BRS Party

51.9K posts

BRS Party banner
BRS Party

BRS Party

@BRSparty

Official Twitter handle of Bharat Rashtra Samithi. BRS Party, formerly known as TRS Party, is an Indian political party founded by Sri KCR.

Hyderabad, Telangana Katılım Mart 2014
125 Takip Edilen941.8K Takipçiler
BRS Party
BRS Party@BRSparty·
మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ప్రజలు తీర్పునిస్తే… మంత్రి వివేక్ అధికార మదంతో కౌన్సిలర్లను భయభ్రాంతులకు గురిచేసి, పోలీసులను అడ్డంపెట్టుకొని అడ్డమైన కేసులు పెట్టించి, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ను జైలుకు పంపిండు. 51 రోజులు ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా.. మొక్కవోని ధైర్యంతో బీఆర్ఎస్ కౌన్సిలర్లు ప్రజాస్వామ్య వ్యవస్థను గెలిపించారు - బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
తెలుగు
0
1
1
5
BRS Party
BRS Party@BRSparty·
సింగరేణి సంపదను కాపాడాల్సింది పోయి.. దేశంలోనే ఎక్కడాలేని విధంగా సైట్ విజిట్ సర్టిఫికేట్ తెచ్చి.. రేవంత్, ఆయన బామ్మర్ది కలిసి వేల కోట్ల సింగరేణి సంపదను కొల్లగొడుతున్నారు. నీకు దమ్ముంటే నీ బామ్మర్దిపై సిట్, ఏసీబీ విచారణ జరిపించు రేవంత్ - బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
తెలుగు
0
6
13
195
BRS Party
BRS Party@BRSparty·
Live: మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశం @KTRBRS twitter.com/i/broadcasts/1…
తెలుగు
0
19
35
475
BRS Party
BRS Party@BRSparty·
మండు వేసవిలో వరద కాలువకు ఎదురెక్కుతున్న కాళేశ్వర గంగ 🌊 శ్రీరాంసాగర్ వరద కాలువపై ఉన్న #రాంపూర్ పంప్ హౌస్ నుండి కథలాపూర్, మేడిపల్లి మండలాల మీదుగా #రాజేశ్వరరావు పేట పంప్ హౌస్ కు చేరుతున్న కాళేశ్వరం జలాలు. కేసీఆర్ గారు నిర్మించిన ఎస్సారెస్పీ పునర్జీవ పథకంతో 122 కిలోమీటర్ల వరద కాలువను 3 రిజర్వాయర్లుగా మార్చిన దృశ్యం. 📍రాంపూర్ పంప్‌హౌస్‌, మల్యాల మండలం, జగిత్యాల జిల్లా. #KCR #KaleshwaramProject
తెలుగు
0
23
48
744
BRS Party
BRS Party@BRSparty·
రేవంత్ సర్కార్ గొప్పలు చెప్పే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అట్టర్ ఫ్లాప్! రెండేండ్ల నుండి వందల కోట్లు ఖర్చు చేసి ఆ స్కిల్ యూనివర్సిటీలో శిక్షణ ఇచ్చింది కేవలం వెయ్యి మందికి మాత్రమే.. అందులో 300 మందికి స్విగ్గీ, జొమాటో డెలివరీ బాయ్స్ గా శిక్షణ “టాస్క్” ద్వారా 37 లక్షల మందికి బీఆర్ఎస్ సర్కార్ నైపుణ్య శిక్షణ కల్పిస్తే… “టాస్క్”ను అణిచివేస్తూ సొంత డబ్బా కొట్టుకోవడానికి స్కిల్ యూనివర్సిటీ తెచ్చిన రేవంత్ స్కిల్ యూనివర్సిటీలో కొత్తగా చేరడానికే జంకుతూ.. అడ్మిషన్లు తీసుకొని విద్యార్థులు “పేరు గొప్ప.. ఊరికి దిబ్బ” అనేలానే ఈ డబ్బా స్కిల్ యూనివర్సిటీ తయారయ్యింది! #CongressFailedTelangana
BRS Party tweet media
తెలుగు
0
17
27
683
BRS Party
BRS Party@BRSparty·
బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ కాల్వ మల్లేశం కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS కరీంనగర్ జిల్లా, అల్గునూర్ 8వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ కాల్వ మల్లేశం సోదరుడు కాల్వ ఇంద్రసేన ఇటీవల మృతి చెందారు. ఈ నేపథ్యంలో వారి కుటుంబ సభ్యులను కలిసి, పరామర్శించి ధైర్యం చెప్పిన కేటీఆర్.
