*𝓖𝓲𝓿𝓮𝓷 𝓽𝓸 𝓰𝓪𝓲𝓷*
అమ్మగా ప్రాణం పోస్తుంది, భార్యగా సగభాగం పంచుకుంటుంది,సోదరిగా అండగా నిలుస్తుంది,కూతురిగా ఇంట మహాలక్ష్మిలా వెలుగుతుంది, సృష్టిలో ఆమె పోషించని పాత్ర లేదు.తన కష్టాలను కన్నీళ్లను దిగమింగి చిరునవ్వులోలికించే మా మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.
మేడిగడ్డ బ్యారేజీపై కుట్రలు చేసింది చాలదన్నట్టు, అన్నారం బ్యారేజీని కూల్చేందుకు కుతంత్రాలకు తెరతీశారా ??
నిబంధనలకు పాతరేసి ఏకంగా బ్యారేజీ కిందే భారీ ఎక్సవేటర్లతో ఇసుక తవ్వకాలు జరపడం దుర్మార్గమే కాదు.. అతిపెద్ద నేరం.
బ్యారేజీ సమీపంలో ఇసుక తవ్వకాలు చేపట్టకూడదన్న రూల్స్ ను బ్రేక్ చేసిన మాఫియాపై వెంటనే క్రిమినల్ చర్యలు తీసుకోవాలి.
ఏకంగా బ్యారేజీని బలహీనపరిచి బీఆర్ఎస్ పై బురదజల్లే పన్నాగాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించాలి.
తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టును దెబ్బతీసేందుకు నాటి నుంచి నేటి వరకు కాంగ్రెస్ చేస్తున్న అరాచకపర్వాన్ని అన్నదాతలు క్షమించే ప్రసక్తే లేదు.
నిబంధనలు తుంగలో తొక్కి అన్నారం బ్యారేజి పిల్లర్ల వద్ద ఇసుక తవ్వకాలు చేసి బ్యారేజీని ప్రమాదంలోకి నెడుతుంది రేవంత్ సర్కార్.. ఇది ఖచ్చితంగా కాళేశ్వరం ప్రాజెక్టును దెబ్బతీసే కుట్రే.
పట్టపగలే, నిస్సిగ్గుగా అన్నారం బ్యారేజ్ నుండి కాంగ్రెస్ నాయకుల ఇసుక మాఫియా ఇసుకను తోడేస్తుంది.
తెలంగాణ వనరులను కాంగ్రెస్ పార్టీ ఎలా కొల్లగొడుతుందో చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణ ఇది.
కాళేశ్వరం బ్యారేజీలకు ఏమైనా జరిగితే పూర్తి బాధ్యత కాంగ్రెస్ పార్టీదే.
అందినకాడికి దోచుకో.. దొరికినకాడికి అమ్ముకో.. ఇవే తెలంగాణలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రజా పాలన సూత్రాలు.
తెలంగాణను నిలువు దోపిడి చేస్తున్న కాంగ్రెస్ నాయకులారా.. ప్రజలు మీ భరతం పట్టే రోజు అతి దగ్గరలోనే ఉంది.. ఖబడ్దార్.
ఏదో ఒక విచారణ పేరిట కాలాయాపన చేయాలని, సిట్ విచారణ పేరిట తెలంగాణ ఉద్యమ నేత 65 ఏండ్ల కేసీఆర్ గారి ని వేదించడం ఆయనపై బురదజల్లేందుకు కాంగ్రెస్ సర్కారు చేస్తున్న కుట్రలు తెలంగాణ ప్రజానీకం గ్రహిస్తుంది తెలంగాణా లో రేవంత్ సర్కారుకు రోజు రోజుకు వ్యతిరేఖత పెరుగుతుంది
పెద్దసారు ఎట్లనో కిందోళ్లు అట్లనే ఉంటారు..
మనం తెచ్చిన నిధులకు వాళ్ళ శంకుస్థాపనలు దాని మీద వాళ్ళ బొమ్మలు, ముప్పై ఏండ్ల రాజకీయా జీవితంలో ఈ బొమ్మలు వేసుకోవడం మొదటి సారి చూస్తున్నాం.
సింగరేణిలో కాంగ్రెస్ సర్కార్ అవినీతిపై గళమెత్తిన బీఆర్ఎస్ పార్టీ 🔥
బొగ్గు గనుల కేటాయింపులో జరిగిన భారీ కుంభకోణంపై తక్షణమే సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి గారు మరియు భూపాలపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి గారు ధర్నా కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...
♦️భూపాలపల్లి నియోజకవర్గ పరిధిలోని సింగరేణి ఓపెన్ కాస్ట్ మరియు అండర్ గ్రౌండ్ మైన్స్లలో పనిచేస్తున్న కార్మికులతో కలిసి సింగరేణి పరిరక్షణ కోసం కదం తొక్కడం జరిగింది.
♦️ఈ సందర్భంగా సింగరేణి సంస్థలో జరుగుతున్న అవినీతిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
♦️సింగరేణిలో కొత్త నిబంధనల పేరుతో “సైట్ విజిట్” వ్యవస్థను ప్రవేశపెట్టి, అవినీతికి ఆస్కారం కల్పిస్తున్నారని ఆరోపించారు.
♦️ఈ మొత్తం వ్యవహారంపై తక్షణమే సిట్టింగ్ జడ్జి ద్వారా న్యాయ విచారణ జరిపి, అవినీతికి పాల్పడిన వారందరినీ గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
♦️సింగరేణి అవినీతిపై మా పార్టీ నాయకుడు మాజీ మంత్రి హరీష్ రావు గారు లేవనెత్తిన అంశాలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు.
♦️నిజంగా ఈ వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీకి, బీజేపీ పార్టీకి సంబంధాలు లేకపోతే, సీబీఐ విచారణతో పాటు సిట్టింగ్ జడ్జి ద్వారా న్యాయ విచారణకు ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
♦️అలా చేయకపోతే కాంగ్రెస్ – బీజేపీ పార్టీల అవినీతి బంధాన్ని ప్రజల ముందు బట్టబయలు చేస్తామని, రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలను ఎండగడతామని హెచ్చరించారు. సింగరేణి కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం, ప్రజల పక్షాన పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు.
#SCAMgress#Singareni@Gandraofficial
భూపాలపల్లి అర్బన్ @BRSparty ప్రధాన కార్యదర్శి, పార్టీలో యువతతో పోటీపడి పనిచేసే క్రీయాశీలక కార్యకర్త, సీనియర్ నాయకులు బేతోజు భరత్ కుమార్ చారి గారు ఈ రోజు గుండెపోటుతో మరణించడం చాలా బాధాకరం. వారి ఆత్మకు శాంతి చేకురాలని కోరుకుంటూ...
జోహార్ బిబిచారి గారు... 🙏
నా తెలంగాణ ప్రజలకు బంధు మిత్రులకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు...
ఈ సంక్రాంతి మన జీవితాలలో వెలుగులు నింపాలని, అందరూ ఆయురారోగ్యాలతో జీవించాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుణ్ణి ప్రార్ధిస్తూ.... 🙏