YS Jagan Mohan Reddy

2K posts

YS Jagan Mohan Reddy banner
YS Jagan Mohan Reddy

YS Jagan Mohan Reddy

@ysjagan

President, YSR Congress Party

Vijayawada, India Katılım Ocak 2015
7 Takip Edilen2.7M Takipçiler
YS Jagan Mohan Reddy
ఇచ్చిన మాట కోసం రాజ్యాన్ని త్యజించి, వనవాసం చేసిన మహోన్నతుడు శ్రీరాముడు. ఎన్ని కష్టాలు ఎదురైనా ధర్మాన్ని వదలని శ్రీరాముడు అందరికీ ఆదర్శప్రాయుడు. ఆ సకల గుణాభిరాముడు, శ్రీరాముడి దివ్య ఆశీస్సులు అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు. #RamNavami
YS Jagan Mohan Reddy tweet media
తెలుగు
215
1.3K
6.5K
116.8K
YS Jagan Mohan Reddy
Hello India… 𝗡𝗼 𝗣𝗼𝗹𝗶𝗰𝗲! 𝗡𝗼 𝗣𝗼𝗹𝗶𝗰𝗲! 𝗡𝗼 𝗣𝗼𝗹𝗶𝗰𝗲 𝗶𝗻 𝗔𝗻𝗱𝗵𝗿𝗮 𝗣𝗿𝗮𝗱𝗲𝘀𝗵! Andhra Pradesh has become a 𝗷𝘂𝗻𝗴𝗹𝗲 𝗿𝗮𝗷 where police exist only on paper, vanishing when tribals, women, and the poor cry for help. Emergency lines go silent, predators roam free, and innocent lives are lost while those in power focus on corruption, power politics and publicity stunts instead of protecting people. A helpless 17-year-old tribal girl became yet another victim of this collapsing system. This 17 year-old Tribal girl was taken from her family under the pretext of education and care. On March 22, a civil engineer approached her family in Hiramandalam, Srikakulam district, promising tuition. On March 23, in Visakhapatnam, she was reportedly subjected to repeated sexual assault, exposing both brutality and systemic failure. By March 24, she was door delivered as a dead body to their parents. There were reports of pressure on the family for a quick, silent cremation, raising serious concerns of a cover-up. On pressure, the postmortem was conducted at Srikakulam Government General Hospital. Police showed no urgency and acted only after a complaint. No action, no arrest this far. Today’s bus fire in Markapuram, exposes yet an another collapse. Repeated calls to police emergency helpline number 100 went unanswered. Calls to 108 were ignored until the bus was fully engulfed. Survivors said their cries went unheard. With no timely rescue, 14 lives were lost. Institutions which were supposed to respond have not responded. Under @ncbn government, except PR stunts, there is zero governance. Under “Red Book” governance, police act as puppets while citizens are left unprotected and suffering. This is the real situation in the state హలో ఇండియా… “ఏపీలో నో పోలీస్‌, నో పోలీస్‌, నో పోలీస్‌’’ ఆంధ్రప్రదేశ్‌ ఇప్పుడు ఒక జంగిల్ రాజ్‌గా మారిపోయింది. కాగితాలపై మాత్రమే పోలీసులు కనిపిస్తున్నారు, కానీ గిరిజనులు, మహిళలు, పేదలు సహాయం కోసం ఆర్తనాదాలు చేస్తున్నప్పుడు, వారు సహాయంకోసం అర్థిస్తున్నప్పుడు పోలీసులు కనిపించడంలేదు. మరోవైపు నేరస్తులు స్వేచ్ఛగా తిరుగుతున్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు ఎమర్జెన్సీ నంబర్లు కూడా స్పందించడం లేదు. ఫలితంగా అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. కానీ అధికారంలో ఉన్నవారు ప్రజల భద్రతను గాలికి వదిలేసి, అవినీతి, రాజకీయ ప్రయోజనాలు, ప్రచార స్టంట్లపై దృష్టి పెడుతున్నారు. ఒక నిరుపేద 17 ఏళ్ల గిరిజన బాలిక రాష్ట్రంలో కుప్పకూలిపోయిన వ్యవస్థకు బలైపోయింది. చదువులు చెప్తామని ఆమెను తీసుకువెళ్లి దారుణానికి పాల్పడ్డారు. మార్చి 22న శ్రీకాకుళం జిల్లా హిరమండలంలో ఒక సివిల్ ఇంజనీర్ ఆమె కుటుంబానికి మాటలు చెప్పి, ట్యూషన్ చెప్తానని నమ్మబలికాడు. ఆ తర్వాత మార్చి 23న విశాఖపట్నంలో ఆమెపై పలు మార్లు లైంగిక దాడి జరిగినట్లు మీడియా కథనాల్లో స్పష్టంగా వచ్చింది. మార్చి 24న, ఆ బాలిక మృతదేహాన్ని ఆమె తల్లిదండ్రుల ఇంటికి డోర్‌ డెలివరీ చేశారు. ఇది కేవలం క్రూరత్వం మాత్రమే కాదు, వ్యవస్థల వైఫల్యాన్ని సూచిస్తోంది. ఈ ఘటనను మూసివేసేందుకు, తీవ్రత తగ్గించి చూపించేందుకు బాధిత కుటుంబంపై ఒత్తిడి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఘటన విషయం తెలియగానే ఈకేసు దర్యాప్తులో పోలీసులు తమ చురుకైన స్పందనను చూపించలేదు. హడావిడిగా శ్రీకాకుళం ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌లో పోస్ట్‌మార్టం నిర్వహించి, అంత్యక్రియలు జరిపించేశారు. చివరకు ఇప్పటివరకు ఎటువంటి చర్యా లేదు, ఎటువంటి అరెస్టు లేదు. ఇవాళ మార్కాపురంలో జరిగిన బస్సు అగ్నిప్రమాదం ఘటన ప్రభుత్వ యంత్రాంగంలో మరో భయానక వైఫల్యాన్ని బయటపెట్టింది. పలుమార్లు పోలీస్ ఎమర్జెన్సీ నంబర్‌ 100 కు కాల్ చేసినా స్పందన లేదు. 108 అంబులెన్స్ సేవలు కూడా బస్సు పూర్తిగా మంటల్లో కాలిపోయేంతవరకూ స్పందించలేదు. ప్రాణాలతో బయటపడ్డవారు చెబుతున్నది ఒక్కటే “మా ఆర్తనాదాలు ఎవరూ వినలేదు”అని. సమయానికి సహాయం అందక 14 మంది ప్రాణాలు కోల్పోయారు. స్పందించాల్సిన వ్యవస్థలు స్పందించలేదు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో పీఆర్ స్టంట్స్ తప్ప పరిపాలన లేదని మరోసారి తేలిపోయింది. “రెడ్ బుక్” పాలనలో పోలీసులు అచేతనంగా మారిపోయారు, రక్షణ లేక ప్రజలు బాధలు పడుతున్నారు. రాష్ట్రంలోని ఉన్న వాస్తవిక పరిస్థితి ఇదే.
