VT😎🇮🇳

29.2K posts

VT😎🇮🇳 banner
VT😎🇮🇳

VT😎🇮🇳

@VTofficial97

New Delhi Katılım Ağustos 2016
1.4K Takip Edilen2.2K Takipçiler
VT😎🇮🇳
VT😎🇮🇳@VTofficial97·
పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన... జూన్ 10వ తేదీన రెండు రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీ వెళ్లనున్న జనసేన అధినేత శ్రీ @PawanKalyan గారు.అదేరోజున జరిగే "12 సంవత్సరాల NDA పాలన "కార్యక్రమంలో పాల్గొననున్నారు.తదుపరి రాష్ట్ర అభివృద్ధి, రాజకీయ అంశాలపై పలువురితో భేటీలు ఉండే అవకాశం #JanaSena #NDA
VT😎🇮🇳 tweet media
తెలుగు
0
35
260
5K
VT😎🇮🇳 retweetledi
JanaSena Party
JanaSena Party@JanaSenaParty·
GO released : Special Task force appointed to take care of Godavari water Sanity ! #PawanKalyanAneNenu
JanaSena Party tweet media
English
0
0
0
13.7K
VT😎🇮🇳 retweetledi
Deputy CMO, Andhra Pradesh
రాష్ట్రంలోని ప్రధాన నదుల కాలుష్య నివారణకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు •ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ •ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి ఆదేశాల మేరకు ఏర్పాటైన ప్రత్యేక టాస్క్ ఫోర్స్ వచ్చే ఏడాది జూన్ నెలలో మొదలయ్యే గోదావరి పుష్కరాల నేపథ్యంలో గోదావరితోపాటు రాష్ట్రంలోని ఇతర ప్రధాన నదులలో కాలుష్య నివారణే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నదుల్లోని కాలుష్య సమస్యలను గుర్తించి, వాటి నివారణకు తక్షణ చర్యలు చేపట్టడం కోసం అత్యున్నత స్థాయి ఎన్విరాన్‌మెంట్ ప్రొటెక్షన్ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేస్తూ జీవో జారీ చేసింది. ఉప ముఖ్యమంత్రి, పర్యావరణ, అటవీ శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అధ్యక్షతన రాజమహేంద్రవరంలో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో అంతర్ జిల్లా టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలనే ఆదేశాల మేరకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తూ పర్యావరణ, అటవీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ కాంతిలాల్ దండే ఉత్తర్వులు జారీ చేశారు. రాజమహేంద్రవరంలో రెండు రోజులపాటు పర్యటించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్వయంగా పడవపై ప్రయాణించి నల్లా ఛానల్, ఆంధ్ర పేపర్ మిల్స్ పరిశ్రమల పరిసర ప్రాంతాలను పరిశీలించారు. ఈ పరిశ్రమల నుంచి వస్తున్న రసాయన వ్యర్థాలు, నగర మురుగునీరు నేరుగా పవిత్రమైన గోదావరి నదిలో కలవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పుష్కరాలకు వచ్చే భక్తులు తాము మురుగు నీటిలో స్నానం చేస్తున్నామనే భావనతో వెళ్లకూడదు. ప్రతి ఒక్కరికీ పవిత్రమైన, స్వచ్ఛమైన గోదావరి జలాల్లో స్నానం చేస్తున్నామనే ఆధ్యాత్మిక అనుభూతి కలగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఉప ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు గోదావరి నదిని కాలుష్య రహితంగా మార్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసింది. ఈ టాస్క్ ఫోర్స్ నదిలోకి కలిసే మురుగునీరు, పారిశ్రామిక వ్యర్థాలను అరికట్టడంతోపాటు, శాశ్వత పర్యావరణ రక్షణ చర్యలను పర్యవేక్షించనుంది. • కమిటీ స్వరూపం ఈ ప్రత్యేక కమిటీకి పర్యావరణ, అటవీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ చైర్మన్‌గా వ్యవహరించనుండగా, ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి మెంబర్ సెక్రటరీ కన్వీనర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తారు. పురపాలక పరిపాలన శాఖ కమిషనర్ అండ్ డైరెక్టర్ (సీడీఎంఏ), పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి కమిషనర్, పరిశ్రమల శాఖ కమిషనర్, వ్యవసాయ శాఖ కమిషనర్, మత్స్య శాఖ కమిషనర్, ఆంధ్రప్రదేశ్ టూరిజం అథారిటీ సీఈఓ, దేవాదాయ శాఖ కమిషనర్, జలవనరుల శాఖ ఇంజనీర్-ఇన్-చీఫ్, గ్రామీణ నీటి సరఫరా ఇంజనీర్-ఇన్-చీఫ్, క్లీన్ కృష్ణా, గోదావరి కెనాల్స్ మిషన్ డైరెక్టర్, గోదావరి పరివాహక ప్రాంత జిల్లాలైన తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కాకినాడ, కోనసీమ, పోలవరం జిల్లాల కలెక్టర్లు సభ్యులుగా ఉంటారు. •కమిటీ ప్రధాన విధులు ఈ ప్రత్యేక కమిటీ ప్రతి15 రోజులకు ఒకసారి తప్పనిసరిగా సమావేశం అవుతుంది. గోదావరితోపాటు రాష్ట్రంలోని ఇతర ప్రధాన నదుల్లోకి కాలుష్యం ఎక్కడెక్కడ నుంచి చేరుతుందో క్షేత్రస్థాయిలో గుర్తిస్తుంది. గుర్తించిన సమస్యలకు కాలుష్య నియంత్రణ మండలి సూచనల ప్రకారం నివారణ చర్యలను తీసుకుంటూ పనుల ప్రగతిని పర్యవేక్షిస్తుంది. గోదావరి పుష్కరాల నాటికి భక్తులకు స్వచ్ఛమైన నదీ జలాలను అందించడమే లక్ష్యంగా ఈ టాస్క్ ఫోర్స్ పనిచేస్తుంది. @PMOIndia @AndhraPradeshCM @PIB_India @IPR_AP @pibvijayawada
తెలుగు
0
0
0
23.6K
VT😎🇮🇳 retweetledi
JanaSena Party
JanaSena Party@JanaSenaParty·
