#Telangana | Revanth Reddy also wrote to Chief Ministers of southern states including Tamil Nadu, Karnataka and Kerala, calling for a united stand among southern states
Reported by: @pvramanakumarnews18.com/india/serious-…
#BreakingNews | Amaravati gets a major push
Bill tabled in Lok Sabha to grant it legal status as #Andhra Pradesh’s permanent capital by Nityanand Rai. Pemmasani Chandrasekhar calls it a “historic moment”
@tweet_aneri@pvramanakumar with details| @harishupadhya
#BreakingNews | K. Kavitha announces she will launch a new political party on April 25 in Medchal’s Muneerabad
All eyes are on the next big shift in #Telangana politics. @pvramanakumar@akankshaswarups with details
#BreakingNews | Tragedy in Andhra Pradesh: 13 people burnt alive in a horrific bus accident; CM orders a thorough probe into the incident
@ramprasadreddy_, Minister for Transport, Andhra Pradesh, joins us for more insights
@pvramanakumar gets you more details
#AndhraPradesh | @ShivaniGupta_5
In Andhra Pradesh, 13 people died after a private travel bus were on board collided with a tipper lorry near Rayavaram in Andhra Pradesh
@pvramanakumar shares more details
@akankshaswarups | #AndhraPradesh#Accident
పుకార్లు నమ్మొద్దు.. ఇంధన కొరత లేదు
60 రోజులకు సరిపడా నిల్వలు ఉన్నాయి
అనవసరంగా ఫుల్ ట్యాంకులు చేయించవద్దు
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు
హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనర్
నగరంలో ఇంధన కొరత ఉందంటూ జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ స్పష్టం చేశారు. నగరంలో దాదాపు 60 రోజులకు సరిపడా పెట్రోల్, డీజిల్ నిల్వలు అందుబాటులో ఉన్నాయని, ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని ఆయన వెల్లడించారు.
ఇంధన సరఫరాపై తలెత్తిన అపోహల నేపథ్యంలో బుధవారం టీజీసీసీసీలో జిల్లా కలెక్టర్ శ్రీమతి హరిచందన, ఐఏఎస్, అదనపు సీపీ శ్రీ తప్సీర్ ఇక్బాల్, ఐపీఎస్, జాయింట్ సీపీ శ్రీమతి శ్వేత, ఐపీఎస్ మరియు సివిల్ సప్లై అధికారులతో కలిసి ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా సీపీ సజ్జనర్ మాట్లాడుతూ.. ఆయిల్ కంపెనీలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని, నగరవ్యాప్తంగా సరఫరా నిరాటంకంగా కొనసాగుతోందని తెలిపారు. ప్రజలు ఒక్కసారిగా పెట్రోల్ బంకులకు వచ్చి వాహనాలకు ఫుల్ ట్యాంకులు చేయించుకోవడం వల్ల అకస్మాత్తుగా డిమాండ్ పెరిగి, కొన్ని చోట్ల తాత్కాలికంగా నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయని, దీనిని కొరతగా భావించవద్దని కోరారు.
తప్పుడు ప్రచారాల వల్ల హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఈ నెల 22న 3,024 కిలోలీటర్ల ఇంధనం అమ్ముడవగా, 23న ఆ సంఖ్య రెట్టింపై 6,400 కిలోలీటర్లకు చేరుకుందని, జనం భయాందోళన చెందడం వల్లే అమ్మకాలు ఈ స్థాయిలో పెరిగాయని తెలిపారు.
ముఖ్యంగా నిబంధనలకు విరుద్ధంగా బాటిళ్లు, డబ్బాల్లో లూజ్ పెట్రోల్ లేదా డీజిల్ విక్రయిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు వ్యాప్తి చేస్తూ ప్రజలను భయాందోళనలకు గురిచేసే వారిపై నిఘా ఉంచామని, అటువంటి వారిపై కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. కమిషనరేట్ పరిధిలోని 240 పెట్రోల్ బంకుల్లో పరిస్థితిని సివిల్ సప్లై, రెవెన్యూ అధికారులతో సమన్వయం చేసుకుంటూ నిరంతరం పర్యవేక్షిస్తున్నామని వివరించారు.
హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన మాట్లాడుతూ.. ఆయిల్ సంస్థలు, సివిల్ సప్లై అధికారులతో పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నామని, ప్రజల సౌకర్యార్థం ప్రత్యేకంగా కంట్రోల్ రూంను కూడా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ప్రస్తుతం హైదరాబాద్ జిల్లా పరిధిలోని 186 బంకుల్లో ఇంధన సరఫరా సజావుగా సాగుతోందని, ప్రజలు అనవసర ఆందోళనతో బంకుల వద్ద రద్దీ పెంచవద్దని కోరారు. నిత్యావసర సేవలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని, క్షేత్రస్థాయిలో యంత్రాంగం అప్రమత్తంగా ఉందని ఆమె పేర్కొన్నారు. ప్రజలు వాస్తవాలను గమనించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
#AdminPost
పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర రెండో కుమార్తె వివాహంలో సరదా సన్నివేశం చోటుచేసుకుంది. మహిళా రిజర్వేషన్ రాబోతోందని, రెడీగా ఉండాలని మంత్రి నారా లోకేష్ నవ్వుతూ అన్నారు. దీనికి స్పందించిన నరేంద్ర “మాకే ఎర్త్ పెడితే ఎలా బాబూ?” అంటూ సరదాగా వ్యాఖ్యానించారు.