రావెల్ ఎగ్జిబిషన్,న్యూఢిల్లీ, ముంబయి, బెంగుళూరు, రాజస్థాన్, చెన్నై తదితర పలు వేదికలపై ఏపీ పర్యాటక విధివిధానాలను మంత్రి చాటి చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సహకారం - మౌలిక వసతుల కల్పన రాష్ట్ర పర్యాటకాభివృద్ధి కోసం కేంద్రం నుంచి 8 పర్యాటక ప్రాజెక్టులకు రూ. 428 కోట్ల నిధులు ఇచ్చారు. స్వదేశీ దర్శన్ 2.0 క్రింద సూర్యలంక బీచ్ అభివృద్ధికి రూ. 97.52 కోట్లు, బొర్రా గుహలకు రూ. 29.87 కోట్లు, సాస్కి క్రింద అఖండ గోదావరి పునరుద్ధరణకు రూ. 94.44 కోట్లు, గండికోట అభివృద్ధికి రూ. 77.91 కోట్లు, ప్రసాద్ స్కీమ్ కింద అన్నవరం దేవస్థానానికి రూ. 25.32 కోట్లు, సింహాచలంకు రూ. 54.04 కోట్లు, అదే విధంగా సీబీడీడీ క్రింద అహోబిలం స్పిరిచువల్ ఒడిస్సీకి రూ. 24.96 కోట్లు, నాగార్జున సాగర్ బౌద్ధ సర్క్యూట్‌కు రూ. 25 కోట్లు మంజూరయ్యాయి. ఈ పనులన్నీ జూలై 2026 నాటికి పూర్తి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోంది. పెరిగిన పర్యాటకుల సంఖ్య గత రెండేళ్లుగా కూటమి ప్రభుత్వం టూరిజం అభివృద్ధికి తీసుకున్న చర్యలతో పర్యాటకుల సంఖ్య పెరిగింది. గత ఏడాదితో పోలిస్తే పర్యాటకుల సంఖ్యలో 10.10% వృద్ధి నమోదు కాగా, విదేశీ పర్యాటకుల సంఖ్య 126.87% మేర పెరగింది. పెట్టుబడుల వెల్లువ మరియు పర్యాటక ప్రాంతాల విస్తరణ వల్ల స్థానిక యువతకు హోటల్ మేనేజ్మెంట్, గైడ్స్, ట్రావెల్స్, మరియు హ్యాండీక్రాఫ్ట్స్ రంగాలలో పెద్ద ఎత్తున ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభించాయి. ఏపీ టూరిజానికి అవార్డులు... ఏపీ టూరిజానికి, ఇక్కడ తీసుకుంటున్న అభివృద్ధి చర్యలకు గుర్తింపు లభిస్తోంది. దక్షిణాదిలో అతి పెద్ద ట్రావెల్, ట్రేడ్ ఎక్స్ పో అయిన గ్లోబల్ ట్రావెల్ మార్కెట్ -2026 సంస్థ పర్యాటకం, సంస్కృతి, వారసత్వ సంపద, టూరిజం డెస్టినేషన్ల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యలతో ఏపీని ఉత్తమ పర్యాటక ప్రచార రాష్ట్రంగా ఎంపిక చేసింది. ఇక జూన్ 4న కేరళలోని తిరువనంతపురంలో మంత్రి కందుల దుర్గేష్ ఈ అవార్డును అందుకోబోతున్నారు. సరికొత్త ఆలోచనలతో రండి... పెట్టుబడులు పెట్టండి: మంత్రి కందుల దుర్గేష్ ఆంధ్రప్రదేశ్ ప్రకృతి ప్రసాదించిన నందనవనమని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. సీఎం చంద్రబాబు మార్గదర్శకత్వంతో... డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రొత్సాహంతో 2 ఏళ్లల్లో పర్యాటక శాఖను అభివృద్ధి బాట పట్టించామన్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి అత్యంత అనుకూలమైన సమయమిదే అని చెప్పారు. సరికొత్త ఆలోచనలతో రండి, పెట్టుబడులు పెట్టండి అని పారిశ్రామిక వేత్తలను ఆహ్వానిస్తున్నామని మంత్రి దుర్గేష్ చెప్పారు. అన్ని విధాలా అండగా నిలిచి, పెట్టుబడులకు పూర్తి భరోసా కల్పించే బాధ్యత కూటమి ప్రభుత్వానిదేనని మంత్రి హామీ ఇస్తున్నారు. #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #NaraLokesh #AndhraPradesh
