Mission Telangana

16.5K posts

Mission Telangana banner
Mission Telangana

Mission Telangana

@MissionTG

Telangana's first and leading news portal. https://t.co/RF0bqgHv8c

Katılım Kasım 2013
10 Takip Edilen13.1K Takipçiler
Mission Telangana
Mission Telangana@MissionTG·
రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. రంజాన్ మాస ఆఖరి పర్వదినమైన 'ఈద్ ఉల్ ఫితర్' సందర్భంగా, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముస్లిం సహోదరులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ప్రారంభం నుంచి చివరి రోజు వరకు, ప్రతి రోజూ ప్రత్యేక దైవ ప్రార్థనలు, ఉపవాస దీక్షలు, భక్తి శ్రద్ధలతో ముస్లింలు పవిత్ర రంజాన్ మాసాన్ని ఆచరిస్తారని అన్నారు. ఈ సందర్భంగా పరస్పర శాంతి, సహనం, సౌభ్రాతృత్వం, ప్రేమాభిమానాలు పరిమళిస్తాయని కేసీఆర్ పేర్కొన్నారు. లౌకికవాద విలువలకు ప్రాధాన్యతనిస్తూ, విభిన్న మతాల సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచారాలను గౌరవిస్తూ, గంగా-జమున తహజీబ్‌కు ప్రతీకగా బీఆర్ఎస్ పాలన కొనసాగిందని తెలిపారు. రాష్ట్రంలో ముస్లిం మైనారిటీల సంక్షేమం, ప్రగతి కోసం విద్య తదితర రంగాల్లో అమలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు వారి జీవన విధానంలో గుణాత్మక మార్పుకు దోహదం చేశాయని కేసీఆర్ అన్నారు. ప్రగతి తిరిగి పుంజుకుని, రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఈ సందర్భంగా కేసీఆర్ ఆకాంక్షించారు.
Mission Telangana tweet media
తెలుగు
0
5
21
599
Mission Telangana
Mission Telangana@MissionTG·
Musi beautification project: Questions mount over one-kilometer buffer zone Uncertainty continues to surround the Musi Beautification project, as discrepancies emerge between official claims and ground-level actions. While the Congress government maintains that land acquisition will be limited to a 50-meter buffer zone on either side of the river, recent developments suggest a much wider scope - possibly extending up to one kilometer. In areas like Chaderghat, nearly 300 houses have already been demolished, with authorities claiming they were located within the river limits. However, residents allege that boundary markers in several areas have been placed far beyond the declared 50-meter limit, in some cases stretching up to 700 meters to one kilometer. Further raising concerns is a tender issued by the Musi Riverfront Development Corporation Limited (MRDCL) for 3D digital modeling of structures within a one-kilometer radius on both sides of the river. The tender, valued at Rs. 18 lakh, covers a 42-square-kilometer area as part of the project’s first phase, which spans 21 kilometers from Himayatsagar to Bapu Ghat. The move has prompted questions: if the project is confined to a 50-meter buffer, why map structures far beyond it? Adding to the suspicion, earlier presentations by officials reportedly outlined plans to develop a one-kilometer-wide corridor along the river, inspired by international models like Seoul. Such large-scale commercial development - featuring real estate, tourism, and business hubs - would not be feasible within a narrow buffer zone. Compensation policies have also fueled doubts. Government orders provide escalating compensation - 200%, 300%, and 400% of property value - for structures located within the riverbed, buffer zone, and beyond. Critics argue this indicates a clear intent to acquire land outside the officially stated limits. Despite repeated assurances, the government has not disclosed key details, including the total land to be acquired or the number of affected households. With reports suggesting over one lakh structures fall within the one-kilometer stretch, concerns over transparency and displacement continue to grow.
