Pamarthi RamaKrishna (RK)

47.2K posts

Pamarthi RamaKrishna (RK) banner
Pamarthi RamaKrishna (RK)

Pamarthi RamaKrishna (RK)

@RAM2347RK

BJP Krishna District General Secretary, MSc Chemistry, MSc Diploma in Advanced Aqua Culture

Vijayawada, AndhraPrades. Katılım Aralık 2021
4.8K Takip Edilen2.8K Takipçiler
Sabitlenmiş Tweet
Pamarthi RamaKrishna (RK)
Pamarthi RamaKrishna (RK)@RAM2347RK·
#RajaRamanna : బావి తవ్వుతున్నాం అని చెప్పి.. దేశ భద్రతనే మార్చేశారు.. ఇది రాజా రామన్న కథ 1974 మే 18.. పోఖ్రాన్ ఎడారిలో అమెరికా నిఘా నేత్రాలైన CIA శాటిలైట్లకు చిక్కకుండా, మిలిటరీ దుస్తుల్లో మారుపేర్లతో తిరుగుతూ భారత్‌ను అణు శక్తిగా మార్చిన అపర వ్యూహకర్త, శాస్త్రవేత్త డాక్టర్ రాజా రామన్న. చైనా, పాకిస్తాన్ల నుంచి ముప్పు పొంచి ఉన్న వేళ, అత్యంత ఒత్తిడి మధ్య "Smiling Buddha" ప్రాజెక్ట్‌ను విజయవంతం చేసిన ఈ అన్సంగ్ హీరో లీడర్‌షిప్ స్టోరీ ఈ రోజు మీకోసం!
తెలుగు
2
65
220
15.1K
Pamarthi RamaKrishna (RK)
#Nehru : 1949 నెహ్రూ చారిత్రక బ్లండర్ : జాతీయ ప్రయోజనమా.. వ్యక్తిగత ప్రభావమా? "ఎట్టి పరిస్థితుల్లోనూ బ్రిటిష్ కామన్వెల్త్‌లో చేరేది లేదు" అని 1947లో భీష్మించిన జవహర్‌లాల్ నెహ్రూ, సరిగ్గా రెండేళ్లలో ఆ నిర్ణయాన్ని ఎందుకు మార్చుకున్నారు? మే 16, 1949న రాజ్యాంగ సభను దిగ్భ్రాంతికి గురిచేసిన ఆ ప్రతిపాదన వెనుక ఉన్న రహస్యం ఏమిటి? లార్డ్ మౌంట్‌బాటన్ దౌత్యం, లేడీ ఎడ్వినా వ్యక్తిగత ప్రభావం భారతదేశ సార్వభౌమాధికారాన్ని ఒక వలసవాద రాజీ వైపు ఎలా నడిపించాయో.. నేటి అంతర్జాతీయ పరిణామాల సాక్షిగా విశ్లేషించే ప్రత్యేక కథనం.
తెలుగు
0
1
1
13
Pamarthi RamaKrishna (RK) retweetledi
BJP
BJP@BJP4India·
𝐅𝐨𝐫 𝐝𝐞𝐜𝐚𝐝𝐞𝐬, 𝐈𝐧𝐝𝐢𝐚’𝐬 𝐛𝐨𝐫𝐝𝐞𝐫𝐬 𝐰𝐞𝐫𝐞 𝐭𝐫𝐞𝐚𝐭𝐞𝐝 𝐚𝐬 𝐰𝐞𝐚𝐤 𝐟𝐫𝐨𝐧𝐭𝐢𝐞𝐫𝐬. 𝐓𝐨𝐝𝐚𝐲, 𝐭𝐡𝐞𝐲 𝐚𝐫𝐞 𝐛𝐞𝐢𝐧𝐠 𝐭𝐫𝐚𝐧𝐬𝐟𝐨𝐫𝐦𝐞𝐝 𝐢𝐧𝐭𝐨 𝐡𝐢𝐠𝐡-𝐭𝐞𝐜𝐡 𝐬𝐞𝐜𝐮𝐫𝐢𝐭𝐲 𝐬𝐡𝐢𝐞𝐥𝐝𝐬. 🛡️🇮🇳 Under PM Modi, border security has witnessed one of the biggest modernisation drives in independent India’s history. 🔹 Smart Border Project launched across nearly 6,000 km along Pakistan & Bangladesh borders 🔹 AI-powered cameras, drones, radars, thermal imaging and ground sensors deployed 🔹 ₹13,000+ crore invested under the Border Infrastructure & Management scheme 🔹 1,812 km of border roads built in difficult terrain 🔹 3,180 km fencing completed along the Indo-Bangladesh border 🔹 1,000+ km floodlighting installed to curb infiltration 🔹 Vibrant Villages Programme boosting roads, healthcare and electricity in border areas From soft borders to smart borders, India is building security through technology, infrastructure and decisive governance. 𝐁𝐡𝐚𝐫𝐚𝐭’𝐬 𝐛𝐨𝐫𝐝𝐞𝐫𝐬 𝐚𝐫𝐞 𝐧𝐨 𝐥𝐨𝐧𝐠𝐞𝐫 𝐯𝐮𝐥𝐧𝐞𝐫𝐚𝐛𝐥𝐞. 𝐓𝐡𝐞𝐲 𝐚𝐫𝐞 𝐛𝐞𝐜𝐨𝐦𝐢𝐧𝐠 𝐚 𝐟𝐨𝐫𝐭𝐫𝐞𝐬𝐬. 🛡️