పంచాయతీలు ఆర్థిక స్వావలంబన సాధించాలి * ఆన్లైన్ పన్నుల వసూళ్లతో విధానంతో పారదర్శకత పెరుగుతుంది * రాజవోలు గ్రామ పంచాయతీలో స్వయంగా ఆన్లైన్ పన్నుల విధానాన్ని పరిశీలించిన ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు ‘సాంకేతికత వినియోగంతో పారదర్శకత పెరుగుతుంది. పంచాయతీ పన్నుల వసూలు ప్రక్రియ సరికొత్త మార్గంలో ముందుకు వెళ్లడం శుభపరిణామం’ అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అన్నారు. గతంలో మాన్యువల్ పద్ధతిలో పన్ను వసూళ్లు ఉండేవని, దీన్ని పూర్తిగా మార్చి మొత్తం ఆన్లైన్ విధానం తీసుకు వచ్చామని చెప్పారు. పంచాయతీల్లో పన్నుల వసూళ్లకు నూతనంగా ప్రవేశపెట్టిన ఆన్లైన్ విధానాన్ని ఉప ముఖ్యమంత్రివర్యులు మంగళవారం స్వయంగా పరిశీలించారు. రాజమండ్రి రూరల్ మండలం, రాజవోలు గ్రామపంచాయతీ కార్యాలయానికి వెళ్లి అక్కడ జరుగుతున్న పన్నుల వసూలు విధానాన్ని పరిశీలించారు. పన్నులను ఆన్లైన్లో కడుతున్న వారితో మాట్లాడారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ.. "కూటమి ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీతనంతో పని చేస్తుంది. ప్రజల నుంచి వసూలు చేసే ప్రతి పైసాను పారదర్శకంగా ఖర్చు చేస్తుంది. పంచాయతీలు స్వావలంబన సాధించాలంటే, ఆర్థికంగా వృద్ధి చెందాలి. స్వయంగా ఆదాయం ఆర్జించే స్థాయికి పంచాయతీలు రావాలి. ప్రతి అభివృద్ధి పనికి ప్రభుత్వం మీద ఆధారపడకుండా సొంతంగా అభివృద్ధి చేసుకునే దశకు పంచాయతీలు రావాలి. దీనికోసం ప్రభుత్వం తగిన విధంగా ప్రోత్సహిస్తోంది. నూతన విధానాలను పంచాయతీలు కూడా అందిపుచ్చుకొని, పన్నులు గ్రామ ప్రగతికి పునాదులు అనే విషయాన్ని ప్రజలకు తెలియజేయాలి" అన్నారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారి వెంట మంత్రులు శ్రీ @mnadendla గారు, శ్రీ @kanduladurgesh గారు, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శ్రీ కాంతిలాల్ దండే గారు, పంచాయతీరాజ్ కమిషనర్ శ్రీ కృష్ణ తేజ గారు ఉన్నారు. *ఆవ ఛానెల్ పరిశీలన* రాజవోలు గ్రామపంచాయతీ నుంచి తిరిగి వస్తూ శ్రీ పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రిలో కీలకమైన ఆవాఎల్ చానల్ ను పరిశీలించారు. ఎస్టీపీ నుంచి వచ్చే ఈ ఛానెల్ పూర్తిగా వ్యర్ధాలతో నిండిపోయి ఉండటంపై శ్రీ పవన్ కళ్యాణ్ గారు అసహనం వ్యక్తం చేశారు. కలెక్టర్ శ్రీమతి కీర్తి చేకూరి, జాయింట్ కలెక్టర్ శ్రీ మేఘ స్వరూప్ లను పిలిచి కాలువలో వ్యర్ధాలు పేరుకుపోకుండా, ముఖ్యంగా ప్లాస్టిక్ వ్యర్ధాలు నిలిచిపోకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పంచాయతీల్లో స్వచ్ఛరథాలు మాదిరిగా అర్బన్ ప్రాంతాల్లో కూడా ప్రత్యేకంగా ఏదైనా కార్యక్రమం నిర్వహించాలని చెప్పారు. భారీగా ప్లాస్టిక్ వ్యర్థాలు ఎందుకు పేరుకు పోతున్నాయనే విషయం మీదా, ఆ సమస్య మీద ప్రజల్లో అవగాహన కలిగించే కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టాలని సూచించారు. దీనికి ప్రభుత్వం నుంచి తగిన సహకారం అందుతుందని, వెంటనే ఛానల్ సరిదిద్దే ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. - గోదావరి పరీవాహకంలో కాలుష్య నివారణకు రూ.100 కోట్లు కృష్ణా, గోదావరి నదులను కాలుష్యం నుంచి రక్షించడానికి, వాటిని శుభ్రపరచడానికి మిషన్ క్లీన్ కృష్ణా, గోదావరి ప్రాజెక్టులు చేపట్టారు. అయితే అనుకున్నంత స్థాయిలో ఫలితాలు ఇవ్వలేదని గుర్తించారు. గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో నదీ జలాలు కాలుష్యం బారిన పడకుండా రూ.100 కోట్లను కేటాయిస్తున్నట్లు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు. ఈ నిధుల ద్వారా మురుగునీరు, పారిశ్రామిక వ్యర్థాలు నేరుగా కాలువల్లో కలకవకుండా నిరోధించడానికి ఉపయోగిస్తామని శ్రీ పవన్ కళ్యాణ్ గారు తెలిపారు. నది, కాలువల్లోకి వెళ్లే మురికినీటిని శుద్ధి చేయడానికి ఎస్టీపీలను ఏర్పాటు చేయడం వంటి పనులను ఈ నిధులతో చేపట్టాలని నిర్ణయించారు. *వుడ్ బ్యాంక్ కోసం పంచాయతీరాజ్ - అటవీ శాఖ మధ్య అవగాహన ఒప్పందం* వుడ్ బ్యాంక్ కింద మొక్కలు కొనుగోలు చేయడానికి పంచాయతీరాజ్ - అటవీ శాఖల అవగాహన ఒప్పందం జరిగింది. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.10 కోట్లను పంచాయతీరాజ్ శాఖ వారు అటవీ శాఖకు ఇస్తారు. అందుకు సంబంధించి అటవీ శాఖ కలపను త్వరగా ఇచ్చే మొక్కలను అందిస్తుంది. వాటితో పంచాయితీల్లో పల్లె వనాలు అభివృద్ధి చేస్తారు. అక్కడ వచ్చే కలపను అటవీ శాఖ కొనుగోలు చేసి వుడ్ బ్యాంక్ ఏర్పాటు చేస్తుంది. ఈ కార్యక్రమం ద్వారా అటు పంచాయతీలకు ఆదాయ ఆర్జన సాధ్యమవుతుంది, ఇటు పర్యావరణం మెరుగవుతుంది. ఇందుకు సంబంధించిన ఒప్పంద పత్రాలపై పీసీసీఎఫ్ శ్రీ చలపతి రావు, పి ఆర్ ఆర్డీ కమిషనర్ శ్రీ కృష్ణ తేజ సంతకాలు చేశారు.
JanaSena Party tweet mediaJanaSena Party tweet mediaJanaSena Party tweet mediaJanaSena Party tweet media
తెలుగు
0
0
0
10.5K
VT😎🇮🇳 retweetledi
Deputy CMO, Andhra Pradesh
పంచాయతీలు ఆర్థిక స్వావలంబన సాధించాలి * ఆన్లైన్ పన్నుల వసూళ్లతో విధానంతో పారదర్శకత పెరుగుతుంది * రాజవోలు గ్రామ పంచాయతీలో స్వయంగా ఆన్లైన్ పన్నుల విధానాన్ని పరిశీలించిన ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు ‘సాంకేతికత వినియోగంతో పారదర్శకత పెరుగుతుంది. పంచాయతీ పన్నుల వసూలు ప్రక్రియ సరికొత్త మార్గంలో ముందుకు వెళ్లడం శుభపరిణామం’ అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అన్నారు. గతంలో మాన్యువల్ పద్ధతిలో పన్ను వసూళ్లు ఉండేవని, దీన్ని పూర్తిగా మార్చి మొత్తం ఆన్లైన్ విధానం తీసుకు వచ్చామని చెప్పారు. పంచాయతీల్లో పన్నుల వసూళ్లకు నూతనంగా ప్రవేశపెట్టిన ఆన్లైన్ విధానాన్ని ఉప ముఖ్యమంత్రివర్యులు మంగళవారం స్వయంగా పరిశీలించారు. రాజమండ్రి రూరల్ మండలం, రాజవోలు గ్రామపంచాయతీ కార్యాలయానికి వెళ్లి అక్కడ జరుగుతున్న పన్నుల వసూలు విధానాన్ని పరిశీలించారు. పన్నులను ఆన్లైన్లో కడుతున్న వారితో మాట్లాడారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ.. "కూటమి ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీతనంతో పని చేస్తుంది. ప్రజల నుంచి వసూలు చేసే ప్రతి పైసాను పారదర్శకంగా ఖర్చు చేస్తుంది. పంచాయతీలు స్వావలంబన సాధించాలంటే, ఆర్థికంగా వృద్ధి చెందాలి. స్వయంగా ఆదాయం ఆర్జించే స్థాయికి పంచాయతీలు రావాలి. ప్రతి