Mission Telangana tweet media
English
2
4
8
316
Mission Telangana
Mission Telangana@MissionTG·
🔹పాలసీల పేరిట అక్రమాలు చేస్తే అభివృద్ది జరుగుతుందా? 🔹ఇండస్ట్రియల్ హబ్ కాదు, కరప్షన్ హబ్‌గా మార్చారు. 🔹అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి ఆరు గ్యారెంటీలు అమలు చేశారనడం దారుణం. 🔹30 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ కడతాం అంటరు.. ఉన్నదా అంత భూమి? 🔹బీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లకు నియామకపత్రాలు ఇచ్చి 60 వేల ఉద్యోగాలు ఇచ్చినం అంటున్నరు. 🔹ప్రజావాణి గురించి గొప్పలు చెబుతున్నరు. ముఖ్యమంత్రి ఎన్నడైనా ప్రజావాణి నిర్వహించిండా? ప్రజలకు అందుబాటులో ఉన్నడా? 🔹మహాలక్ష్మి పేరిట రూ. 2800 కోట్ల బకాయిపడింది. 🔹ఆర్టీసికి రూ. 9222 కోట్లు ఇచ్చి ఉంటే ఆర్టీసీ రూ. 3 వేల కోట్ల అప్పులు ఎందుకు చేసింది. 🔹ఆర్టీసీ లాభాల్లో ఉంటే పింఛన్ బకాయిలు ఎందుకు ఇవ్వడం లేదు.. ఎందుకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం లేదు. 🔹కొత్త పింఛన్లు కాదు ఉన్న పింఛన్లు ఊడగొడుతున్నరు. 🔹3 లక్షల పింఛన్లు తొలగించి, కొత్త పింఛన్లు ఇస్తం అంటున్నరు. 🔹పింఛన్ల పెంపు ఎప్పుడు అని ప్రజలు ఎదురు చూస్తున్నరు. 🔹కేసీఆర్ గారు పదింతలు పింఛన్లు పెంచితే, మీరు మోసం చేసారు. 🔹మేం ప్రశ్నిస్తున్నాం అని వడ్డీ లేని రుణాల గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. 🔹రాష్ట్ర మహిళలందరిని మోసం చేశారు. 🔹రైతుబంధు మూడు పంటలు ఎగ్గొట్టారు.. రుణమాఫీ గురించి ప్రస్తావన లేదు.. బోనస్ దోఖా చేసారు. 🔹గతేడాది యాసంగి సన్నరకం వడ్లకు వెయ్యి కోట్లు ఎగ్గొట్టింది. 🔹నిస్సిగ్గుగా రెండు పంటలకు సన్న వడ్లకు బోనస్ ఇచ్చినం అంటున్నరు. 🔹మీరు రెండు పంటలకు ఇచ్చారా? రాజీనామా చేస్తరా? ఇచ్చినట్లు నిరూపిస్తే నేను రాజీనామా చేస్తా. 🔹వానాకాలం ఇచ్చి, యాసంగి ఎగ్గొట్టింది నిజం కాదా? 🔹ఉత్తమ్ గారేమో 6 లక్షల రేషన్ కార్డులు ఇచ్చినం అంటే భట్టి గారేమో ఇవ్వలేదు అంటున్నరు. 🔹తెలంగాణ చీకట్ల మగ్గింది కాంగ్రెస్ పాలనలోనే. 🔹మీ పాలనలో పారిశ్రామికవేత్తలు ధర్నాలు చేశారు. మీ పాలనలో కరెంట్ కోతలు.. కేసీఆర్ గారు 24 గంటల కరెంట్ ఇచ్చారు. 🔹యాదాద్రి ప్లాంట్ ఎవరు ప్రారంభించారు. ఈరోజు యాదాద్రి తెలంగాణ జాతికి గర్వకారణం అంటున్నారు. 🔹మా ఖ్యాతిని కూడా తమదిగా చెప్పుకోవడం సిగ్గుచేటు. 🔹ఆరోజు యాదాద్రి పవర్ ప్లాంట్‌ను తీసేస్తాం, మూసేస్తాం అన్నరు. నేడు మా గొప్పతనం అంటున్నరు. 🔹సింగరేణిను స్కాంల ఖనిగా మార్చారు. కుంభకోణాల కేంద్రంగా మార్చారు. 🔹బోగస్ ప్రొడక్షన్, బోగస్ ఇన్‌కం టాక్స్, బోగస్ లెక్కలు. 🔹బడ్జెట్ ప్రసంగానికి వీసమెత్తైనా నిజాయితీ ఉందా. 🔹బ్రేక్‌ఫాస్ట్ పథకం గురించి డబ్బా కొట్టారు. 🔹ఎవరు ప్రారంభించారు సీఎం బ్రేక్‌ఫాస్ట్ పథకం? కేసీఆర్ గారు కాదా? 🔹టిమ్స్ సనత్ నగర్ ప్రారంభిస్తాం అని నాలుగు డేట్లు మారాయి. 🔹డేట్లు, డెడ్‌లైన్లు మారాయి తప్ప ఆసుపత్రి అందుబాటులోకి రాలేదు 🔹దగాకోరు బడ్జెట్ ఇది.. అన్ని వర్గాల ప్రజలను నిరాశపర్చిన బడ్జెట్.
తెలుగు
0
0
0
58
Mission Telangana
Mission Telangana@MissionTG·
🔷 కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ 2026-27 పై అసెంబ్లీ మీడియా హాల్‌లో మీడియా సమావేశం నిర్వహించిన మాజీ మంత్రి హరీష్ రావు 👇 🔹రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ రాష్ట్ర ప్రజలను తీవ్రంగా నిరాశపరిచింది. 🔹ఆరు గ్యారెంటీలకు భట్టి గారు, రేవంత్ గారు విజయవంతంగా ఘోరీ కట్టారు. 🔹20 పేజీలు పెంచారు, రూ. 20 వేల కోట్ల బడ్జెట్ పెంచారు తప్ప ఆరు గ్యారెంటీల ప్రస్తావన గానీ, నిధుల కేటాయింపు గానీ చేయలేకపోయారు. 🔹కాగితాల మీద అంకెలు ఉన్నాయి తప్ప, ప్రజల కష్టాలు తీర్చడంలో ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదు. 