Harsha Vardhan Reddy

2.8K posts

Harsha Vardhan Reddy banner
Harsha Vardhan Reddy

Harsha Vardhan Reddy

@hvrysrcp

State Deputy General Secretary – Coordination @YSRCParty | Fmr State Booth Committee President | Ex NRI Wing Coordinator |

Andhra Pradesh Katılım Şubat 2013
316 Takip Edilen32.5K Takipçiler
Harsha Vardhan Reddy
Harsha Vardhan Reddy@hvrysrcp·
కాపు ఉద్యమనేత, వైయస్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ముద్రగడ పద్మనాభం గారి అంతిమయాత్రలో భుజాల మీద ఆయన పార్థీవ దేహాన్ని మోసిన మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు ! @ysjagan @YSRCParty #AndhraPradesh #YSRCP #YSJagan
తెలుగు
1
1
6
191
Harsha Vardhan Reddy retweetledi
YS Jagan Mohan Reddy
మా పార్టీ సీనియర్‌ నాయకులు, నాకు పితృసమానులైన ముద్రగడ పద్మనాభంగారి మరణవార్త నన్ను తీవ్రంగా కలచివేసింది. ఇటీవల అనారోగ్యానికి గురైన ఆయన క్రమంగా కోలుకుంటున్నారనే వార్త మాకు ఎంతో ధైర్యాన్నిచ్చింది. సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి మన మధ్యకు వస్తారని ఆశిస్తున్న సమయంలోనే ఆయన ఇలా శాశ్వతంగా దూరం కావడం అత్యంత బాధాకరం. ఐదు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎంపీగా, మంత్రిగా, ఎమ్మెల్యేగా ప్రజలకు చిరస్మరణీయమైన సేవలందించిన ముద్రగడగారు విలువలకు కట్టుబడి రాజకీయాలు చేశారు. పదవులకన్నా ప్రజలనే గొప్పగా భావించారు. తన జీవితాంతం పేదల బతుకుల్లో మార్పు కోసం తపించారు. ముఖ్యంగా కాపు సామాజికవర్గానికి పెద్దదిక్కుగా నిలిచి, వారి సంక్షేమం కోసం అలుపెరగని పోరాటం చేశారు. తాను నమ్మిన మాటకు కట్టుబడి నిలబడే తత్వం, మంచికోసం ఎంతదూరమైనా వెళ్లే ధైర్యం ఆయన సొంతం. ఆత్మగౌరవానికి, నిజాయితీకి, వ్యక్తిత్వానికి ఆయన నిలువెత్తు రూపం. ముద్రగడగారి మరణం ఆయన కుటుంబానికే కాదు.. వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి, ఆయనను అభిమానించే లక్షలాది మందికి తీరని లోటు. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబసభ్యులకు ధైర్యాన్ని ప్రసాదించాలని, ముద్రగడగారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున ముద్రగడగారికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాను.
