BRS TechCell
20.8K posts

BRS TechCell
@BRSTechCell
#JaiTelangana ✊ #JaiBharat
Hyderabad Beigetreten Ağustos 2020
126 Folgt46.7K Follower
BRS TechCell retweetet

స్పీకర్ కార్యాలయానికి చేరిన 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించే ప్రైవేటు మెంబర్ బిల్లు అంశం
6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించే ప్రైవేట్ మెంబర్ బిల్లు తాలూకు నోటీసును స్పీకర్ గడ్డం ప్రసాద్ ను ను కలిసి అందజేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS మరియు పార్టీ ఎమ్మెల్యేలు
ఈ ప్రైవేట్ మెంబర్ బిల్లు ద్వారా 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించే వీలు కలుగుతుందని తెలిపిన కేటీఆర్
ఈ సమావేశాల్లోనే అత్యంత కీలకమైన ఈ బిల్లును ప్రవేశపెట్టడానికి అనుమతించాలని స్పీకర్ కు విజ్ఞప్తి చేసిన కేటీఆర్
స్పీకర్ తో పాటు అసెంబ్లీ సెక్రటరీకి కూడా బిల్లు తాలూకు నోటీసులు అందజేసిన కేటీఆర్ మరియు ఎమ్మెల్యేలు.
తెలుగు
BRS TechCell retweetet

ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించే ప్రైవేట్ మెంబర్ బిల్లుకు సంబంధించిన నోటీసును స్పీకర్ గడ్డం ప్రసాద్ గారిని కలిసి అందజేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS మరియు పార్టీ ఎమ్మెల్యేలు.
ఈ ప్రైవేట్ మెంబర్ బిల్లుతో ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించే అవకాశం ఉంటుందని తెలిపిన కేటీఆర్.
ఈ సమావేశాల్లోనే అత్యంత కీలకమైన ఈ బిల్లును ప్రవేశపెట్టడానికి అనుమతించాలని స్పీకర్ను విజ్ఞప్తి చేసిన కేటీఆర్.
స్పీకర్తో పాటు అసెంబ్లీ సెక్రటరీకి కూడా బిల్లుకు సంబంధించిన నోటీసులు అందజేసిన కేటీఆర్ మరియు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.


తెలుగు

పొద్దున వ్యాపారం అయిపోయింది.. ఇగ రాత్రి పూట వ్యాపారం చేస్తాడట!
రాత్రి వ్యాపారం అంటే రేవంత్ రెడ్డికే తెలియాలి ఏం చేయిస్తాడో.
రేవంత్ పాలనలో సామాన్య ప్రజలు ఎట్లా బతకాలో అర్థం కావడం లేదు.
- మూసీ బాదితుల ఆవేదన
#CongressFailedTelangana
తెలుగు

రాష్ట్ర - కేంద్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు నెపం వేసుకుంటూ ఆడుతున్న ఈ దొంగనాటకాల వల్లే ఈరోజు గ్యాస్ కొరత పరిస్థితి ఏర్పడింది.
గ్యాస్ కొరతపై ఎల్బీనగర్ నియోజకవర్గ సీనియర్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎల్బీనగర్ చౌరస్తా వద్ద ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం “గ్యాస్ సప్లై ఎక్కడా ఆగలేదు, అన్నీ సక్రమంగా జరుగుతున్నాయి” అని పేర్కొంటుండగా, రాష్ట్ర ప్రభుత్వం “కేంద్రం నుంచి సరైన సరఫరా లేకపోవడం వల్లే సమస్యలు వస్తున్నాయి” అని చెబుతోందని విమర్శించారు.
ఈ రెండు ప్రభుత్వాల పరస్పర ఆరోపణల మధ్యలో సామాన్య ప్రజలే తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. రోజువారీ జీవనంపై ఆధారపడే ఆటో డ్రైవర్లు, టిఫిన్ సెంటర్ యజమానులు, ఓల్డ్ ఏజ్ హోమ్స్ వంటి అనేక వర్గాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని తెలిపారు.
తెలుగు

కాంగ్రెస్ ప్రభుత్వంలో రిటైర్మెంట్ ఉద్యోగులు చాలా ఇబ్బందులు పడుతున్నారు.
రిటైర్డ్ ఉద్యోగులు తమకు రావాల్సిన పెండింగ్ పీఆర్సీ, డీఏల కోసం ప్రతీ మంత్రి, ఎమ్మెల్యే చుట్టూ తిరుగుతున్నారు.
పెన్షనర్లకు రావాల్సిన బకాయిలను ఎప్పుడు ఇస్తారు?
- ఎమ్మెల్యే @drsanjayBRS
తెలుగు