🔹ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ డిక్లరేషన్లు ఓట్ల కోసమే తప్ప ఆ వర్గాల అభివృద్ది కోసం కాదన్నది బడ్జెట్ నిరూపించింది. 🔹గత బడ్జెట్‌లో చెప్పిన పథకాలు అమలు చేయలేదు, ఈసారి అవే పెట్టారు. 🔹పోయిన బడ్జెట్ లో రాజీవ్ యువ వికాసం కోసం రూ. 6 వేల కోట్లు అన్నరు, ఈసారి రూ. 6 వేల కోట్లు అన్నరు. 🔹ఇందిరమ్మ ఆత్మీయ భరోసా విషయంలోనే అదే జరిగింది. 🔹ఒక్క రూపాయి ఇవ్వలేదు, ఒక్క పైసా ఖర్చు చేయలేదు. 🔹ఈ బడ్జెట్‌ అంకెల గారడీ తప్ప కేటాయింపుల విషయంలో, ఖర్చు విషయంలో చిత్తశుద్ధి లేదు. 🔹ఇందిరమ్మ పేరు చెప్పి, రాజీవ్ గాంధీ పేరు చెప్పి వారి ఆత్మ క్షోభించేలా చేస్తున్నారు. 🔹రూపాయి ఇవ్వలేదు, రూపాయి ఖర్చు పెట్టలేదు. 🔹భట్టి బడ్జెట్ బోగస్ బడ్జెట్, బడా జూటా బడ్జెట్, ఇదొక వట్టి బడ్జెట్. 🔹అభయహస్తం కాదు రిక్త హస్తం అని అర్థమైంది. 🔹తెలంగాణను, హైదరాబాద్‌ను మూడు ముక్కలు చేయడం తప్ప విషయం లేదు. 🔹పింఛన్ల పెంపు లేదు, రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ గురించి లేదు. 🔹ఆర్టీసీ కార్మికులకు మొండి చేయి, సింగరేణి కార్మికులకు మొండి చెయ్యి. 🔹ముదిరాజులకు, గౌడన్నలకు, గొల్ల కుర్మలకు ఇలా అన్నబీసీ వర్గాలకు మొండి చెయ్యి. 🔹ఎస్సీ, ఎస్టీలకు మొండి చేయి, మహిళలకు మొండి చేయి, ఆశా, అంగన్వాడీలకు మొండి చెయ్యి.. మైనార్టీలకు మొండి చెయ్యి.. ఆర్టీసీ కార్మికులకు మొండి చెయ్యి 🔹సకల జనులకు దక్కింది గుండు సున్నా 🔹అంకెల గారడీ మాటల గారడీ తప్ప పేదల పట్ల చిత్తశుద్ధి లేదు. 🔹మూడేళ్లు నిండకముందే మూడున్నర లక్షల కోట్ల అప్పలు చేసిండు. 🔹కేసీఆర్ గారు కాళేశ్వరం, మిషన్ భగీరథ, మెడికల్ కాలేజీలు కట్టిండు. 🔹తెచ్చిన అప్పులను మూలధన పెట్టుబడిగా మార్చి సంపద సృష్టించిండు. 🔹మీరేం చేసారు.. చరిత్రలో ఎన్నడూ లేనంత అప్పు పెరిగింది.. 27 శాతం నుంచి 28 శాతానికి పెంచారు. 🔹ఫిరాయింపు ఎమ్మెల్యేలను కూర్చొబెట్టుకొని అంబేద్కర్ సూక్తులు మాట్లాడటం సిగ్గుచేటు. 🔹 బీఆర్ఎస్ పదేండ్ల కాలంలో బూడిద నుంచి ఫీనిక్స్ పక్షిలాగా ఎగిరేలా చేసింది. 🔹ఆ ఫీనిక్స్ పక్షిని బూడిద చేసిన పాపం మీది. 🔹స్కాంలు తప్ప స్కీంలు ఉన్నాయా. 🔹మేడారం టెండర్లలో ఏం జరిగిందో మీ క్యాబినెట్ మంత్రి కుమార్తెనే చెప్పింది. 🔹నాసిరకం పనులతో నాలుగు రోజులకే బయటపడ్డది. 🔹గురుకులాల్లో తిండి పెట్టే దిక్కు లేదు.. అంతర్జాతీయ ప్రమాణాలతో యంగ్ ఇండియా స్కూల్స్ అంటూ ఆర్భాటాలు చేస్తున్నారు. 🔹మీ పాలనలో 167 మంది గురుకుల పిల్లలు చనిపోయారు. 🔹పెట్టుబడుల విషయంలో అవే కట్టు కథలు. 🔹ఏ కంపెనీ, ఎన్ని ఉద్యోగాలు, ఎంత పెట్టుబడులపై శ్వేతపత్రం విడుదల చేయండి. 🔹విదేశాలకు వెళ్లింది పెట్టుబడుల కోసం కాదు అక్రమ సంపాదన భద్రపరుచుకోవడానికి. 🔹భట్టి గారేమో దేశ సగటు కన్నా తెలంగాణ జీఎస్డీపీ అధికంగా ఉంది అన్నారు. 🔹మరి రేవంత్ రెడ్డి రాష్ట్రం దివాళా తీసింది అంటడు. 🔹వంద రోజుల్లో చేస్తానన్న ఆరు గ్యారెంటీలు ఎందుకు అమలు చేయడం లేదు. 🔹మూడుసార్లు రైతు బంధు ఎగ్గొట్టినందుకు సీఎం ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. 🔹ఆరు గ్యారెంటీల విషయంలో గతేడాది రూ. 56 వేల కోట్లు పెడితే, ఈ బడ్జెట్‌లో రూ. 50 వేల కోట్లకు కుదించారు. 🔹దేశం కంటే తెలంగాణ తలసరి ఆదాయం 1.9 శాతం ఎక్కువ అన్నారు. 🔹బీఆర్ఎస్ పాలనలో 14 శాతం అయితే, కాంగ్రెస్ పాలనలో 10 శాతం.. నాలుగు శాతం తగ్గింది. 🔹మా పాలనలో జీఎస్డీపీ వృద్ధి రేటు 12.5 శాతం ఉంటే, కాంగ్రెస్ పాలనలో 10.7 శాతానికి తగ్గింది. 🔹పాలనలో మీరు ఫెయిల్ అయ్యారు.. హైడ్రా కూల్చివేతల వల్ల, మీ మూర్ఖత్వం వల్ల అభివృద్ది ఆగిపోయింది. 🔹మాటల్లో గట్టి పలుగులు చేతల్లో ఉట్టి పలుగులు భట్టి గారు. 🔹జీఎస్డీపీలో డౌన్, తలసరి ఆదాయం వృద్ధిలో డౌన్. 🔹క్యూర్, ప్యూర్, రేర్ కాదు.. చోర్ మోడల్, గోల్‌మాల్ మోడల్. 🔹మూడు ముక్కల ఆట గురించే ప్రసంగంలో చెప్పారు కానీ, ఆరు గ్యారెంటీల గురించి లేదు. 🔹భూముల మీద ఉన్న ప్రేమ, ప్రజల మీద లేదు. 🔹తెలంగాణను మూడు ముక్కలు చేశారు, జీహెచ్ఎంసీని మూడు ముక్కలు చేశారు. 🔹కూల్చడం మీద ఉన్న ప్రేమ నిర్మాణం మీద లేదు.. చేతగానితనాన్ని ఒప్పుకున్నరు. 🔹పారిశ్రామికవేత్తల తలకు తుపాకులు పెట్టి అక్రమ వసూళ్లు చేస్తే పెట్టుబడుదారులు వస్తరా?
