PROHMWSSB retweetledi

జలమండలి ఈడీ బాధ్యతల స్వీకరణ
==============
జలమండలి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా మయాంక్ మిట్టల్ బాధ్యతలు స్వీకరించారు. నారాయణపేట జిల్లా అదనపు కలెక్టర్ గా పనిచేస్తున్న ఆయన్ను.. రాష్ట్రప్రభుత్వం వాటర్ బోర్డుకు ఈడీగా బదిలీ చేసింది. ఈ నేపథ్యంలోనే బుధవారం ఆయన ఖైరతాబాద్ లోని ప్రధాన కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. అంతకు ముందు ఎండీ అశోక్ రెడ్డిని ఆయన ఛాంబర్ లో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎండీ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. జలమండలి ఉన్నతాధికారులు, ఉద్యోగులు సైతం నూతన ఈడీకి పుష్ప గుచ్ఛాలతో స్వాగతం పలికారు. మయాంక్ మిట్టల్ ఐఏఎస్-2020 బ్యాచ్ కి చెందిన అధికారి.


తెలుగు












































