
ఆంధ్రప్రదేశ్లో మత్స్యకారుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం మరోసారి తన చిత్తశుద్ధిని చాటుతోంది. వేట నిషేధ సమయంలో గంగపుత్రుల కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోకుండా ఆదుకునేందుకు అమలు చేస్తున్న “మత్స్యకారుల సేవలో” పథకం కింద వరుసగా రెండో ఏడాది భారీ ఆర్థిక సాయాన్ని అందిస్తోంది. ప్రజా ప్రభుత్వం మత్స్యకారుల వెన్నంటే నిలుస్తూ, వారి కుటుంబాలకు భరోసా కల్పిస్తోంది.
నెల్లూరు జిల్లా కావలి మండలం తుమ్మలపెంటలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఈ నిధుల విడుదల కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,30,796 మత్స్యకార కుటుంబాలకు రూ.262 కోట్ల ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం నేరుగా వారి ఖాతాల్లో జమ చేసింది. ప్రతీ కుటుంబానికి రూ.20 వేల చొప్పున అందిస్తున్న ఈ సాయం, వేట నిషేధ కాలంలో కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించనుంది.
ప్రతీ ఏడాది ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు 61 రోజుల పాటు సముద్రంలో చేపల సంరక్షణ కోసం వేట నిషేధం అమలులో ఉంటుంది. ఈ సమయంలో ఉపాధి కోల్పోయే మత్స్యకార కుటుంబాలకు ఇబ్బంది కలగకుండా చేయాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ వరుసగా రెండో ఏడాది ఈ సాయం అందించడం గమనార్హం.
గత ఏడాది 1,21,433 కుటుంబాలకు రూ.243 కోట్ల సాయం అందించగా, ఈసారి లబ్ధిదారుల సంఖ్య పెరిగి 1,30,796 కుటుంబాలకు చేరింది. రెండేళ్లలోనే మొత్తం రూ.505 కోట్ల సాయాన్ని ప్రభుత్వం మత్స్యకార కుటుంబాలకు అందించింది. గత ప్రభుత్వ హయాంలో కేవలం రూ.10 వేల సహాయం మాత్రమే అందించగా, కూటమి ప్రభుత్వం దానిని రెట్టింపు చేసి రూ.20 వేలకు పెంచింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు సవాళ్లతో ఉన్నప్పటికీ బలహీన వర్గాల సంక్షేమమే ప్రధాన లక్ష్యమని ప్రభుత్వం మరోసారి నిరూపించింది.
మత్స్యకారుల సంక్షేమం కేవలం ఆర్థిక సాయంతోనే పరిమితం కాలేదు. వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు మరణించిన మత్స్యకారుల కుటుంబాలకు కూడా ప్రభుత్వం అండగా నిలుస్తోంది. 2024-25లో 63 క్లెయిమ్స్కు రూ.3.15 కోట్లు, 2025-26లో 113 పెండింగ్ క్లెయిమ్స్కు రూ.5.65 కోట్ల పరిహారాన్ని సకాలంలో చెల్లించింది. కుటుంబాలు రోడ్డున పడకుండా చేయాలనే బాధ్యతతో ప్రభుత్వం పనిచేస్తోంది.
అంతేకాకుండా మత్స్యకారుల ఆదాయ వనరులు పెంచేందుకు సీవీడ్ సాగును కూడా ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. సముద్రతీర ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలను పెంచి మత్స్యకార కుటుంబాల ఆర్థిక స్థితిని బలోపేతం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
“వేటకు విరామం… కానీ మత్స్యకారుల కుటుంబాలకు కాదు” అన్న భావనతో కూటమి ప్రభుత్వం చేపడుతున్న ఈ చర్యలు గంగపుత్రుల జీవితాల్లో భరోసా నింపుతున్నాయి. సంక్షేమం అంటే కేవలం మాటలు కాదు… అవసరమైన సమయంలో అండగా నిలవడమేనని ప్రజా ప్రభుత్వం మరోసారి నిరూపిస్తోంది.
#MatsyakarulaSevalo
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh

తెలుగు



