MYTDP App tweet mediaMYTDP App tweet mediaMYTDP App tweet mediaMYTDP App tweet media
తెలుగు
3
20
33
345
MYTDP App
MYTDP App@MYTDPApp·
అంపశయ్యపై నుంచి అభివృద్ధి పథంలోకి... కూటమి రాకతో చేనేతకు స్వర్ణయుగం ప్రారంభం చేనేత రంగ అభివృద్ధికి నూతన టెక్స్ టైల్స్ పాలసీ నేతన్నలకు వ్యక్తిగత లబ్ధి కలిగేలా పథకాలు అమలు లక్షకు పైగా నేతన్నల కుటుంబాల్లో ఉచిత విద్యుత్ వెలుగులు 15 శాతం సబ్సిడీకే నూలు... 90 శాతం సబ్సిడీతో ఆధునిక పనిముట్లు చేనేత సహకార సంఘాలకు విడతల వారీగా బకాయిల చెల్లింపు రాష్ట్ర వ్యాప్తంగా క్లస్టర్లు, మెగా టెక్స్ టైల్స్ పార్కుల ఏర్పాటు చేనేత వస్త్రాల అమ్మకాలు పెంచేలా ఒప్పందాలు ఆప్కో షో రూముల్లో పెరిగిన అమ్మకాలు... ఇళ్ల ముంగిటకే చేనేత వస్త్రాలు లోకేష్ చొరవతో మంగళగిరి చేనేతకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు నేతన్నలు కాలరెగరేసేలా కూటమి పాలన అమరావతి : కూటమి ప్రభుత్వం రాక నిస్తేజంలో కూరుకుపోయిన నేతన్నకు భరోసానిచ్చింది. గత రెండేళ్ల కాలంలో చేనేత రంగ అభివృద్ధికి, నేతన్నల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యలతో అంపశయ్యపై ఉన్న చేనేత పరిశ్రమ అభివృద్ధి పథంలోకి పయనించసాగింది. ఒకవైపు నూతన టెక్స్ టైల్స్ పాలసీ, మరోవైపు వ్యక్తిగత లబ్ధి పొందేలా పథకాల అమలు, ఇంకోవైపు చేనేత సహకార సంఘాల బలోపేతానికి చర్యలతో డీలా పడిన చేనేత రంగానికి కూటమి ప్రభుత్వం జవసత్వాలు నింపింది. నేను కూలీని కాదు కళాకారుడిని అని నేతన్నలు కాలెరగేసేలా కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది, ఆత్మగౌరవాన్ని ఇచ్చింది. చేనేత రంగాన్ని ఆదుకున్న ఎన్టీఆర్ స్ఫూర్తితో పాలన సాగిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు సైతం నేతన్నలకు లబ్ధి కలిగేలా ఎన్నో నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇక మంత్రి నారా లోకేష్ తీసుకున్న చొరవతో మంగళగిరి చేనేతకు అంతర్జాతీయ గుర్తింపు, గౌరవం దక్కింది. చేనేతకు పథకాలతో చేయూత... 2024లో సీఎం చంద్రబాబు నేతృత్వంలో ఏర్పడిన ఎన్డీయే ప్రభుత్వం చేనేతలకు అండగా నిలిచింది. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కింద 92,724 మంది నేతన్నలకు రూ.3 వేల నుంచి రూ. 