English
6
40
92
2.6K
Pamarthi RamaKrishna (RK)
“ఒక రిటైర్డ్ దంపతులు… సముద్రం చూడలేని గ్రామంలో ఓ భారీ ఓడ కట్టారు అంటే నమ్ముతారా?” కానీ ఇది సినిమా కథ కాదు… నిజంగా జరిగిన సంఘటన. ఈ ఆశ్చర్యకరమైన ఘటన కేరళలోని కొడుంగల్లూరు ప్రాంతంలో జరిగింది. మాజీ నావికాదళ ఉద్యోగి జోసఫ్ మరియు ఆయన భార్య చాలా ఏళ్లుగా ఒక ప్రత్యేకమైన ఇల్లు నిర్మించాలని కల కనేవారు. సముద్రంపై ప్రేమతో పెరిగిన జోసఫ్‌కు ఓడ అంటే ప్రాణం. retirement తర్వాత ఆ కలను నిజం చేయాలని నిర్ణయించుకున్నారు. చాలామంది “ఇది అసాధ్యం” అన్నారు. కానీ వారు ఆగలేదు. తమ పొదుపు మొత్తాన్ని ఉపయోగించి, ఇంటి రూపాన్ని పూర్తిగా ఓడలా design చేయించారు. బయట నుంచి చూస్తే అది నిజమైన ship లాగానే కనిపిస్తుంది. windows, decks, steering area… అన్నీ ఓడ మాదిరిగానే రూపొందించారు. ఈ ఇంటిని నిర్మించడానికి స్థానిక కార్మికులు, engineers కలిసి చాలా నెలలు కష్టపడ్డారు. గ్రామ ప్రజలు మొదట ఆశ్చర్యపోయినా… తర్వాత అది వారి ప్రాంతానికి గుర్తుగా మారింది. ఇప్పుడు ఆ ship house చూడటానికి చాలామంది tourists వస్తున్నారు. ఈ కథలో డబ్బు కంటే గొప్పది determination. leadership అంటే పెద్ద పదవులు కాదు… మన కలను వదలకుండా నిలబడటం అని ఈ దంపతులు నిరూపించారు. politics, governance, public service గురించి మాట్లాడే సమాజంలో… సాధారణ మనుషుల కలలు కూడా సమాజానికి inspiration అవుతాయని ఈ కథ చెబుతోంది. ప్రపంచం “అసాధ్యం” అన్నా… మనసు “సాధ్యం” అంటే చాలు. ఒక చిన్న కల… ఒక గ్రామాన్నే famous చేసింది. #Kerala #ShipHouse #Inspiration #Leadership #DreamHouse #PublicService #Motivation
Pamarthi RamaKrishna (RK) tweet media
తెలుగు
0
1
1
13
Pamarthi RamaKrishna (RK)
🥋 తమిళ సంస్కృతికి గర్వకారణమైన సిలంబం (#Silambam) కళను ప్రపంచానికి పరిచయం చేసిన పుదుచ్చేరి గురువు కె. పజనివేల్ (K. Pajanivel) గారికి పద్మశ్రీ (#PadmaShri) పురస్కారం లభించింది. 🇮🇳 అవార్డు స్వీకరించే ముందు ప్రధాని నరేంద్ర మోదీ (#NarendraModi) ముందు వేదికపై నమస్కరించడం అందరినీ భావోద్వేగానికి గురిచేసింది. 🙏 మరచిపోయిన సంప్రదాయ కళాకారులకు ఇప్పుడు జాతీయ స్థాయిలో గౌరవం దక్కుతోందని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ✨ #PMModi #TamilCulture #IndiaNews #PadmaAwards
Pamarthi RamaKrishna (RK) tweet media
తెలుగు
0
2
6
55
Mallampalli Manirupa kishore
Mallampalli Manirupa kishore@Mallampallkygb·
భారతదేశ గతిని మార్చిన ప్రధాని మోడీ 12 చారిత్రాత్మక నిర్ణయాలు "प्रधान सेवक" #12YearsOfModiEra
Mallampalli Manirupa kishore tweet media
తెలుగు
1
0
1
5
Pamarthi RamaKrishna (RK)
భారతదేశ గతిని మార్చిన ప్రధాని మోడీ 12 చారిత్రాత్మక నిర్ణయాలు "प्रधान सेवक" #12YearsOfModiEra
