Mohan Tanari
6 posts


శ్రీకాకుళం జిల్లా ముఖచిత్రాన్ని మార్చబోయే మూలపేట గ్రీన్ ఫీల్డ్ పోర్టు నిర్మాణంలో అత్యంత కీలకమైన అడ్డంకి తొలగిపోయింది. నౌపాడ పరిధిలోని 385.24 ఎకరాల ఉప్పు భూములను ఏపీ మేరిటైం బోర్డుకు 99 ఏళ్ల లీజు ప్రాతిపదికన అప్పగిస్తూ కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేయడం శుభపరిణామం.
కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి @RamMNK గారు వివిధ శాఖలతో జరిపిన నిరంతర సమన్వయం వల్లే ఈ కీలక సమస్యకు పరిష్కారం లభించింది. ఉగాది పర్వదినానికి ముందే జిల్లా ప్రజలకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది.
ఈ భూముల బదలాయింపుతో జాతీయ రహదారి నుంచి పోర్టును అనుసంధానించే 330 అడుగుల విశాల రహదారుల నిర్మాణం మరియు మౌలిక వసతుల కల్పన పనులు ఇకపై శరవేగంగా సాగుతాయి. భవిష్యత్తులో ఎగుమతి, దిగుమతులకు అవసరమైన అంతర్జాతీయ స్థాయి సదుపాయాల కల్పనతో పాటు, సుమారు 280 ఎకరాల మేర పోర్టు విస్తరణకు కూడా ఈ నిర్ణయం ఎంతగానో దోహదపడుతుంది.
ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారి మార్గదర్శకత్వంలో రికార్డు సమయంలో మూలపేట పోర్టును అందుబాటులోకి తెచ్చి, ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని పారిశ్రామిక హబ్గా మారుస్తాం. తద్వారా వేలమంది స్థానిక యువతకు ఉపాధి కల్పించి జిల్లా నుంచి వలసలను శాశ్వతంగా అరికడతాం.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల డబుల్ ఇంజిన్ కృషితో శ్రీకాకుళం జిల్లాను అభివృద్ధి పథంలో అగ్రగామిగా నిలుపుతాం.
#MulapetaPort #SrikakulamDevelopment #KinjarapuAtchannaidu #AndhraPradesh #IndustrialGrowth #NDAGovt

తెలుగు

జనసేన 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జనసేన ఏడు సిద్ధాంతాలతో ప్రజాజీవితాల్లో భాగం కావడం చాలా సంతోషం. ఈ శుభసందర్భంలో జనసేనాని పవనన్నకు, నేతలు, కార్యకర్తలకు హృదయపూర్వక అభినందనలు.
#JanaSenaFormationDay
@PawanKalyan
@JanaSenaParty

తెలుగు

Deeply concerned by the painful and sad remarks of Hon’ble President Smt. Droupadi Murmu Ji regarding the conduct of the International Santal Conference in Darjeeling, West Bengal . When an event celebrating the rich heritage of the Santhal community is organized, it should ensure the dignity, participation, and respect that such a culture deserves.
It is regrettable that circumstances arose where members of the Santhal community themselves found it difficult to attend the conference meant for them. Such cultural gatherings must reflect inclusivity, sensitivity, and proper administrative planning.
The office of the Hon’ble President of India holds the highest constitutional respect in our nation and must always be treated with the dignity it deserves. Ensuring that the Hon’ble President’s visit is conducted with utmost regard is the responsibility of the concerned administration.
India’s tribal communities are an integral part of our nation’s identity and pride. Their culture, traditions, and voices must always be honoured with sincerity and respect.
@rashtrapatibhvn @PMOIndia @HMOIndia
English

#AnnadathaSukhibhava3
#FarmersFriendlyGovt
ఆరుగాలం కష్టపడే అన్నదాతలే మన దేశానికి బలం. రైతు సంక్షేమాన్ని ప్రధమ ప్రాధాన్యంగా తీసుకుని ‘అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్’ పథకాన్ని అమలు చేస్తున్నాం. నేడు 3వ విడతగా 46.85 లక్షల మంది రైతులకు ఒక్కొక్కరికి రూ.6,000 చొప్పున రూ.2,670 కోట్లు వారి ఖాతాల్లో జమ చేశాం. 2025 ఆగస్టు 2న రూ.3,174 కోట్లు, నవంబర్ 19న రూ.3,135 కోట్లు, నేడు విడుదల చేసిన రూ.2,670 కోట్లు కలిపి మొత్తం రూ.8,985 కోట్లు రైతులకు అందించాం. రైతన్నలకు కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడు అండగా ఉంటుంది.