4 వేలకు పెన్షన్ పెంచారు. చేనేతలకు త్రిఫ్ట్ కింద ప్రభుత్వ వాటాను 8 నుంచి 16 శాతానికి పెంచారు. ఈ పథకం కింద 2024-25లో రూ.5 కోట్లు, 2025-26లోనూ మరో రూ.5 కోట్లు కేటాయించారు. త్రిఫ్ట్ పథకం ద్వారా 5,726 మందికి లబ్ధి కలిగింది. రెండేళ్లలో రూ.65.35 కోట్ల మేర ముద్ర రుణాలను 6,808 మందికి అందజేశారు. జాతీయ చేనేత అభివృద్ధి కార్యక్రమం (ఎన్.హెచ్.డి.పి)పథకం ద్వారా చిన్న క్లస్టర్ అభివృద్ధి కార్యక్రమాలకు రూ.10.44 కోట్లను వెచ్చించగా, 7,500 మంది చేనేతలకు లబ్ధి కలిగింది. రూ.175 కోట్లతో ముడి పదార్థాల సరఫరా పథకం ద్వారా నూలు కొనుగోలుపై 15 శాతం సబ్సిడీ అందజేశారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా చేనేత ఉత్పత్తుల 5 శాతం జీఎస్టీ రియింబర్స్ మెంట్ ఇవ్వాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. స్వయం సహాయక సంఘాల్లో ఉన్న చేనేత మహిళలకు రూ.10 వేలు విలువ చేసే నూలును అందజేస్తున్నారు. 2024 ఏప్రిల్ నుంచి 109 ప్రాథమిక చేనేత సహకార సంఘాలకు రూ.78.73 కోట్ల నగదు పరపతి సౌకర్యం కల్పించారు. ఆధునిక పనిముట్ల కొనుగోలుకు 90 శాతం వరకు సబ్సిడీతో పాటు క్యాష్ క్రెడిట్ పథకం కింద సహకార సంఘాలకు బ్యాంకు రుణాలు అందజేస్తున్నారు. నేతన్నల కుటుంబాల్లో ‘ఉచిత’ వెలుగులు గత ఎన్నికల సమయంలో సీఎం చంద్రబాబు స్వయంగా నేతన్నల కష్టాలను తెలుసుకుని, ఉచిత విద్యుత్ అందజేస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాటకు కట్టుబడుతూ, మగ్గం నేతన్నలకు 200 యూనిట్లు, మరమగ్గం నేతన్నలకు 500 యూనిట్ల విద్యుత్ ను ఉచితంగా అందిస్తున్నారు. ఇందుకోసం ఏడాదికి రూ.150 కోట్లను చంద్రబాబు ప్రభుత్వం వెచ్చిస్తోంది. సుమారు 1.04 లక్షల కుటుంబాలకు ఉచిత విద్యుత్ పథకం ద్వారా లబ్ది కలుగనుంది. పథకం ద్వారా ఏడాదికి మగ్గం నేతన్నలకు రూ.8,640లు, మర మగ్గం నేతన్నలకు రూ.21,600లు ఆదా అవుతోంది. ఇళ్ల ముంగిటకే చేనేత వస్త్రాలు నేటితరం అభిరుచులకు అనుగుణంగా చేనేత వస్త్రాల తయారీలో 5 జిల్లాల్లో నైపుణ్య అభివృద్ధి శిక్షణా కార్యక్రమాలు నిర్వహించారు. కలంకారి చీరలు, పెన్ కలంకారి చీరలు, దుపట్టాలు, డిజిటల్ ప్రింటెడ్ చీరలు, క్రోచెట్ లేస్ చీరల తయారీలో శిక్షణ అందజేశారు. ఆప్కో షో రూముల్లో రెడీమేడ్ చేనేత వస్త్రాలను అమ్మకాలు ప్రారంభించారు. వెల్క్రో ధోవతులు, కాటన్ రెడీమేడ్ పెళ్లికూతురి ధోవతులు, మోడీ జాకెట్లు, సిల్క్ పెళ్లికూతురి సెట్లు, కొత్త డిజైన్లతో రెడీమేడ్ షర్టులు, లెనిన్ షర్టుల సహా వందకు పైగా డిజైన్లతో చేనేత రెడీమేడ్ వస్త్రాలను అమ్మకాలు చేస్తున్నారు. మారిన అభిరుచుల నేపథ్యంలో యువత, మహిళలు చేనేత వస్త్రాల కొనుగోలుకు