తెలుగు
0
27
92
1K
BRS Party
BRS Party@BRSparty·
కాంగ్రెస్ మార్క్ 'ఆర్ధిక విధ్వంసం' రేవంత్ ప్రభుత్వం తుగ్లక్ నిర్ణయాలు, తెలివి తక్కువ విధానాలతో... కుప్పకూలిపోయిన రాష్ట్ర ఆదాయ రాబడులు సంపద సృష్టించే తెలివిలేక.. అప్పుల మీద అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని అప్పులఊబిలో నెడుతున్న కాంగ్రెస్ దద్దమ్మలు! #CongressFailedTelangana
BRS Party tweet media
తెలుగు
4
22
40
715
BRS Party
BRS Party@BRSparty·
లక్షలాది మత్స్యకారుల పొట్టకొడుతున్న కాంగ్రెస్ దద్దమ్మలు! చేప పిల్లల పంపిణీకి ఏటా కావాల్సిన నిధులు రూ. 150 కోట్లు కాగా.. రూ. 16 కోట్లు మాత్రమే కేటాయించి, లక్షల మంది మత్స్యకారుల కుటుంబాల పొట్ట కొడుతున్న అసమర్థ కాంగ్రెస్ సర్కార్.
BRS Party tweet media
తెలుగు
4
19
44
781
BRS Party
BRS Party@BRSparty·
కాంగ్రెస్ సర్కార్‌ భూదందా 🚨 నిషేధిత భూముల పేరిట రేవంత్‌ ప్రభుత్వం కుట్రలు 📣 ⚠️ రైతులను బ్లాక్‌మెయిల్‌ చేస్తూ రియల్‌ఎస్టేట్‌ దందా 🆘 గత బీఆర్‌ఎస్‌ హయాంలో 16లక్షల ఎకరాలుంటే కాంగ్రెస్‌ వచ్చాక నిషేధిత జాబితాలోకి కోటి ఎకరాలు 📢 ఇదే అదునుగా పొంగులేటి, ప్రభుత్వ పెద్దల డీల్‌ 💥 బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆగ్రహం రాష్ట్రంలో విలువైన భూములు ఎక్కడున్నా వాటిని నిషేధిత జాబితాలో చేర్చి కాంగ్రెస్‌ ప్రభుత్వం భూదందాలు చేస్తున్నది. గత బీఆర్‌ఎస్‌ హయాంలో 16లక్షల ఎకరాలు మాత్రమే నిషేధిత జాబితాలో ఉంటే, కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత కోటి ఎకరాలకు పెంచేశారు. ఫ్యూచర్‌సిటీ పేరుతో రేవంత్‌రెడ్డి భూదందా చేస్తూ, ఆయన కుటుంబసభ్యులు, అనుచరులకు దోచిపెట్టేందుకే కొత్త కుట్రకు తెరతీస్తున్నారు. పేదల భూములను లాక్కొని రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేయాలనుకుంటున్న రేవంత్‌రెడ్డి చరిత్ర హీనుడిగా మిగిలిపోతాడు. ఏఐ చిత్రాలతో గ్రాఫిక్స్‌ చేసి ఫ్యూచర్‌సిటీ అని రేవంత్‌రెడ్డి కొత్త కుట్రకు తెరతీశాడు. రేవంత్‌రెడ్డికి ఉన్న సిటీనే పట్టించుకొనే తెలివి లేదు. దోమలు కుట్టి జనం చస్తుంటే సోయి లేదు. అలాంటిది ఫ్యూచర్‌సిటీ కడుతా అని మాట్లాడుతున్నడు. ఫ్యూచరే లేని నాయకుడు ఫ్యూచర్‌ సిటీ కడుతా అంటే జనం నవ్వుతున్నారు.
