హనుమకొండకు శ్రీ @PawanKalyan గారు
- యువ అభిమాని నిరంజన్ కు పరామర్శ
ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు బుధవారం ఉదయం తెలంగాణ రాష్ట్రం హనుమకొండకు వెళ్ళనున్నారు. నిరంజన్ అనే పదిహేడేళ్ల యువకుడిని పరామర్శిస్తారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న నిరంజన్ తన అభిమాన హీరో, నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలవాలని కోరిక వ్యక్తం చేశాడు. పార్టీ వర్గాల ద్వారా తెలుసుకున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు బుధవారం హనుమకొండకు చేరుకొని నిరంజన్ కలుస్తారు.
అనంతరం భద్రకాళి అమ్మవారి ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకుంటారు.
తెలుగు చలనచిత్ర చరిత్రను తిరగరాసిన #GabbarSingh గురించి తలుచుకుంటే ఇప్పటికీ పూనకాలు వస్తాయి… మరోసారి ఆ మ్యాజిక్ను పెద్ద తెరపై చూడాలనిపించింది. నాకే కాదు, పవర్ స్టార్ అభిమానులందరూ కూడా ఆ సంచలన చిత్రాన్ని మరోసారి థియేటర్లో ఆస్వాదించాలని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అందుకే మీ అందరి కోసం ఈ నెల 26న గబ్బర్ సింగ్ మరోసారి థియేటర్లలో సందడి చేయబోతోంది. ఆ హంగామా, ఆ డైలాగులు, ఆ పాటలు, ఆ ఎనర్జీని మరోసారి కలిసి సెలబ్రేట్ చేసుకుందాం.
“నాకొంచెం తిక్క ఉంది… కానీ దానికి ఓ లెక్క ఉంది!”
ఈ నెల 26న థియేటర్లలో కలుద్దాం! 🔥💥
పవర్ స్టార్ @PawanKalyan అభిమానులందరికీ ఇది మరో పండుగ! ❤️🙏🏻
రేపు హన్మకొండ జిల్లాలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన.. హనుమాన్ నగర్, పేడపల్లిలో పవన్ పర్యటన.. పొనుగోటి నిరంజన్ అనే 17 ఏళ్ల దివ్యాంగుడి ఇంటికి వెళ్లనున్న పవన్.. ఏడేళ్ల వయసు నుంచే మంచానికి పరిమితమైన నిరంజన్.. అభిమాన హీరో పవన్ను ఒక్కసారి కలవాలని నిరంజన్ కోరిక.. రేపు నిరంజన్ ఇంటికి వెళ్లి పరామర్శించనున్న పవన్
#Telangana#JanaSena#PawanKalyan#Hanamkonda
"చిన్నారి కోరిక కోసం వరంగల్కు పవన్.. రాజకీయంగానూ కీలక పర్యటన!"
ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న చిన్నారి నిరంజన్ చివరి కోరికను నెరవేర్చేందుకు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రేపు వరంగల్కు వెళ్లనున్నారు. ❤️
అభిమాన బాలుడిని పరామర్శించనున్న పవన్.. అనంతరం స్థానిక జనసేన నాయకులతో కూడా సమావేశమయ్యే అవకాశం ఉంది. ఇటీవల తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమైన 'స్థానికత' వివాదం తర్వాత జరుగుతున్న ఈ పర్యటనపై అందరి దృష్టి నెలకొంది. 🔥
మరోవైపు తెలంగాణలో పార్టీ విస్తరణకు వేగం పెంచిన జనసేన.. త్వరలోనే జాయినింగ్స్ కమిటీని ప్రకటించనున్నట్లు సమాచారం.
#PawanKalyan#Janasena#Warangal#Telangana#JanaSenaParty
ఢిల్లీలో జనసేన అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి అధ్యక్షతన జరిగిన ' సేన ప్రస్థానం - దేశ సమైక్యత కోసం' సమావేశంలో 5 తీర్మానాలకు ఆమోదం.
• వికసిత్ భారత్: ఆకాంక్షల నుంచి విజయాల వైపు
• జాతీయ సమైక్యత, సమగ్రత, భద్రతే జనసేన లక్ష్యం
• సంక్షోభం నుండి నమ్మకం వైపు: ఆంధ్రప్రదేశ్ లో రెండేళ్ల పునర్నిర్మాణం, సంక్షేమం, అభివృద్ధి.
• జనసేన @ 12 : త్యాగం, సేవ, ప్రజల నమ్మకం తాలూకు ప్రయాణం.
• యువతకు అండగా, వారి ఆకాంక్షలకు అనుగుణంగా అవకాశాల కల్పన
#SenaPrasthanam
జనసేన పార్టీలో చేరికల సమన్వయానికి జాయినింగ్స్ కమిటీ
- 14 మంది సభ్యులతో ఆంధ్ర ప్రదేశ్ కమిటీ ఏర్పాటు
- త్వరలో తెలంగాణ కమిటీ
జనసేన పార్టీలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్న ఇతర పార్టీల నేతలు, విద్యావంతులు, సామాజికవేత్తలు, తటస్థులను పార్టీలోకి ఆహ్వానించేందుకు ప్రత్యేకంగా జాయినింగ్స్ కమిటీని నియమించాము. 14 మంది సభ్యులతో కూడిన ఈ కమిటీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారి చేరికలను సమన్వయం చేస్తుంది.
ఈ కమిటీలో ఎమ్మెల్యేలు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్, శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్, శ్రీ పంతం నానాజీ, ఎంపీ శ్రీ లింగమనేని రమేష్, మాజీ మంత్రి శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు శ్రీ కిలారి రోశయ్య, శ్రీ సామినేని ఉదయభాను, పార్టీ సీనియర్ నేతలు శ్రీ కొటికలపూడి చినబాబు, డా.హరిప్రసాద్, డా.పెదపూడి విజయ్ కుమార్, శ్రీ కొరికాన రవికుమార్, శ్రీ వంపూరు గంగులయ్య, శ్రీ టి సి వరుణ్, శ్రీ ఆరణి మదన్ సభ్యులుగా ఉంటారు. ఢిల్లీ పర్యటన అనంతరం ఈ సభ్యులతో సమావేశం ఏర్పాటు చేసి పార్టీలో చేరికలపై దిశానిర్దేశం చేస్తాను. ఆంధ్ర ప్రదేశ్ తరహాలోనే తెలంగాణలోనూ జాయినింగ్స్ కమిటీ నియామకానికి సన్నాహాలు చేస్తున్నాము.
(పవన్ కళ్యాణ్) @PawanKalyan
అధ్యక్షులు, జనసేన