Pamarthi RamaKrishna (RK) tweet media
తెలుగు
0
5
18
255
Pamarthi RamaKrishna (RK)
ఇదీ కాంగ్రెస్ చేసిన అరాచకం మొగలులు... భారతీయులు అయ్యారు భారతీయులు... నాస్తికులు అయ్యారు పాకిస్థానీలు... కశ్మీరీలు అయ్యారు కశ్మీరీ పండితులు... శరణార్ధులు అయ్యారు నెహ్రూలు... గాంధీలు అయ్యారు..?? ఈ దేశ పౌరులను మోసం చేశారు చరిత్రను మరచిపోతే... భవిష్యత్తు ప్రమాదంలో పడుతుంది
Pamarthi RamaKrishna (RK) tweet media
తెలుగు
1
39
78
670
Pamarthi RamaKrishna (RK)
☀️ ఢిల్లీలో మండుతున్న ఎండల మధ్య ట్రాఫిక్ పోలీసుల కోసం కొత్త టెక్నాలజీని పరీక్షిస్తున్నారు! 🚦 44°C పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో, ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు సోలార్ సహాయంతో పనిచేసే “AC హెల్మెట్లు” 🪖❄️ మరియు పోర్టబుల్ కూలింగ్ ఫ్యాన్లను ఉపయోగిస్తున్నారు. ఈ ప్రత్యేక హెల్మెట్లు తీవ్ర ఎండల్లో విధులు నిర్వహించే సిబ్బందికి హీట్ స్ట్రెస్, హీట్ స్ట్రోక్ నుంచి రక్షణ ఇవ్వడమే లక్ష్యం. 👮‍♂️ సోషల్ మీడియాలో ఈ నిర్ణయానికి భారీ ప్రశంసలు లభిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఇలాంటి సదుపాయాలు అమలు చేయాలని చాలామంది కోరుతున్నారు. 🇮🇳 #DelhiTrafficPolice #Heatwave #India #PoliceSafety #Summer #DelhiBJP
Pamarthi RamaKrishna (RK) tweet media
తెలుగు
0
4
11
150
Pamarthi RamaKrishna (RK)
“మతం మారినోళ్లు దేశాన్ని ప్రేమించలేరు ” భారతరత్న BR అంబేద్కర్.. 👌🪷👌🪷👌🪷
Pamarthi RamaKrishna (RK) tweet media
తెలుగు
6
77
336
3.3K
Pamarthi RamaKrishna (RK)
రాజేంద్ర ప్రసాద్: ఆత్మగౌరవ శిఖరం నెహ్రూ అభ్యంతరాలను, బెదిరింపులను తృణీకరించి సోమనాథ్ వెళ్ళిన రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్.. నిజమైన ‘భారతీయత’కు నిలువుటద్దం. ఆయన నెహ్రూకు రాసిన సమాధానం ఒక గొడ్డలి పెట్టు: “నేను పౌరుడిగా అన్ని మతాలను గౌరవిస్తాను, కానీ నా ధర్మాన్ని పాటించే హక్కును ఏ పదవీ అడ్డుకోలేదు.” ప్రసాద్ గారి దృష్టిలో జాతీయత అంటే సంస్కృతి లేని శూన్యం కాదు; అది అన్ని వర్ణాల కలయికతో కూడిన సంస్కృతి-ఆధారిత జాతీయత. ఆయన వెళ్ళడం వల్లనే సోమనాథ్ పునరుద్ధరణ ఒక ‘ప్రభుత్వేతర’ వేడుకగా కాకుండా, ఒక ‘జాతి’ వేడుకగా చరిత్రలో నిలిచింది. అణిచివేత - మార్కెటింగ్ - మౌనం నెహ్రూ సెక్యులరిజం కేవలం ఒక సిద్ధాంతం కాదు, అది హిందూ సంస్కృతిపై ఉన్న అసౌకర్యాన్ని ‘లౌకికవాదం’ అనే పేరుతో మార్కెట్ చేసిన ఒక రాజకీయ ఎత్తుగడగా అభివర్ణిస్తారు. జాతీయ గర్వానికి చిహ్నమైన సోమనాథ్‌ను స్టేట్ లెవల్‌లో నిరసించడం ద్వారా, రాబోయే తరాలకు “మన మూలాల గురించి మాట్లాడటం నేరం” అనే తప్పుడు సంకేతాన్ని పంపినట్లైంది. దీనివల్ల భారత జాతీయత విభజించబడింది. ఒకవైపు సంస్కృతిని ప్రేమించే ప్రజలు, మరోవైపు సంస్కృతిని అసహ్యించుకునే వర్గంగా విడిపోయింది. ముగింపు: నేటి మేల్కొలుపు