BRS Party tweet mediaBRS Party tweet media
తెలుగు
1
31
66
1.4K
BRS Party
BRS Party@BRSparty·
మేస్త్రీ.. ఇగో ఒకసారి తెలంగాణ ప్రజలు నిన్ను ఏమంటున్నరో చూడు!
తెలుగు
23
229
968
17.9K
BRS Party
BRS Party@BRSparty·
రేవంత్ గెలిచిన దగ్గరి నుండి పేదల కడుపు మీద కొడుతున్నాడు మా ఇండ్లు కోల్పోయి మేమంతా విషం తాగి చనిపోతే, మా ఓట్లు దొంగ ఓట్లు వేసుకుందామని రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నాడు కావొచ్చు అంటూ ఆవేదన చెందిన అమీన్‌పూర్ మండలం ఐలాపూర్ గ్రామంలో హైడ్రా బాధిత మహిళ
తెలుగు
1
33
106
1.4K
BRS Party
BRS Party@BRSparty·
కాంగ్రెస్ అంటేనే దళిత, గిరిజన వ్యతిరేక ప్రభుత్వం! రెండున్నరేళ్లుగా దళిత, గిరిజన విద్యార్థులకు కార్పొరేట్ విద్యనందించే బెస్ట్ అవైలబుల్ స్కీమ్‌కు పైసా నిధులు ఇవ్వకుండా, ఇప్పుడు ఏకంగా ఈ పథకాన్నే రద్దు చేయాలనే కుట్ర చేస్తున్న కాంగ్రెస్ సర్కార్. #CongressFailedTelangana
BRS Party tweet media
తెలుగు
10
23
65
1.1K
BRS Party
BRS Party@BRSparty·
రేవంత్ రెడ్డికి రియల్ ఎస్టేట్ దందా తప్ప ఇంకేమీ చేయడం రాదు. రంగారెడ్డి జిల్లాలో ఉన్న భూములను రేవంత్ దోచుకోవాలని చూస్తున్నాడు. తన రియల్ ఎస్టేట్ దందాల కోసం రేపటి రోజున రంగారెడ్డి జిల్లా ఫర్ సేల్ అనే బోర్డు కూడా పెట్టేస్తాడు. - మాజీ ఎమ్మెల్యే @ManchireddyBRS
తెలుగు
5
25
110
1.7K
BRS Party
BRS Party@BRSparty·
♦️ అధికారం ఎవరికీ శాశ్వతం కాదు.. రేవంత్ అహంకారానికి ప్రజలే బుద్ధి చెబుతారు ♦️ అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తున్న రేవంత్ రెడ్డి చరిత్ర హీనుడిగా మిగిలిపోతాడు ♦️ ఫోర్త్ సిటీ ఒక పెద్ద డ్రామా.. తన కుటుంబ సభ్యులకు భూములు కట్టబెట్టేందుకు కుట్ర. ♦️ నిషేధిత భూముల జాబితాతో బ్లాక్ మెయిల్ రాజకీయాలు. - బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS 👇🏻 అన్ని వర్గాలను మోసం చేస్తూ, తన కుటుంబ సభ్యులు, అనుచరుల కోసం పేదవాళ్ల భూములను అరాచకంగా గుంజుకుంటున్న అనుముల రేవంత్ రెడ్డి, తెలంగాణ చరిత్రలో ఒక చరిత్ర హీనుడిగా మిగిలిపోతాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ సమాజం కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డిని చీత్కరించే రోజులు తప్పకుండా వస్తాయన్నారు. రేవంత్ రెడ్డి పదవి దిగిపోయిన తర్వాత కనీసం పలకరించే నాథుడు కూడా ఉండడని, కానీ ఇదే రేవంత్ రెడ్డి తన అధికారాన్ని, పదవిని చూసుకొని అహంకారంతో ప్రవర్తిస్తున్నారన్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, ఆ విషయం మర్చిపోయి అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డికి ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెబుతారన్నారు. ఈరోజు మున్సిపల్ ఎన్నికల అనంతరం దాదాపు రెండు నెలల పాటు అన్ని రకాల అన్యాయాలు, అక్రమాలు చేసిన తర్వాత