Mission Telangana tweet media
తెలుగు
1
4
4
174
Mission Telangana
Mission Telangana@MissionTG·
రెండున్నరేళ్ల పాలనలో చెప్పుకోదగ్గ పనులు ఏమిలేక ఏఐ ఫోటోలు, గ్రాఫిక్స్‌తో సోషియో ఎకనామిక్ ఔట్‌లుక్ కవర్ పేజీని నింపిన కాంగ్రెస్ ప్రభుత్వం.
Mission Telangana tweet media
తెలుగు
0
4
9
369
Mission Telangana
Mission Telangana@MissionTG·
సిద్దిపేట జిల్లాలోని చింతమడకలో ఈ నెల 25, 27న జరిగే శ్రీ పట్టాభి సీతారామచంద్ర స్వామి నూతన ధ్వజస్తంభ ప్రతిష్ట మరియు శ్రీరామనవమి వేడుకలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ఆహ్వానించిన ఆలయ కమిటీ సభ్యులు.
Mission Telangana tweet media
తెలుగు
0
3
7
119
Mission Telangana
Mission Telangana@MissionTG·
బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన చేసిన బ్రేక్‌ఫాస్ట్ పథకం ఆపేసి, ఇప్పుడు మళ్లీ ఏదో కొత్తగా వాళ్లే తెచ్చినట్లు డబ్బా కొట్టుకుంటున్నారు. టిమ్స్ సనత్‌నగర్ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి ఇప్పటికే ఐదు తేదీలు మార్చారు. మొత్తానికి ఈ బడ్జెట్ అన్ని వర్గాల ప్రజలను నిరాశపరిచిన బడ్జెట్, దగాకోరు బడ్జెట్, పేదలను వంచించిన బడ్జెట్, ఆరు గ్యారంటీలను పాతరేసిన బడ్జెట్. - అసెంబ్లీ మీడియా హల్‌లో మాజీ మంత్రి హరీష్ రావు
Mission Telangana@MissionTG

బీఆర్ఎస్ హయంలో ఉన్న పథకాలు ఇప్పటికే ఎత్తేసి, మళ్ళీ అలాంటి పథకాలే తెస్తామని 2026 బడ్జెట్‌లో గొప్పగా చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం. 👉 కేసీఆర్ హయాంలో ప్రారంభించిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని బంద్ పెట్టిన కాంగ్రెస్ సర్కార్. 👉 మళ్ళీ అదే పథకాన్ని కొత్తగా తెస్తున్నామని గొప్పగా చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం. 👉 కేసీఆర్ ప్రవేశపెట్టిన రూ. 5 లక్షల రైతు బీమా పథకాన్ని ఆపేసిన కాంగ్రెస్ సర్కార్. 👉 మళ్ళీ అలాంటి పథకాన్నే ఇందిరమ్మ జీవిత బీమా పేరుతో తెస్తామని బొంకుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం.

తెలుగు
0
3
5
208
Mission Telangana
Mission Telangana@MissionTG·
ఓట్లేసిన ప్రజలను వెన్నుపోటు పొడిచారు.. అన్ని వర్గాల ప్రజలకు మొండి చెయ్యి చూపించారు. ఈ బడ్జెట్‌లో సకల జనులకు దక్కింది గుండుసున్నా. హైదరాబాద్‌ను మూడు ముక్కలు చేయడం తప్ప బడ్జెట్‌లో విజన్ లేదు. - అసెంబ్లీ మీడియా హల్‌లో మాజీ మంత్రి హరీష్ రావు
తెలుగు
0
4
8
172
Mission Telangana
Mission Telangana@MissionTG·
🔷 అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన ఎమ్మెల్యే కేపీ వివేకానంద 👇 🔹ఈ బడ్జెట్‌లో అన్ని వర్గాల ప్రజలకు చెవిలో పూలు పెట్టారు. 🔹హైదరాబాద్ ప్రజలను వంచించారు. 🔹రాష్ట్రానికి ఎక్కువ ఆదాయం వచ్చేదే హైదరాబాద్ నుంచి. 🔹హైదరాబాద్ నూతన కార్పొరేషన్లకు ఒక్క రూపాయి బడ్జెట్‌లో పెట్టలేదు. 🔹హైదరాబాద్‌లో స్కేర్ ఫీట్‌కి 100 నుంచి 200 రూపాయలు వసూలు చేసి ఢిల్లీకి పంపుతున్నారు. 🔹హైదరాబాద్‌లో విలువైన భూములపై కన్నేశారు. 🔹హైదరాబాద్ తాగునీటి సమస్యపై బడ్జెట్‌లో ప్రస్తావనే లేదు. 🔹కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ మహా నగరాన్ని ఎంతో అభివృద్ధి చేశాము. 🔹రాష్ట్ర జనాభాలో హైదరాబాద్‌లో నివసించే జనాభా 50 శాతం పైగా ఉంటుందని చెప్పి, బడ్జెట్‌లో ఒక్క రూపాయి కేటాయించలేదు. 🔹కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సేకరించిన ఫార్మా సిటీ భూములను పప్పు బెల్లాల్లా అమ్ముతున్నారు. 🔹హైదరాబాద్ ప్రజల చెవుల్లో పూలు పెట్టారు.
తెలుగు
0
4
13
222
Mission Telangana
Mission Telangana@MissionTG·
🔷 అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ 👇 🔹ఈ బడ్జెట్‌లో స్కీమ్‌లు మరిచి, స్కాంలకు తెరలేపారు 🔹బీసీలకు నిధులు కేటాయించకుండా గొంతు కోశారు. 🔹కళ్యాణ లక్ష్మీతో తులం బంగారం వస్తుంది అని అందరు భావించారు. 🔹ఈ బడ్జెట్ చూసిన తర్వాత ప్రభుత్వ డొల్లతనం మొత్తం బయటపడింది. 🔹దళితులకు కేటాయించే బడ్జెట్‌ను కుదించారు, దళితులను మోసం చేశారు. 🔹బడుగు బలహీనవర్గాల హక్కులను కాలరాశారు. 🔹రాబోయే రోజుల్లో బడుగు బలహీనవర్గాలు కాంగ్రెస్ పార్టీని గద్దె దించడం ఖాయం.