సోమనాథ్ ఘట్టం మనకు నేర్పిన పాఠం ఒక్కటే: పునాది లేని భవనం ఎలా నిలబడదో, సంస్కృతి లేని జాతీయత కూడా అలానే కుప్పకూలుతుంది. సెక్యులర్ ముసుగును చీల్చుకుని రాజేంద్ర ప్రసాద్ గారు ఎగురవేసిన జెండా నేటికీ సజీవంగా ఉంది. మనం మన చరిత్రను గర్వంగా చెప్పుకోవాలి. మన మూలాలను గౌరవించుకోవాలి. ఎందుకంటే, జాతీయత అంటే కేవలం సరిహద్దులు కావు, అది వేల ఏళ్ల నాటి మన అజేయమైన అస్తిత్వం! #somnathtemple | #nehruvspatel | #IndianHistory #secularismvsnationalism #SomnathReconstruction #HistoricalDebates #indiapastandpresent #CulturalRenaissance #JawaharlalNehru #SardarPatel #DrRajendraPrasad #somnathtemplehistory #IndianPolitics #nationalidentity #historicalfacts #SpiritualIndia #knowledgeispower #BharatHistory
తెలుగు
0
0
0
11
Pamarthi RamaKrishna (RK)
సెక్యులరిజం Vs జాతీయత : సోమ్ నాథ్ వేడుకలను నెహ్రూ ఎందుకు వ్యతిరేకించారు? 1951.. దేశం అప్పుడే స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటోంది. కానీ ఆ గాలిలో విభజన రక్తపు వాసన ఇంకా పచ్చిగానే ఉంది. అరేబియా సముద్ర తీరంలో వేల ఏళ్ల బానిసత్వపు గాయాలను మాన్పుతూ ‘సోమనాథ్’ పునర్వైభవం పొందుతోంది. ఒక జాతి, తాను పోగొట్టుకున్న ఆత్మను తిరిగి పొందుతున్న క్షణం అది. కానీ, అదే సమయంలో ఢిల్లీ పీఠంపై కూర్చున్న మేధావులకు అది ‘మతతత్వం’లా కనిపించింది. ఇక్కడే మొదలైంది.. భారతీయతకు మరియు దిగుమతి చేసుకున్న ‘సెక్యులరిజం’కు మధ్య జరిగిన అసలైన యుద్ధం! జూనాగఢ్ విలీనం తర్వాత సోమ్ నాథ్ శిథిలాలను చూసి చలించిపోయిన పటేల్.. "ఈ ఆలయాన్ని మళ్ళీ పున:నిర్మిస్తాం" అని శపథం చేశారు. అది కేవలం ఒక హామీ కాదు.. అది ఒక జాతి తన చరిత్రను మళ్ళీ రాసుకునే ప్రయత్నం. అయితే ఆలయ నిర్మాణం ప్రభుత్వ నిధులతో వద్దని గాంధీజీ వారించడంతో.. ప్రజలు ఇచ్చే విరాళాలతో ఆలయాన్ని నిర్మించేందుకు పటేల్.. 'సోమనాథ్ ట్రస్ట్'ను ఏర్పాటు చేశారు. అయితే ఈ క్రమంలో పటేల్ మరణంతో ఆలయ బాధ్యతను కేఎం మున్షీ భుజానికెత్తుకున్నారు. ఈ మధ్యకాలంలో ఆలయ పునర్నిర్మానాన్ని అప్పటి ప్రధాని నెహ్రూ చాలాసార్లు తీవ్రంగా వ్యతిరేకించారు. "నేను ఈ హిందూ పునరుద్ధరణవాదాన్ని (Hindu Revivalism) ఇష్టపడటం లేదు" అని నెహ్రూ స్పష్టంగా మున్షీతో చెప్పారు. దానికి మున్షీ ఇచ్చిన సమాధానం ఏంటంటే: "గతాన్ని విస్మరించి మనం భవిష్యత్తును నిర్మించలేము. సోమనాథ్ మన జాతీయ ఆత్మగౌరవానికి చిహ్నం." అని అన్నారు. మే 11, 1951 న జరిపించతలపెట్టిన ఆలయ ప్రారంభోత్సవానికి మున్షీ గారు రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్‌ను ఆహ్వానించారు. ఇది నెహ్రూకు అస్సలు నచ్చలేదు. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి వెళ్లడం అంటే మతానికి ప్రాధాన్యత ఇచ్చినట్లవుతుందని నెహ్రూ ఆందోళన పడ్డారు. అంతేకాకుండా.. రాష్ట్రపతికి లేఖ రాస్తూ.. "మీరు వెళ్లడం వల్ల మన సెక్యులర్ ఇమేజ్ దెబ్బతింటుంది" అని హెచ్చరించారు. అంతటితో ఆగని నెహ్రూ.. సైలెంట్ యాక్షన్ కూడా తీసుకున్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల జాబితా నుండి తొలగించాలని ఆదేశిస్తూ.. గెజిట్ కూడా విడుదల చేశారు. అలాగే సౌరాష్ట్ర (ప్రస్తుత గుజరాత్) ముఖ్యమంత్రికి లేఖ రాస్తూ.. రాజేంద్ర ప్రసాద్ రాకకు భారీ ఏర్పాట్లు చేయవద్దని, ప్రభుత్వ నిధులు ఖర్చు చేయొద్దన్నారు. ఈ విషయంలో కేంద్రం తరపున ఎలాంటి సంబంధం పెట్టుకోకూడదని గట్టిగా నిర్ణయించుకున్నామని.. ఇది రాజేంద్రప్రసాద్ వ్యక్తిగత పర్యటనగానే చూడాలని సూచించారు. ఆల్ ఇండియా రేడియో (AIR) లో ఈ కార్యక్రమ ప్రత్యక్ష ప్రసారం జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఇంకా విదేశాల్లోని భారత రాయబారులకు (Ambassadors) ఒక సర్క్యులర్ కూడా పంపారు. అందులో "సోమనాథ్ వేడుకలకు భారత ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు, ఇది ఒక ప్రైవేట్ వ్యవహారం" అని స్పష్టం చేశారు. కానీ.. రాజేంద్రప్రసాద్ గారు నెహ్రూ నేతృత్వంలోని ప్రభుత్వం పెట్టిన ఆంక్షలను లెక్కచేయకుండా.. ఒక సామాన్య వ్యక్తిగా సోమ్ నాథ్ వెళ్లి.. సోమ్ నాథ్ ను ప్రారంభించడంతోపాటు.. జ్యోతిర్లింగాన్ని పున:ప్రతిష్ట చేశారు. అసలు సోమ్ నాథ్ ఆలయ పునర్నిర్మాణంపై నెహ్రూకు ఎందుకింత వ్యతిరేకత? ఇందులో ప్రముఖమైనది: దేశం ఇప్పుడే విభజన గాయాల నుంచి కోలుకుంటోందని, ప్రభుత్వం మరియు ప్రభుత్వ ప్రతినిధులు అన్ని రకాల మతపరమైన ప్రదర్శనలకు దూరంగా ఉండాలని కోరుకున్నారు. మెజారిటీ మతపరమైన వేడుకల్లో రాష్ట్రపతి పాల్గొనడం, మైనారిటీలలో భయాందోళనలు కలిగిస్తుందని ఆయన భావించారు. మరి విభజన పాపం ఎవరిది? నెహ్రూ సోమనాథ్‌ను వ్యతిరేకించడానికి చెప్పిన విషయం: “విభజన గాయాలు ఇంకా పచ్చిగానే ఉన్నాయి.” ఎంతటి హాస్యాస్పదం ఇది! అసలు ఆ విభజనకు బీజం వేసింది ఎవరు? తమ రాజకీయ వైఫల్యాల వల్ల దేశం విచ్ఛిన్నమైతే, ఆ నేరాన్ని భారతీయ సంస్కృతిపై వేసి, “హిందూ చిహ్నాలు ప్రదర్శిస్తే మైనారిటీలు భయపడతారు” అని వాదించడంలో నైతికత ఎంత? అందువల్లే సొంత తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ‘సెక్యులరిజం’ అనే ముసుగును నెహ్రూ ఒక ఆయుధంగా వాడుకున్నారనే విమర్శలున్నాయి. నెహ్రూ సెక్యులరిజం: జాతీయతను ఛిద్రం చేసిందా? పాకిస్తాన్ తన ఇస్లామిక్ గుర్తింపును గర్వంగా ప్రకటించుకుంటుంటే, భారత్ మాత్రం తన వేల ఏళ్ల సనాతన ధర్మాన్ని ప్రదర్శించేందుకు అప్పటి పాలకులు (నెహ్రూ) ససేమీరా ఒప్పుకోలేదు. మెజారిటీ సంస్కృతిని “మైనస్ ఫ్యాక్టర్”గా చూడటం ఏ రకమైన న్యాయం? ఒక దేశం తన చరిత్రలోని గొప్పతనాన్ని (Cultural Pride) గౌరవించుకోవడాన్ని అడ్డుకోవడం అంటే, ఆ దేశానికి ‘నైతిక వెన్నెముక’ లేకుండా చేయడమే. నెహ్రూ విధానం భారత్‌ను ఒక “అధోగతి చెందిన జాతీయ ఆత్మవిశ్వాసం” ఉన్న దేశంగా మార్చాలని చూసినట్లు ఇక్కడ అర్థం అవుతుంది.
