Mohammad Aslam retweetledi

సీఎం @revanth_anumula, మంత్రి @INC_Ponguleti మాయమాటలు నమ్మి.. చేస్తున్న ప్రైవేట్, ఐటీ ఉద్యోగాలు వదిలేసుకుని వచ్చిన 6,500 మంది లైసెన్స్డ్ సర్వేయర్లను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నట్టేట ముంచింది.
మంచి జీతం ఇస్తామని ఆశపెట్టి, శిక్షణ ఇచ్చి, ప్రమాణ స్వీకారాలు చేయించి.. తీరా ఇప్పుడు ఎకరం సర్వే చేస్తే కేవలం 10 రూపాయల కమిషన్ ఇస్తామనడం విద్యావంతులైన యువతను ఘోరంగా అవమానించడమే..
ఏడాది పొడవునా కష్టపడి రెండు వేల ఎకరాలు సర్వే చేసినా వీరికి వచ్చేది 20 వేల రూపాయలే.. ఇదేనా రేవంత్ రెడ్డి గారు యువతకు ఇచ్చే ఉపాధి? ఏడాదిగా జీతాలు లేక ఆ కుటుంబాలు రోడ్డున పడితే పట్టించుకోకపోగా.. మండల ఆఫీసుల్లో ఉచితంగా కూలీల్లా వాడుకుంటూ శ్రమదోపిడీ చేయడం దుర్మార్గం.
ఈరోజు సిద్దిపేటలో నన్ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్న సర్వేయర్లకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది.
ప్రభుత్వం కమిషన్ల పేరుతో వాళ్ల జీవితాలతో ఆడుకోకుండా.. తక్షణమే వారికి గౌరవ వేతనం, ఉద్యోగ భద్రత కల్పించాలి. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో సర్వేయర్ల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీస్తాం.. మీకు న్యాయం జరిగే వరకు కొట్లాడుతాం.
@TelanganaCMO
#CongressFailedTelangana



తెలుగు



