YS Jagan Mohan Reddy tweet media
తెలుగు
202
1.3K
4.8K
115.6K
Harsha Vardhan Reddy
Harsha Vardhan Reddy@hvrysrcp·
కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం గారి మృతిపై వైయస్ జగన్ గారు తీవ్ర సంతాపం.. ముద్రగడ గారి కుమారుడు గిరిబాబును ఫోన్ లో పరామర్శించిన వైయస్‌ జగన్‌ గారు. ప్రజలకోసం ముద్రగడ గారు చేసిన సేవలు చిరస్మరణీయం.. ఆయన హఠాన్మరణం తీవ్రంగా కలచివేసిందన్న వైయస్‌ జగన్‌ గారు ! @ysjagan @YSRCParty #AndhraPradesh #YSJagan #YSJaganInVizag
Harsha Vardhan Reddy tweet media
తెలుగు
1
6
40
1.1K
Harsha Vardhan Reddy
బోటు ప్రమాదంలో గల్లంతైన మత్స్యకార కుటుంబాల్ని పరామర్శించేందుకు విశాఖపట్నానికి చేరుకుని బాధిత కుటుంబాలను పరామర్శించిన వైయస్ జగన్ గారు వైయస్ జగన్ గారికి మద్దతు తెలుపుతూ దారి పొడవునా భారీగా చేరుకున్న ప్రజలు, వైయస్‌ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ! @ysjagan @YSRCParty #YSJaganInVizag #AndhraPradesh #YSRCP #YSJagan
Harsha Vardhan Reddy tweet mediaHarsha Vardhan Reddy tweet mediaHarsha Vardhan Reddy tweet mediaHarsha Vardhan Reddy tweet media
తెలుగు
0
3
34
495
Harsha Vardhan Reddy
మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్ గారు రేపు (14.07.2026) ఇటీవల విశాఖపట్నంలో జరిగిన విషాదకర బోటు ప్రమాదంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలను పరామర్శించి వారికి ధైర్యం చెప్పేందుకు వెళ్లనున్నారు. ఎల్లుండి (15.07.2026) పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పర్యటనకు వెళ్లనున్నారు. రాష్ట్రంలో ఆక్వా రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న నేపథ్యంలో, ఆక్వా రైతుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని వారికి అండగా నిలిచేందుకు శ్రీ వైయస్ జగన్ గారు భీమవరం పర్యటన చేపడుతున్నారు. @ysjagan @YSRCParty #AndhraPradesh #YSJagan #YSRCP
Harsha Vardhan Reddy tweet media
తెలుగు
0
6
84
915
Harsha Vardhan Reddy retweetledi
YS Jagan Mohan Reddy
Deeply saddened by the passing of the legendary S. Janaki Amma, who hailed from Guntur. Her timeless voice transcended generations, touching millions of hearts across languages. Indian music has lost one of its brightest stars, but her melodies will live on forever. Rest in peace, Amma.
YS Jagan Mohan Reddy tweet media
English
56
806
5.7K
107.8K
Harsha Vardhan Reddy retweetledi
YS Jagan Mohan Reddy