పెద్ద సంఖ్యలో ముందుకొస్తున్నారు. ఆన్ లైన్ లోనూ చేనేత రెడీమేడ్ దుస్తులు,ఇతర వస్త్రాలను విక్రయిస్తున్నారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 40 ఆప్కో షో రూమ్స్ ద్వారా 6,770 ఉత్పత్తులను అమ్మకాలకు పెట్టారు. ఈ కామర్స్ అమ్మకాలతో నేరుగా వినియోగదారుల ఇళ్లకే వస్త్రాలను డోర్ డెలివరీ చేస్తున్నారు. ఆప్కో పేరిట సొంత వెబ్ సైటును అందుబాటులోకి తీసుకొచ్చారు. చేనేత వస్త్రాల పై సోషల్ మీడియాలోనూ విస్తృత ప్రచారం చేస్తూ, నేటి తరానికి నేతన్నలను కూటమి ప్రభుత్వం మరింత దగ్గర చేస్తోంది. మెగా క్టస్లర్లు, టైక్స్ టైల్స్ పార్కుల ఏర్పాటు చేనేతలకు 365 రోజులూ పని కల్పించేలా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నూతన టెక్స్ టైల్స్ పాలసీని అమలు చేసి, ఈ పాలసీ ద్వారా చేనేత రంగంలో రూ.10,000 కోట్ల పెట్టుబడుల సేకరించాలని, 1.51 లక్షల మందికి ఉపాధి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనిలో భాగంగా జాతీయ హ్యాండ్‌లూమ్ అభివృద్ధి ప్రోగ్రామ్ కింద 10 క్లస్టర్లు ఏర్పాటు చేసింది. రాయదుర్గం, హిందూపురం, బ్రాండెక్స్ టెక్స్ టైల్స్ పార్కుల అభివృద్ధితో పాటు ఎమ్మిగనూరు టెక్స్ టైల్స్ పార్క్ కూడా నిర్మించనుంది. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్‌ను రూ.38.31 కోట్లతో ఏర్పాటు చేయనుంది. మంగళగిరిలో చేనేత పార్క్ ఏర్పాటు చేయనుంది. పిఠాపురంలో మౌలిక సదుపాయాల కల్పనకు స్పెషల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ ను ప్రారంభించనున్నారు. 9,120 మంది చేనేత కార్మికులకు ప్రయోజనం చేకూర్చేలా రూ.15.11 కోట్లతో ఈ ప్రాజెక్టును నిర్మించనున్నారు. రూ.172 కోట్లతో విశాఖపట్నంలోని మధురవాడలో యూనిటీ మాల్ ను నిర్మిస్తున్నారు. అమరావతిలో శాఖమూరులో చేనేత, హస్తకళల మ్యూజియం నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నారు. చేనేత వస్త్రాల విక్రయాలకు ఒప్పందాలు చేనేత ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పించడానికి కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఒకవైపు రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఎగ్జిబిషన్లు నిర్వహిస్తూనే, మరింత మార్కెటింగ్ సౌకర్యాలు పెంచే ప్రణాళికల్లో భాగంగా పలు ఒప్పందాలు చేసుకుంది. టాటా తనేరియా, ఆద్యం బిర్లా గ్రూప్, తమిళనాడుకు చెందిన కో ఆప్టెక్స్. ఏపీ హస్తకళల కార్పొరేషన్ తోనూ ఆప్కో ఒప్పందం చేసుకుంది. చేనేత వస్త్రాల అమ్మకాలు పెంచడానికి ఈ ఒప్పందాలు ఎంతగానో ఉపకరించనున్నాయి. చేనేతకు లోకేష్ దంపతుల ప్రమోషన్ ఏపీ చేనేతకు... ప్రత్యేకించి మంగళగిరి చేనేత