తెలుగు
0
5
17
310
Mission Telangana
Mission Telangana@MissionTG·
అసెంబ్లీ నుండి ‌వాకౌట్ చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. చెవిలో పూలు పెట్టుకొని వాకౌట్ చేసిన ఎమ్మెల్యేలు. బీఆర్ఎస్ సభ్యుల ఆందోళనతో దద్దరిల్లిన శాసనసభ ప్రాంగణం. తులం బంగారం మోసం మోసం, రెండు లక్షల ఉద్యోగాలు మోసం మోసం, బడ్జెట్ మోసం మోసం అంటూ నినాదాలు చేస్తూ శాసనసభ ఎంట్రీ వద్ద ధర్నా చేపట్టిన బీఆర్ఎస్ సభ్యులు.
తెలుగు
1
16
39
1.6K
Mission Telangana
Mission Telangana@MissionTG·
బీఆర్ఎస్ హయంలో ఉన్న పథకాలు ఇప్పటికే ఎత్తేసి, మళ్ళీ అలాంటి పథకాలే తెస్తామని 2026 బడ్జెట్‌లో గొప్పగా చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం. 👉 కేసీఆర్ హయాంలో ప్రారంభించిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని బంద్ పెట్టిన కాంగ్రెస్ సర్కార్. 👉 మళ్ళీ అదే పథకాన్ని కొత్తగా తెస్తున్నామని గొప్పగా చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం. 👉 కేసీఆర్ ప్రవేశపెట్టిన రూ. 5 లక్షల రైతు బీమా పథకాన్ని ఆపేసిన కాంగ్రెస్ సర్కార్. 👉 మళ్ళీ అలాంటి పథకాన్నే ఇందిరమ్మ జీవిత బీమా పేరుతో తెస్తామని బొంకుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం.
Mission Telangana tweet mediaMission Telangana tweet media
తెలుగు
0
9
17
1.6K
Mission Telangana
Mission Telangana@MissionTG·
🔷 బాకీ కార్డులతో కాంగ్రెస్ మోసాన్ని ఎండగట్టిన బీఆర్ఎస్ 🔷 ఆరు గ్యారెంటీల అమలు వైఫల్యంపై బీఆర్ఎస్ నిరసన 🔷 ఆరు గ్యారెంటీల అమలు విషయంలో కాంగ్రెస్ మోసాన్ని అసెంబ్లీలో ఎండగడతాం: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 👇 🔹గన్‌పార్క్ వద్ద భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు కలిసి కాంగ్రెస్ ప్రభుత్వ హామీల వైఫల్యంపై ప్లకార్డులతో నిరసన చేపట్టారు. 🔹బాకీ కార్డులు ప్రదర్శిస్తూ ప్రజలను మోసం చేసిన విధానాన్ని బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు ఎండగట్టారు. 🔹ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయకుండా తెలంగాణను ఆగం చేశారని తీవ్ర ఆరోపణలు చేశారు. 🔹దివ్యాంగులకు బాకీపడ్డ రూ. 54,000 ఎక్కడ అని నిలదీశారు. 🔹నిరుద్యోగులకు హామీ ఇచ్చిన రెండు లక్షల ఉద్యోగాలు ఎక్కడ? నిరుద్యోగ భృతి ఏమైంది? అంటూ ప్రశ్నించారు. 🔹ఆటో డ్రైవర్లకు ఇస్తామని చెప్పిన రూ. 24,000లో, సంవత్సరానికి రూ. 12,000 చొప్పున రెండు సంవత్సరాలుగా బాకీ ఉందని విమర్శించారు. 🔹వృద్ధులకు ఇవ్వాల్సిన నెలకు రూ. 4,000 చొప్పున మొత్తం రూ. 54,000 బాకీ ఎక్కడ అని ప్రశ్నించారు. 🔹పేదింటి ఆడబిడ్డలకు ఇస్తామని చెప్పిన తులం బంగారం ఏమైందని నిలదీశారు. 🔹తెలంగాణ రాష్ట్ర సంపాదనను దోచుకుంటూ రాష్ట్ర ప్రజలను గాలికి వదిలేసిందని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. 🔹ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, “మేము అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి, ‘అభయహస్తం’ మేనిఫెస్టోతో ప్రజలను నమ్మబలికి ఓట్లు దక్కించుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం, ఇవాళ మూడో బడ్జెట్ ప్రవేశపెడుతున్నప్పటికీ ఆ హామీలకు చట్టబద్ధత కల్పించకుండా, నిధులు కేటాయించకుండా ప్రజలను వంచిస్తోంది. ఈ మోసాన్ని నిలదీయడానికే అమరవీరుల స్తూపం సాక్షిగా ఈ నిరసన చేపట్టాం” అని అన్నారు. 🔹“జేమ్స్ బాండ్‌ల మాదిరిగా బాండ్ పేపర్లు రాసిచ్చి, 100 రోజుల్లో హామీలు అమలు చేస్తామని చెప్పి ప్రజలను మోసం చేశారు. ఇప్పుడు మూడో బడ్జెట్‌లో కూడా ‘గ్యారెంటీ’ అన్న మాట లేకుండా, ‘డిక్లరేషన్’ అన్న మాట లేకుండా ప్రతి వర్గాన్ని వంచిస్తున్నారు” అని కేటీఆర్ విమర్శించారు. 🔹కేటీఆర్ ప్రభుత్వంపై పలు కీలక అంశాలపై ప్రశ్నలు లేవనెత్తారు. బలహీన వర్గాలకు లక్ష కోట్ల బడ్జెట్ ఇస్తామని చెప్పి, మూడు బడ్జెట్లు కలిపినా 20 వేల కోట్లకు మించకుండా కేటాయించడాన్ని ప్రశ్నించారు. వృద్ధులు, వితంతువులు ఎదురుచూస్తున్న రూ. 4,000 పెన్షన్ ఎప్పుడు ఇస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. 🔹మహిళలకు 18 ఏళ్లు నిండిన కోటి 58 లక్షల మందికి ఇస్తామని చెప్పిన రూ. 