అమరావతి రాజధాని పేరుతో ఉండవల్లిలో రైతులపై చంద్రబాబు ప్రభుత్వం సాగించిన రాక్షసకాండను తీవ్రంగా ఖండిస్తున్నాను. తమ కుటుంబాలకు జీవనాధారమైన కొద్దిపాటి భూములను ఇచ్చేది లేదని రైతులు స్పష్టంగా చెబుతున్నా, వారి అభిప్రాయాలను, అభ్యంతరాలను కనీసం వినకుండా పోలీసులను మోహరించి, బుల్డోజర్లతో పొలాల్లోకి దూసుకెళ్లి, సాగులో ఉన్న పంటలను ధ్వంసం చేయడం అత్యంత దుర్మార్గం. రైతులను వారి పొలాలనుంచి బలవంతంగా ఈడ్చిపారేసి, భయభ్రాంతులకు గురిచేసి భూములను స్వాధీనం చేసుకోవడం దారుణం. బాధితుల్లో అత్యధికులు సన్న, చిన్నకారు రైతులే. వారి కుటుంబాలకు ఆ కొద్దిపాటి భూమే ఆధారం. ఆ భూమితోనే పిల్లలను చదివించుకుంటున్నారు. ఆ భూమిలో పండే పంటతోనే కుటుంబాలను పోషించుకుంటున్నారు. అలాంటి రైతులు “మా భూమి తీసుకుంటే మేం ఎలా బతకాలి?” అని అడుగుతుంటే సమాధానం చెప్పకుండా పోలీసు బలంతో వారి గొంతులను నొక్కడం చంద్రబాబు ప్రభుత్వ నిరంకుశత్వానికి పరాకాష్ట. వారు పెట్టిన పెట్టుబడి ఏమవుతుంది? ధ్వంసం చేసిన పంటలకు ఎవరు పరిహారం చెల్లిస్తారు? రైతుల జీవనాధారాన్ని నాశనం చేసే అధికారం ఈ ప్రభుత్వానికి ఎవరిచ్చారు? రాజధాని పేరుతో గతంలోనే వేల ఎకరాలు తీసుకున్నారు. మొదట భూములు ఇచ్చిన రైతులకే దిక్కులేకుండా చేసిన ఈ ప్రభుత్వం, ఇప్పుడు మళ్లీ కొత్తగా భూముల కోసం ఎందుకు రైతులను వెంటాడుతోంది? రైతులపై పోలీసులను ప్రయోగించడం ఏమిటి? రైతుల అంగీకారం లేకుండా వారి భూములపై ప్లాన్లు గీయడం, కాగితాల మీద అవార్డులు ప్రకటించుకున్నామని చెప్పడం, ఆ వివరాలను కూడా రైతులకు తెలియజేయకుండా ఏకపక్షంగా స్వాధీనం చేసుకోవడం న్యాయమేనా? ఈ భూములు మారుమూల ప్రాంతాల్లో లేవు. విజయవాడకు కూతవేటు దూరంలో, చెన్నై–కోల్‌కత జాతీయ రహదారికి అత్యంత సమీపంలో, తాడేపల్లి నగర ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న అత్యంత విలువైన భూములు. మార్కెట్లో భారీ ధరలు పలికే భూములకు అరకొర విలువలను మీరే నిర్ణయించుకుని, రైతుల సమ్మతి లేకుండా వాటిని లాక్కోవడం వెనుక ఎవరి ప్రయోజనాలు ఉన్నాయి? రైతుల భూములను తీసుకుని భవిష్యత్తులో ఎవరికి కట్టబెట్టాలనుకుంటున్నారు? అసలు లబ్ధిదారులు రైతులా? లేక చంద్రబాబుగారి అస్మదీయులా? రైతుల భూములను బలవంతంగా లాక్కుని, వారిని రోడ్డుమీద పడేసి, వారి జీవితాలను దెబ్బతీస్తామంటే సహించేది లేదు. . రైతు స్వచ్ఛందంగా భూమి ఇస్తే తీసుకోండి. కానీ పోలీసులను పెట్టి, పంటలను ధ్వంసం చేసి, రైతులను ఈడ్చిపారేసి లాక్కుంటామంటే అది ముమ్మాటికీ తప్పే అవుతుంది. ఈ ప్రభుత్వాన్ని మరోసారి హెచ్చరిస్తున్నాం. @ncbn గారు రాజధాని రైతుల భూముల్లో జరుగుతున్న బలవంతపు చర్యలను వెంటనే నిలిపివేయాలి. ధ్వంసం చేసిన పంటలకు పూర్తి పరిహారం చెల్లించాలి. రైతుల అంగీకారం లేకుండా ఒక్క సెంటు భూమిని కూడా స్వాధీనం చేసుకోవడం సరికాదు. రైతుల హక్కులను కాపాడే పోరాటంలో వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ వారికి అండగా నిలుస్తుంది. English Version- tinyurl.com/ypbwepfw
తెలుగు
255
1.4K
4K
222.2K
Harsha Vardhan Reddy
విజయనగరం జిల్లా అధ్యక్షులు మరియు జెడ్పీ చైర్మన్, భీమిలి నియోజకవర్గ ఇంచార్జ్ మజ్జి శ్రీనివాసరావు గారు(చిన్న శ్రీను) గారి అధ్యక్షతన భీమిలి నియోజకవర్గంలోని ఎండాడ BLA ల సమావేశంలో పాల్గొనడం జరిగింది. @ysjagan @YSRCParty #YSRCP #YSJagan #AndhraPradesh
Harsha Vardhan Reddy tweet mediaHarsha Vardhan Reddy tweet mediaHarsha Vardhan Reddy tweet mediaHarsha Vardhan Reddy tweet media
తెలుగు
0
0
58
844
Harsha Vardhan Reddy retweetledi
YS Jagan Mohan Reddy
YS Jagan Mohan Reddy@ysjagan·
.@ncbn గారూ.. టెట్‌ నిబంధనలతో టీచర్లు చాలా ఇబ్బందులు పడుతున్నా మీరు పట్టించుకోకపోవడం అన్యాయం. 2011 ముందు నుంచి టీచర్లుగా ఇప్పటికీ పనిచేస్తున్న వారు కూడా టెట్‌ పరీక్ష తప్పనిసరిగా పాస్‌ కావాలన్న నిబంధన పెట్టడంతో దాదాపు లక్షమందికి పైగా టీచర్లు ఇబ్బందులు పడుతున్నారు. 20-25 ఏళ్లకు పైబడి సబ్జెక్టు టీచర్లుగా కొనసాగుతున్న వీళ్లు, ఇప్పుడు అన్ని సబ్జెక్టుల సిలబస్‌తో ఉన్న టెట్‌ పరీక్ష పాస్‌కావాలని, అందులోకూడా గరిష్టంగా 60శాతం మార్కులు రావాలని చెప్పడం ఎంతవరకు సమంజసం? పైగా వీళ్లంతా అప్పట్లో డీఎస్సీ ఎలిజిబిలిటీ టెస్టులో ఉత్తీర్ణులు కాబట్టేకదా ఉద్యోగాలు వచ్చాయి? వారికి ఉద్యోగాలు ఇచ్చేటప్పుడు అప్పట్లో “టెట్‌’’ అనే పరీక్షే లేనప్పుడు, ఇప్పుడు వీళ్లుకూడా టెట్‌ పరీక్షలో పాస్‌ కావాలని రూల్‌ పెట్టడం ఎంతవరకు కరెక్టు? టీచర్లందరికీ టెట్‌ను తప్పనిసరి చేస్తూ జాతీయ విద్యాహక్కు చట్టం ప్రకారం 2011 నుంచి టెట్‌ను తప్పనిసరి చేస్తే, ఈ చట్టం రాకముందు నుంచే టీచర్‌ ఉద్యోగాలు చేస్తున్నవారికి “టెట్‌’’ పరీక్షను ఎందుకు తప్పనిసరి చేస్తున్నారంటూ వాళ్లు చేస్తున్న వాదనలో న్యాయం ఉంది కదా? అప్పట్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌ పాస్‌ అయిన తర్వాతే వారికి ఉద్యోగం ఇవ్వడం జరిగింది కదా? టెట్‌ పరీక్ష నిబంధన కారణంగా ప్రమోషన్ల సమస్యే కాకుండా, చివరకు ఉద్యోగభద్రత లేకుండా చేస్తున్నారని, మానసిక ఒత్తిడికి గురిచేస్తున్నారని టీచర్లంతా వాపోతున్నారు. కాని, చంద్రబాబుగారు ఈ టీచర్ల ఇబ్బందుల గురించి పట్టించుకోవడంలేదు. చట్టాన్ని సవరించాలని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేసి, కేంద్రానికి పంపాలన్న ధ్యాసకూడా ఆయనకు లేకుండా పోయింది. టెట్‌ రాకముందు అంటే 2011కు ముందు సర్వీసులో ఉన్న టీచర్లందరికీ, టెట్‌ నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చి, టీచర్లకు ఉపశమనం తీసుకురావాలని డిమాండ్‌ చేస్తున్నాను. వారంతా అప్పట్లో కాంపిటేటివ్ పరీక్షలు పాస్‌ అయిన తర్వాతనే వారికి ఉద్యోగాలు వచ్చాయి అన్నది మరిచిపోకూడదు అనికూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను మరొక్కసారి. English Version- tinyurl.com/rvjstnm3