తెలుగు
1
2
1
46
Pamarthi RamaKrishna (RK)
ముందు మీ గ్రామానికి, మీ మండలానికి, మీ జిల్లాకి గత 60 సం లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏమి చేసిందో తెలుసుకోండి అలాగే ప్రస్తుత బిజెపి ప్రభుత్వం ఈ 12 సం లలో ఏం చేసిందో తెలుసుకో ఆ తరువాత మీ అమూల్యమైన శాపనార్థాలు ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోండి తెలుసుకునే సమయం ఆశక్తి లేకపోతే మీ గ్రామంలో డీటైల్స్ పంపండి నేనే వివరాలు పంపుతాను
తెలుగు
0
0
0
3
భవాని ఆళ్ళ/Bhavani Alla 🇮🇳(Kisan ka Parivar)
@RAM2347RK రాముడు లేకపోతే మీకు బ్రతుకే లేదు. రామరాజ్యం అని నరకం చూపిస్తున్నారు. రాముడు కూడా కళ్ళు తెరుస్తారు, మీ చెత్త పాలనని అంతం చేస్తాడు.
తెలుగు
1
0
0
3
Pamarthi RamaKrishna (RK)
🚨🇮🇳 ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన కాంస్య శ్రీరామ విగ్రహం ఆవిష్కరణకు భారత్ సిద్ధం! 🔥🛕✨ భారత ఆధ్యాత్మిక చరిత్రలో మరో మహత్తర ఘట్టం నమోదుకానుంది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన 77 అడుగుల కాంస్య శ్రీరామ విగ్రహం గోవాలోని పవిత్ర పార్టగల్ మఠంలో ఆవిష్కరించబడనుంది. 🙏🚩 ఈ అద్భుత విగ్రహం ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ చర్చకు దారితీస్తోంది. భక్తులు, సనాతన ధర్మాన్ని విశ్వసించే ప్రజలు దీనిని భారత ఆధ్యాత్మిక వారసత్వానికి, సంస్కృతికి, నాగరికతకు ప్రతీకగా అభివర్ణిస్తున్నారు. 🌍🕉️ అత్యంత శిల్పకళాత్మక నైపుణ్యంతో రూపొందించిన ఈ భారీ కాంస్య విగ్రహం భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా యాత్రికులు, పర్యాటకులు, భక్తులను ఆకర్షించే గొప్ప ఆధ్యాత్మిక కేంద్రమవుతుందని భావిస్తున్నారు. 🏗️✨ గోవాలోని చారిత్రాత్మక పార్టగల్ మఠంలో జరగనున్న ఈ వేడుక కేవలం ఒక ధార్మిక కార్యక్రమం మాత్రమే కాదు భారతీయ సంప్రదాయాల పునర్జన్మకు, సనాతన సంస్కృతి పునరుద్ధరణకు చిహ్నంగా మారుతోంది. 🇮🇳🔥 శ్రీరాముడు అంటే సత్యం, ధర్మం, క్రమశిక్షణ, ధైర్యం, ఆదర్శ నాయకత్వానికి ప్రతీక అని కోట్లాది మంది విశ్వసిస్తున్నారు. 📜⚔️ అందుకే ఈ విగ్రహాన్ని చాలామంది “భారత్ తన ఆధ్యాత్మిక గర్వాన్ని ప్రపంచానికి గట్టిగా చాటుతున్న సమయం”గా చూస్తున్నారు. 🌏🚩 అయోధ్య రామమందిరం తరువాత దేశవ్యాప్తంగా శ్రీరాముడిపై భక్తి, భారతీయ సంస్కృతిపై ఆసక్తి మరింత పెరుగుతోంది. 🌸🛕 ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు కూడా ఇప్పుడు తమ సనాతన మూలాలను మరింత గర్వంగా ఆచరిస్తున్నారు. ఈ మహా విగ్రహం కేవలం ఒక నిర్మాణం కాదు… ఇది విశ్వాసానికి ప్రతీక. ఇది ఐక్యతకు సందేశం. ఇది భారత నాగరికత శాశ్వత మహిమకు గుర్తు. 🚀🇮🇳 జై శ్రీరామ్! 🚩🙏
Pamarthi RamaKrishna (RK) tweet media
తెలుగు
5
45
292
4K
Pamarthi RamaKrishna (RK) retweetledi
PVN Madhav (Modi Ka Parivar)
“వికసించిన ప్రజా పద్మాలు”… ప్రజల సేవలో నిస్వార్థంగా అంకితమై పనిచేసిన నిజమైన సేవామూర్తులకు మోదీ ప్రభుత్వం నిజమైన గౌరవం అందిస్తోంది . #PadmaAwards
