Sabitlenmiş Tweet
AadiSrinivas
140 posts

AadiSrinivas
@aadisrinivasmla
Government Whip Telangana | MLA-Vemulawada. President-DCC Rajanna sircilla.
vemulawada Katılım Nisan 2024
9 Takip Edilen343 Takipçiler
AadiSrinivas retweetledi

వేములవాడ అర్బన్ మండలం అగ్రహారం గ్రామంలోనీ శ్రీ కన్వెన్షన్ లో నిర్వహించిన పట్టభద్రల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శి పి. విశ్వనాథన్, బీసీ సంక్షేమ శాఖ రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్, జిల్లా గ్రంధాలయ చైర్మన్ నాగులసత్యనారాయణ,కరీంనగర్ పార్లమెంట్ ఇంచార్జి వెలిచాల రాజేందర్ రావు, వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల కో ఆర్డినేటర్ నర్సారెడ్డి భూపతిరెడ్డి, సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కేకే మహేందర్ రెడ్డి గార్లతో కలసి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు పాల్గొన్నారు
#MLCelections2025 #graduate




తెలుగు

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం హన్మాజీపేట గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, హన్మాజీపేట వజ్రోత్సవాల సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తన సందేశాన్ని తెలిపారు
#75thyeargovtschool #anniversary #Hanumajipet #vemuawada

తెలుగు

అబద్దాలు ఆడడంలో హరీష్ రావును మించిన వారు ఎవరూ లేరు..
ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను చూస్తూ ఓర్వలేక ప్రభుత్వం పై మూడు నెలల నుండి విమర్శలు చేస్తున్నారు..
బాబా బామ్మర్దులు ఒకరిపై మరొకరు పై చేయి సాధించడానికి లేనిపోని ఆరోపణలు చేస్తూ ప్రజలకు కల్లి బోల్లి కబుర్లు చెప్తున్నారు...
ప్రభుత్వం పై మసి పూసి మారేడు కాయ చేసినట్లుగా, బట్ట కాల్చి ప్రభుత్వంపై వేసే విధంగా హరీష్ రావు, కేటీఆర్, ఈమధ్య కవిత కూడా వీళ్లకు తోడైంది..
గత పది సంవత్సరాల మీ పరిపాలనలో రాష్ట్రాన్ని విధ్వంసం చేసి అప్పుల కుప్పగా మార్చారు..
రైతులకు రైతు భరోసా అందిస్తే చూసి ఓర్వలేక పోతున్నారు.. మీ హయాంలో రైతులకు 40 కిలోల సంచికి 44 కిలోలు జోకి రైతులను నిలువున ముంచారు..
రైతు రుణమాఫీ పై రైతులను మోసం చేశారు..
రైతులకు రైతు భరోసా అందిస్తూ మొన్నటి రోజున ఎకరం, రెండు ఎకరాలు ఇలా రైతులకు అందిస్తే అబద్దాల హరీష్ రావు ఒక దుష్ప్రచారానికి తెరలేపారు..
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం నామాపూర్ గ్రామానికి చెందిన నకీర్తి కనకవ్వ కు రైతు భరోసా విషయంలో 31 గుంటలు ఉంటే కేవలం 1650 రూపాయలు వేశారని హరీష్ రావు అబద్ధాలు మాట్లాడుతున్నారు..
నకీర్తి కనకవ్వ కు 580/బి లో 4 గుంటలు, 943/10 లో 7 గుంటలు మొత్తం 11 గుంటలు ఉంటే దానికి 1650 రూపాయలు వస్తాయి..
కావాలంటే పొత్గల్ లోని వారి బ్యాంకు ఖాతాలో ఒకసారి సరి చూసుకోగలరు..
11 గంటలు ఉంటే 33 గుంటలు ఉన్నాయని హరీష్ రావు ఒక దుష్ప్రచారం చేస్తున్నారు..
హరీష్ రావు ఒకసారి కళ్ళకు కంటి ఆపరేషన్ చేయించుకోవాలి..
దుష్ప్రచారానికి బ్రాండ్ అంబాసిడర్ గా హరీష్ రావు నిలుస్తున్నారు..
హరీష్ రావు అసెంబ్లీలో కుల గణనపై కూడా ఇలానే అనవసరపు రాద్ధాంతం చేస్తున్నాడు..
వారు చేసిన కులగణనను బయట పెట్టకుండా అటకెక్కించారు..
వారు 61 శాతం బీసీ లకు ఇచ్చామంటున్నారు తీరా చూస్తే 51 శాతమే ఉంది..
రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వంలో చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక విమర్శలు చేస్తున్నారు..
నకీర్తి కనకవ్వ రైతు భరోసా విషయంలో హరీష్ రావు చేసిన ఆరోపణలు తీవ్రంగా ఖండిస్తున్నాం..
తెలుగు

ముఖ్యమంత్రిని కలసిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు
ఇటీవల దావోస్ పర్యటనను దిగ్విజయంగా ముగించుకొని తెలంగాణ రాష్ట్రానికి దావోస్ వేదికగా రూ. 1.78 లక్షల కోట్లు పెట్టుబడులు సాధించినందుకు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారిను మంగళవారం హైదరాబాద్ లో ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారు కలిసి ధన్యవాదాలు తెలపడం జరిగింది.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోనీ తెలంగాణ ప్రభుత్వం ఒక స్పష్టమైన విధానం, నిర్దిష్టమైన ప్రణాళిక కలిగి ఉన్న కారణంగా ప్రపంచ అగ్రశ్రేణి కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయని అన్నారు..
అలాగే రాజన్న సిరిసిల్ల జిల్లాతో పాటు వేములవాడ నియోజకవర్గ పరిధిలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి గారితో ప్రభుత్వ విప్ చర్చించారు.
#reventhreddy #congress
@TelanganaCMO



తెలుగు


రుద్రంగి మండల కేంద్రంలో శంకుస్థాపనల జాతర
2 కోట్ల 3 లక్షలతో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం
రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంతోపాటు ఉమ్మడి మానాల పరిధిలో 2 కోట్ల 03 లక్షలతో నూతన సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్ ల నిర్మాణానికి గురువారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారు, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా గారు, రాష్ట్ర కో ఆపరేటివ్ ఛైర్మెన్ మానాల మోహన్ రెడ్డి గార్లతో కలసి భూమి పూజ నిర్వహించారు.
#Congress #prajapalana



తెలుగు

*లడ్డూ తయారీ కేంద్రం తనిఖీ చేసిన ప్రభుత్వ విప్, జిల్లా కలెక్టర్*
శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలోని లడ్డూ ప్రసాదం తయారీ కేంద్రాన్ని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా బుధవారం తనిఖీ చేశారు. మహాశివరాత్రి జాతర సమన్వయ సమావేశం అనంతరం విప్, కలెక్టర్, ఎస్పీ తదితరులు ఆలయంలో స్వామివారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా వారిని ఆలయ ఈవో వినోద్ రెడ్డి శాలువాలతో సన్మానించి, స్వామి వారి ప్రసాదాన్ని అందజేయగా, అర్చకులు ఆశీర్వచనం చేశారు.
అనంతరం విప్, కలెక్టర్ తదితరులు లడ్డూ ప్రసాదం తయారీ కేంద్రాన్ని పరిశీలించారు. స్టోర్ రూం, లడ్డూ తయారీకి వినియోగించే పదార్థాలు, నెయ్యి, తయారీ విధానం, పరిసరాలు తనిఖీ చేశారు. రోజు ఎంత నెయ్యి వినియోగిస్తున్నారు, ఎన్ని లడ్డూలు రోజు సిద్ధం చేస్తారు? ఎంత మంది సిబ్బంది పనిచేస్తున్నారో ఆరా తీశారు. లడ్డూ ప్రసాదం తయారీ కేంద్రాన్ని పూర్తిగా ఆధునీకరించాలని, భక్తుల సంఖ్యకు అనుగుణంగా ప్రసాదం అందేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. నాణ్యత, పరిశుభ్రత విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆదేశించారు..
#vemulawada #rajannatemple #prasadam



తెలుగు

ఆధ్యాత్మిక పట్టణంగా వేములవాడ అభివృద్ధికి చర్యలు:ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
శివరాత్రి నాటికి ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులు ప్రారంభించాలి
భక్తులకు వేగంగా దర్శనం, మంచి వసతి, ఆహ్లాదకరమైన వాతావరణం కల్పనకు కృషి
అంబేద్కర్ జంక్షన్ వద్ద కాంస్య విగ్రహం ఏర్పాటుకు చర్యలు
వేములవాడ ఆలయ అభివృద్ధి పై రివ్యూ నిర్వహించిన ప్రభుత్వ విప్
#vemulawada #temple #devolopment #srrd #congress
#congresso #aadisrinivas #mla #govtwhip



తెలుగు

నేడు సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా మహిళా ఉపాధ్యాయులందరికీ "మహిళా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు".
#SavitriBaiPhuleJayanti

తెలుగు

గోవిందరాజుల స్వామివారిని దర్శించుకున్న ప్రభుత్వ విప్
చందుర్తి మండలం సనుగుల గ్రామంలోని శ్రీ శ్రీదేవి భూదేవి సమేత గోవిందరాజుల స్వామి వారిని శుక్రవారం ప్రభుత్వ విప్,వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారు దర్శించుకున్నారు.. ఆలయ కమిటీ సభ్యులు ప్రభుత్వ విప్ కు ఘనస్వాగతం పలికారు.. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు..అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు...గోవింద రాజుల స్వామి వారి ఆశీస్సులతో ప్రజలంతా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని సకాలంలో వర్షాలు సమృద్ధిగా కురిసి రైతులు పాడిపంటలతో సంతోషంగా ఉండాలని వేడుకున్నారు...