2,500 మహాలక్ష్మి పథకం ఏమైందని ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 5 లక్షల దివ్యాంగులకు రూ. 6,000 పెన్షన్ హామీ అమలు చేయాలన్నారు. 🔹రైతులకు రైతు భరోసా పేరుతో రూ. 15,000 ఇస్తామని చెప్పి, ఇప్పటికే ఉన్న రైతుబంధునే అమలు చేయడంలో విఫలమయ్యారని విమర్శించారు. సంక్రాంతికి రావాల్సిన డబ్బులు ఉగాది దాటినా రాకపోవడం ప్రభుత్వ వైఫల్యమని అన్నారు. 🔹ఉద్యోగాల విషయంలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కేవలం 11,900 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారని, ఇది యువతను మోసం చేయడమేనని పేర్కొన్నారు. 🔹“మీరు రాసిచ్చిన బాండ్ పేపర్లు ఇవాళ నీటి మీద రాతలైపోయాయి. శాసనసభ, శాసనమండలి సమావేశాల్లో ప్రతి అడుగునా రాష్ట్ర ప్రజల తరపున మిమ్మల్ని నిలదీస్తాం. హామీలు నిలబెట్టుకోకపోతే వదిలిపెట్టే ప్రసక్తే లేదు” అని కేటీఆర్ హెచ్చరించారు.
తెలుగు
0
9
22
320
Mission Telangana
Mission Telangana@MissionTG·
100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని బాండ్ పేపర్లు ఇచ్చి, గ్యారంటీ కార్డులు పంచి, గెలిచాక అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ వంచించింది. - గన్‌పార్క్ వద్ద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
తెలుగు
0
6
14
208
Mission Telangana
Mission Telangana@MissionTG·
గన్‌పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నిరసన. ఆరు గ్యారంటీల అమలుపై నిర్లక్ష్యం వహిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిపై నిరసన తెలిపిన బీఆర్ఎస్ నాయకులు.
తెలుగు
0
3
12
198
Mission Telangana
Mission Telangana@MissionTG·
🔷 అసెంబ్లీలోని బీఆర్‌ఎస్‌ఎల్‌పీ కార్యాలయంలో మీడియాతో చిట్‌చాట్ నిర్వహించిన మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు 🔷 రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణంలో జరుగుతున్న భారీ కుంభకోణాన్ని బయటపెట్టిన హరీష్ రావు 👇 🔹రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 76 ఇంటిగ్రేటెడ్ స్కూళ్లకు టెండర్లు పూర్తి చేయగా, అందులో ఒక్కటంటే ఒక్కటి కూడా బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలున్న 26 నియోజకవర్గాలకు ఇవ్వలేదు. 🔹కక్షపూరితంగానే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు స్కూళ్లు మంజూరు చేయలేదు. 🔹కానీ, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన 10 మంది పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు, అలాగే కొందరు బీజేపీ ఎమ్మెల్యేలకు మాత్రం స్కూళ్లు కేటాయించారు. 🔹ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల టెండర్లలో భారీ అవినీతి జరుగుతోంది. 🔹కాంట్రాక్టర్లు ఆర్గనైజ్డ్ రింగ్‌గా అయ్యి పనులను పంచుకుంటున్నారు. 🔹76 స్కూళ్లకు సంబంధించిన ప్రతి టెండర్‌కు ఎక్సెస్‌ ధర కోట్ చేసి దక్కించుకున్నారు. 🔹టెండర్లలో కనిష్టంగా 4.59% నుంచి గరిష్టంగా 4.96% ఎక్సెస్‌తో, నిబంధనల ప్రకారం 5% దాటకుండా పక్కా ప్లాన్‌తో కొల్లగొట్టారు. 🔹ఒక్కో స్కూలుకు రూ. 250 కోట్లు కేటాయించగా, అందులో సివిల్ వర్క్స్ కోసమే సుమారు రూ. 150 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారు. 🔹76 స్కూళ్లకు సంబంధించి ప్రభుత్వ అంచనా వ్యయం రూ. 10,199.54 కోట్లు కాగా, కాంట్రాక్టర్లు దాన్ని రూ. 10,693.55 కోట్ల ఎక్సెస్‌తో దక్కించుకున్నారు. 🔹అంటే కేవలం ఈ టెండర్ల ద్వారా సుమారు రూ. 494 కోట్లు ప్రజాధనాన్ని అదనంగా దోచిపెడుతున్నారు. 🔹ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ తో పాటు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నియోజకవర్గం మధిరలో అత్యధికంగా 4.95% ఎక్సెస్ ధరకు టెండర్లు కేటాయించడం పలు అనుమానాలకు కలిగిస్తున్నాయి. 🔹డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నియోజకవర్గంలో 4.95 ఎక్సెస్. 🔹మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గం హుజూర్‌నగర్‌లో 4.95% ఎక్సెస్‌కు టెండర్ ఇచ్చారు. 🔹మంత్రి పొన్నం ప్రభాకర్ నియోజకవర్గం హుస్నాబాద్‌లో 4.95% ఎక్సెస్‌కు టెండర్ ఇచ్చారు. 