గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రతి 50 కుటుంబాలకు ఒక వలంటీరును నియమించి.. అర్హత గల ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అందిస్తున్నారు - పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
తిరుపతి ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం చేస్తున్నాం. ప్రజలు కూడా వాడవాడలా వైఎస్సార్సీపీ అభ్యర్థికి బ్రహ్మరథం పడుతున్నారు. ఇందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిపాలనే కారణం - పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో ప్రజా తీర్పు ఏకపక్షంగా ఉంటుంది. వైఎస్సార్సీపీ అభ్యర్థి గురుమూర్తి బంపర్ మెజార్టీ సాధిస్తారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేస్తున్న సంక్షేమాభివృద్ధే ఫలితాన్ని నిర్దేశిస్తుంది - పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నికకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి నెల్లూరు కలెక్టరేట్లో నామినేషన్ వేశారు. వైఎస్సార్సీపీ ముఖ్యనేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలతో ర్యాలీగా గురుమూర్తి కలెక్టరేట్కు చేరుకొని మూడు సెట్ల నామినేషన్ దాఖలు చేశారు.
రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే చంద్రబాబు గోదావరి పుష్కరాల కోసం రూ.3 వేల కోట్లు ఖర్చు పెట్టారు. ఆ నిధులను పూర్తిగా దుర్వినియోగం చేశారు. గోదావరి పుష్కరాల ఘటనపై విచారణ చేయించాలి - మల్లాది విష్ణు
గోదావరి పుష్కరాల సమయంలో 29 మంది చనిపోవడానికి చంద్రబాబు కారణం. లక్షలాది మంది భక్తులు వచ్చినప్పుడు కనీసం జాగ్రత్తలు తీసుకోలేదు. పైగా భక్తుల తొక్కిసలాట వల్లే ప్రమాదం జరిగిందని గత టీడీపీ ప్రభుత్వం సమర్ధించుకుంది. ఈ ఘటనకు సోమయాజులు కమిషన్ నివేదనకు పట్టించుకోలేదు - జక్కంపూడి రాజా
చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చితోనే గోదావరి పుష్కరాల్లో 29 మంది భక్తులు చనిపోయారు. పర్యాటక శాఖ ద్వారా నేషనల్ జియో గ్రాఫిక్ ఛానల్కు రూ. 64 లక్షలతో డాక్యుమెంటరీ చిత్రీకరించే యత్నం చేశారు. బోయపాటి శీనుతో ఆ షూట్ చేశారు - జక్కంపూడి రాజా
పుష్కరాల సమయంలో చంద్రబాబు ఎందుకు సామాన్య ఘాట్లో పుష్కర స్నానం చేయాల్సి వచ్చింది? అంత పెద్ద ఘటన జరిగిన కూడా కనీసం ఒక్కరిపై చర్యలు తీసుకోలేదు. 29 మంది మరణానికి కారణమైన వారికి శిక్ష తప్పదు. గోదావరి పుష్కరాల ఘటనపై సభాసంఘం వేయాలి. అసలైన దోషులను గుర్తించాల్సిన అవసరం ఉంది - జోగి రమేష్
గోదావరి పుష్కరాల సమయంలో 29 మంది భక్తులు చనిపోవడానికి కారణమేవరు? దర్శకుడు బోయపాటి శ్రీనును అక్కడ షూటింగ్ చేయమని ఎవరు చెప్పారు? బోయపాటిని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు షూటింగ్ చేయమన్నారా? లేక బోయపాటినే సినిమా షూటింగ్ చేశారా? అనేది టీడీపీ సమాధానం చెప్పాలి - జోగి రమేష్
పుష్కరాల పేరిట గత ప్రభుత్వం కొన్ని వేల కోట్ల రూపాలయను మంచి నీళ్లలా ఖర్చు పెట్టింది. గోదావరి పుష్కరల్లో 29 మంది అమాయకపు భక్తులు చనిపోవడానికి కారణం టీడీపీ ప్రభుత్వమే. గోదావరి, కృష్ణా పుష్కరాల్లో వేలాది కోట్ల కుంభకోణం జరిగింది - జోగి రమేష్
అన్నదాతల ఆపద్బాంధవుడు దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని రైతు దినోత్సవంగా నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇక ప్రతి ఏటా వైఎస్ జయంతి అయిన జూలై 8వ తేదీన రైతు దినోత్సవం నిర్వహిస్తామని సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు.
రాష్ట్ర వ్యాప్తంగా 42 పరిశ్రమల ఏర్పాటుకు సమస్యలు ఉన్నాయని ప్రభుత్వ దృష్టికి వచ్చింది. కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై ప్రస్తుత పరిస్థితిని పరిశీలిస్తున్నాము. ప్రత్యేక హోదా ఏపీ హక్కు. హోదా వస్తే పరిశ్రమలకు రాయితీ వస్తుంది. హోదా వచ్చే వరకూ మా పోరాటాన్ని కొనసాగిస్తాము - గౌతమ్రెడ్డి
గ్రామీణ ప్రాంతాల్లోని యువతీ యువకులకు ఉద్యోగాలు కల్పించేలా బీపీఓలను గ్రామస్థాయికి విస్తరిస్తాం. గత ప్రభుత్వంలో రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమలు వాస్తవమైనవా కాదా అని పరిశీలిస్తాము. జన్యూన్ ఇండ్రస్టీస్కు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తాము - గౌతమ్రెడ్డి
ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్గా గుంటూరు జిల్లా బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కోన రఘుపతి ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో డిప్యూటీ స్పీకర్గా ఎన్నికైనట్లు స్పీకర్ తమ్మినేని సీతారం అధికారికంగా ప్రకటించారు.