తెలుగు

మీ ప్రాంత బిడ్డగా, మీ కష్టసుఖాలు తెలిసిన వ్యక్తిగా ఎన్నికల సమయంలో నేను ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడమే నా ప్రథమ కర్తవ్యం.
టెక్కలి మరియు నర్సన్నపేట నియోజకవర్గాల్లో ప్రధాన సమస్యగా ఉన్న త్రాగునీటి కష్టాలను శాశ్వతంగా తీర్చేందుకు జల జీవన్ మిషన్ ద్వారా మన కూటమి ప్రభుత్వం రూ. 1202 కోట్ల భారీ నిధులను విడుదల చేసింది.
గత ఐదేళ్ల జగన్ ప్రభుత్వ హయాంలో అస్తవ్యస్తమైన పాలన, నిధుల మళ్లింపు మరియు కనీస నిర్వహణ లోపంతో ఉత్తరాంధ్ర ప్రజలు గుక్కెడు నీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గత ప్రభుత్వం కేవలం ప్రచారానికే పరిమితమై ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేసింది.
కానీ నేడు మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పూర్తి చిత్తశుద్ధితో పనిచేసి, రక్షిత మంచినీటి సరఫరా ప్రాజెక్టును పట్టాలెక్కించింది.
ఈ నిధులతో రెండు నియోజకవర్గాల్లోని ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికీ శుద్ధి చేసిన నీరు అందుతుంది. యుద్ధ ప్రాతిపదికన పనులు ప్రారంభించి ప్రజల దాహార్తిని తీరుస్తాం.
మన ప్రాంతంపై ప్రత్యేక ప్రేమతో ఈ ప్రాజెక్టుకు సహకరించిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారికి మరియు ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
ప్రజల సంక్షేమమే లక్ష్యంగా మా ప్రయాణం కొనసాగుతుంది.

తెలుగు

@katchannaidu @naralokesh Sir maku annadata sukhibhava padaledhu sir ,last turm kuda padaledhu sir
Indonesia

ఘన స్వాగతం! యువనేత రాకతో భామినిలో పండుగ వాతావరణం!
రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి, యువత ఆశాజ్యోతి శ్రీ @naralokesh గారికి పాలకొండ నియోజకవర్గం, భామినిలో నా తరపున మరియు కార్యకర్తల తరపున అపూర్వ స్వాగతం పలికే అవకాశం దొరికింది.
ఈరోజు భామినిలో నిర్వహించిన తెదేపా కార్యకర్తల సమావేశానికి విచ్చేసిన లోకేష్ గారిని సాదరంగా ఆహ్వానించడం జరిగింది. యువ నాయకత్వంపై కార్యకర్తల్లో ఉన్న ఉత్సాహం, విశ్వాసం ఈ సభలో కళ్లారా చూశాను. జై లోకేష్ నినాదాలతో భామిని దద్దరిల్లింది!
కార్యకర్తలే మా బలం!
ఈ సమావేశంలో లోకేష్ గారు కార్యకర్తలతో ఆత్మీయంగా మాట్లాడారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంవిజయానికి, నూతన శకానికి కారణం కార్యకర్తల నిబద్ధత, నిస్వార్థ సేవ అని ఆయన కొనియాడారు.
సీఎం శ్రీ @ncbn గారి నాయకత్వంలో మన కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని, కార్యకర్తలకు ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని లోకేష్ గారు భరోసా ఇచ్చారు.
✅ రైతన్నల సంక్షేమం,
✅ యువత భవితవ్యం,
✅ అభివృద్ధి వికేంద్రీకరణ
లక్ష్యంగా పనిచేస్తున్న మన ప్రభుత్వం తరపున, కార్యకర్తలందరూ డబుల్ స్పీడ్తో ముందుకు సాగాలని కోరుతున్నాను.
#KinjarapuAtchannaidu #NaraLokesh #TDP #KutamiPrabhutvam #Palakonda #Bhamini #తెలుగుదేశం #AndhraPradesh




తెలుగు