అభివృద్ధి పనికి ప్రభుత్వం మీద ఆధారపడకుండా సొంతంగా అభివృద్ధి చేసుకునే దశకు పంచాయతీలు రావాలి. దీనికోసం ప్రభుత్వం తగిన విధంగా ప్రోత్సహిస్తోంది. నూతన విధానాలను పంచాయతీలు కూడా అందిపుచ్చుకొని, పన్నులు గ్రామ ప్రగతికి పునాదులు అనే విషయాన్ని ప్రజలకు తెలియజేయాలి" అన్నారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారి వెంట మంత్రులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, శ్రీ కందుల దుర్గేష్ గారు, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శ్రీ కాంతిలాల్ దండే గారు, పంచాయతీరాజ్ కమిషనర్ శ్రీ కృష్ణ తేజ గారు ఉన్నారు. * ఆవ ఛానెల్ పరిశీలన రాజవోలు గ్రామపంచాయతీ నుంచి తిరిగి వస్తూ శ్రీ పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రిలో కీలకమైన ఆవాఎల్ చానల్ ను పరిశీలించారు. ఎస్టీపీ నుంచి వచ్చే ఈ ఛానెల్ పూర్తిగా వ్యర్ధాలతో నిండిపోయి ఉండటంపై శ్రీ పవన్ కళ్యాణ్ గారు అసహనం వ్యక్తం చేశారు. కలెక్టర్ శ్రీమతి కీర్తి చేకూరి, జాయింట్ కలెక్టర్ శ్రీ మేఘ స్వరూప్ లను పిలిచి కాలువలో వ్యర్ధాలు పేరుకుపోకుండా, ముఖ్యంగా ప్లాస్టిక్ వ్యర్ధాలు నిలిచిపోకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పంచాయతీల్లో స్వచ్ఛరథాలు మాదిరిగా అర్బన్ ప్రాంతాల్లో కూడా ప్రత్యేకంగా ఏదైనా కార్యక్రమం నిర్వహించాలని చెప్పారు. భారీగా ప్లాస్టిక్ వ్యర్థాలు ఎందుకు పేరుకు పోతున్నాయనే విషయం మీదా, ఆ సమస్య మీద ప్రజల్లో అవగాహన కలిగించే కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టాలని సూచించారు. దీనికి ప్రభుత్వం నుంచి తగిన సహకారం అందుతుందని, వెంటనే ఛానల్ సరిదిద్దే ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. - గోదావరి పరీవాహకంలో కాలుష్య నివారణకు రూ.100 కోట్లు కృష్ణా, గోదావరి నదులను కాలుష్యం నుంచి రక్షించడానికి, వాటిని శుభ్రపరచడానికి మిషన్ క్లీన్ కృష్ణా, గోదావరి ప్రాజెక్టులు చేపట్టారు. అయితే అనుకున్నంత స్థాయిలో ఫలితాలు ఇవ్వలేదని గుర్తించారు. గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో నదీ జలాలు కాలుష్యం బారిన పడకుండా రూ.100 కోట్లను కేటాయిస్తున్నట్లు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు. ఈ నిధుల ద్వారా మురుగునీరు, పారిశ్రామిక వ్యర్థాలు నేరుగా కాలువల్లో కలకవకుండా నిరోధించడానికి ఉపయోగిస్తామని శ్రీ పవన్ కళ్యాణ్ గారు తెలిపారు. నది, కాలువల్లోకి వెళ్లే మురికినీటిని శుద్ధి చేయడానికి ఎస్టీపీలను ఏర్పాటు చేయడం వంటి పనులను ఈ నిధులతో చేపట్టాలని నిర్ణయించారు. * వుడ్ బ్యాంక్ కోసం పంచాయతీరాజ్ - అటవీ శాఖ మధ్య అవగాహన ఒప్పందం వుడ్ బ్యాంక్ కింద మొక్కలు కొనుగోలు చేయడానికి పంచాయతీరాజ్ - అటవీ శాఖల అవగాహన ఒప్పందం జరిగింది. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.10 కోట్లను పంచాయతీరాజ్ శాఖ వారు అటవీ శాఖకు ఇస్తారు. అందుకు సంబంధించి అటవీ శాఖ కలపను త్వరగా ఇచ్చే మొక్కలను అందిస్తుంది. వాటితో పంచాయితీల్లో పల్లె వనాలు అభివృద్ధి చేస్తారు. అక్కడ వచ్చే కలపను అటవీ శాఖ కొనుగోలు చేసి వుడ్ బ్యాంక్ ఏర్పాటు చేస్తుంది. ఈ కార్యక్రమం ద్వారా అటు పంచాయతీలకు ఆదాయ ఆర్జన సాధ్యమవుతుంది, ఇటు పర్యావరణం మెరుగవుతుంది. ఇందుకు సంబంధించిన ఒప్పంద పత్రాలపై పీసీసీఎఫ్ శ్రీ చలపతి రావు, పి ఆర్ ఆర్డీ కమిషనర్ శ్రీ కృష్ణ తేజ సంతకాలు చేశారు. (1/3)
Deputy CMO, Andhra Pradesh tweet mediaDeputy CMO, Andhra Pradesh tweet mediaDeputy CMO, Andhra Pradesh tweet mediaDeputy CMO, Andhra Pradesh tweet media
తెలుగు
0
0
0
33.9K
VT😎🇮🇳
VT😎🇮🇳@VTofficial97·
RT @JanaSenaParty: పంచాయతీలు ఆర్థిక స్వావలంబన సాధించాలి * ఆన్లైన్ పన్నుల వసూళ్లతో విధానంతో పారదర్శకత పెరుగుతుంది * రాజవోలు గ్రామ పంచాయతీ…
తెలుగు
0
44
0
2
VT😎🇮🇳 retweetledi
JanaSena Party
JanaSena Party@JanaSenaParty·
కలుషిత జలాలు గోదావరిలో కలిపేస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారు? గలగలా గోదారి… అని గీతం ఆలపిస్తాము… ఇంత కాలుష్యం ఉంటే ఏమని ఆలపించాలి? * ఆంధ్ర పేపర్ మిల్స్ యాజమాన్యానికి నోటీసులు ఎందుకు ఇవ్వలేదు? * రూ. 13 కోట్ల బకాయిలను రాబట్టలేరా? * ప్రజల ముందు సమాధానం చెప్పాల్సింది మేము * ⁠పుష్కరాల్లో పన్నీరు స్నానం చేయించక్కర్లేదు… కెమికల్ స్నానం చేయించకూడదు కదా * ఇంతటి కీలక సమస్యలను నా దృష్టికి తీసుకురండి క్యాబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటాం * ఆంధ్ర పేపర్ మిల్స్ పరిశ్రమ కాలుష్యాన్ని ప్రత్యక్షంగా… తూర్పులంక లాగూన్స్ వరకు వెళ్లి మరీ పరిశీలించిన ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ‘మా తెలుగుతల్లికి.. రాష్ట్ర గీతంలో గల గలా గోదారి అని గుండెల నిండా ఆర్తితో ఆలపిస్తాం.. ఇక్కడకు వచ్చి చూస్తే గోదావరి వెలవెలబోతూ.. కాలుష్యంతో నిండిపోతూ కనిపిస్తోంది. ఏమని ఆలపించాలి. ఇంతటి కాలుష్యం కలుస్తున్న నీటిలో మన పిల్లలను స్నానం చేయించే సాహసం చేస్తామా..? ఇంత దారుణంగా కలుషిత జలాలు గోదావరిలోకి ప్రత్యక్షంగా కలుస్తున్నా అధికారులు ఇంకా మీనమేషాలు ఎందుకు లెక్కిస్తున్నారు?’ అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పారిశ్రామిక అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోంది… పరిశ్రమలను ప్రోత్సహించాలని రాయితీ ధరలకు భూములను కేటాయిస్తున్నాం.. ప్రభుత్వం ఎంత సహకరిస్తున్నా, పరిశ్రమలకు కనీసం పర్యావరణ స్పృహ లేకపోతే ఎలా అని ప్రశ్నించారు. రాజమహేంద్రవరం ఆంధ్ర పేపర్ మిల్స్ లిమిటెడ్ పరిశ్రమ గోదావరిలోకి వదులుతున్న కాలుష్య జలాలను శ్రీ పవన్ కళ్యాణ్ గారు మంగళవారం ఉదయం ప్రత్యక్షంగా పరిశీలించారు. కలుషిత నీటిని శుద్ధి చేసి గోదావరిలోకి విడుదల చేయాలి. తూర్పు లంకలోని లాగూన్స్ (మడుగులు)లో వీటిని వదులుతారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఉదయాన్నే వెంకట నగరం ఘాట్ నుంచి పడవలో లాగూన్స్ వరకూ వెళ్లి ప్రత్యక్ష పరిశీలన చేశారు. కాలుష్య నియంత్రణ మండలి మొబైల్ కిట్లతో నీటిలో కాలుష్య కారకాలు ఎంత ఉన్నాయి అన్నది అక్కడికక్కడే పరీక్షలు చేయించారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తూ- ప్రత్యక్షంగా గోదావరిలోకి కాలుష్య జలాలు ఈ స్థాయిలో కలుస్తున్నా ఇప్పటి వరకు కాలుష్య నియంత్రణ మండలి అధికారులు ఎందుకు స్పందించలేదని, కనీసం నోటీసులు ఎందుకు ఇవ్వలేదని కాలుష్య నియంత్రణ మండలి ఈఈ శ్రీ శంకర్ నాయక్ ను ప్రశ్నించారు. ఎప్పటికప్పుడు తనిఖీలు చేసి కాలుష్య శుద్ధి ఎలా జరుగుతుంది అన్న వివరాలు తెలుసుకుంటున్నారా? క్షేత్రస్థాయిలోకి వచ్చి ఈ మడుగులను ఎన్నిసార్లు పరిశీలించారు అని ప్రశ్నించారు. గోదావరి మధ్యలోని తూర్పులంకలో అతి పెద్ద మడుగులలో కాలుష్య కారకాలు ఉన్న నీటిని నిల్వ చేసి తర్వాత, గోదావరిలోకి ఇంకిపోయేలా చేయడం ఏమిటన్నారు. మడుగుల్లోని నీరు మొబైల్ కిట్ లో మరోసారి పరీక్షలు చేయించారు. అక్కడ గుర్రపు డెక్క భారీగా పేరుకొని ఉందంటే కచ్చితంగా జలాలు కలుషితం అయినట్లే కదా అన్నారు. *పెండింగ్ బకాయి రాబట్టలేరా?* కూటమి ప్రభుత్వం పరిశ్రమలకు స్నేహపూర్వక భాగస్వామిగా ఉంటుంది. రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు వస్తే, యువతకు ఉపాధి దొరుకుతుందని, రాష్ట్ర ప్రగతి పరుగులు పెడుతుందని భావిస్తాం. అయితే ఇంత స్నేహపూర్వక వాతావరణంలో రాయితీలపై భూములు కేటాయిస్తున్నా సరే పరిశ్రమలు కాలుష్యం నివారణ విషయంలో సరైన దృష్టి పెట్టడం లేదు అనిపిస్తుంది. గాలి, నీరు కాలుష్యం విషయంలో ప్రతి పరిశ్రమ కాలుష్య నియంత్రణ మండలి నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. ఆంధ్ర పేపర్ మిల్స్ యాజమాన్యం ప్రభుత్వానికి పన్నులు రూపేణా చెల్లించాల్సిన రూ. 13 కోట్ల బకాయిలను వెంటనే రాబట్టేలా జిల్లా యంత్రాంగం పనిచేయాలి. ప్రభుత్వం నుంచి రాయితీలు పొందుతూ బకాయిలు కట్టకపోతే ఎలా? దీనిపై సీరియస్ గా స్పందించండి. అలాగే ప్రతి ఏటా కాలుష్య నియంత్రణకు యాజమాన్యం ఎంత మేర చిత్తశుద్ధితో చర్యలు తీసుకుంటుందో..? పరిశీలించండి. ఇంత దారుణంగా కళ్ళముందే కాలుష్యం జరుగుతున్న ఇప్పటివరకు కాలుష్య నియంత్రణ మండలి అధికారులు యాజమాన్యానికి ఎందుకు నోటీసు ఇవ్వలేదో కూడా నివేదిక ఇవ్వండి అని ఆదేశించారు. *ప్రజలకు సమాధానం చెప్పాల్సింది మేము* ‘క్షేత్రస్థాయిలో పరిస్థితులు చక్కదిద్దాల్సింది అధికారులైతే, ప్రజాక్షేత్రంలో సమాధానం చెప్పాల్సింది ప్రజా ప్రతినిధులుగా మేము. గోదావరి కాలుష్యం మీద నా కార్యాలయానికి ఫిర్యాదులు వస్తున్నాయి. అసలు నిబంధనలు క్షేత్రస్థాయిలో అమలు అవుతున్నాయా? పరిస్థితి చూస్తే దారుణంగా ఉంది. ప్రజలు ఏదైనా మమ్మల్ని ప్రశ్నిస్తారు. వారికి సమాధానం చెప్పాల్సింది మేము.
JanaSena Party tweet mediaJanaSena Party tweet mediaJanaSena Party tweet mediaJanaSena Party tweet media
తెలుగు
0
0
0
7.6K
VT😎🇮🇳 retweetledi
Deputy CMO, Andhra Pradesh
గోదావరి గలగల కాదు... కాలుష్యంతో విలవిల •రోడ్లు కంటే ముందు గోదావరి జలాల శుద్ధి జరగాలి •నదిని మురికిగా ఉంచి భక్తులను స్నానాలు చేయమనడం వంచించడమే •పారిశ్రామికవేత్తల మాటల్లో నియమాలు… చేతల్లో ఉల్లంఘనలు •ఆంధ్ర పేపర్ మిల్లు సంస్థ నిబంధనలను ఉల్లంఘించింది •కనీసం పన్ను బకాయిలు కూడా చెల్లించలేదు •పర్యావరణ పరిరక్షణలో పారిశ్రామికవేత్తలు బాధ్యతతో ఉండాలి •రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కార్యాలయంలో గోదావరి నది కాలుష్యం, పుష్కరాల సన్నద్ధతపై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించిన ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు ‘ఒకప్పుడు గలగలా ప్రవహించిన గోదావరి తల్లి, నేడు పారిశ్రామిక వ్యర్థాల కాలుష్యంతో విలవిలలాడుతోంది. నదిని మురికిగా ఉంచి, భక్తులను పవిత్ర స్నానాలు చేయమనడం ప్రజలను వంచించడమే అవుతుంది. ఇంత కలుషిత నీటిలో స్నానాలు చేస్తే పుణ్యం వస్తుందో లేదో తెలియదు కానీ, జబ్బులు రావడం మాత్రం ఖాయమ’ని ఉప ముఖ్యమంత్రి, పర్యావరణ, అటవీ శాఖల మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆవేదన వ్యక్తం చేశారు. పుష్కరాల కోసం రోడ్లు, రంగులు వేయడం కంటే ముందు గోదావరి నది కాలుష్యాన్ని తగ్గించాలని అధికారులకి స్పష్టం చేశారు. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కార్యాలయంలో గోదావరి నది కాలుష్యం, పుష్కరాల సన్నద్ధతపై జిల్లా అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తారు. ఈ సమావేశానికి ముందు తూర్పు లంక లాగూన్స్ పరిశీలించారు. అక్కడి నుంచి తిరిగి వస్తూ నల్లా ఛానెల్ ను మరోసారి పరిశీలించారు. కన్వేయర్ బెల్ట్ మీద మురుగు నీరు శుద్ధి ప్రక్రియ ముందుకు వెళ్లకపోవడం గుర్తించారు. దీనిపై అధికారుల నుంచి వివరణ తీసుకున్నారు. అనంతరం నిర్వహించిన సమీక్ష సమావేశంలో రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, పర్యాటక శాఖ మంత్రి శ్రీ కందుల దుర్గేష్ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ... “ఒక వైపు పుణ్య నది గోదావరిలో స్నానం చేస్తే పుణ్యం వస్తుందని భక్తులకు చెబుతూ.. మరో వైపు భారీ స్థాయిలో మురుగు నీటిని నేరుగా నదిలోకి వదలడం అత్యంత హాస్యాస్పదం, దారుణం. స్నానం చేస్తే పుణ్యం వస్తుందో రాదో తెలియదుగానీ... జబ్బులు వచ్చే ప్రమాదం మాత్రం పొంచి ఉంది. రాజమండ్రి