తెలుగు
0
9
20
215
Pamarthi RamaKrishna (RK) retweetledi
PVN Madhav (Modi Ka Parivar)
📍ఈ రోజే 2014లో: ప్రధానమంత్రి @narendramodi గారు తొలిసారిగా భారత ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. #12YearsOfModiEra
తెలుగు
3
9
41
540
Pamarthi RamaKrishna (RK)
హెచ్ వి శేషాద్రి : సంఘ వికాసానికి అంకితమైన దేశభక్తుడు సంఘం కోసం తన జీవితమంతా అంకితం చేసిన పూజనీయులు హెచ్ వీ శేషాద్రి. వీరి పూర్తి పేరు హెంగసంద్ర వెంకటరామయ్య శేషాద్రి. వీరు మే 26, 1926న బెంగళూరులో జన్మించారు. 1943లో స్వయం సేవక్‌గా మారి, 1946లో మైసూర్ విశ్వవిద్యాలయం నుంచి రసాయన శాస్త్రంలో ప్రథమ శ్రేణిలో బంగారు పతకం సాధించిన తర్వాత ఎమ్మెస్సీ చేశారు. తరువాత సంఘ్ ప్రచారక్‌గా తన జీవితాన్ని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌కు అంకితం చేశారు. మొదట శేషాద్రి గారి పని ప్రదేశం మంగళూరు విభాగ్ కాగా, తర్వాత కర్ణాటక రాష్ట్రం, ఆ తర్వాత యావత్ దక్షిణ భారతదేశం. 1986 వరకు వీరు దక్షిణాదిలో చురుకుగా పని చేశారు. శ్రీ యాదవరావ్ జోషిచే బాగా ప్రభావితమైన శేషాద్రిగారు 1987 నుండి 2000 వరకు సంఘ్ సర్‌కార్యవాహ. ఈ కారణంగా వారు భారతదేశమంతటా, ఇంకా ప్రపంచంలోని కొన్ని దేశాలలోను పర్యటించారు. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో సైతం సరైన నాయకత్వాన్ని అందించారు. శేషాద్రి గారు పనిలో నిమగ్నమైనప్పటికీ, ప్రతిరోజూ రాయడానికి సమయం కేటాయించుకునేవారు. తన రచనల ద్వారా ఎందరోమందికి స్పూర్తి ప్రదాతగా నిలిచారు. వారు తరచుగా విక్రమ్ వీక్లీ, ఉత్థాన్ మాసపత్రిక, ఢిల్లీ నుంచి వెలువడే పాంచజన్య, ఆర్గనైజర్ వీక్లీ, లక్నో నుంచి ప్రచురించే రాష్ట్రధర్మ మాసపత్రికలకు వ్యాసాలు రాసేవారు. ఆయన కథనాల కోసం పాఠకులు ఆసక్తిగా ఎదురుచూసేవారు. సంఘతో పాటుగా ఇతర హిందూ సాహిత్య ప్రచురణల కోసం శ్రీ యాదవరావు పర్యవేక్షణలో ‘రాష్ట్రోత్తన్ పరిషత్’ను బెంగుళూరులో స్థాపించారు. సేవాకార్యక్రమాల విస్తరణకు, సంస్కృత అభ్యున్నతికి కూడా శేషాద్రి ఎంతో కృషి చేశారు. శేషాద్రి గారు వందకు పైగా చిన్న పెద్ద పుస్తకాలు రాశారు; రెండవ సర్‌సంఘ్‌చాలక్ శ్రీ గురూజీ ప్రసంగాలను ‘బంచ్ ఆఫ్ థాట్స్’ రూపంలో మొదట సంకలనం చేసింది వీరే. దాని సంచికలు నేటికీ ఏటా ప్రచురించబడుతున్నాయి. ఇవి కాకుండా, వీరి ముఖ్యమైన రచనలు కృతిరూప్ సంఘ్ దర్శన్, ఔర్ దేశ్ బనుత్ గయా, నన్యాహ్ పంథా, వైశ్యాన్, ది వే, Hindus abroad: The dilemma, dollar or dharma?, ఉజాలే కి ఓర్… మొదలైనవి. ఇవన్నీ అనేక భాషల్లోకి అనువదించబడ్డాయి. ఇక శివాజీ మహరాజ్ పై శేషాద్రి రాసిన యుగావతార, ప్రత్యేకంగా సమాజ హితంపై రాసిన అమ్మ బగిలు అనే వ్యాసాలు, చింతనగంగ, విభజన యొక్క విషాధ కథ, భుగిలు అనే పుస్తకాలు, ఆర్ఎస్ఎస్ పై వారు రాసిన “ఎ విజన్ ఇన్ యాక్షన్” పుస్తకాలు అత్యంత ప్రసిద్ధిపొందాయి. వారు రాసిన వ్యాసాల సంకలనం అమ్మ బగిలు 1982లో కర్ణాటక రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డును