వస్త్రాలకు మంత్రి నారా లోకేష్ దంపతులే బ్రాండ్ అంబాసిడర్లుగా మారారు. లోకేష్, బ్రాహ్మాణిలు ఏ శుభకార్యానికి వెళ్లినా చేనేత వస్త్రాలనే బహుకరిస్తున్నారు. ఇక బ్రహ్మాణి వివిధ సందర్భాల్లో మంగళగిరి చేనేత వస్త్రాలు ధరిస్తూ ప్రమోట్ చేస్తున్నారు. మరోవైపు లోకేష్ తాను కలిసే ప్రతినిధులకు... తనను కలవడానికి వచ్చే వారికి చేనేత శాలువాతో సత్కరిస్తున్నారు.. చేనేత వస్త్రాలను బహుకరిస్తున్నారు. ప్రధానిని కలిసిన ప్రతి సందర్భంలోనూ లోకేష్ చేనేత వస్త్రాలతో ఆయన్ను సత్కరిస్తారు. తాజాగా ప్రజా ప్రతినిధుల కుటుంబాలకు ఇచ్చిన ఆత్మీయ విందులోనూ మంగళగిరి చీరలను నారా లోకేష్ బహుకరించారు. ఇక మంగళగిరిలో నేతన్నల కోసం వీవర్ శాల ఏర్పాటు చేశారు. ఈ వీవర్ శాలలో చేనేత రంగానికి నైపుణ్యాభివృద్ధి, అత్యాధునిక టూల్స్ అందుబాటులోకి తెచ్చి... చేనేత రంగాన్ని ప్రొత్సహిస్తున్నారు. ఆప్కోలో అమ్మకాలు పెరుగుదల కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆప్కో షో రూమ్ ల బలోపేతానికి చర్యలు తీసుకుంది. అమ్మకాలు పెంచేలా సిబ్బందికి ప్రత్యేక శిక్షణ అందజేసింది. సాంకేతికతకు పెద్దపీట వేస్తూ, డిజిటల్ అమ్మకాలు ప్రారంభించింది. చీరలు, దుప్పట్లు, తువ్వాళ్లతో పాటు చేనేత రెడీమేడ్ దుస్తులను అమ్మకానికి పెట్టారు. పుట్టపర్తి, ఎమ్మిగనూరు, ప్రొద్దుటూరు, టెక్కలి, అనకాపల్లిలో అయిదు కొత్త షోరూమ్‌లు ప్రారంభించింది. ప్రభుత్వం తీసుకున్న చర్యలతో రెండేళ్లలో రూ.188.01 కోట్ల మేర అమ్మకాలు జరగడం విశేషం. చేనేత సహకార సంఘాలకు విడతల వారీగా ఆప్కో బకాయిలు చెల్లిస్తూ వస్తోంది. చేనేత రంగానికి అవార్డుల వెల్లువ రాష్ట్రంలో చేనేత రంగ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం రెండేళ్లలో తీసుకున్న చర్యలు సత్ఫలితాలు వస్తున్నాయి. వన్ డిస్ట్రిక్ - వన్ ప్రొడెక్ట్ కింద పలు చేనేత వస్త్రాల గుర్తింపునకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. 2024 సంవత్సరానికి గాను పది ఓడీ-ఓపీ అవార్డులను ఏపీ సొంతం చేసుకుంది. వాటిలో ఏడు అవార్డులు చేనేత, జౌళి శాఖకు చెందినవే కావడం విశేషం. ఆప్కోలో చేపట్టిన డిజిటైలేజేషన్ కు గానూ స్కోచ్ అవార్డు సొంతమైంది. నేతన్నలకు 365 రోజులూ ఉపాధే లక్ష్యం: మంత్రి సవిత గడచిన రెండేళ్ల కాలంలో చేనేత రంగానికి ఊపిరి పోసేలా కూటమి ప్రభుత్వం చాలా చర్యలు తీసుకుందని చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత అన్నారు. చేనేత కార్మికులకు గౌరవ జీవనం కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. సగం ధరకే చీర, దోవతి నినాదంతో ఆనాడు అన్న ఎన్టీఆర్ చేనేత రంగానికి