🔹మంత్రి జూపల్లి కృష్ణారావు నియోజకవర్గం కొల్లాపూర్‌లో 4.77% ఎక్సెస్‌కు టెండర్ ఇచ్చారు. 🔹మంత్రి కొండా సురేఖ నియోజకవర్గం వరంగల్ ఈస్ట్‌లో 4.99% ఎక్సెస్‌కు టెండర్ ఇచ్చారు. 🔹మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నియోజకవర్గం నల్గొండలో 4.87% ఎక్సెస్‌కు టెండర్ ఇచ్చారు. 🔹మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నియోజకవర్గం ఖమ్మంలో 4.95% ఎక్సెస్‌కు టెండర్ ఇచ్చారు. 🔹మంత్రి సీతక్క నియోజకవర్గం ములుగులో 4.95% ఎక్సెస్‌కు టెండర్ ఇచ్చారు. 🔹మంత్రి దామోదర రాజనర్సింహ నియోజకవర్గం ఆందోల్‌లో 4.99% ఎక్సెస్‌కు టెండర్ ఇచ్చారు. 🔹స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నియోజకవర్గం వికారాబాద్‌లో 4.80% ఎక్సెస్‌కు టెండర్ ఇచ్చారు. 🔹మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు నియోజకవర్గం మంథనిలో 4.89% ఎక్సెస్‌కు టెండర్ ఇచ్చారు. 🔹సీఎం రేవంత్ రెడ్డి వాడుతున్న వాహనం కేఎల్ఎస్ఆర్ కంపెనీ పేరు మీదనే ఉంటుంది. 🔹ఆశ్చర్యకరంగా ముఖ్యమంత్రి నియోజకవర్గంతో పాటు ఏకంగా 9 స్కూళ్ల టెండర్లను ఈ ప్రభుత్వం అదే కేఎల్ఎస్ఆర్ సంస్థకు కట్టబెట్టింది. 🔹మంత్రుల నియోజకవర్గాల్లోనే ఎక్కువ ధరకు టెండర్లు ఖరారు కావడం ఈ కుంభకోణానికి నిదర్శనం. 🔹నాడు కేసీఆర్ గారి పదేళ్ల పాలనలో అభివృద్ధి, సంక్షేమం విషయంలో ఏనాడూ రాజకీయ పక్షపాతం చూపలేదు. 🔹రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు సమానంగా ప్రాధాన్యత ఇచ్చారు. 🔹మిషన్ కాకతీయ మొదటి దశ నుంచే, మిషన్ భగీరథ, బీసీ, మైనార్టీ గురుకులాలు ఇలా ఏ పథకమైనా 119 నియోజకవర్గాలకు సమానంగా ఇచ్చారు. 🔹మెడికల్ కాలేజీలను అన్ని జిల్లాలకు ఇస్తూ, నేటి కాంగ్రెస్ మంత్రి సీతక్క ప్రాతినిధ్యం వహిస్తున్న ములుగు నియోజకవర్గానికి కూడా ఇచ్చాం. 🔹దళితబంధు లాంటి గొప్ప పథకాన్ని ప్రతిపక్ష నేతగా ఉన్న భట్టి విక్రమార్క నియోజకవర్గమైన మధిర, చింతకాని నుంచే పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించిన ఘనత కేసీఆర్ గారిది. 🔹అభివృద్ధిని సమానంగా చూసిన బీఆర్ఎస్ ఎక్కడ? 🔹కేవలం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారన్న అక్కసుతో 26 నియోజకవర్గాలకు స్కూళ్లను ఆపేసిన మీరెక్కడ? 🔹ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణంలో జరిగిన ఈ వందల కోట్ల టెండర్ల కుంభకోణంపై శాసనసభలో ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తాం. 🔹నా దగ్గర ఈ స్కామ్‌కు సంబంధించి ఇంకా పూర్తి ఆధారాలు, వివరాలు ఉన్నాయి. వాటన్నింటినీ అసెంబ్లీ సమావేశాల్లో సభ సాక్షిగా బయటపెడతాను.
Mission Telangana tweet media
తెలుగు
0
8
20
467
Mission Telangana
Mission Telangana@MissionTG·
🔷 తెలంగాణ భవన్‌లో నిర్వహించిన శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు, పంచాంగ శ్రవణంలో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఇతర నాయకులు 🔷 ప్రభుత్వ వైఫల్యాలతో ప్రతిపక్షానికి బలం పెరుగుతుందన్న పండితుల అభిప్రాయం 🔷 ప్రభుత్వంలో ఉన్న లోటుపాట్లు, పాలనా వైఫల్యాలు కొనసాగితే ప్రజల్లో అసంతృప్తి పెరిగి, ప్రతిపక్షానికి గణనీయంగా బలం చేకూరే అవకాశం 🔷 ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైతే, ప్రత్యామ్నాయ శక్తిగా ప్రతిపక్షం ఎదిగే పరిస్థితులు 🔷 విద్యా విధానంలో జరుగుతున్న మార్పులు విద్యార్థులకు నష్టాన్ని కలిగించే ప్రమాదం 🔷 యువత పక్కదారి పట్టే అవకాశం ఉందని ఆందోళన 🔷 ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకపోతే నిరుద్యోగం మరింత పెరిగే అవకాశం 🔷 ఈ సంవత్సరం మంచి వర్షాలు కురిసే సూచనలు, సమృద్ధిగా పంటలు పండే అవకాశం 👇 🔹తెలంగాణ భవన్‌లో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా నిర్వహించిన పంచాంగ శ్రవణ కార్యక్రమంలో కేటీఆర్, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు, ఎంపీలు మరియు పార్టీ సీనియర్ నాయకులతో కలిసి పాల్గొన్నారు. 🔹ఈ సందర్భంగా సంప్రదాయ పూజా కార్యక్రమాలు నిర్వహించగా, అనంతరం పంచాంగ శ్రవణం ప్రారంభమైంది. 🔹ప్రముఖ పండితులు మృత్యుంజయ శర్మ, ఫణీంద్ర శర్మ పంచాంగ శ్రవణం చేసి, ఈ ఏడాది పరిస్థితులపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. 