English
170
1.8K
4.7K
101.8K
YS Jagan Mohan Reddy
మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలో టిప్పర్, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొన్న దుర్ఘటనలో పలువురు ప్రయాణికులు సజీవ దహనం కావడం మనసును కలిచివేసింది. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి తక్షణమే మెరుగైన‌ వైద్యం అందించాలని, బాధిత కుటుంబాలకు వెంటనే తగిన ఆర్థిక సహాయం ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. ఈ ఘోర ప్రమాదానికి గ‌ల‌ కార‌ణాల‌పై ద‌ర్యాప్తు చేసి బాధ్యుల‌పై కఠిన చర్యలు తీసుకోవాల‌ని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నా.
తెలుగు
54
732
2.8K
60.8K
YS Jagan Mohan Reddy
The YSR Congress Party wholeheartedly supports the proposed amendments to the Women's Reservation Act, 2023, enabling its implementation in 2029. Our party has always placed utmost emphasis on the empowerment of women. We have already led the way by implementing 50% reservation for women in local bodies, nominated posts, and in works and service contracts awarded on a nomination basis. This initiative for 33% political representation in the Assembly and Lok Sabha is a welcome move. Empowering women to emerge as leaders at every level of our democracy has always been our steadfast endeavour. @narendramodi
English
59
801
3.2K
67.6K
YS Jagan Mohan Reddy
రూరల్‌ డెవలప్‌మెంట్‌ ట్రస్ట్‌ (RDT)కి FCRA పర్మిషన్లు రెన్యువల్‌ చేసినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీగారికి, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఉమ్మడి అనంతపురం జిల్లాలో విద్య, వైద్యం, పర్యావరణం, సామాజికాభివృద్ధిలో RDT సేవలు కొనసాగేందుకు, తద్వారా పేదల అభ్యున్నతికి ఈ అనుమతులు మేలుచేస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. కాని, RDTకి FCRA అనుమతుల విషయంలో చంద్రబాబుగారు క్రెడిట్‌ చోరీకి పాల్పడడం చాలా ఆశ్చర్యంగా ఉంది. నిజంగా ఆయన కృషిచేసి ఉంటే, ఏప్రిల్‌ 21, 2025లో నిలిచిపోయిన పర్మిషన్ల రెన్యువల్‌కు ఏడాదికాలం ఎందుకు పట్టింది? చంద్రబాబుగారు పట్టించుకోకపోవడంవల్లే వైయస్సార్‌సీపీ సహా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రజలు ఉద్యమం చేయాల్సి వచ్చిందన్నది వాస్తవం కాదా? ఇప్పుడు పబ్లిసిటీ స్టంట్స్ చేస్తూ క్రెడిట్ చోరీ చేయడంలో @ncbn ను మించిన వారు ఈ దేశంలో ఇంకొకరు లేరు. @narendramodi @AmitShah @RDT_anantapur
YS Jagan Mohan Reddy tweet mediaYS Jagan Mohan Reddy tweet mediaYS Jagan Mohan Reddy tweet mediaYS Jagan Mohan Reddy tweet media
తెలుగు
49
734
2.2K
102.6K
YS Jagan Mohan Reddy
Heartfelt congratulations to Hon’ble PM Shri Narendra Modi ji on completing 8,931 days as Head of Government and setting a historic milestone in dedicated public service. This landmark is a testament to one’s grit and resolve. Wishing you strength and good health in the service of the nation. @narendramodi
English
143
776
6.5K
230.7K
YS Jagan Mohan Reddy
YS Jagan Mohan Reddy@ysjagan·
రంజాన్ మాసంలో అత్యంత నియమనిష్టలతో ఉపవాస దీక్షలు పాటించి రంజాన్ పండుగను జరుపుకుంటున్న నా ముస్లిం సోదర సోదరీమణులందరికీ ఈద్ ముబారక్. అల్లా దయతో అందరి జీవితాల్లో ఆనందం, ఆయురారోగ్యాలు మెండుగా ఉండాల‌ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. #EidMubarak