నగరం నుంచి ప్రతి రోజూ 75 మిలియన్ లీటర్ల మురుగునీరు వస్తుంటే, అందులో కేవలం 30 మిలియన్ లీటర్లను మాత్రమే శుద్ధి చేస్తున్నారు. మిగిలిన 45 మిలియన్ లీటర్ల మురికినీటిని ఎటువంటి శుద్ధి లేకుండానే నేరుగా గోదావరి నదిలోకి వదిలేస్తున్నారు. గోదావరి తల్లి మన తప్పులన్నింటినీ భరిస్తూ ప్రవహిస్తోంది కాబట్టి సరిపోయింది. కానీ పవిత్రమైన పుష్కర స్నానాలు ఆచరించేందుకు దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తులు మురుగు నీటిలో స్నానం చేస్తున్నామనే భావన కలగకూడదు. * మురుగునీటి శుద్ధికి బడ్జెట్ ఎక్కడ? రాబోయే పుష్కరాల కోసం అన్ని రకాల వసతులు, రోడ్లు, ఘాట్‌ల నిర్మాణం, మౌలిక వసతులు కోసం దాదాపు రూ.8,000 కోట్ల బడ్జెట్ ప్రతిపాదనలు అధికారులు సిద్ధం చేసుకున్నారు. భక్తులకు అన్ని వసతులు కల్పిస్తున్నాం కానీ, వారు స్నానం చేసే గోదావరి నదిని శుభ్రంగా ఉంచే మురుగునీటి శుద్ధికి మాత్రం పైసా బడ్జెట్ కేటాయించలేదు. రోజూ 45 ఎంఎల్డీ మురుగునీరు నేరుగా నదిలోకి వెళ్తుంటే.. దాన్ని ఆపడానికి బడ్జెట్ పెట్టకుండా, మిగతా వసతులకు రూ. 8,000 కోట్లు ఖర్చు పెడితే ఏం లాభం? కొన్నేళ్ల క్రితం ఏలూరులో తాగునీరు కలుషితమై, ప్రజలు వింత వ్యాధి బారిన పడి పది మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి ఘటనలను దృష్టిలో పెట్టుకొని అప్రమత్తంగా ఉండాలి. గోదావరి నదిలోకి మురుగు నీరు కలవకుండా నిరోధించేందుకు, అత్యుత్తమ టెక్నాలజీతో వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ల నిర్మాణానికి నిధులు కేటాయించాలి. * వాళ్లది బాధ్యత లేని నిర్లక్ష్యం నిన్న జరిగిన సమావేశంలో పారిశ్రామికవేత్తలు తాము అన్ని నిబంధనలూ కచ్చితంగా పాటిస్తున్నామని చెప్పారు. కానీ ఈ రోజు ఆంధ్ర పేపర్ మిల్లు పరిసరాల్లో క్షేత్రస్థాయికి వెళ్లి చూస్తే వారు చెప్పిన మాటలకు, అక్కడ ఉన్న పరిస్థితులకు ఎక్కడా పొంతన లేదు. పరిశ్రమ నుంచి వస్తున్న రసాయన వ్యర్థ జలాల కోసం కనీసం ఒక కాంక్రీట్ కెనాల్ కూడా నిర్మించలేదు. విషపు నీటిని నేరుగా వదిలేయడం వల్ల చుట్టుపక్కల భూగర్భజలాలు పూర్తిగా కలుషితమైపోతున్నాయి. ఈ రసాయన మురికి నీరంతా నేరుగా పవిత్ర గోదావరిలో కలవడం వల్ల నదిలో విపరీతంగా గుర్రపుడెక్క పెరిగిపోతోంది. నది పర్యావరణ వ్యవస్థ సర్వనాశనమవుతోంది. ఇన్ని తప్పులు చేస్తూ, తిరిగి మమ్మల్ని ఇబ్బందిపెడుతున్నారు అని ఆ పరిశ్రమ వాళ్ళు మాట్లాడుతున్నారు. (1/2)
Deputy CMO, Andhra Pradesh tweet mediaDeputy CMO, Andhra Pradesh tweet mediaDeputy CMO, Andhra Pradesh tweet mediaDeputy CMO, Andhra Pradesh tweet media
తెలుగు
0
0
0
10.7K
VT😎🇮🇳 retweetledi
Trend PSPK
Trend PSPK@TrendPSPK·
ఎన్నో కష్టాలు పడుతూ చదువుకుని, దశాబ్దాల పాటు ప్రజలకు వైద్య సేవలు అందించిన దళిత వైద్యుడు డాక్టర్ సుధాకర్ గారి వర్ధంతి నేడు... ఆయనను అవమానాలు, వేధింపులు ఎదుర్కొనే పరిస్థితికి నెట్టివేసి, పిచ్చివాడిగా ముద్ర వేసి దారుణంగా అంతమొందించిన ఆనాటి వైకాపా... ఆ విషాద గాథ ఆయన తల్లి గారి మాటల్లో... #DalitDrohiJagan #AntiDalitYSRCP #MurdererYSJagan
తెలుగు
0
0
0
7.2K
VT😎🇮🇳 retweetledi
Deputy CMO, Andhra Pradesh
కలుషిత జలాలు గోదావరిలో కలిపేస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారు? - గలగలా గోదారి… అని గీతం ఆలపిస్తాము… ఇంత కాలుష్యం ఉంటే ఏమని ఆలపించాలి? * ఆంధ్ర పేపర్ మిల్స్ యాజమాన్యానికి నోటీసులు ఎందుకు ఇవ్వలేదు? * రూ. 13 కోట్ల బకాయిలను రాబట్టలేరా? * ప్రజల ముందు సమాధానం చెప్పాల్సింది మేము * ⁠పుష్కరాల్లో పన్నీరు స్నానం చేయించక్కర్లేదు… కెమికల్ స్నానం చేయించకూడదు కదా * ఇంతటి కీలక సమస్యలను నా దృష్టికి తీసుకురండి క్యాబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటాం * ఆంధ్ర పేపర్ మిల్స్ పరిశ్రమ కాలుష్యాన్ని ప్రత్యక్షంగా… తూర్పులంక లాగూన్స్ వరకు వెళ్లి మరీ పరిశీలించిన ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు ‘మా తెలుగుతల్లికి.. రాష్ట్ర గీతంలో గల గలా గోదారి అని గుండెల నిండా ఆర్తితో ఆలపిస్తాం.. ఇక్కడకు వచ్చి చూస్తే గోదావరి వెలవెలబోతూ.. కాలుష్యంతో నిండిపోతూ కనిపిస్తోంది. ఏమని ఆలపించాలి. ఇంతటి కాలుష్యం కలుస్తున్న నీటిలో మన పిల్లలను స్నానం చేయించే సాహసం చేస్తామా..? ఇంత దారుణంగా కలుషిత జలాలు గోదావరిలోకి ప్రత్యక్షంగా కలుస్తున్నా అధికారులు ఇంకా మీనమేషాలు ఎందుకు లెక్కిస్తున్నారు?’ అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పారిశ్రామిక అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోంది… పరిశ్రమలను ప్రోత్సహించాలని రాయితీ ధరలకు భూములను కేటాయిస్తున్నాం.. ప్రభుత్వం ఎంత సహకరిస్తున్నా, పరిశ్రమలకు కనీసం పర్యావరణ స్పృహ లేకపోతే ఎలా అని ప్రశ్నించారు. రాజమహేంద్రవరం ఆంధ్ర పేపర్ మిల్స్ లిమిటెడ్ పరిశ్రమ గోదావరిలోకి వదులుతున్న కాలుష్య జలాలను శ్రీ పవన్ కళ్యాణ్ గారు మంగళవారం ఉదయం ప్రత్యక్షంగా పరిశీలించారు. కలుషిత నీటిని శుద్ధి చేసి గోదావరిలోకి విడుదల చేయాలి. తూర్పు లంకలోని లాగూన్స్ (మడుగులు)లో వీటిని వదులుతారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఉదయాన్నే వెంకట నగరం ఘాట్ నుంచి పడవలో లాగూన్స్ వరకూ వెళ్లి ప్రత్యక్ష పరిశీలన చేశారు. కాలుష్య నియంత్రణ మండలి మొబైల్ కిట్లతో నీటిలో కాలుష్య కారకాలు ఎంత ఉన్నాయి అన్నది అక్కడికక్కడే పరీక్షలు చేయించారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తూ- ప్రత్యక్షంగా గోదావరిలోకి కాలుష్య జలాలు ఈ స్థాయిలో కలుస్తున్నా ఇప్పటి వరకు కాలుష్య నియంత్రణ మండలి అధికారులు ఎందుకు స్పందించలేదని, కనీసం