🔹పండితుల ప్రకారం, ప్రభుత్వంలో ఉన్న లోటుపాట్లు, పాలనా వైఫల్యాలు కొనసాగితే ప్రజల్లో అసంతృప్తి పెరిగి, ప్రతిపక్షానికి గణనీయంగా బలం చేకూరే అవకాశం ఉందని పేర్కొన్నారు. 🔹ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైతే, ప్రత్యామ్నాయ శక్తిగా ప్రతిపక్షం ఎదిగే పరిస్థితులు ఏర్పడతాయని స్పష్టం చేశారు. 🔹విద్యా విధానంలో జరుగుతున్న మార్పులు విద్యార్థులకు నష్టాన్ని కలిగించే ప్రమాదం ఉందని, యువత పక్కదారి పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. 🔹ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకపోతే నిరుద్యోగం మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. 🔹అంతర్జాతీయంగా విదేశీ శక్తుల కుట్రలను మన దేశ సైనికులు సమర్థవంతంగా ఎదుర్కొంటారని, అయితే ఇరుగుపొరుగు దేశాలతో కొన్ని ఉద్రిక్తతలు లేదా ఘర్షణలు చోటు చేసుకునే అవకాశముందని పేర్కొన్నారు. 🔹వ్యవసాయ రంగంలో ఈ సంవత్సరం మంచి వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని, చెరువులు, జలాశయాలు నిండిపోతాయని తెలిపారు. 🔹ధాన్యం, పత్తి, మక్క వంటి పంటలు బాగా పండే అవకాశం ఉందని, రైతుల ఆత్మహత్యలు తగ్గే సూచనలు ఉన్నాయని చెప్పారు. 🔹అయితే బంగారం, వెండి, ఆహార ధాన్యాల ధరలు పెరిగే అవకాశం ఉందని, కూరగాయల ధరలు కొంతవరకు తగ్గవచ్చని తెలిపారు. 🔹అగ్ని ప్రమాదాలు, వాహన ప్రమాదాలు, దొంగతనాలు ఎక్కువగా జరిగే అవకాశముందని కూడా హెచ్చరించారు. పశుసంపద అభివృద్ధి గణనీయంగా ఉంటుందని పేర్కొన్నారు. 🔹ఉన్నత పదవుల్లో మహిళలకు మరిన్ని అవకాశాలు లభించే అవకాశం ఉందని తెలిపారు. 🔹కొన్ని ప్రాంతాల్లో తుఫానులు, భూకంపాలు వంటి ప్రకృతి విపత్తులు సంభవించే అవకాశం ఉన్నప్పటికీ, పాలకులు వాటిని సమర్థంగా ఎదుర్కొనే అవకాశముందని చెప్పారు. 🔹పంజాబ్ రాష్ట్రంలో ప్రకృతి ప్రకోపాలు ఉండే సూచనలు ఉన్నాయని పేర్కొన్నారు. రైలు, విమాన, రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని, సినీ మరియు రాజకీయ రంగాలకు చెందిన కొంతమంది ప్రముఖులు కనుమరుగయ్యే అవకాశముందని కూడా తెలిపారు. 🔹ప్రజలు మానసికంగా కొంత ఒత్తిడిని ఎదుర్కొనే పరిస్థితులు ఉండవచ్చని పేర్కొన్నారు. ఈ ఏడాది సూర్యగ్రహణం, చంద్రగ్రహణం ప్రభావం భారతదేశంపై పెద్దగా ఉండదని పండితులు వెల్లడించారు.
Mission Telangana tweet mediaMission Telangana tweet mediaMission Telangana tweet mediaMission Telangana tweet media
తెలుగు
0
2
8
256
Mission Telangana
Mission Telangana@MissionTG·
తెలంగాణ భవన్‌లో నిర్వహించిన శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకల్లో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఇతర నాయకులు.
తెలుగు
0
6
46
1.3K
Mission Telangana
Mission Telangana@MissionTG·
🔷 తెలంగాణ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. 🔷 మనిషిలోని చెడు లక్షణాలు పరాభవం చెంది మంచితనం విజయం సాధించాలి. 🔷 రాష్ట్రం పునర్వైభవాన్ని సంతరించుకుని, ప్రగతి పథాన పయనించాలి. 🔹రాష్ట్ర ప్రజలకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి , బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. 🔹వ్యవసాయ పనులను నూతనంగా పునః ప్రారంభం చేసుకునే రైతు నామ సంవత్సరంగా ఉగాది పండుగ ప్రత్యేకతను సంతరించుకున్నదని అన్నారు. 🔹ప్రకృతి మాత శిశిరాన్ని వీడి, కొత్త చిగురులతో వసంతాన్ని ఆహ్వానిస్తూ, నూతన ఆశలకు, సంకల్పాలకు నాంది పలుకుతుందని, ఉగాది నుండి కాలచక్రం పునరావృతమౌతుందని కేసీఆర్ తెలిపారు. 🔹ద్వేష భావనలు, అహంకారం, తదితర చెడు లక్షణాలు పరాభవం చెంది వాటి స్థానంలో ఉన్నతమైన ఆశయాలు వృద్ధి చెంది, మనిషి సమున్నతమైన మార్గాన్ని అనుసరించాలనే తాత్వికతను శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది మనకు తెలియజేస్తుందని కేసీఆర్ తెలిపారు. 🔹రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలు, నష్టాలు సమస్యలు పరాభవం చెంది అందరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆరోగ్యం, ఐశ్వర్యం నిండి రాష్ట్రం పునర్వైభవం సాధించి విజయం వైపు సాగాలని కేసీఆర్ ఆకాంక్షించారు.
Mission Telangana tweet media
తెలుగు
0
2
20
246