తెలుగు
99
993
4.6K
44.2K
YS Jagan Mohan Reddy
YS Jagan Mohan Reddy@ysjagan·
పార్టీ కేంద్ర కార్యాల‌యంలో ఉగాది వేడుక‌ల్లో పాల్గొని, శ్రీ పరాభవ నామ సంవత్సరం మీ అందరి జీవితాల్లో ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు తీసుకురావాలని ఆ భ‌గ‌వంతుడిని కోరుకుంటూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియ‌జేస్తున్నాను. #Ugadi2026
YS Jagan Mohan Reddy tweet mediaYS Jagan Mohan Reddy tweet mediaYS Jagan Mohan Reddy tweet mediaYS Jagan Mohan Reddy tweet media
తెలుగు
138
996
4.3K
55.6K
YS Jagan Mohan Reddy
YS Jagan Mohan Reddy@ysjagan·
శ్రీ గంగా భవాని సమేత వేణుతల కాటమరాజు తిరునాళ్ల శుభసందర్భంగా భక్తులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ప్రకాశం జిల్లా, పెద్దారవీడు మండలం గుండంచర్లలో నిర్వహిస్తున్న ఈ పవిత్ర తిరునాళ్లను భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవాలని, శ్రీ వేణుతల కాటమరాజు వారి దివ్య ఆశీస్సులు అందరిపై ఉండాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
YS Jagan Mohan Reddy tweet media
తెలుగు
41
617
3.1K
35.3K
YS Jagan Mohan Reddy
YS Jagan Mohan Reddy@ysjagan·
తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక మహనీయుడు శ్రీ పొట్టిశ్రీరాములుగారు. ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం సాధించాలనే మహోన్నత లక్ష్యంతో ప్రాణత్యాగం చేసి చరిత్రలో అమరుడిగా నిలిచారు. ఆయన త్యాగం తరతరాలకు స్ఫూర్తి. నేడు శ్రీ పొట్టిశ్రీరాములు గారి జయంతి సందర్భంగా నివాళులర్పిస్తున్నాను.
YS Jagan Mohan Reddy tweet media
తెలుగు
35
590
2.5K
26K
YS Jagan Mohan Reddy
YS Jagan Mohan Reddy@ysjagan·
Best wishes to all our 10th class students appearing for their board exams today! You are the future of our state. Stay focused, believe in yourselves, and give it your best shot. Success will follow your hard work. Good luck!
English
52
856
4.3K
54.5K
YS Jagan Mohan Reddy
YS Jagan Mohan Reddy@ysjagan·
నా ధైర్యం మీరే… నా బలం మీరే… నాన్న గారి ఆశయ సాధన కోసం స్థాపించిన మ‌న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, న‌న్ను మీరు గుండెల్లో పెట్టుకున్నారు, భుజాలపై మోస్తున్నారు. కష్టకాలంలో వెనక్కి తగ్గకుండా పార్టీ కోసం నిల‌బ‌డుతున్నారు. పార్టీపై నమ్మకం పెట్టుకుని, నాపై న‌మ్మకం ఉంచి పార్టీ కోసం నిలిచిన మీరే మ‌న‌ పార్టీకి అసలైన బలం.. నా బ‌లం. మన పార్టీ ప్రస్థానం కేవలం ఒక రాజకీయ ప్రయాణం మాత్రమే కాదు… ఒక ల‌క్ష్యంతో లక్షలాది మంది కార్యకర్తల క‌ష్టం, నమ్మకం, త్యాగాలకు నిలువెత్తు సాక్ష్యం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కార్యకర్తలు, అభిమానులు, నాయకులకు పేరు పేరునా శుభాకాంక్షలు. #YSRCPFormationDay
YS Jagan Mohan Reddy tweet mediaYS Jagan Mohan Reddy tweet mediaYS Jagan Mohan Reddy tweet mediaYS Jagan Mohan Reddy tweet media
తెలుగు
134
1.5K
5.5K
78.9K
YS Jagan Mohan Reddy
YS Jagan Mohan Reddy@ysjagan·
Deeply saddened by the passing of former Union Minister and senior leader Sri Kavuri Sambasiva Rao Garu. My heartfelt condolences to his family members. May his soul rest in peace.