తెలుగు

వయనాడ్ లోక్ సభ ఉప ఎన్నికలో భారీ మెజారిటీతో అఖండా విజయం సాధించిన శ్రీమతి ప్రియాంక గాంధీ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు.
@INCIndia @priyankagandhi

తెలుగు

నిర్వాసితుల నీరీక్షణ ఫలించింది
ఇండ్ల నిర్మాణాలకు నిధుల మంజూరు
ముంపు గ్రామాల్లో సంబరాలు
ఎనిమిదేళ్ళ క్రితం అప్పటి సీఎం కేసీఆర్ వేములవాడకు వచ్చారు.
రాజన్న గుడి మెట్లపైనిలబడి...
" మీరేం ఫికర్ జెయ్యకుండ్రి. మధ్య మానేర్ నిర్వాసులందరికీ డబుల్ బెడ్రూం కింద 5 లక్షల చొప్పున ఇస్తా...ఆరునూరైనా ఇచ్చి తీర్తా.. కేసీఆర్ మాటిస్తే తప్పుడన్న మాటే లేదు" ...
అంటూ మాయ మాటలు చెప్పి వెళ్ళిపోయాడు.పదేళ్ళుగా నిర్వాసితులకు నిరీక్షణే మిగిలింది.
అప్పటి రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తన పల్లెననిద్ర కార్యక్రమంలో నిర్వాసితుల సమస్యలు తెలుసుకున్నారు.తాము అధికారంలోకి రాగానే నిర్వాసితులకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.
ఆధికారం చేపట్టిన స్వల్ప వ్యవధిలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మిడ్ మానేర్ నిర్వాసితులకు ఇండ్ల నిర్మాణాలకు నిధులు మంజూరు చేశారు.నిర్వాసితుల
మన్ననలు పొందారు.
మిడ్ మానేర్ లో మొత్తం 10వేల6వందల83 కుంటుంబాలవారు
నిర్వాసితులయ్యారు.
ఇందులో 5వేల 9వందల87 కుటుంబాలవారు ప్రభుత్వం ఇచ్చిన 242 గజాల స్థలం లో ఇండ్లు నిర్మించుకున్నారు.
ఇండ్లు నిర్మిచుకోకుండా మిగిలిన 5వేల 9 వందల87 కుటుంబాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2వందల 35 కోట్ల నిధులు మంజూరు చేసి,
ప్రజల మన్ననలు పోందుతున్నారు.
*నిర్వాసితులకు అండ దండ ఆది*
*నిధుల మంజూరుకు కృషి చేయడంలో...దశాబ్ద కాలంగా ప్రతీ క్షణమూ నిర్వాసితులకు అండదండగా ఉంటున్న జననేత ఆది శ్రీనివాస్ దే ప్రధాన పాత్ర.
అందుకే...అడుగడుగునా ఆది శ్రీనివాస్ కు ప్రజలు అడుగడుగునా నీరాజనాలు పడుతున్నారు.ప్రశంసల పరంపరను కొనసాగిస్తున్నారు
#AdminPost


తెలుగు

వేములవాడకు వరాల జల్లు
127.65 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం
వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రం అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.127.65 కోట్లు సోమవారం మంజూరు చేసింది
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర ఆలయ కాంప్లెక్స్ విస్తరణ, భక్తులకు అవసరమైన అధునాతన సదుపాయాలకు రూ.76 కోట్లు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
వేములవాడ ఆలయం నుంచి మూలవాగు బ్రిడ్జి వరకు ఉన్న రోడ్లును వెడల్పు చేసేందు రూ.47.85 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు
మూలవాగులో ఉన్న బతుకమ్మ తెప్ప నుంచి జగిత్యాల కమాన్ జంక్షన్ వరకు పైప్లైన్ నూతన డ్రైనేజీ నిర్మాణానికి రూ.3.8 కోట్ల పనులకు పరిపాలక ఆమోదం తెలుపుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది
కాంగ్రెస్ ప్రభుత్వం రాజన్న ఆలయానికి అభివృద్ధి సంక్షేమం కోసం 127 కోట్ల నిధులను మంజూరు చేయడం పట్ల వేములవాడ పట్టణవాసులు రాజన్న భక్తులు, హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిధులు మంజూరీకి కృషి చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నారు



తెలుగు

తెలంగాణ రాష్ట్ర సచివాలయంలోని దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారి ఆధ్వర్యంలో వారి చాంబర్లో వేములవాడ దేవాలయం మాస్టర్ ప్లాన్,అభివృద్ధి కార్యకలాపాల పైనిర్వహించిన సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ & వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝూ, కమీషనర్ హనుమంతు, వేములవాడ ఈవో వినోద్, పలువురు దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు, తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు



తెలుగు