కూడా గెలుచుకుంది. వారి రచన “ది ట్రాజిక్ స్టోరీ ఆఫ్ పార్టిషన్” (తెలుగులో విభజన యొక్క విషాద గాథ) అనేది విభజన సమస్యకు భిన్నమైన దృక్పథాన్ని అందించిన ఏకైక పుస్తకాలలో ఒకటి. దీన్ని భారతీయ చరిత్ర గురించి తెలుసుకోవాలనుకునే ప్రతి ఒక్కరూ తప్పకుండా చదవాలి. శేషాద్రి గారి ప్రసంగ శైలి కూడా అద్భుతంగా ఉంటుంది. సరళమైన మరియు ఆసక్తికరమైన ఉదాహరణలు ఇస్తూ తన అభిప్రాయాలను శ్రోతలకు తెలియజేసేవారు. 1984లో న్యూయార్క్ (అమెరికా)లో జరిగిన ప్రపంచ హిందూ సదస్సుకు, బ్రాడ్‌ఫోర్డ్‌లో (UK) జరిగిన హిందూ సంగమానికి ప్రత్యేకంగా ఆహ్వానం అందుకున్నారు. ఆయన ప్రసంగాలను అక్కడి ప్రజలు ఎంతగానో మెచ్చుకున్నారు. నాల్గవ సర్‌సంఘచాలక్ రజ్జు భయ్యా అనారోగ్య కారణాలతో సెలవు తీసుకోవాలనుకున్నప్పుడు, స్వయంసేవకులందరూ శేషాద్రి జీ ఈ బాధ్యతను చేపట్టాలని కోరుకున్నారు; కానీ వారు ఇందుకు సిద్ధంగా లేరు. మితిమీరిన శారీరక, మానసిక శ్రమ కారణంగా అనారోగ్యం బారిన పడ్డారు. తన ఆరోగ్యం బాగోలేదని, అందుకే ఈ పని ఓ యువకుడికి ఇవ్వాలని అన్నారు. చివరికి ఈ బాధ్యతను సుదర్శన్ జీకి అప్పగించారు. శేషాద్రి జీ సహ-సర్‌కార్యవాహగాను, ప్రచారక్ ప్రముఖ్‌గాను ఎప్పుడు పనిచేస్తూనే ఉన్నారు. శేషాద్రి గారి చివరి రోజుల్లో బెంగుళూరు కార్యాలయంలో ఉండేవారు. అక్కడ ఒక రోజు సాయంత్రం ఆయన జారి పడటంతో కాలులో ఎముక విరిగింది. వారి తుంటి ఎముక గతంలో కూడా ఒకసారి విరిగింది. ఈసారి చికిత్సా సమయంలో వారి శరీరం ఇన్ఫెక్షన్ బారిన పడింది. దీంతో అవయవాలన్నీ క్రమంగా క్రియారహితంగా మారాయి. కొన్ని రోజులు ఆసుపత్రిలోనే ఉంచారు. ఈ దేహంతో సంఘ కార్యం ఇక సాధ్యం కాదని భావించి విరామం తీసుకున్నారు. ఆయన కోరికను గౌరవించి హాస్పిటల్ నుంచి సంఘ్ కార్యాలయానికి తీసుకొచ్చారు. జీవితకాలం మొత్తం సంఘ వికాసానికి పనిచేసిన శేషాద్రి గారు తమ 80 సంవత్సరాల వయసులో ఆగస్టు 14, 2005 సాయంత్రం దేశమాత ఒడిలో శాశ్వతంగా నిద్రపోయారు. మెరుగైన సమాజాన్ని నిర్మించాలంటే అందుకు అనుగుణంగా స్వయం సేవకులు తయారవ్వాలని శేషాద్రి గారు బలంగా విశ్వసించారు. వారి రచనలన్నింటిలో కూడా సంఘ లక్ష్యాలు, సంఘ చేసే పనులు, సంఘ దృక్పథం స్పష్టంగా గోచరించించేవి. ఎక్కడా కూడా వ్యక్తిగత ప్రశంస ఉండేది కాదు.
Pamarthi RamaKrishna (RK) tweet media
తెలుగు
0
0
2
20
Pamarthi RamaKrishna (RK)
📚 జ్ఞానానికి జీవితాన్ని అంకితం చేసిన మహానుభావుడు! 🏆 కర్ణాటకకు చెందిన అంకేగౌడ ఎం (Ankegowda M) తన స్వంత సంపాదనతో 20 లక్షలకు పైగా పుస్తకాలు సేకరించి, “ಪುಸ್ತಕದ ಮನೆ (Pustakada Mane)” పేరుతో ఉచిత గ్రంథాలయాన్ని నిర్మించారు. 📖 విద్యా సేవలకు గుర్తింపుగా ఆయనకు పద్మశ్రీ (Padma Shri) పురస్కారం లభించడం దేశానికి గర్వకారణం అని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. 🇮🇳✨ #Ankegowda #PadmaShri #Karnataka #Education #PadmaAwards #PadmaAwards2026 #PeoplesPadma
Pamarthi RamaKrishna (RK) tweet media
తెలుగు
0
3
15
354