YS Jagan Mohan Reddy tweet media
English
49
346
2K
40.5K
YS Jagan Mohan Reddy
YS Jagan Mohan Reddy@ysjagan·
గత మూడు రోజుల్లో చంద్రబాబు గారి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు మూడు డ్రామాలు చూపించింది. అసెంబ్లీలో ఒక డ్రామా.. పగటి వేషాలు వేసుకున్న అదే ఎమ్మెల్యేతో మరో డ్రామా.. ఈ రెండింటికీ కొనసాగింపుగా అంతర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం నాడు చంద్ర‌బాబు నాయుడు ట్రూప్ ఆడిన‌ది ఇంకో డ్రామా! నేను నేరుగా @ncbn గారిని అడుగుతున్నా.. అయ్యా! జ‌నాభాలో 50 శాతం ఉన్న అక్క చెల్లెమ్మ‌ల‌కు ఎన్నిక‌ల ముందు మీరిచ్చిన ఏ ఒక్క హామీని ఇప్ప‌టి వ‌ర‌కు అమ‌లు చేయ‌క‌పోయినా , అన్నీ చేసేసిన‌ట్లు విజ‌య‌వాడ‌లో ఈ రోజు, అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా, ప‌ట్ట‌ప‌గ‌లు ఇంకో డ్రామా మొద‌లు పెట్టిన మిమ్మ‌ల్ని నేరుగా అడుగుతున్నా.. మ‌హిళా సాధికార‌త అన్న ప‌దం ప‌లికే అర్హ‌త మీకుందా? 1 - సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ లో భాగంగా 19-59 మ‌ధ్య వ‌య‌సున్న ప్ర‌తి ఒక్క అక్క‌చెల్లెమ్మ‌కు నెల‌కు రూ.1,500 చొప్పున ఏడాదికి రూ.18 వేలు ఇస్తామ‌ని ఎన్నిక‌ల ముందు చెప్పారు. రాష్ట్రంలో 18 ఏళ్ల పైబడి, 60 ఏళ్ల లోపు ఉన్న మహిళలు ఎన్నికల కమిషన్‌ డేటా ప్రకారం కోటి 80 లక్షల మంది ఉన్నారు. వీరికి నెలకు రూ.1500 అంటే సంవత్సరానికి రూ.18 వేల చొప్పున ఒక్కో అక్కచెల్లెమ్మలకు మూడేళ్ల‌లో రూ.54 వేల చొప్పున బాకీ పడ్డారు. ఆ డ‌బ్బులు ఎప్పుడిస్తారు చంద్ర‌బాబు గారూ? 2- మ‌రో హామీ 50 ఏళ్లకే పింఛన్‌. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్క‌చెల్లెమ్మ‌ల‌కు 50 ఏళ్లు వయస్సు దాటిన వారికి నెల‌కు రూ.4వేలు చొప్పున ఒక్కొక్కరికి రూ.48 వేలు ఇవ్వాలి. మూడేళ్లలో రూ.1.44 లక్షలు బాకీ పడ్డారు. ఆ డ‌బ్బులు ఎప్పుడిస్తారు? 3- బడికి వెళ్లే ప్రతి పిల్ల వాడికి ఏడాదికి రూ.15 వేల చొప్పున ఎంత మంది పిల్లలుంటే అంత మందికి త‌ల్లికి వంద‌నం కింద‌ ఇస్తామన్నారు. మొద‌టి ఏడాది పూర్తిగా ఎగ‌నామం పెట్టారు. రాష్ట్రంలో యూడీఐఎస్ఈ (యూనిఫైడ్‌ డిస్ట్రిక్ట్ ఇన్‌ఫర్మేషన్‌ సిస్టమ్‌ ఫర్‌ ఎడ్యుకేషన్‌) ప్రకారం 2023–24 నాటికి బడికి పోయే పిల్లలు 87,41,885 మంది ఉంటే రెండో ఏడాది 20 ల‌క్ష‌ల మందికి ఎగ‌ర‌గొట్టారు. చివరకు 67.27 లక్షల మందికి మాత్రమే అది కూడా కొందరికి రూ.8 వేలు.. రూ.9 వేలు.. రూ.10 వేలు, మరి కొంత మందికి రూ.13 వేలు ఇచ్చారు. మ‌రి వీళ్లంద‌రికీ డ‌బ్బులు ఎప్పుడిస్తారు? ఎగ్గొట్టిన మొద‌టి ఏడాది డ‌బ్బులు ఎప్పుడిస్తారు? 4- సూపర్‌ సిక్స్‌లో ఉచిత గ్యాస్‌ చిన్న హామీ. ఇక్కడా కూడా మోసాలే. రాష్ట్రంలో యాక్టివ్‌గా ఉన్న గ్యాస్‌ కనెక్షన్ల సంఖ్య 1.59 కోట్లు. వీరికి ఏటా మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తామన్నారు. సిలిండర్ ధర రూ.855 చొప్పున మూడు సిలిండర్లకు ఏడాదికి రూ.3,990 కోట్లు కేటాయించాలి. మొదటి ఏడాది కేవలం రూ.786 కోట్లు, రెండో ఏడాది రివైజ్డ్‌ ఎస్టిమేట్స్‌ ప్రకారం బడ్జెట్‌లో రూ.2,199.99 కోట్లు కేటాయించారు. 