ఊపిరిపోస్తే, నేడు సీఎం చంద్రబాబు నేతన్నలకు ఆర్థిక మేలు కలుగజేసేలా పథకాలు రూపొందిస్తున్నారని మంత్రి చెప్పారు. ముఖ్యంగా చేనేత వస్త్రాలకు మార్కెటింగ్ కల్పించేలా కూటమి ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుందని మంత్రి వివరించారు. గత నెల ఒకటో తేదీ నుంచి అమలు చేస్తున్న ఉచిత విద్యుత్ పథకంతో నేతన్న కుటుంబాలకు మరింత లబ్ధి కలుగుతోందని చెప్పారు. చేనేతలకు 365 రోజుల పాటు పని కల్పించడమే సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రధాన లక్ష్యమన్నారు. ఆ లక్ష్యం దిశగా వడివడిగా అడుగులు వేస్తూ ముందుకు సాగుతున్నామని మంత్రి సవిత చెప్పారు. #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #NaraLokesh #AndhraPradesh
MYTDP App tweet mediaMYTDP App tweet mediaMYTDP App tweet mediaMYTDP App tweet media
తెలుగు
3
32
69
653
MYTDP App
MYTDP App@MYTDPApp·
పసి పిల్లల చిరునవ్వు ఎంత స్వచ్ఛంగా ఉంటుందో మన రాష్ట్రం కూడా అంతే స్వచ్ఛంగా ఉండాలి. #SwarnaAndhraSwachhAndhra
తెలుగు
2
16
54
565
MYTDP App
MYTDP App@MYTDPApp·
కేంద్రం సహకారంతో, మంత్రి నారా లోకేష్ కృషితో మంగళగిరి రైల్వే స్టేషన్ అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. #Mangalagiri #NaraLokesh #AndhraPradesh
తెలుగు
1
10
40
404
MYTDP App
MYTDP App@MYTDPApp·
"వీరికి వీరే సాటి, వీరికి లేదు పోటీ" అన్నట్లుగా నారా కుటుంబం మూడు తరాలుగా తమదైన ముద్ర వేస్తోంది. అపర చాణక్యుడు, విజనరీ లీడర్ నారా చంద్రబాబు నాయుడు నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించి, సరికొత్త 'క్వాంటం' టెక్నాలజీతో దేశానికే దిక్సూచిగా నిలిచారు. అటు 'యువగళం'తో ప్రభంజనం సృష్టించిన నారా లోకేష్.. నేడు 'రాయల్' సీమలో 'జెట్' స్పీడ్‌తో భారీ పెట్టుబడులు, ఐటీ కంపెనీలు తెప్పిస్తూ ప్రగతి పరుగుల తీయిస్తున్నారు. ఇక మూడో తరం వారసుడు నారా దేవాన్ష్ సైతం బాల్యంలోనే "Dino Deets" యూట్యూబ్ ఛానల్‌తో తన వినూత్న ఆలోచనలను చాటుతూ అందరి మెప్పు పొందుతున్నాడు. ఇలా ఒకే త్యాగం, ఒకే సంకల్పంతో మూడు తరాలుగా పట్టుదల, ఆవిష్కరణలతో సరికొత్త చరిత్ర లిఖిస్తూ సరిహద్దులు దాటి స్ఫూర్తినింపుతున్నారు. #ChandrababuNaidu #NaraLokesh #DinoDeets #DevaanshPodcast
MYTDP App tweet media
తెలుగు
11
41
167
4.8K
MYTDP App
MYTDP App@MYTDPApp·