నోటీసులు ఎందుకు ఇవ్వలేదని కాలుష్య నియంత్రణ మండలి ఈఈ శ్రీ శంకర్ నాయక్ ను ప్రశ్నించారు. ఎప్పటికప్పుడు తనిఖీలు చేసి కాలుష్య శుద్ధి ఎలా జరుగుతుంది అన్న వివరాలు తెలుసుకుంటున్నారా? క్షేత్రస్థాయిలోకి వచ్చి ఈ మడుగులను ఎన్నిసార్లు పరిశీలించారు అని ప్రశ్నించారు. గోదావరి మధ్యలోని తూర్పులంకలో అతి పెద్ద మడుగులలో కాలుష్య కారకాలు ఉన్న నీటిని నిల్వ చేసి తర్వాత, గోదావరిలోకి ఇంకిపోయేలా చేయడం ఏమిటన్నారు. మడుగుల్లోని నీరు మొబైల్ కిట్ లో మరోసారి పరీక్షలు చేయించారు. అక్కడ గుర్రపు డెక్క భారీగా పేరుకొని ఉందంటే కచ్చితంగా జలాలు కలుషితం అయినట్లే కదా అన్నారు. * పెండింగ్ బకాయి రాబట్టలేరా? కూటమి ప్రభుత్వం పరిశ్రమలకు స్నేహపూర్వక భాగస్వామిగా ఉంటుంది. రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు వస్తే, యువతకు ఉపాధి దొరుకుతుందని, రాష్ట్ర ప్రగతి పరుగులు పెడుతుందని భావిస్తాం. అయితే ఇంత స్నేహపూర్వక వాతావరణంలో రాయితీలపై భూములు కేటాయిస్తున్నా సరే పరిశ్రమలు కాలుష్యం నివారణ విషయంలో సరైన దృష్టి పెట్టడం లేదు అనిపిస్తుంది. గాలి, నీరు కాలుష్యం విషయంలో ప్రతి పరిశ్రమ కాలుష్య నియంత్రణ మండలి నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. ఆంధ్ర పేపర్ మిల్స్ యాజమాన్యం ప్రభుత్వానికి పన్నులు రూపేణా చెల్లించాల్సిన రూ. 13 కోట్ల బకాయిలను వెంటనే రాబట్టేలా జిల్లా యంత్రాంగం పనిచేయాలి. ప్రభుత్వం నుంచి రాయితీలు పొందుతూ బకాయిలు కట్టకపోతే ఎలా? దీనిపై సీరియస్ గా స్పందించండి. అలాగే ప్రతి ఏటా కాలుష్య నియంత్రణకు యాజమాన్యం ఎంత మేర చిత్తశుద్ధితో చర్యలు తీసుకుంటుందో..? పరిశీలించండి. ఇంత దారుణంగా కళ్ళముందే కాలుష్యం జరుగుతున్న ఇప్పటివరకు కాలుష్య నియంత్రణ మండలి అధికారులు యాజమాన్యానికి ఎందుకు నోటీసు ఇవ్వలేదో కూడా నివేదిక ఇవ్వండి అని ఆదేశించారు. (1/2)
Deputy CMO, Andhra Pradesh tweet mediaDeputy CMO, Andhra Pradesh tweet mediaDeputy CMO, Andhra Pradesh tweet mediaDeputy CMO, Andhra Pradesh tweet media
తెలుగు
0
0
0
94.9K
VT😎🇮🇳 retweetledi
JanaSena Party
JanaSena Party@JanaSenaParty·
'Either You Fall in line or Fall Out of Line' - Senani's Strong Message
English
5
484
1.4K
9.8K
VT😎🇮🇳 retweetledi
JanaSena Party
JanaSena Party@JanaSenaParty·
ఒక మారుమూల గ్రామానికి రోడ్డు వేస్తే అదే నాకు ఆస్కార్ కొట్టినంత ఆనందం!
తెలుగు
6
556
1.8K
11.5K
VT😎🇮🇳 retweetledi
JanaSena ITWing
JanaSena ITWing@ITWingJSP·
తమ్మెష్ గాలిదేవరా గారు రూపొందించిన “తల్లి గోదావరి” షార్ట్ ఫిల్మ్‌లో చూపిన దృశ్యాలు, ఈరోజు నిజ జీవితంలో ఆవిష్కృతమవుతుండటం ఆనందంగా ఉంది. ఈరోజు గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు స్వయంగా ప్రాంతాన్ని సందర్శించి గోదావరి పరిరక్షణ, కాలుష్య నియంత్రణపై సమీక్ష నిర్వహించడం ఆశాజనకం.
తెలుగు
0
0
0
10.4K
VT😎🇮🇳
VT😎🇮🇳@VTofficial97·
పెద్దల సభకు నాగబాబు, బాలినేని..! ఖాళీ అయిన 4 రాజ్యసభ స్థానాలలో ఒకటి జనసేనకు కేటాయింపు...అభ్యర్థిగా నాగబాబు గారు.ప్రస్తుత ఎమ్మెల్సీ పదవికి త్వరలో రాజీనామా,ఆస్థానంలో బాలినేనికి అవకాశం, జూన్ మొదటి వారంలో అధికారిక ప్రకటన..? #JanaSena #PawanKalyan
VT😎🇮🇳 tweet media
తెలుగు
0
0
0
26.9K
VT😎🇮🇳 retweetledi
Deputy CMO, Andhra Pradesh
గోదావరి నది స్వచ్ఛతకు పారిశ్రామికవేత్తలు సహకరించాలి * కాలుష్య వ్యర్థాల శుద్ధి ప్లాంట్లను పక్కాగా నిర్వహించాలి * మూడు నెలలకోసారి కాలుష్య నియంత్రణ మండలి ఆడిట్ చేపడతాం * పుష్కరాల నిర్వహణలో పారిశ్రామికవేత్తలు సామాజిక బాధ్యతతో చొరవ తీసుకోవాలి * పారిశ్రామికవేత్తలను ప్రభుత్వం ఇబ్బందిపెట్టదు.. పారిశ్రామికవేత్తలూ ప్రభుత్వానికి సహకరించాలి * రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల పరిశ్రమల యాజమాన్యాలతో ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు ప్రత్యేక సమావేశం గోదావరి నదిలో పెరిగిపోతున్న కాలుష్యాన్ని నివారించేందుకు పారిశ్రామికవేత్తలు కూడా తగిన విధంగా సహకరించాలి అని ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. రాబోయే గోదావరి పుష్కరాలకు పారిశ్రామికివేత్తలు సామాజిక బాధ్యతతో సహకరించి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పారిశ్రామిక ప్రగతికి కూటమి ప్రభుత్వం అడ్డుపడబోదని స్పష్టం చేశారు. అదే సమయంలో పరిశ్రమల యాజమాన్యం కూడా కాలుష్య కారకాలను నివారించి, శుద్ధి చేసే ప్లాంట్లను పద్ధతులను పకడ్బందీగా అమలు చేయాలని దిశానిర్దేశం చేశారు. రాజమహేంద్రవరం పర్యటనలో భాగంగా గోదావరి పుష్కరాల ప్రత్యేక సమీక్ష అనంతరం పారిశ్రామికవేత్తలతో ఉప ముఖ్యమంత్రివర్యులు ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ "పరిశ్రమల నుంచే వ్యర్ధాలు నేరుగా నదీ జలాల్లో కలపకూడదనే నిబంధన ఉంది. ప్రతి పరిశ్రమ శుద్ధి ప్లాంటు నిర్వహణ తప్పనిసరి చేసుకోవాలి. వ్యర్ధాలను ఆధునిక పద్ధతులను ఉపయోగించి పూర్తిస్థాయిలో శుద్ధి చేసిన తర్వాత మాత్రమే విడుదల చేయాలి. ప్రజలకు తాగు, సాగునీటికి వినియోగించే నీటిలో కాలుష్యకారక వ్యర్ధాలు కలపడం వల్ల తీవ్రమైన సమస్యలు వస్తాయి. భవిష్యత్తు తరాలకు కొత్త ఆరోగ్య సమస్యలు పుడతాయి. వీటిని పూర్తిస్థాయిలో దృష్టిలో పెట్టుకొని కాలుష్య వ్యర్ధాలను పూర్తిస్థాయిలో శుద్ధి చేయాలి. పరిశ్రమల్లో శుద్ధిప్లాంట్ల నిర్వహణ వ్యయాన్ని ఏమాత్రం భారం అనుకోకుండా శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించండి. ఇక నుంచి తప్పనిసరిగా ప్రతి మూడు నెలలకు ఒకసారి కాలుష్యంత్రణ మండలి ప్రతి పరిశ్రమ ను ఆడిట్ చేసి, ఆ పరిశ్రమ పరిస్థితిని రెడ్, ఎల్లో, గ్రీన్ విభాగాలుగా గుర్తిస్తుంది. మన సంస్కృతి సంప్రదాయం, నదుల్లో ఇమిడి ఉంటుంది. వాటిని రక్షించుకోవడం మన బాధ్యతగా భావిద్దాం. * పుష్కరాల విజయవంతానికి కలిసి రావాలి వచ్చే ఏడాది నిర్వహించనున్న గోదావరి పుష్కరాలు దేశమంతా ఆసక్తిగా మాట్లాడుకునేంత ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించునున్న ఈ పుష్కరాలకు గోదావరి జిల్లాల నుంచి పారిశ్రామికవేత్తల సహకారం అవసరం. తగిన చొరవ తీసుకొని పుష్కరాల నిర్వహణలో పారిశ్రామికవేత్తలు కూడా తగిన సహాయ సహకారాలు అందించాలి. పుష్కరాల విజయవంతానికి పరిశ్రమల నిర్వాహకుల చొరవ చాలా అవసరం. ప్రభుత్వానికి తగిన విధంగా సహకరించాలి" అన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఆహార పౌరసరఫరాల శాఖ మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, పర్యాటక శాఖ మంత్రివర్యులు శ్రీ కందుల దుర్గేష్ గారు, కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ శ్రీ కృష్ణయ్య గారు, అధికారులు పాల్గొన్నారు.
Deputy CMO, Andhra Pradesh tweet mediaDeputy CMO, Andhra Pradesh tweet mediaDeputy CMO, Andhra Pradesh tweet mediaDeputy CMO, Andhra Pradesh tweet media
తెలుగు
0
0
0
6.5K
VT😎🇮🇳 retweetledi
Deputy CMO, Andhra Pradesh
‘కాలుష్యరహిత గోదావరి పుష్కరాలు’ నిర్వహణకు ప్రభుత్వం కట్టుబడి ఉంది * గోదావరిలో కలిసే కాలుష్య జలాలపై సమగ్ర ఆడిట్ చేపట్టాలి * నిజాయతీగా కాలుష్య నివారణలో పనులు చేద్దాం * సమస్య ఎక్కడుందో తెలుసుకుంటే ఆచరణ సులభం అవుతుంది * ఆంధ్ర పేపర్ మిల్స్ వ్యర్థజలాల నిర్వహణకు వేగంగా ప్రత్యామ్నాయం అవసరం * శాస్త్రీయ పద్ధతిలో వ్యర్ధ జలాల నిర్వహణ జరగాలి * గోదావరి పుష్కర ఘాట్ నుంచి కోటిలింగాల ఘాట్ వరకు పడవలో ప్రయాణించి గోదావరి తీర కాలుష్యాన్ని, పుష్కర పనులను స్వయంగా పరిశీలించిన ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు ‘గోదావరి నదిలోకి కలిసే కాలుష్యకారక వ్యర్ధాలు, జలాలు, వాటి నిర్వహణపై పూర్తిస్థాయి ఆడిట్ చేపట్టి నివేదిక ఇవ్వండి. ఇప్పటివరకు తీసుకున్న చర్యలు ఏమిటి..? భవిష్యత్తులో చేయబోయే పనుల మీద స్పష్టమైన ప్రణాళికను సిద్ధం చేయండి’ అని ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ఉన్నత అధికారులు, తూర్పు గోదావరి జిల్లా అధికారులను ఆదేశించారు. వచ్చే ఏడాది నిర్వహించనున్న గోదావరి పుష్కరాలను ‘కాలుష్యరహిత గోదావరి’ థీమ్ తో సాకారం చేసి నిర్వహించడానికి కూటమి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని స్పష్టం చేశారు. రాజమహేంద్రవరం పర్యటనలో భాగంగా సోమవారం ఉదయం 6 గం.కు శ్రీ పవన్ కళ్యాణ్ గారు రాజమహేంద్రవరం పుష్కరాల ఘాట్ నుంచి కోటిలింగాలు ఘాట్ వరకు పడవలో ప్రయాణించి గోదావరి జలాల కాలుష్యకారక ప్రాంతాలని పరిశీలించారు. పుష్కరాల్లో చేయాల్సిన పనుల తీరు, త్వరలో చేపట్టబోయే పనుల ప్రణాళికను స్వయంగా పరిశీలించారు. గోదావరి గట్ల సుందరీకరణ పనులు ఎంతవరకు వచ్చాయనేది, పుష్కరాల నేపథ్యంలో గట్లను ఎలా తీర్చిదిద్దబోతున్నది అధికారులు వివరించారు. ఈ సందర్భంగా చింతలమ్మ ఘాట్ వద్ద నల్లా ఛానల్ ద్వారా రాజమహేంద్రవరం మురుగునీరు గోదావరిలోకి కలిసే ప్రాంతాన్ని శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్వయంగా పరిశీలించారు. నది తీరంలో జరుగుతున్న కాలుష్యం తీరును స్వయంగా చూశారు. నీటిని ఎలా శుద్ధి చేస్తున్నారనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. అక్కడే ఉన్న సిబ్బందితో మాట్లాడి వ్యర్థాలను వేరు చేసే విధానాన్ని చూశారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు అధికారులకు ఆదేశాలిస్తూ "గోదావరిలోకి రోజువారీ సుమారుగా 55 ఎం. ఎల్. డి. (మిలియన్ లీటర్స్ పర్ డే) మురుగునీరు వస్తున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ఈ మురుగు నీటిని శుద్ధి చేసే విధానం శాస్త్రీయంగా జరగాలి. మురుగు నీటిని నేరుగా గోదావరిలోకి వదలడం వల్ల జలాలు కలుషితం అవుతున్నాయనే ఫిర్యాదులు వస్తున్నాయి. దీనిపై దృష్టి సారించాలి. * నిధులను సత్కార్యం కోసం వినియోగించుకుందాం గోదావరి పుష్కరాలకు ఖర్చు చేసే ప్రతి పైసాను ప్రజలకు ఉపయోగపడే, గోదావరి నది తీరాన్ని కాపాడే మంచి పనులకు ఉపయోగించుకోవాలి. మొదట కాలుష్యకారక అంశాలపై పూర్తిస్థాయి ఆడిట్ జరగాలి.. తర్వాత దానిని ఎలా అధిగమించాలి అనే అంశాల పట్ల దృష్టి సారించవచ్చు. కేవలం లెక్కలతో సరిపెట్టకుండా పూర్తి స్థాయి యాక్షన్ ప్లాన్ తో ముందుకు వెళ్దాం. కేంద్ర జల శక్తి ద్వారా ఎన్.ఆర్. సి. పి. నిధులు రూ. 416 కోట్లలో రూ. 95 కోట్ల నిధులకు పరిపాలన అనుమతులు వచ్చాయి. ఈ నిధులతో కొత్త ట్రీట్మెంట్ ప్లాంట్లను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించాలి. పూర్తిస్థాయిలో మురుగు లేకుండా జలాలను గోదావరిలోకి విడిచిపెట్టి బాధ్యతను తీసుకోవాల”ని ఆదేశించారు. * పేపర్ మిల్ కాలుష్యంపై ఆరా ఆంధ్ర పేపర్ మిల్స్ కాలుష్య జలాలు గోదావరిలోకి విడుదల మీద ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆరా తీశారు. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ శ్రీ కృష్ణయ్య నుంచి వివరాలు అడిగారు. ప్రస్తుతం పేపర్ మిల్లు ద్వారా బయటకు వచ్చే వ్యర్థాలను దూరంగా లంకల్లో విడిచి పెడుతున్నారని, దీనికి ప్రత్యామ్నాయంగా ఆ కంపెనీ మరో ప్రాంతంలో శుద్ధి చేసేందుకు ఆలోచిస్తుందని ఆయన తెలియజేశారు. ప్రత్యామ్నాయ పనులు వేగంగా జరిగేలా చూడాలని, అప్పటివరకు మరో శుద్ధి ప్లాంట్ నిర్మించుకునేలా యాజమాన్యానికి ఆదేశాలు ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రివర్యులు దిశానిర్దేశం చేశారు.