తెలుగు
112
643
2.3K
247.3K
Harsha Vardhan Reddy
Harsha Vardhan Reddy@hvrysrcp·
ఇడుపులపాయలో మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి గారి ఘాట్ నందు కుటుంబ సభ్యులతో కలిసి నివాళులు అర్పించిన మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు! @ysjagan @YSRCParty #YSRJayanti #YSRLivesOn #JoharYSR #AndhraPradesh #YSJagan
Harsha Vardhan Reddy tweet mediaHarsha Vardhan Reddy tweet mediaHarsha Vardhan Reddy tweet mediaHarsha Vardhan Reddy tweet media
తెలుగు
0
12
100
1.1K
Harsha Vardhan Reddy
Harsha Vardhan Reddy@hvrysrcp·
కొందరు భౌతికంగా మన మధ్య లేకపోయినా.. తమ ఆశయాలతో, సేవలతో ప్రజల హృదయాల్లో శాశ్వతంగా జీవిస్తారు. అలాంటి మహానేత డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి గారు. తరాలు మారినా… “వైఎస్సార్” అనే పేరు వినగానే ఒక చిరునవ్వు, ఒక నమ్మకం, ఒక నిజం గుర్తుకు వస్తాయి. ప్రతి ఇంటి నాయకుడిగా, కోట్లాది ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన మహానేత డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా ఘన నివాళులు ! @YSRCParty #JoharYSR #YSRLivesOn #YSRJayanti
Harsha Vardhan Reddy tweet mediaHarsha Vardhan Reddy tweet media
తెలుగు
0
7
83
826
Harsha Vardhan Reddy retweetledi
YS Jagan Mohan Reddy
YS Jagan Mohan Reddy@ysjagan·
మీరే నా స్ఫూర్తి.. మీ ఆశీస్సులే నా ధైర్యం! Miss You Nana… #77thYSRJayanthi
YS Jagan Mohan Reddy tweet mediaYS Jagan Mohan Reddy tweet mediaYS Jagan Mohan Reddy tweet media
తెలుగు
273
2.1K
9.6K
226.1K
Harsha Vardhan Reddy retweetledi
YS Jagan Mohan Reddy
YS Jagan Mohan Reddy@ysjagan·
అణగారిన వర్గాల ఆత్మగౌరవం, సమాన అవకాశాల కోసం జీవితాంతం అలుపెరుగని కృషి చేసిన మహనీయుడు, మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ గారు. వ్యవసాయం, రక్షణ రంగాల బలోపేతంతో పాటు దేశ ప్రగతికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయం. నేడు డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ గారి వర్ధంతి సందర్భంగా నివాళులు.
YS Jagan Mohan Reddy tweet media
తెలుగు
20
366
1.6K
52.1K
Harsha Vardhan Reddy retweetledi
YS Jagan Mohan Reddy
YS Jagan Mohan Reddy@ysjagan·