చరిత్ర సృష్టించిన విజనరీ లీడర్ చంద్రన్న. నారా చంద్రబాబు నాయుడు కేవలం ఒక రాజకీయ నాయకుడు కాదు, నవ్యాంధ్ర చరిత్రను తిరగరాసిన ఒక అద్భుత శకం! వయసు ఏడు పదులు దాటినా, అభివృద్ధి కోసం ఆయన పరుగు ఇరవై ఏళ్ల యువకుడిని తలపిస్తుంది. గ్లోబల్ మ్యాప్‌లో ఐటీ సిటీలను నిలిపిన విజనరీ, ప్రజా క్షేమమే ధ్యేయంగా జీరో పావర్టీ-P4 విధానంతో పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్న కార్యసాధకుడు. ఇంద్రుడు దేవతల కోసం రాజధానిని నిర్మిస్తే, ఈ 'చంద్రుడు' ప్రజల భవిష్యత్తు కోసం మహానగరం 'అమరావతి'ని సృష్టిస్తున్నారు. అంతర్జాతీయ గుర్తింపు ఉన్నా సామాన్యుడికి సైతం అందుబాటులో ఉండే ప్రజా నాయకుడు ఆయన. నవశకానికి దిక్సూచిగా, ఆంధ్రుల ఆశాకిరణంగా నిలిచిన ఆయనే ఒక నిజమైన విజనరీ లీడర్! #ChandrababuNaidu #AndhraPradesh
తెలుగు
5
31
119
1.3K
MYTDP App
MYTDP App@MYTDPApp·
*నారా దేవాన్ష్ యూట్యూబ్ చాన‌ల్ ``Dino Deets ` ప్రారంభం* - *త‌న‌యుడి టీజ‌ర్‌లో తండ్రి లోకేష్ కూడా భాగ‌మ‌య్యారు* - *దేవాన్ష్‌కు శుభాకాంక్ష‌లు తెలిపిన నారా-నంద‌మూరి కుటుంబ‌స‌భ్యులు* మంత్రి నారా లోకేష్ త‌న‌యుడు నారా దేవాన్ష్ ``Dino Deets ``పేరుతో యూట్యూబ్ ఛాన‌ల్ ఆరంభించారు. ఈ సంద‌ర్భంగా నారా-నంద‌మూరి కుటుంబ‌స‌భ్యులు దేవాన్ష్‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. ``Dino Deets ``టీజ‌ర్‌లోనూ మంత్రి నారా లోకేష్ పాలుపంచుకుని దేవాన్ష్ యూట్యూబ్‌, పాడ్ కాస్ట్ ప్ర‌త్యేక‌తలు తెలుసుకున్నారు. డైనోసార్లు, శిలాజాలు (fossils), పురాత‌న అవ‌శేషాల గురించి తాను తెలుసుకున్న ఆశ్చర్యపరిచే నిజాలు, డైనోసార్ల వింత‌లు-విశేషాలు ఆక‌ట్టుకునే శైలిలో, న‌వ్విస్తూ, ఆలోచింప‌జేసేలా దేవాన్ష్ అందించే పాడ్ కాస్ట్‌లు ఈ యూట్యూబ్ చాన‌ల్ ద్వారా వీక్ష‌కుల‌కు చేర‌నున్నాయి. దేవాన్ష్ సృష్టించిన ప్రాచీన ప్రపంచంలోకి నేను ఒక ప్రేక్ష‌కుడిలా ప్ర‌వేశించేందుకు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నానంటూ మంత్రి నారా లోకేష్ ఉద్విగ్నంగా త‌న భావాల‌ను సోష‌ల్ మీడియా ద్వారా పంచుకున్నారు. యూట్యూబ్ చాన‌ల్ ద్వారా ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన‌ నారా దేవాన్ష్‌ చదరంగంలో క్లిష్టమైన 175 పజిల్స్‌ను వేగంగా పరిష్కరించడం ద్వారా ‘ఫాస్టెస్ట్ చెక్‌మేట్ సాల్వర్’గా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సాధించాడు. ‘5334 ప్రాబ్లమ్స్ అండ్ గేమ్స్’ పుస్తకంలోని 175 సంక్లిష్టమైన చెక్‌మేట్ పజిల్స్‌ను గతేడాది దేవాన్ష్‌ వేగంగా పరిష్కరించి ఈ రికార్డు సొంతం చేసుకున్నాడు. *ఛానెల్ లింక్స్* YouTube - @dinodeets" target="_blank" rel="nofollow noopener">youtube.com/@dinodeets Instagram - instagram.com/dinodeets/ Facebook - facebook.com/DinoDeets/ #DinoDeets #DevaanshPodcast
తెలుగు
2
32
