ప్రకాశం జిల్లా, ఒంగోలు పట్టణంలో పేదల మరియు రోజు కూలీల ఆకలి తీర్చేందుకు ప్రభుత్వం నిర్మిస్తున్న ‘అన్న కాంటీన్’ నిర్మాణ పనులను రాష్ట్ర పురపాలక శాఖా మంత్రి నారాయణ పరిశీలించారు. సకాలంలో పనులు పూర్తయ్యేలా సమీక్షించాలని అధికారులను ఆదేశించారు
గుంటూరు జిల్లా, వినుకొండ పట్టణంలో కాల్వలలో నిండుకున్న పూడికలను తొలగించే పనులు జరుగుతున్నాయి. తొలగించిన పూడికలను ఎప్పటికప్పుడు తరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పనులను సమీక్షిస్తున్న పురపాలక సంఘం క్షేత్ర స్థాయి సిబ్బంది తెలిపారు.
కర్నూలు జిల్లా, ఎమ్మిగనూరు పట్టణంలో పలు ప్రాంతాలలో స్థానిక శాసనసభ్యులు డా.బి.వి.జయనాగేశ్వర రెడ్డి పర్యటించి కొళాయి కనెక్షన్ లేని వారికి వెంటనే తీసుకోవాలని చైతన్యపరిచారు. ఈ పర్యటనలో ప్రజలకు, ప్రభుత్వం అమలు జరుపుతున్న వివిధ సంక్షేమ పథకాల గురించి వివరించారు.
గుంటూరు నగర పాలక సంస్థ కమీషనర్ శ్రీకేష్ నగరంలో చుట్టుకుంట, నరసరావుపేట, చిలకలూరిపేట రోడ్డు, పొన్నూరు రోడ్డు, అమరావతి రోడ్డు, కొరిటెపాడు రోడ్డు, గుజ్జన గుండ్ల తదితర ప్రాంతాలలో పర్యటించారు. నగర పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులను సమీక్షించారు.
తూర్పు గోదావరి జిల్లా, రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు 122 వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలో ఉన్న అల్లూరి సీతారామ రాజు విగ్రహానికి పూల మాలలు వేసి, దేశ స్వాతంత్ర్ర్యం కోసం ఆయన చేసిన త్యాగాలను మననం చేసుకున్నారు.
గుంటూరు జిల్లా తెనాలి పట్టణం రాష్ట్ర మరియు జాతీయ స్థాయిలలో ప్రధమ స్థానంలో నిలుపడంలో కృషి చేసినందుకు పట్టణ పురపాలక సంఘ కమీషనర్ శకుంతలను జిల్లా కలెక్టర్ కోన శశిధర్ ఘనంగా సత్కరించారు.
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ పరిధిలో ఉన్న కొత్తూరు వద్ద పేదలకోసం నిర్మిస్తున్న భవన సముదాయాలను పురపాలక శాఖ మంత్రి నారాయణ, శాసనసభ్యులు తోట త్రిమూర్తులు పరిశీలించారు.
కర్నూలు జిల్లా, నంద్యాల పట్టణంలో ఉన్న కాల్వలలో పేరుకున్న పూడికలను తొలగింపజేసే పనులు చేపడుతున్నారు. వర్షాకాలంలో నీరు రోడ్ల పై నిలిచి ప్రజలకు అసౌకర్యం కలగకుండా , పనులు సకాలంలో పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు పనులను సమీక్షిస్తున్న క్షేత్ర స్థాయి అధికారులు తెలియజేశారు.
కర్నూలు జిల్లా, ఎమ్మిగనూరు పట్టణంలో RTMS లో భాగంగా పట్టణ పురపాలక సంఘ కమీషనర్ జి. రఘునాథ రెడ్డి ఆధ్వర్యంలో మైక్రో పాకెట్ ల వారీగా స్ట్రీట్ సర్వే జరిగింది. ఈ కార్యక్రమంలో అసిస్టెంటు ఇంజినీరు ఓబులెసు, శానిటరీ ఇన్స్పెక్టర్ హమీద్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.
గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో స్థానిక చినరావూరు సత్యనారాయణ పార్కులో ఆనందలహరి కార్యక్రమం సందడి వాతావరణంలో జరిగింది. ఈ సందర్బంగా మహిళలకు, విద్యార్ధులకు పలు ఆటల పోటీలను నిర్వహించి బహుమతులను అందించారు. ఈ ఆటల పోటీలలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ఆనందంగా సేద తీరారు.
చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలో స్థానిక తూర్పు మొగసాల పురపాలక సంఘ ప్రాధమిక పాఠశాలలో ఆనందలహరి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలలో పట్టణానికి చెందిన వివిధ పాఠశాలల విద్యార్ధులు పలు సాంప్రదాయ, సినీ గేయాలకు చేసిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి.
గుంటూరు జిల్లా, పిడుగురాళ్ళ పట్టణంలో పురపాలక సంఘం ఆనందలహరి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలలో విద్యార్ధులు చిన్నారులు చేసిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి.
కర్నూలు జిల్లా, నందికోట్కూరులో ఆనందలహరి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్ధులు చేసిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఆదివారం ఆటవిడుపుగా ఉన్న ఈ కార్యక్రమం తమకు ఎంతో ఉత్సాహాన్ని మానసిక ఆనందాన్ని ఇచ్చింది అని పాల్గొన్న ప్రజలు, విద్యార్ధులు, ఉద్యోగులు తెలియజేశారు.
గుంటూరు పట్టణంలో జరుగుతున్న వీధి లైట్ల పనులను, పలు రోడ్ల అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. పనులు సకాలంలో పూర్తిచేయాలని, నిర్మాణ పనులలో నాణ్యతా ప్రమలు తప్పనిసరిగా పాటించాలని గుత్తేదారులను ఆదేశించారు.
చిత్తురు జిల్లా, శ్రీకాళహస్తి పట్టణంలో పురపాలక శాఖ మంత్రి నారాయణ పర్యటించారు. దైవ దర్శనార్ధమై పట్టణానికి విచ్చేసిన మంత్రిని పట్టణ పురపాలక సంఘం చైర్మన్ పార్ధసారధి కలిసి పట్టణ సమస్యలపై వినతి పత్రం సమర్పించారు. శ్మశాన వాటికల అభివృద్ధికి, కన్నలి కలువ అభివృద్ధికి సహకరించాలని కోరారు.
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో స్థానిక పుష్కర ఘాట్ వద్ద ఆనందలహరి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పలు కళాశాల, పాఠశాల విద్యార్ధులు పాల్గొని పలు సినీ, జానపద పాటలకు నృత్యాలు చేసి అందరినీ అలరించారు.
గుంటూరు జిల్లా, తెనాలి పట్టణంలో పలు వార్డులలోను, మార్కెట్ తదితర ప్రాంతాలలో కమీషనర్ పర్యటించారు. మార్కెట్ లో జరుగుతున్న పారిశుధ్య పనుల వివరాలను వ్యాపారస్తులను అడిగి తెలుసుకున్నారు. ఇళ్ళ వద్ద మంచి నీటి కొళాయిల నుండి వస్తున్న మంచి నీటిని స్వయంగా త్రాగి పరిశీలించారు.
చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలో స్థానిక మదనపల్లి రోడ్డు, పి.ఆర్. గెస్ట్ హౌస్ సమీపంలో పేద ప్రజల ఆకలి తీర్చేందుకు ప్రభుత్వం నిర్మించనున్న ‘అన్న క్యాంటీన్’ భవన నిర్మాణ పనులకు మునిసిపల్ కమీషనర్ భూమి పూజ చేశారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, పట్టణ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
గుంటూరు జిల్లా పిడుగురాళ్ళ పట్టణంలో స్థానిక 8 మరియు 9 వార్డులలో మంచినీటి సరఫరా మరియు శానిటేషన్ పనులను కమీషనర్ తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో కమీషనర్ తోబాటు వార్డుల కౌన్సిలర్లు, పురపాలక సిబ్బంది పాల్గొన్నారు.
చిత్తూరు జిల్లా, పలమనేరు పట్టణ శివార్లలో గొబ్బిళ్ళ కొత్తూరు ప్రాంతంలో కంపోస్ట్ యార్డ్ స్థలం లో క్యూబ్ బయో ఎనర్జీస్ సంస్థ తరపున నిర్మించనున్న ఘన వ్యర్ధల నుండి విద్యుత్ ను ఉత్పత్తి చేసే ప్లాంటు నిర్మాణ పనులు జరుగుతున్నాయి.