హే రామ్‌… సేవ్‌ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు దుష్ట పాలనలో అత్యంత ప్రమాదకర ధోరణిలో పోలీసు యంత్రాంగం @ncbn గారూ... రాజకీయ అణచివేత చర్యలకోసం, ప్రశ్నించేవారి గొంతు నొక్కడానికి ఆంధ్రప్రదేశ్‌లో మీరు పోలీస్‌ వ్యవస్థను అత్యంత ప్రమాదకర ధోరణివైపు నడిపిస్తున్నారు. మీ పాలనలో పుట్టుకొచ్చిన దుష్టసంప్రదాయాలతో మీరు రాష్ట్రంలో ప్రతిచోటా విషపు విత్తనాలు నాటారు, అవి క్రమంగా మొక్కలై విషవృక్షాలుగా మారుతున్నాయి. చిన్నారులు మిస్సింగ్‌ అయినా దర్యాప్తుపై వేగం లేదు. మహిళలపై నేరాలకు సంబంధించి ఫిర్యాదులు నమోదు కాకపోయినా కదలిక లేదు. గిరిజన మహిళను వివస్త్రచేసి, దాడి చేసినా అరెస్టులు లేవు. కానీ సోషల్‌ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మాత్రం కేసులు, అరెస్టులు, చిత్రహింసలు, నాన్‌బెయిలబుల్‌ సెక్షన్లు పెడతారా? కాకినాడ జిల్లా తుని నియోజకవర్గానికి చెందిన చిన్నారి జ్ఞానేశ్వరి కనిపించకుండా పోయి 30 రోజులు దాటిపోయింది. ఇప్పటికీ ఆ పాప ఆచూకీ లేదు. తన కూతురు ఫొటోలు పట్టుకుని ఆ తండ్రి వీధివీధి తిరుగుతున్నాడు. పాప తల్లి ఆ బాధ తట్టుకోలేక తీవ్ర అనారోగ్యానికి గురైంది. ఒక చిన్నారి ఆచూకీ కనుగొనడంలోనే ప్రభుత్వం విఫలమైతే ఇక ప్రజల భద్రతకు భరోసా ఎలా ఇవ్వగలుగుతారు? ఇంకో ఘటనలో ఇదే కాకినాడ జిల్లా పెద్దాపురంలో మానసిక దివ్యాంగురాలైన బాలికపై లైంగిక దాడి ఘటనపై కేసు నమోదుకు నానా తాత్సారం చేసి, నిందితులతో కుమ్మక్కు అయితే ఇక ఈ రాష్ట్రంలో పాలన ఎక్కడుంది? పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలో టీడీపీ మాజీ కౌన్సిలర్‌ గిరిజన మహిళను వివస్త్రను చేసి దాడి చేశారన్న ఘటన రాష్ట్రాన్ని కుదిపేసింది. ఇలాంటి దారుణ ఘటనలో, తాత్సారం చేసిన వారం రోజుల తర్వాత ఫిర్యాదు తీసుకోవడం ఒక పెద్ద తప్పు అయితే ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయకపోవడం మరింత దారుణం. పైగా బాధితులపైనే ఎదురు కేసు పెట్టడం చూస్తే, నేరస్తులకు రక్షణ, బాధితులకు వేధింపులు అన్నట్టుగా మీరు పోలీసు వ్యవస్థను నడుపుతున్నారు. సాయికృష్ణ లాకప్‌డెత్‌, శవం మాయం కేసు రాష్ట్రాన్ని కుదిపేసింది. ఆ తల్లి అడిగిన ప్రశ్నలకు మీ వద్ద ఇప్పటికీ సమాధానాల్లేవు. క్రాంతికుమార్‌ ఆత్మహత్య కేసు, తాను ఇచ్చిన మరణ వాంగ్మూలం, దీన్ని సోషల్‌ మీడియా సాక్షిగా చూసిన ప్రజలు తీవ్రంగా కలతచెందారు. గంగమ్మ, తిరుపతమ్మల లాకప్‌డెత్‌, పోలీసుల వేధింపులతో కళావతి ఆత్మహత్య కేసులు, ఇవన్నీ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థకు తీవ్ర తలవంపులు తెచ్చాయి. అయినా, మీ బరితెగింపునకు కట్టడి లేదు. వీటన్నింటి నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి రోజుకో డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారు. సోషల్‌ మీడియా యాక్టివిస్టులపై వాటికి సంబంధించిన సెక్షన్లతో కాకుండా, బెయిల్‌ రాని సెక్షన్లు పెట్టాలని, కేసులను వ్య‌వ‌స్థీకృత నేరాల‌కు లింక్‌ చేయాలంటూ ఒక ఆర్గనైజ్డ్‌ క్రిమినల్‌ మాదిరిగా మీరే, ప్రతి స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌కు ఈ ఆదేశాలు చేరేలా, పోలీసుల‌కు హుకుం జారీ చేసిన‌ట్లుగా స‌మాచారం వ‌స్తోంది. ఇది అత్యంత ప్రమాదకరమైన ధోరణి. ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, భయపెట్టాలనుకోవడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే అవుతుంది. యూట్యూబ్‌ ఇన్‌ఫ్లూయెన్సర్‌, ఉస్మానియా గోల్డ్‌మెడల్‌ జర్నలిస్ట్‌ కేవీఆర్‌ను సరైన చట్ట ప్రక్రియలు పాటించకుండా హైదరాబాద్‌ నుంచి భారీ పోలీసు బలగాలతో తీసుకురావడం, అతను చేయని వాటిని చేసినట్టుగా ఎఫ్‌ఐఆర్‌లో పెట్టి, జైలుకు పంపడం అత్యంత దుర్మార్గం. యూట్యూబర్‌ రావణ్ విషయంలో ఇప్పుడు మీరు పెట్టిన కేసులకు, నాలుగు కోర్టుల్లో బెయిల్స్‌ వచ్చినా, అహంకారంతో చెలరేగిపోతూ, నేరుగా సంబంధిత పోలీస్‌స్టేషన్లపై త‌మ వారి చేత దాడులు చేయించారు. అసహనంతో తీవ్రవాదులపై పెట్టే అభియోగాలు మోపారు. చంద్రబాబుగారూ.., మీరు, పవన్‌కళ్యాణ్‌, లోకేష్‌లు సహా మీ పార్టీ నాయకులు గతంలో, ఇప్పుడుకూడా ఏ మాట్లాడారో, ఏం మాట్లాడుతున్నారో ఇప్పుడు వాళ్లుకూడా అవే మాటలు మాట్లాడుతున్నారు, వాటినే ప్రశ్నిస్తున్నారు. అలాంటప్పుడు మరి అవే అభియోగాలు మీ మీదకూడా పెట్టాలికదా? విమర్శకులను నేరస్తులుగా చిత్రీకరించడం, వారిని చంపడం కోసం పోలీస్‌స్టేషన్ల మీదకు మీవారిని పంపి దాడిచేయించడం, పోలీసులు మౌనం వహించి, ప్రేక్షకు పాత్ర పోషించడం, ఇవన్నీ ప్రజాస్వామ్యానికి ప్రమాదకర సంకేతాలు. ఇది రాజ్యాంగ హక్కులపై దాడి. ఇది ప్రజాస్వామ్య విలువలపై దాడి. చంద్రబాబుగారూ ఆంధ్రప్రదేశ్‌కు కావాల్సింది రౌడీ పోలీస్‌ రాజ్యం కాదు. జంగిల్‌రాజ్‌ కాదు. ప్రజలకు భద్రత కల్పించే పాలన కావాలి. బాధితులకు న్యాయం చేసే వ్యవస్థ కావాలి. చట్టం ముందు అందరూ సమానమనే నమ్మకం కావాలి. రాజకీయ ఆదేశాలకు కాకుండా, రాజ్యాంగానికి లోబడి నడిచే పోలీస్‌ వ్యవస్థ కావాలి. హే రామ్‌.. సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌. English Version- tinyurl.com/3ueswry7
తెలుగు
964
1.6K
5K
775.7K
Harsha Vardhan Reddy retweetledi
YS Jagan Mohan Reddy
YS Jagan Mohan Reddy@ysjagan·
`మీపై మీకు విశ్వాసం ఉంటేనే గొప్ప విజయాలకు పునాది పడుతుంది.` * స్వామి వివేకానంద భారత యువతలో ఆత్మవిశ్వాసం, సేవా దృక్పథం, దేశభక్తిని నింపిన మ‌హ‌నీయుడు స్వామి వివేకానంద గారు. ప్రతి యువకుడు తన సామర్థ్యాన్ని విశ్వసిస్తూ, జ్ఞానాన్ని ఆయుధంగా, సేవను ధ్యేయంగా, దేశాభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని ముందుకు సాగాలని ఆయ‌న ఇచ్చిన సందేశం నేటికీ స్ఫూర్తిదాయ‌కం. నేడు స్వామి వివేకానంద గారి వ‌ర్ధంతి సంద‌ర్భంగా నివాళుల‌ర్పిస్తున్నాను.