ఇబ్రహీంపట్నం మరియు క్యాతనపల్లి మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ గులాబీ జెండా ఎగిరిందన్న విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తుంచుకోవాలన్నారు. మెజారిటీ కౌన్సిలర్లు బీఆర్ఎస్ వాళ్లు గెలిచిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ అక్రమంగా చైర్మన్ పదవులను తీసుకునేందుకు అనేక దురాగతాలకు పాల్పడిందని, అయితే చివరికి న్యాయం గెలిచిందని కేటీఆర్ అన్నారు. ఈరోజు ఇబ్రహీంపట్నంలో బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేటీఆర్, తాజాగా మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన చైర్‌పర్సన్, కౌన్సిలర్లను, సర్పంచ్‌లను సన్మానించారు. కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎమ్మెల్యే అరాచకాలను ఎదుర్కొని బలంగా నిలబడిన మంచిరెడ్డి కిషన్ రెడ్డి కుమారుడు, పార్టీ యువ నాయకుడు ప్రశాంత్ రెడ్డిని ప్రత్యేకంగా కేటీఆర్ అభినందించారు. మంచి నాయకత్వం, మొండితనం ఉన్న నాయకత్వం ఉంటే ఖచ్చితంగా ప్రజలు ఆదరిస్తారని ప్రశాంత్ ఈ ఎన్నికల్లో సాధించిన విజయం నిరూపించిందన్నారు. ఇక రేవంత్ రెడ్డి ఫార్మా సిటీ పేరుతో భూముల దందా చేస్తున్నారన్నారు. ఎన్నికలకు ముందు గత ప్రభుత్వం సేకరించిన 14,000 ఎకరాల ఫార్మా సిటీ భూములను తిరిగి రైతన్నలకు ఇస్తామని చెప్పి వారితో ఓట్లు వేయించుకొని, ఇప్పుడు ఫోర్త్ సిటీ పేరుతో మోసం చేస్తున్నారని కేటీఆర్ అన్నారు. ఒకవైపు కోర్టులో ఫార్మా సిటీ ఉందని చెబుతూ, బయటకు వచ్చి అవే భూముల్లో ఫోర్త్ సిటీ కడతామని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతుందన్నారు. ఆనాడు ఫార్మా సిటీ భూముల్లో అప్పటి సిఎల్పీ నాయకుడిగా ఉన్న భట్టి విక్రమార్క, మంత్రి సీతక్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహా మిగిలిన మేధావులు పాదయాత్ర చేసి, "మాకు ఓటు వేస్తే మీ భూములు మీకు తిరిగి అప్పజెపుతాం" అని హామీ ఇచ్చారని, రెండున్నర సంవత్సరాల తర్వాత మరో 16,000 ఎకరాల అదనపు భూమిని రైతుల నుంచి గుంజుకొని ఫోర్త్ సిటీని, భారత్ ఫ్యూచర్ సిటీని కడతానని నాటకాలు ఆడుతున్నారన్నారు. కేవలం తన అనుచరులకు, తన కుటుంబ సభ్యులు సోదరులకి భూములు కట్టబెట్టడం కోసమే ఈ ఫ్యూచర్ సిటీ డ్రామాను రేవంత్ రెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీ తెరలేపిందన్నారు. ఉన్న సిటీనే పట్టించుకునే తెలివి రేవంత్ రెడ్డికి లేదు. ఉన్న సిటీలో దోమలు కుట్టి జనం చనిపోతుంటే పట్టించుకునే పరిస్థితి లేదు, అలాంటిది ఫ్యూచర్ సిటీ కడతానని రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారన్నారు. ఫ్యూచరే లేని నాయకుడు మళ్లీ ఫ్యూచర్ సిటీ కడతా అంటే ప్రజలు నవ్వుతున్నారన్నారు. గత ప్రభుత్వం కోహెడలో 178 ఎకరాల భారీ విస్తీర్ణంలో అతిపెద్ద పండ్ల మార్కెట్ కడతామని అంటే, వాటిని మళ్ళీ ఇప్పుడు రాచకొండ గుట్టలకో, రామోజీ ఫిలిం సిటీ అవతలకో పోవాలని చెప్పి ప్రభుత్వం చెబుతుందన్నారు. ఈ 178 ఎకరాలను అమ్ముకునేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఒకప్పుడు నిషేధిత భూముల జాబితాను తగ్గించి భూమి సమస్యలను పరిష్కరిస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ, అధికారంలోకి వచ్చిన తర్వాత 16 లక్షలు ఉన్న నిషేధిత భూముల సంఖ్యను కోటి ఎకరాలకు పెంచి, అందరినీ బ్లాక్ మెయిల్ చేస్తూ భూముల దందా చేస్తోందని విమర్శించారు. ఈ నిషేధిత జాబితాను అడ్డు పెట్టుకొని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ పెద్దలు కలెక్టర్లకు ఫోన్లు చేసి ప్రజలను ఇబ్బందులు పెడుతూ భూముల దందా సెటిల్‌మెంట్లకు పాల్పడుతున్నారన్నారు. ఇక ఇబ్రహీంపట్నం స్థానిక ఎమ్మెల్యే అవినీతి గురించి, అరాచకాల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదన్నారు. హోటళ్ల నుంచి, బార్ల నుంచి, క్రషర్ల నుంచి ప్రతి ఒక్కరి నుంచి అడ్డగోలుగా నెలకి ఇంత చొప్పున రేటు నిర్ణయించి వసూలు చేస్తున్న అరాచకాలను కేటీఆర్ ప్రస్తావించారు. ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా రేవంత్ రెడ్డి లాంటి అరాచక శక్తిని ఎదుర్కొని, అక్రమ కేసులను ఎదుర్కొని పార్టీ వెంటనే నిలబడి మున్సిపల్ పీఠాన్ని దక్కించుకున్న ప్రతి ఒక్క నాయకుడికి, మున్సిపల్ కౌన్సిలర్ కి పేరు పేరునా ధన్యవాదాలు చెబుతున్నానని తెలిపారు. రెండున్నర సంవత్సరాల పాటు మన పార్టీకి ఉన్న కష్టకాలం పోయిందని, త్వరలోనే రాష్ట్రానికి మంచి రోజులు రాబోతున్నాయన్నారు. అధికారులు కాంగ్రెస్ పార్టీ ప్రలోభాలకు లొంగి అక్రమాలకు పాల్పడితే ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తి లేదని, రానున్న గవర్నమెంట్లో వారందరినీ గుర్తుంచుకొని మరీ తగిన విధంగా శిక్షిస్తామన్నారు. ఇప్పటికైనా అధికారులు ప్రజల కోసం పని చేయాలని కేటీఆర్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి, మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, భువనగిరి పార్లమెంట్ ఇంచార్జ్ క్యామ మల్లేష్ తదితర సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
BRS Party tweet mediaBRS Party tweet mediaBRS Party tweet mediaBRS Party tweet media
తెలుగు
6
42
137
2.1K
BRS Party
BRS Party@BRSparty·
రాష్ట్రవ్యాప్తంగా విధ్వంసం సృష్టిస్తూ.. ఎక్కడపడితే అక్కడ భూములను కాజేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తోంది. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి ఫార్మా సిటీ భూములను వెనక్కి ఇస్తానని రైతులకు మాట ఇచ్చి, ఇప్పుడు ఉన్న భూములను కూడా లాక్కుంటున్నాడు. ఎక్కడ పేద రైతుని కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బంది పెట్టినా.. అక్కడ బీఆర్ఎస్ ఆ రైతులకు అండగా ఉంటుంది. - మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BrsSabithaIndra