154
2.6K
MYTDP App
MYTDP App@MYTDPApp·
ఆపరేషన్ క్లీన్ స్వీప్... ఇవాళ్టి నుంచి రాష్ట్రంలో ఆపరేషన్ క్లీన్ స్వీప్ ప్రారంభమవుతుంది. నెలరోజుల పాటు ఈ ప్రత్యేక డ్రైవ్ చేపడతాం. నాలుగు వారాల పాటు అధికారులు, ప్రజాప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలి. #SwarnaAndhraSwachhAndhra #MyCleanAP #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh
తెలుగు
1
15
48
381
MYTDP App
MYTDP App@MYTDPApp·
మొన్నటి దాకా రాయలసీమ అంటే గొడ్డళ్లు, గన్ సౌండ్లు, ఫ్యాక్షన్ నీడలు గుర్తొచ్చేవి.. ఈ రోజు అదే రాయలసీమలో రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ సౌండ్ వినిపిస్తోంది.. అది కేవలం బైక్ శబ్దం కాదు.. అభివృద్ధి పరుగుల శబ్దం. ఒకప్పుడు భయంతో మూగబోయిన నేలపై, ఇప్పుడు పరిశ్రమల హోరు వినిపిస్తోంది. గన్‌లతో గాయపడిన సీమను, విజన్‌తో గెలిపిస్తున్న నాయకత్వం ఇది. ఫ్యాక్షన్ నుంచి ఫ్యాక్టరీల దిశగా.. విధ్వంసం నుంచి వికాసం వైపు.. రాయలసీమ కొత్త చరిత్ర రాస్తోంది. #royalenfield #ChandrababuNaidu #AndhraPradesh
MYTDP App tweet media
తెలుగు
1
22
87
599
MYTDP App
MYTDP App@MYTDPApp·
ఎవరినీ వదలడు.. ఎవరినీ మరువడు. 🔥 అన్న ఎన్టీఆర్ తర్వాత, అనంతపురం కేడర్ మీటింగ్‌లో నారా లోకేష్ గారు "మా మామ" అని పిలిచారు. కేడర్ నుంచి "జై బాలయ్య" అంటూ ఆకాశం దద్దరిల్లేలా నినాదాలు వచ్చాయి. ఆ ఊపును వాడుకుని ప్రసంగాన్ని కొనసాగించడం ఎవరికైనా సాధ్యమే. కానీ లోకేష్ గారు ఆగి. స్పష్టంగా చెప్పారు. "హరి మామయ్య" అని.. ఆ వెంటనే, "ముద్దుల మామయ్య బాలయ్య" అని పూర్తి చేశారు. ఆయన దృష్టిలో ఏ పేరు మరుగున పడదు. ఏ సోదరుణ్ణీ ఆయన విమర్శించరు. చైతన్య రథ సారథిని మరువని కార్యకర్త ఆయన. ఇది కేవలం ప్రసంగం కాదు.. నారా లోకేష్ వ్యక్తిత్వం! నమ్మిన వారిని, నడిపించే వారిని ఎప్పటికీ మరువని నాయకత్వం. #LokeshWithCadre #NaraLokesh #AndhraPradesh
తెలుగు
195
1.4K
3K
11.9K
MYTDP App
MYTDP App@MYTDPApp·
Jagan - JGF CBN - JGF *Both are not same*
MYTDP App tweet media
English
3
31
128
1.2K
MYTDP App
MYTDP App@MYTDPApp·
గొడ్డలి పార్టీది ఫ్యాక్షన్ బ్యాక్‌గ్రౌండ్ – మనది ఫైటర్ జెట్ బ్యాక్‌గ్రౌండ్. బోత్ ఆర్ నాట్ సేమ్.... అర్థమైందా రాజా... #RayalaseemaTakesOff #AMCA
తెలుగు
2
18
79
863
MYTDP App
MYTDP App@MYTDPApp·
ఇదేమి మాస్ జాతర రా నాయనా..! 🔥🔥 ఒక్క నాయకుడి రాక కోసం వేలాదిమంది యువత, అభిమానులు, మహిళలు రోడ్లపైకి వచ్చారంటే ఇది లోకేష్ మాస్ మార్క్ . #NaraLokesh #AndhraPradesh
తెలుగు
207
1.5K
3.3K
9.8K