YS Jagan Mohan Reddy tweet media
తెలుగు
18
403
1.6K
42.8K
Harsha Vardhan Reddy retweetledi
YS Jagan Mohan Reddy
YS Jagan Mohan Reddy@ysjagan·
పేదలు, బలహీన వర్గాల పక్షాన నిలబడి, వారి అభ్యున్నతి కోసం తన చివరి శ్వాస వరకు పోరాడిన ప్రజానాయకుడు వంగవీటి మోహన రంగా గారు. ప్రజలతో మమేకమై, వారి కష్టసుఖాల్లో భాగస్వామిగా నిలుస్తూ ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం. ప్రజల గుండెల్లో నిలిచిన రంగా గారి జయంతి సందర్భంగా నివాళులర్పిస్తున్నాను.
YS Jagan Mohan Reddy tweet media
తెలుగు
124
969
5.2K
247.5K
Harsha Vardhan Reddy
Harsha Vardhan Reddy@hvrysrcp·
శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గ ఇంచార్జి శ్రీమతి రెడ్డి శాంతి గారి అధ్యక్షతన కొత్తూరు మండలంలో జరిగిన S.I.R సమీక్షా సమావేశంలో జిల్లా అధ్యక్షులు, మాజీ ఉపముఖ్యమంత్రి శ్రీ ధర్మాన కృష్ణదాస్ గారు, పార్లమెంట్ పరిశీలకులు ఎమ్మెల్సీ కుంభ రవిబాబు గారు మరియు ఇతర ముఖ్య నాయకులతో కలిసి పాల్గొనడం జరిగింది. @ysjagan @YSRCParty #YSJagan #AndhraPradesh #YSRCP
Harsha Vardhan Reddy tweet mediaHarsha Vardhan Reddy tweet mediaHarsha Vardhan Reddy tweet mediaHarsha Vardhan Reddy tweet media
తెలుగు
0
0
38
855
Harsha Vardhan Reddy
Harsha Vardhan Reddy@hvrysrcp·
రేపు (02.07.2026) ఉదయం 10 గంటలకు విజయవాడలో పేరుపోగు క్రాంతి కుమార్ కుటుంబాన్ని పరామర్శించనున్న మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత శ్రీ వైయస్‌ జగన్‌ గారు. @ysjagan @YSRCParty #YSRCP #AndhraPradesh #YSJagan
Harsha Vardhan Reddy tweet media
తెలుగు
0
3
76
1.9K
Harsha Vardhan Reddy
Harsha Vardhan Reddy@hvrysrcp·
ఏపీలో సాగుతున్న జంగిల్ రాజ్ పాలన ఏ స్థాయిలో ఉందో ఆధారాలతో సహా బయటపెట్టిన మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు ! @ysjagan @YSRCParty #AndhraPradesh #YSJagan #YSRCP
Harsha Vardhan Reddy tweet mediaHarsha Vardhan Reddy tweet mediaHarsha Vardhan Reddy tweet mediaHarsha Vardhan Reddy tweet media
తెలుగు
0
6
61
663
Harsha Vardhan Reddy
Harsha Vardhan Reddy@hvrysrcp·
రేపు అనగా 01.07.2026 ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షులు శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమైన ప్రెస్మీట్ పెట్టబోతున్నారు..! @ysjagan @YSRCParty #YSRCP #YSJagan #AndhraPradesh
Harsha Vardhan Reddy tweet media
తెలుగు
0
1
32
1.4K