Deputy CMO, Andhra Pradesh tweet mediaDeputy CMO, Andhra Pradesh tweet mediaDeputy CMO, Andhra Pradesh tweet mediaDeputy CMO, Andhra Pradesh tweet media
తెలుగు
0
0
0
10.8K
VT😎🇮🇳 retweetledi
JanaSena Party
JanaSena Party@JanaSenaParty·
50 శాతం గ్రీన్ కవర్ ఉండాలని చెప్పాము... గ్రేట్ గ్రీన్ వాల్ లాంటి ప్రతిష్ఠాత్మక కార్యక్రమాలు కూడా ముందుకు తీసుకు వెళ్లలేరా? •పనుల్లో నిర్లక్ష్యం వహించిన కొంత మంది అధికారుల తీరుపై ఆగ్రహం అటవీ శాఖ ఉన్నతాధికారులతో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించిన ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ @PawanKalyan గారు
తెలుగు
0
0
0
30.5K
VT😎🇮🇳 retweetledi
Deputy CMO, Andhra Pradesh
‘పర్యాటక పోలీసు’ విధానంతో పర్యాటకుల భద్రతకు భరోసా * క్యాబినెట్ లో చర్చించి అమలుకు సన్నాహాలు * పర్యాటకుల స్వర్గధామంగా ఆంధ్రప్రదేశ్ నిలిచిపోవాలి * 50 వేల మంది యువతకు ఎకో టూరిజంలో ఉపాధి చూపాలి * అటవీ, పర్యాటకశాఖ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలతో ఉమ్మడి కమిటీ వేసి 200 దర్శనీయ ప్రాంతాల గుర్తింపు * అయిదు రోజుల్లో నివేదిక ఇవ్వండి * అటవీ, పర్యాటక శాఖల ఉన్నతాధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించిన ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు ‘అటవీశాఖ, పర్యాటకశాఖ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు కలసి ఓ కమిటీగా ఏర్పడి రాష్ట్రంలో అద్భుతమైన సందర్శనీయ ప్రాంతాలు ఏమున్నాయో గుర్తించాలి. సుమారు 200 ప్రాంతాలను గుర్తిస్తూ, అక్కడున్న సౌకర్యాలు, సదుపాయాలు గురించి పూర్తి వివరాలు సేకరించండి. దీనిపై అయిదు రోజుల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వండి. రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాల సందర్శన కోసం వచ్చే పర్యాటకుల భద్రత అనేది చాలా ముఖ్యం. ఇతర దేశాలు, రాష్ట్రాలు, జిల్లాలను దాటి కొత్త ప్రదేశాలను చూసేందుకు రాష్ట్రంలోకి వచ్చే వారికి పూర్తి భద్రత కల్పించేందుకు ‘పర్యాటక పోలీసు’ అనే కొత్త విధానంపై క్యాబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకుందాం’ అని శ్రీ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అటవీశాఖతో పర్యాటక శాఖ సమన్వయం చేసుకుంటే ఎకో టూరిజం అభివృద్ధికి రాష్ట్రంలో మంచి అవకాశాలున్నాయన్నారు. అద్భుతమైన అనుభూతి పర్యాటకులకు సొంతం అయితే, వారు పదిమందికి చెబుతారు. ఫలితంగా రాష్ట్రం పర్యాటకానికి స్వర్గంగా మారుతుందని చెప్పారు. శుక్రవారం సచివాలయంలో అటవీశాఖ, పర్యాటక శాఖ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులతో శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎకో టూరిజం అభివృద్ధి అవకాశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో పర్యాటక శాఖ మంత్రి శ్రీ కందుల దుర్గేష్ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ‘‘పర్యాటక ప్రాంతాలతోపాటు దేవాలయాలను దర్శించే నిమిత్తం వచ్చే భక్తులకు భద్రతను కల్పించేలా పని చేయాలన్నదే నా ఆకాంక్ష. దీనివల్ల రాష్ట్రంలో 50 వేల మంది యువతకు ఉపాధి లభించడంతో పాటు, పూర్తి భద్రమైన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ కు జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తుంది. దేవాదాయ శాఖను సమన్వయం చేసుకొని పర్యాటక, ఆధ్యాత్మిక యాత్రలకు వచ్చే వారికి తగిన భద్రతనిచ్చేలా కార్యాచరణ రూపొందిద్దాం. కేంద్ర పథకాలను సద్వినియోగం చేసుకొని పర్యాటకాన్ని అభివృద్ధి చేయాలి. * గ్రామాలకు పర్యాటక శోభ తీసుకురావాలి రాష్ట్రంలో విశిష్టతలు, ప్రత్యేకతలున్న గ్రామాలు చాలా ఉన్నాయి. అయితే వాటిని చూసేందుకు పర్యాటకులు వెళితే అక్కడ సదుపాయాలు లేకపోవడం నిరాసక్తత కలిగిస్తోంది. దీంతో చాలామంది ఆసక్తి చూపించడం లేదు. పంచాయతీరాజ్ అధికారులు దీనిపై ప్రత్యేక కార్యాచరణ రూపొందించండి. ఈశాన్య రాష్ట్రాలకు పర్యటనకు వెళితే వారు ఇళ్లలోనే తగిన సదుపాయాలు కల్పిస్తారు. అతిథిని దేవుడిలా చూసుకుంటారు. అలాంటి విధానం రాష్ట్రంలోని గ్రామాల్లో తీసుకురావాలి. పైలెట్ ప్రాజెక్టులుగా కొన్ని ప్రాంతాలను ఎంచుకొని పర్యాటకం అభివృద్ధి చేయండి. ఇది అమలు అయితే గ్రామాల ముఖచిత్రం మారుతుంది. ఆర్థికంగానూ బలోపేతం అవుతాయి. ఎకో టూరిజాన్ని మరింత అభివృద్ధి చేసి, పర్యాటకుల సంఖ్యను పెంచాలి. కర్నూలు జిల్లా కృష్ణ జింకలకు అత్యంత ప్రసిద్ధి. అంతర్జాతీయ ప్రమాణాలతో పర్యాటకులు వీక్షించేలా అభివృద్ధి చేయాలి. నల్లమలలో ఉన్న బైర్లూటి, నెల్లూరు జిల్లాలో ఫ్లెమింగో పక్షుల విడిది కేంద్రాలు… ఇలా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ప్రత్యేకతలు గుర్తించి, దానికి అనుగుణంగా పర్యాటకాన్ని అభివృద్ధి చేయాలి.
Deputy CMO, Andhra Pradesh tweet mediaDeputy CMO, Andhra Pradesh tweet mediaDeputy CMO, Andhra Pradesh tweet media
తెలుగు
0
0
0
37.2K