2026–27లో బడ్జెట్‌లో ఈ పథకానికి పెట్టింది రూ.2,601 కోట్లు. అంటే మొత్తంగా రూ.6,143 కోట్లు బాకీ పడ్డారు. ఆ డ‌బ్బులు ఎప్పుడు ఇస్తారు చంద్ర‌బాబు గారూ? 5- ఉచిత బ‌స్సులో ఎక్క‌డి నుంచి ఎక్క‌డికైనా వెళ్ల‌వ‌చ్చ‌ని మ‌హిళ‌ల‌కు హామీ ఇచ్చారు. కడప నుంచి వైజాగ్‌కు పోవచ్చు.. శ్రీకాకుళం వాళ్లు తిరుపతికి వచ్చి దర్శనం చేసుకోవచ్చు.. మధ్యలో కనకదుర్గమ్మను కూడా దర్శనం చేసుకోవచ్చన్నారు. రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లినా ఫ్రీ అన్నారు. ఏపీఎస్ ఆర్టీసీలో 16 రకాల సర్వీసులుంటే.. కేవలం ఐదు సర్వీసులకు మాత్రమే పరిమితం చేశారు. ఈ పథకం అమలు చేయాలంటే ఏడాదికి రూ.3,200 కోట్లు ఖర్చు చేయాలి. మొదటి ఏడాది ఈ స్కీమ్‌ ఎగరగొట్టేశారు. రెండో ఏడాది ఆర్నెల్ల తర్వాత ఆగస్టులో అరకొరగా మొదలు పెట్టారు. చేసిన ఖర్చు రూ.1,040 కోట్లు. ఈ స్కీమ్‌ కోసం ఈ బడ్జెట్‌లో కేటాయించిన మొత్తం రూ.1,420 కోట్లు. అంటే మూడేళ్లలో రూ.9,600 కోట్లకు గాను రూ.2,460 కోట్లు కేటాయించారు. అంటే రూ.7,140 కోట్లు బాకీ పడ్డారు. ఆ డ‌బ్బులు ఎప్పుడిస్తారు చంద్ర‌బాబు గారూ? 6- సూప‌ర్ సిక్స్‌లో అక్క‌చెల్లెమ్మ‌ల‌కు ఇచ్చిన ప్ర‌తి ఒక్క హామీని ఇలా వంచ‌న‌గా మార్చ‌టం వ‌ల్ల ప్ర‌తి ఒక్క కుటుంబాన్నీ, అక్క‌చెల్లెమ్మ‌ల ఆర్థిక సాధికార‌త‌ను, మొత్తంగా మ‌న రాష్ట్రంలో ఇంటింటి భ‌విష్య‌త్తును మీరు ఎంత‌గా దెబ్బ‌తీశారో అర్థ‌మ‌వుతోందా? 7- ఇవేకాదు అక్కచెల్లెమ్మల పేరిట వాళ్లకు మంచి చేస్తూ ఏకంగా 31 లక్షల ఇళ్లపట్టాలిచ్చాం. అందులో 21 లక్షల ఇళ్లు మంజూరు చేయించాం. అందులో 10 లక్షల పైచిలుకు ఇళ్లు పూర్తి చేశాం. చంద్రబాబునాయుడు అక్కచెల్లెమ్మలకు ఇచ్చే ఇంటి స్థలాలకు సంబంధించి చేసిన ప్రామిస్‌ ఏంటి? పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇస్తామనిమేనిఫెస్టోలో చెప్పారు. 3 బడ్జెట్లు అయిపోయాయి. ఈరోజుకు కూడా ఒక్క కుటుంబానికి ఒక్క పట్టా ఇవ్వలేదు. ఒక్క గజం కూడా స్థలం దీనికోసం కొనలేదు. ఉన్న ఇళ్ల‌నిర్మాణాల‌ను గాలికొదిలేశారు. మ‌రి ఆ ఇళ్ల నిర్మాణాల‌ను అక్క‌చెల్లెమ్మ‌ల‌కు ఎప్పుడు పూర్తి చేసి ఇస్తారు? 8- డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ. ఈ పథకానికి మూడు బడ్జెట్లలో అతీగతీ లేదు. స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలను రూ. 3 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతామని చెప్పి.. పెంచడం కథ దేవుడెరుగు.. మామూలుగా ఇంతకు ముందు ఇస్తున్నట్టు ఇచ్చేది కూడా ఆగిపోయింది. మా హయాంలో కోటి మంది మహిళలకు వడ్డీ లేని రుణాల కింద రూ.4,969 కోట్లు ఇచ్చాం. మీరు వ‌చ్చి మూడు బ‌డ్జెట్లు పెట్టారు. ఇప్ప‌టికి ఒక్క పైసా కూడా సున్నా వ‌డ్డీ కింద ఇవ్వ‌లేదు. ఈ డ‌బ్బులు ఎప్పుడు ఇస్తారు? 