తెలుగు
4
54
140
1.5K
BRS Party
BRS Party@BRSparty·
రేవంత్ రెడ్డి అరాచకాలను తట్టుకొని ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో ప్రజాస్వామ్యం గెలిచింది.. గులాబీ జెండా ఎగిరింది. - బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
తెలుగు
12
44
142
1.9K
BRS Party
BRS Party@BRSparty·
ఫార్మా సిటీ 14 వేల ఎకరాల భూములు రైతులకు తిరిగి ఇచ్చేస్తాం అని చెప్పి మోసం చేసి.. ఇప్పుడు మరో 16 వేల ఎకరాల భూములు ఫ్యూచర్ సిటీ పేరిట దౌర్జన్యంగా గుంజుకుంటున్నాడు. ఫ్యూచర్ లేని రేవంత్ రెడ్డి.. ఫ్యూచర్ సిటీ కడతాడట..! - బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS🔥
తెలుగు
6
32
108
1.4K
BRS Party
BRS Party@BRSparty·
ఎందరో ముఖ్యమంత్రులు వచ్చారు.. కానీ పేదల భూములు గుంజుకునే రేవంత్ రెడ్డి మాత్రం ఒక చరిత్ర హీనుడిగానే మిగిలిపోతాడు, ఆయనను తెలంగాణ సమాజం ఛీత్కరించే రోజులు వస్తాయి. - బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
తెలుగు
7
57
151
1.6K
BRS Party
BRS Party@BRSparty·
Live: ఇబ్రహీంపట్నం నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశం. @KTRBRS twitter.com/i/broadcasts/1…
తెలుగు
2
49
136
7.5K
BRS Party
BRS Party@BRSparty·
జగిత్యాల జిల్లా కేంద్రంలో ఈ నెల 20వ తేదీన నిర్వహించనున్న మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి బహిరంగ సభకు సంబంధించి మోతె రోడ్డు పక్కన గల స్థలాన్ని మాజీ మంత్రులు @Koppulaeshwar1, జీవన్ రెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు @Vidyasagarrao_K, ఎమ్మెల్సీ ఎల్. రమణ పరిశీలించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ… రెండేళ్లలోనే రాష్ట్రం అస్తవ్యస్తంగా మారిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలలో ఒక్కటినీ కూడా నెరవేర్చలేదన్నారు. జగిత్యాల సభతో ప్రభుత్వానికి కనువిప్పు కలిగిస్తామని తెలిపారు. జీవన్ రెడ్డి చేరికతో ఉత్తర తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి మరింత బలం చేకూరిందన్నారు. జగిత్యాల సభను భారీగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ సభకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరవుతారని, లక్ష మందితో సభ నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే @drsanjayBRS, మాజీ జెడ్పీ చైర్మన్ @DVS_BRS, ఉమ్మడి కరీంనగర్ జిల్లా మాజీ జెడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, మాజీ డీసీఎంఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, లోక బాపురెడ్డి, పట్టణ అధ్యక్షుడు వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
BRS Party tweet mediaBRS Party tweet mediaBRS Party tweet mediaBRS Party tweet media
తెలుగు
1
45
223
4.3K