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రికార్డు స్థాయి వరి సాగు అంటూ డబ్బా కొట్టుకుంటున్నారు.
2014-15లో 24 లక్షల మెట్రిక్ టన్నులు ప్రొక్యూర్ చేస్తే..
2019-20లో 111 లక్షల మెట్రిక్ టన్నులు
2020-21లో 141 లక్షల మెట్రిక్ టన్నులు
2021-22లో 120.65 లక్షల మెట్రిక్ టన్నులు
2022-23లో 131 లక్షల మెట్రిక్ టన్నుల వరి ప్రొక్యూర్ చేసింది.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 2023-24లో రెండు సీజన్లు కలిసి 95.31 లక్షల మెట్రిక్ టన్నులు
2024-25లో 100.31 లక్షల మెట్రిక్ టన్నులు..
గత ప్రభుత్వం కంటే మీరు రికార్డు స్థాయిలో ఎప్పుడు ప్రొక్యూర్మెంట్ చేశారు?
- ఎమ్మెల్యే @PRR_BRS
తెలుగు

కాంగ్రెస్ ప్రభుత్వం ఫిలిప్పీన్స్కు సరఫరా చేసిన బియ్యంలో భారీ కుంభకోణం జరిగింది.
సీబీఐ, ఈడీ కేసుల్లో ఉన్న వ్యక్తి ప్రేమ్ చంద్ గార్గ్ను ఫిలిప్పీన్స్కు ఎగుమతి చేయడానికి ప్రభుత్వం అడ్వైజర్గా పెట్టుకున్నారా లేదా?
ఏడాది కాలం నుంచి కాకినాడ పోర్టులో ఉన్న 7500 మెట్రిక్ టన్నుల బియ్యం పరిస్థితి ఏంటి? ఆ బియ్యం వల్ల లాభం వచ్చిందా లేదా?
ఆ స్కామ్ పై హౌస్ కమిటీ వేయండి.. అందులో జరిగిన అవినీతి, అవకతవకలు అన్నీ బయటపెడతాం.
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish
తెలుగు

ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ గన్ పార్క్ వద్ద నిరసన చేస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు.
ఫీజు రీయింబర్స్మెంట్కు కొర్రీలు, పేద విద్యార్థులకు వర్రీలు అంటూ ప్లకార్డులు ప్రదర్శించిన బీఆర్ఎస్ నాయకులు.
అనంతరం గన్ పార్క్ నుండి అసెంబ్లీ వరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ర్యాలీ.
తెలుగు
BRS TechCell retweetet

Live: అసెంబ్లీలో మాట్లాడుతున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish twitter.com/i/broadcasts/1…
తెలుగు
BRS TechCell retweetet

ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ గన్ పార్క్ వద్ద నిరసన చేస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు.
ఫీజు రీయింబర్స్మెంట్కు కొర్రీలు, పేద విద్యార్థులకు వర్రీలు అంటూ ప్లకార్డులు ప్రదర్శించిన బీఆర్ఎస్ నాయకులు.
అనంతరం గన్ పార్క్ నుండి అసెంబ్లీ వరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ర్యాలీ.


తెలుగు
BRS TechCell retweetet
BRS TechCell retweetet
BRS TechCell retweetet

గ్యారంటీల గారడీతో
నాలుగు కోట్ల మందికి టోపీ పెట్టింది కాంగ్రెస్!
ఆరు గ్యారంటీల పేర్లు చెప్పి అడ్డగోలుగా ఓట్లు వేయించుకొని రాష్ట్రంలోని అన్ని వర్గాలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఒత్తిడి తేవడానికి ఈ ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెడుతున్నాం.
అధికారంలోకి వచ్చిన తొలిరోజే ముఖ్యమంత్రి ఆరు గ్యారంటీల అమలు ఫైలు పైన సంతకం చేశారు.
సరిగ్గా వారం రోజుల తర్వాత అప్పటి రాష్ట్ర గవర్నర్తో అసెంబ్లీ ఉభయ సభల సమావేశంలో చెప్పించారు.
800 రోజులైనా 6 గ్యారంటీల అమలుకు అతీగతీ లేదు.
ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించాలని..
ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రైవేట్ మెంబర్ బిల్లును ప్రవేశపెడతాం.
కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఈ ప్రైవేట్ మెంబర్ బిల్లును సభలో అనుమతించాలి.
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
తెలుగు
BRS TechCell retweetet

రంజాన్ పర్వదినం సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారిని శనివారం ఎర్రవెల్లి నివాసంలో వారి చిన్ననాటి స్నేహితుడు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మహమ్మద్ జహంగీర్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు జుబేర్ మహమ్మద్, వారి కుటుంబ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ అధినేత వారికి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.



తెలుగు

కాంగ్రెస్ నాయకులవి ఓటు కోసం కోటి మోసాలు.
ప్రజల నుండి ఓట్లు దండుకోవాలని ఆరు గ్యారంటీలు, పదమూడు డిక్లరేషన్లు, 420 హామీలు అడ్డగోలుగా ఇచ్చి 4 కోట్ల తెలంగాణ ప్రజలకు టోపీ పెట్టారు.
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
తెలుగు
BRS TechCell retweetet

Live: తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS మీడియా సమావేశం. twitter.com/i/broadcasts/1…
తెలుగు

నిన్న ప్రకటించిన బడ్జెట్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం విద్యారంగానికి 20% నిధులు కేటాయించకుండా, జాబ్ క్యాలెండర్ గురించి ప్రస్తావించకుండా, యూత్ డిక్లరేషన్, విద్యా భరోసాను నిర్లక్ష్యం చేయడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్వీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ వేదికగా బడ్జెట్ ప్రతులను చించివేసి విలేకరుల సమావేశం నిర్వహించారు బీఆర్ఎస్వీ విద్యార్థి విభాగం నాయకులు.
అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్లో విద్యారంగానికి రూ.26,674 కోట్లు కేటాయించి మొత్తం బడ్జెట్లో కేవలం (8.22%) మాత్రమే ప్రకటించడాన్ని చూస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విద్యాశాఖపై ఉన్న చిత్తశుద్ధి స్పష్టమైంది.
కోఠారి కమిషన్ విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలని సూచించినప్పటికీ, విద్యా కమిషన్ 18% నిధులు కేటాయించాలని చెప్పినప్పటికీ, ఏ మాత్రం పట్టించుకోకుండా 8.22% నిధులనే కేటాయించింది రేవంత్ రెడ్డి సర్కార్.
పేద, మధ్యతరగతి విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ల కోసం కోటి ఆశలతో ఎదురుచూస్తూ ఉంటే, బడ్జెట్లో కనీసం ఊసెత్తకపోవడం సిగ్గుచేటు.
జాబ్ క్యాలెండర్ జాడలేదు. నిరుద్యోగ భృతి అంశం మచ్చుకకైనా బడ్జెట్లో కనిపించకపోవడం చూస్తుంటే, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి నిరుద్యోగులపై ఏపాటి శ్రద్ధుందో తేటతెల్లమైంది.
యూత్ డిక్లరేషన్ కింద యువతకు వడ్డీలేని రూ.10 లక్షల రుణాలు, యువతులకు ఎలక్ట్రిక్ స్కూటీలు ప్రస్తావన లేదు. విద్యా భరోసా పత్తా లేకుండా పోయింది.
బడ్జెట్లో గురుకుల విద్యాలయాల గురించి ఏమాత్రం పట్టించుకోనట్టు ప్రభుత్వం వ్యవహరించడం సరైంది కాదు.
ఈ బడ్జెట్ విద్యార్థి, యువత, నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లింది. ప్రతిపాదించిన బడ్జెట్ కేవలం జీతాలు, వేతనాలు, పెన్షన్ల చెల్లింపులకే సరిపోతుంది తప్ప, విద్యారంగ సంస్కరణలకు చిల్లిగవ్వ కూడా మిగలదు.
‘రాజీవ్ యువ వికాసం’ అని పేరు పెట్టి, ఈ హామీ ప్రకారం ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులు 10వ తరగతి పాస్ అయితే రూ.10,000, ఇంటర్ పాస్ అయితే రూ.15,000, గ్రాడ్యుయేషన్ పూర్తిచేస్తే రూ.25,000, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తే రూ.1 లక్ష, ఎంఫిల్, పీహెచ్డీ పూర్తిచేస్తే రూ.5 లక్షలు అందజేస్తామని హామీ ఇచ్చి, నిన్నటి బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడం దారుణం.
యూనివర్సిటీల్లో చదువుకునే విద్యార్థులకు రూ.10 వేల ఫెలోషిప్ ఇస్తామని అన్నారు. కానీ నిధుల కేటాయింపు మాత్రం శూన్యం.
విద్యార్థుల అభివృద్ధి కోసం, విద్యాభివృద్ధి కోసం, ఉద్యోగాల కల్పన కోసం బీఆర్ఎస్వీ కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు కేటాయించే వరకు పోరాడుతూనే ఉంటుంది. కాంగ్రెస్ పార్టీని దించే వరకు పోరాడుతుంది. ఖబర్దార్ రేవంత్ రెడ్డి.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వీ నాయకులు జంగయ్య, కాటం శివ, నాగారం ప్రశాంత్, బొల్లు నాగరాజ్, రమేష్ గౌడ్, శీను నాయక్, రామకృష్ణ, శ్రీకాంత్ ముదిరాజ్, అవినాష్, పవన్, కొండ గణేష్, రాకేష్, వినోద్ కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.
తెలుగు

రేవంత్ రెడ్డి రైతులకు రుణమాఫీ చేస్తామని తెలంగాణలో ఉన్న ప్రతీ దేవుడిపైన ఒట్లు వేశాడు
రేవంత్ రెడ్డి వెళ్తున్న నర్మెట గ్రామంలో ఇంతవరకు 350 మంది రైతులకు రుణమాఫీ పూర్తి కాలేదు.
సిద్ధిపేట నియోజకవర్గంలో 22,819 మంది రైతులకు రూ. 300 కోట్ల బకాయి పెట్టారు.
సిద్ధిపేట నియోజకవర్గంలో రుణమాఫీ కాని రైతులు 52% ఉన్నారు.
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish
తెలుగు