9- వైయ‌స్ఆర్‌ చేయూత పథకం ద్వారా 26,98,931 మంది అక్కచెల్లెమ్మలకు రూ.19,189 కోట్లు ఇచ్చాం. వైయ‌స్ఆర్‌ ఆసరా కింద 78,94,169 మంది అక్కచెల్లెమ్మలకు రూ.25,570 కోట్లు ఇచ్చాం. వైయ‌స్ఆర్‌ కాపు నేస్తం ద్వారా 3,58,613 మంది అక్కచెల్లెమ్మలకు రూ.2,029 కోట్లు ఇచ్చాం. వైయ‌స్ఆర్‌ ఈబీసీ నేస్తం ద్వారా 4,95,269 మంది అక్కచెల్లెమ్మలకు మరో రూ.1876 కోట్లు ఇచ్చాం. నిజంగా స్త్రీ శక్తి ఎక్కడైనా లభించింది అంటే, వారి సాధికారత ఎక్కడైనా జరిగింది అంటే అది వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వంలోనే అని గర్వంగా చెప్పగలుగుతాం. ఈ ప‌థ‌కాల‌న్నీ మీరు అధికారంలోకి వ‌చ్చాక ర‌ద్దు చేశారు క‌దా.. మరి మీకు మ‌హిళా సాధికార‌త గురించి మాట్లాడే అర్హ‌త ఉందా? 10- మీ పాల‌న‌లో ఈబీసీ అక్క‌చెల్లెమ్మ‌ల‌కు ఈబీసీ నేస్తం అనే ప‌థ‌క‌మే లేదు. మీకు కాపుల్ని మ‌భ్య‌పెట్టించి వారి ఓట్లు కొల్ల‌గొట్టే ప్యాకేజీ ప‌థ‌కాలు బాగా తెలుసుగానీ, కాపు నేస్తంగా ఒక్క రూపాయి కూడా ఆ అక్క‌చెల్లెమ్మ‌ల‌కు ఇచ్చిన చ‌రిత్ర మీకు కానీ, మీకు మ‌ద్ద‌తిస్తున్న‌వారికి కూడా లేదు. 11- ఇలా ఇవ్వ‌క‌పోవ‌టం కూడా మీకున్న విజ‌న్‌లో భాగ‌మే అని న‌మ్మించ‌గ‌ల ఎల్లో మీడియా మీ చేతిలో ఉంది కాబ‌ట్టి.. ఇదీ గొప్ప ఎంప‌వ‌ర్‌మెంట్ అని ప‌త్రిక‌ల్లో రాయించ‌టం, టీవీల్లో వేయించ‌ట‌మే ఇక మిగిలింది! 12- అక్క‌చెల్లెమ్మ‌ల కాపురాల్లో చిచ్చుపెట్టేలా వీధికో బెల్టుషాపు, ఊరికో మ‌ద్యం షాపు, బారు తెర‌వ‌ట‌మే మీకు తెలిసిన మ‌హిళా సాధికార‌త‌, అదే మీకు తెలిసిన మ‌హిళా భ‌ద్ర‌తా? 13- దిశ పోలీస్ స్టేష‌న్ల‌ను, దిశ యాప్ ను కూడా నిర్వీర్యం చేశారు. చివ‌రికి రాష్ట్రాన్ని మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులు, మీ టీటీడీ ఛైర్మ‌న్‌.. ఇలా ప్ర‌తి ఒక్క‌రూ అత్యాచార‌ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను నిర్మించారు. ప‌సి పిల్ల‌ల్ని, ఆడ‌పిల్ల‌ల్ని, చివ‌రికి ఉద్యోగాలు చేసుకుంటున్న మ‌హిళ‌ల్ని కూడా.. మీరు, మీకు మ‌ద్ద‌తిస్తున్న వాళ్లు పెంచి పోషిస్తున్న కామాంధులంతా ఎలా చిదిమేస్తున్నారో చూసి కూడా మీకు సిగ్గు అనిపించ‌డం లేదా? 14- మా అయిదేళ్ల పాల‌న‌లో దాదాపు 90 శాతం అక్క‌చెల్లెమ్మ‌ల పేరిట డీబీటీ ప‌థ‌కాలే. మేం ఇచ్చిన ఇళ్ల స్థ‌లాల‌న్నీ అక్క‌చెల్లెమ్మ‌ల పేరుమీదే! దేశ చ‌రిత్ర‌లో తొలిసారిగా.. మేం ఇచ్చిన వేల కొద్దీ నామినేటెడ్ ప‌ద‌వుల్లో 50 శాతం వాటా నేరుగా అక్క‌చెల్లెమ్మ‌ల‌కే! 15- చ‌రిత్ర‌లోనే క‌నీవినీ ఎరుగ‌ని విధంగా ఎక్కువ మంది మ‌హిళ‌ల‌కు ఎమ్మెల్సీలు, క్యాబినెట్ మంత్రులుగా అవ‌కాశం ఇచ్చిన‌ది కూడా మా అయిదేళ్ల పాల‌న‌లోనే! ఇలా చేశాం కాబ‌ట్టే మా పాల‌న మ‌హిళా సంక్షేమ చ‌రిత్ర‌లో సువ‌ర్ణ అధ్యాయం అని గ‌ర్వంగా చెప్పుకోగ‌లుగుతున్నాం. మ‌న ఆడ బిడ్డ‌లు, త‌మ కుటుంబాల చ‌రిత్ర‌నే కాకుండా.. ఈ దేశ చ‌రిత్ర‌నే మార్చేలా శ‌క్తిమంతంగా ఎదిగేలా వారికి అండ‌గా నిలిచాం. 16- ఇప్ప‌టి ప‌రిస్థితి ఏమిటంటే.. మ‌హిళాభ్యుద‌యానికి, మ‌హిళా సాధికార‌త‌కు చంద్ర‌బాబుగారి పాల‌న చీక‌టి కాలం. రాష్ట్రంలో న‌డుస్తున్న‌దంతా దుశ్శాస‌న ప‌ర్వం!
తెలుగు
147
823
2.9K
154.8K
YS Jagan Mohan Reddy
YS Jagan Mohan Reddy@ysjagan·
సమాజ నిర్మాణంలో మహిళల పాత్ర అమూల్యమైనది, వారి ఆర్థిక ఎదుగుదలతో కుటుంబాలు బలపడతాయి.. రాష్ట్రం ముందుకు సాగుతుందన్న నమ్మకంతో మన ప్రభుత్వంలో మహిళల సంక్షేమం, సాధికారతకు పెద్ద‌పీట‌ వేశాం. పథకాలలోనే కాకుండా కీలక పదవుల్లో కూడా వారికి అగ్ర తాంబూలం ఇచ్చాం. కుటుంబ బాధ్యతలతో పాటు సమాజ అభివృద్ధి కోసం త‌న వంతు కృషి చేస్తున్న ప్రతి మహిళకూ పేరు పేరున హృదయపూర్వకంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. #InternationalWomensDay
తెలుగు
68
621
2.3K
43.6K
YS Jagan Mohan Reddy
YS Jagan Mohan Reddy@ysjagan·
The administration and management of the Tirumala Tirupati Devasthanam temples, where Lord Venkateswara is worshipped as the living deity of the Kali Yuga by crores of devotees not only in India but across the world, is an extremely sacred responsibility. Such a holy institution must be led by individuals who possess impeccable character, unwavering devotion, integrity and commitment. However, Chief Minister @ncbn has reduced this sacred position to a platform for selfish political interests. Instead of protecting the dignity and sanctity of the temple, decisions taken under his leadership have brought disrepute to the institution. Even before the elections, a woman had written to Chandrababu Naidu alleging that the current TTD Chairman had cheated her and played with her life. In her complaint, she stated that women who approached him even for small works were harassed and troubled. As a responsible leader, Chandrababu Naidu should have ordered an inquiry into these serious allegations and taken appropriate action. Instead, despite being aware of such accusations, he ignored them completely and went ahead with appointing the same individual as the Chairman of TTD, thereby compromising the sanctity and reputation of the temple. Anyone with genuine devotion towards Lord Venkateswara would never take such a decision. If there had been true commitment to protect the sanctity of the temple, such appointments would not have been made. This once again proves that Chandrababu Naidu lacks devotion, sincerity, and even basic reverence towards the deity. The same negligence is visible in the issue of ghee used for preparing Tirumala Laddu prasadam. During Chandrababu Naidu’s tenure, the TTD laboratory itself had rejected certain consignments of ghee for failing quality standards. Despite this, the same low-quality ghee tankers were later allowed to enter TTD again under different names during his tenure. These consignments were accepted and eventually used in the preparation of Tirumala Laddu. This has been clearly mentioned in the CBI-SIT chargesheets. The first chargesheet refers to this on pages 64 and 91, while the final chargesheet mentions it again on page 44. These findings clearly show the negligence and lack of seriousness in protecting the sanctity of temple prasadam. After committing this mistake in the Tirumala Laddu issue, Chandrababu Naidu is now attempting to shift the blame onto others while simultaneously creating political controversy around it. Another disturbing aspect is the pricing of ghee. Between 2014 and 2019, the purchase price of ghee for TTD ranged between about Rs.278 and Rs.330 per kilogram. Even during 2019–2024, the average price remained roughly within the same range. However, under Chandrababu Naidu’s leadership, while making false allegations about ghee quality and creating political controversy, contracts were structured in a way that benefited Indapur Dairy, a manufacturing company linked to his Heritage group. In 2025, ghee from this company was reportedly supplied to TTD at a price of about Rs.658 per kilogram, allowing huge profits while turning temple procurement into a means of private gain. These developments raise serious concerns. They demonstrate that Chandrababu Naidu has neither devotion towards the deity nor sincerity towards the administration of temples. His actions show a lack of commitment, integrity, and honesty in handling matters connected with such a sacred institution. Details attached - tinyurl.com/4dfjs5xv @thewire_in @ndtv @IndiaToday @TimesAlgebraIND @timesofindia @TimesNow @ANI @BBCIndia @firstpost @CNNnews18 @BBCBreaking @ABPNews @News18India @ThePrintIndia @the_hindu @IndianExpress @DeccanChronicle @PTI_News @WIONews @sardesairajdeep @umasudhir @rohini_sgh @ravishndtv @BDUTT @sagarikaghose @rahulkanwal @ShekharGupta @thenewsminute @republic @TheSouthfirst @htTweets @JagranNews @scroll_in @ZeeNews @EconomicTimes @NewIndianXpress
English
29
548
1.6K
46.1K
YS Jagan Mohan Reddy
YS Jagan Mohan Reddy@ysjagan·
దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులకు కలియుగ ప్రత్యక్ష దైవం, వేంకటేశ్వరస్వామి కొలువై ఉన్న తిరుమల, తిరుపతి ఆలయాల నిర్వహణ, పరిపాలన అత్యంత పవిత్రమైన బాధ్యత, అత్యంత నిష్ఠతో చేయాల్సిన బాధ్యత. అలాంటి టీటీడీ ఛైర్మన్‌ పదవిలో నిష్కలంక వ్యక్తిత్వం, అచంచల భక్తి, నిబద్ధత, నిష్ఠ కలిగిన వారే ఉండాలి. కానీ @ncbn గారు ఈ పవిత్రమైన స్థానాన్ని స్వార్థ రాజకీయాలకు వేదికగా మార్చారు. ఆలయ ప్రతిష్ఠను మంటగలిపేలా వ్యవహరించారు. ఒక బాధిత మహిళ ఎన్నికలకు ముందే చంద్రబాబుగారికి లేఖ రాస్తూ, ప్రస్తుత టీటీడీ ఛైర్మన్‌ తనను మోసం చేశాడని, తన జీవితంతో ఆడుకున్నాడని, ఏ చిన్న పనితో ఆడవారు వచ్చినా వారిని ఇబ్బంది పెడతారంటూ ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఒక బాధ్యత ఉన్న వ్యక్తిగా చంద్రబాబుగారు ఈ ఫిర్యాదుపై విచారణ చేసి, చర్యలు తీసుకోవాల్సింది పోయి, ఇన్నిరకాల ఆరోపణలు ఉన్నాయని తెలిసి కూడా, విచారణ, చర్యలన్నవి పూర్తిగా పక్కనపెట్టి, అతన్నే టీటీడీ ఛైర్మన్‌గా నియమించి, ఆలయ ప్రతిష్ఠను, పవిత్రతను కాలరాశారు. దేవుడి పట్ల భక్తి ఉన్నవారు ఎవరైనా ఇలా చేస్తారా? ఆలయ పవిత్రతను కాపాడాలన్న ఉద్దేశం ఉంటే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారా? చంద్రబాబుగారికి భక్తీ లేదు, శ్రద్ధ అంతకన్నా లేదు, దేవుడిపట్ల భయం కూడా లేదని మరోసారి రుజువైంది. లడ్డూలో వాడే నెయ్యి విషయంలోనూ చంద్రబాబుగారికి అదే నిర్లక్ష్యం. నెయ్యి క్వాలిటీ బాగోలేదని ఈ చంద్రబాబుగారి హయాంలోనే టీటీడీ ల్యాబ్‌ తిప్పి పంపినా, మళ్లీ అవే క్వాలిటీలేని నెయ్యి ట్యాంకర్లు, ఆయన హయాంలోనే వేరేవారిపేరిట తిరిగి టీటీడీకి రావడం, ఆయన హయాంలో వచ్చిన అవే ట్యాంకర్లను టీటీడీ అంగీకరించి, అనుమతించడం, అక్కడ నుంచి తిరుమల లడ్డూ తయారీలో వాడడం, ఇదే విషయాన్ని సీబీఐ-సిట్‌ మొదటి ఛార్జిషీటు 64, 91 పేజీల్లోనూ, ఫైనల్‌ ఛార్జిషీటు 44వ పేజీలోనూ ఇదే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పింది. చంద్రబాబుగారికి దేవుడి పట్ల భక్తీ లేదు, ఆలయాల నిర్వహణపట్ల శ్రద్ధ అంతకన్నా లేదనడానికి ఇది మరొక ఉదాహరణ. ఈ రకంగా చంద్రబాబుగారు తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో తప్పు చేసి, దాన్ని వేరొకరిమీదకు నెట్టి, మళ్లీ దానిమీద రాజకీయ దుమారం రేపుతూ, ఆ నెయ్యితోనే స్కాంలు చేస్తున్నాడు. మరోవైపు 2014-19 మధ్య టీటీడీ నెయ్యి కొనుగోలు ధర దాదాపుగా రూ.278- రూ.330. 2019-24 మధ్య కూడా నెయ్యి సగటు రేటుకూడా దాదాపుగా అంతే. చంద్రబాబుగారు తాను ముఖ్యమంత్రిగా ఉంటూ, నెయ్యి విషయంలో తప్పుడు ఆరోపణలు చేస్తూ, దానిపై రాజకీయ దుమారం రేపుతూ తన హెరిటేజ్‌కి చెందిన మాన్యుఫ్యాక్చరింగ్‌ కంపెనీ, ఇందాపూర్‌ డెయిరీకి, కిలో నెయ్యి రూ.658లకు, 2025లో అమ్ముకునేందుకు కట్టబెట్టి, లాభాలు ఆర్జిస్తూ, స్కాంలు చేస్తూ టీటీడీకి నెయ్యి సరఫరాను తన సొంత ఆదాయ మార్గంగా మార్చుకున్నారు. ఆలయాల నిర్వహణలో చంద్రబాబుకు భక్తి లేదు, శ్రద్ధ లేదు, నిష్ఠ లేదు, నిజాయితీ అంతకన్నా లేదనడానికి ఇది మరొక ఉదాహరణ. Details attached - tinyurl.com/4dfjs5xv
తెలుగు
202
1.1K
3.6K
154.3K
YS Jagan Mohan Reddy
YS Jagan Mohan Reddy@ysjagan·
.@ncbn గారూ.. ఎన్నికల సమయంలో మీరు ఇచ్చిన హామీలు అమలు చేయాలంటూ అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లు గట్టిగా అడగడం తప్పు అవుతుందా? రెండేళ్లు అవుతున్నా.. ఆ హామీలకు దిక్కూ, మొక్కూ లేదని నిలదీయడం, ప్రశ్నించడం నేరం అవుతుందా? అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లపై మీ దమనకాండ అత్యంత హేయం. మహిళలని చూడకుండా వారిపై లాఠీఛార్జీ చేస్తూ, పోలీసుల చేత బలప్రయోగంచేస్తూ, ఎక్కడికక్కడ వారిని నిర్బంధించి, వారికి కనీస సౌకర్యాలు కూడా లేకుండా చేసి అత్యంత అమానవీయంగా వ్యవహరించారు. ఇలా చేయడానికి మీకు సిగ్గనిపించడం లేదా? వాళ్లు ప్రజాస్వామ్యయుతంగా, శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే, ఈ ఉదయం చర్చలకు పిలుస్తామనిచెప్పి, ముందు రోజు రాత్రే నిరసన శిబిరాలకు కరెంటు తీసివేసి, కంచెలు వేసి, కనీసం ఆహారం, తాగునీళ్లు అందకుండా చేయడం దారుణం కాదా? ఏరుదాటాక తెప్పతగలేసే మీ ధోరణిని, సూపర్‌ సిక్స్‌, సూపర్‌ సెవెన్‌లు ఎగరగొట్టి పచ్చి మోసాలు ఎలా చేస్తున్నారో, ప్రజలంతా గమనిస్తున్నారు. ఒక్క అంగన్‌వాడీలకే కాదు, రైతులకు, విద్యార్థులకు, మహిళలకు, ఉద్యోగులు సహా వివిధ వర్గాల వారికి మీరు చేస్తున్న అన్యాయాలు, వెన్నుపోట్లు శిశుపాలుడి పాపాల్లా పెరుగుతూనే ఉన్నాయి. దీనికి తప్పకుండా మీరు మూల్యాన్ని చెల్లించాల్సి ఉంటుంది. చంద్రబాబుగారూ.. మీరు తక్షణం అంగన్‌వాడీలు, వర్కర్లకు క్షమాపణలు చెప్పాలని, వారికిచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్‌ చేస్తున్నాను.
తెలుగు
86
913
2.8K
75.4K